Thursday 25 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (185)



తమిళనాడుకు విఘ్నేశ్వరుని సాహాయ్యం


ప్రత్యక్షంగా తమిళనాడుకు గణపతి ఎంతో సాయం చేసాడు. కొడగునుండి కావేరీ జలాన్ని తమిళనాడులో ప్రవహింప చేసినవాడని లోగడ చదువుకున్నాం.


మనం, నదీ పరీవాహక సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఉంటాం. నదీతీరంలో ఉన్న జనులకు తిండికి, నీటికి కొరత ఉండదు, ఎప్పుడైతే భౌతికమైన తృప్తి ఏర్పడిందో గొప్ప గొప్ప పనులు చేసి నాగరికతా వృద్ధి కోసమై ప్రజలు పాటు పడుతూ ఉంటారు. అట్టి గొప్ప నాగరికత, ఈ ప్రాంతంలో ఏర్పడడానికి కావేరీ నదియే కారణం. దీనికి కారకుడు గణపతియే.


గొప్ప సంస్కృతి అంటే చిత్రకళ, సంగీతం, సాహిత్యం, నృత్యం అని అనుకుంటూ ఉంటాం. అంతేకాదు, ఇది ఆత్మోన్నతినీ సూచిస్తుంది. ఇక్కడ ఉన్న దేవాలయాల చుట్టూ ఆ కళలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇందున్న ఆలయ సంపద, ఏ ప్రాంతంలోనూ ఇంత విస్తారంగా కనబడదు. తమిళనాడు లోనే చోళ ప్రాంతం ఉంది. కావేరీ నదీ ప్రాంతంలో లెక్కకు మిక్కిలి ఆలయాలు వెలిసాయి.


ఆ పవిత్రాలయాలలో శైవ భక్తులైన అప్పర్, జ్ఞాన సంబంధర్, సుందర్ భగవానుని కీర్తిస్తూ వందలకొద్దీ పాటలు వ్రాసారు. అట్టి అలయాలు 274 ఇందు 194 వరకూ కావేరికి ఉత్తర దక్షిణ తీరాలలో ఉన్నవే. వైష్ణవ ఆళ్వార్లు కీర్తించినవి 108 దివ్యక్షేత్రాలు, ఇందులో చాలా భాగం చోళ ప్రాంతంలోనే ఉన్నాయి. సుమారు 40 వరకూ కావేరీ నదీ తీరంలోనే ఉన్నాయి.


No comments:

Post a Comment