Sunday 28 August 2016

హిందూ ధర్మం - 223 (జ్యోతిష్యం - 5)

ఈనాడు కుతుబ్ మినార్ గా పిలువబడుతున్న మేరు స్థంభం కట్టించింది వరాహమిహిరుడే.  అది తన జ్యోతిష్య (ఖగోళ) శాస్త్ర పరిశోధన కోసం కట్టించాడని చెప్తారు. ఇక్కడే ఉన్న సుమారు 2200 ఏళ్ళ క్రితం నాటిదైన లోహపు స్థంభం ఈనాటికి తుప్పపట్టలేదు, చెక్కుచెదరలేదు. దాన్ని 7 గ్రహాలకు సూచికగా, 7 అంతస్థులతో, 27 నక్షత్రాలకు సూచికగా 27 కిటికీలతో నిర్మించారట. 26 గజాల లోతు వరకు పునాది వేసి, 84 గజాల ఎత్తు వరకు నిర్మించారని, అయితే ఆ తర్వాత దాన్ని ఆంగ్లేయులు పదగొట్టి 76 అడుగులకు కుదించారని చెప్తారు. కుతుబుద్ధీన్ పాలన సమయానికి ధృవ స్థంభం/ మేరు స్థభం/ విష్ణు స్థంభం ఉంది. కానీ ఆ దుర్మార్గుడు దాని అద్భుత శిలాసంపదను, వైజ్ఞానికతను నాశనం చేసి, దానికి తన పేరు తగిలించుకుని, తన నిర్మాణంగా ప్రచారం చేసుకున్నాడు. మన ధౌర్భాగ్యం ఏమిటంటే కుతుబ్ మినార్ కుతుబుద్దీన్ జీవించిన సమయానికంటే ఎంతో పూర్వం నుంచి ఉందని, దాని మీదే ఆధారాలు ఉన్నా, అవి శాస్త్రీయమని తేలినా, ఇంకా నేటికి అది కుతుబ్ మినార్ గానే పిలువబడుతోంది.


గణితంలో త్రికోణమితి చెందిన సూత్రాలను కనుగొన్నారు. ఆర్యభట్టు రచనల్లో విడిచిన మిగిలిన సైన్ల పట్టికలను ఈయన పూర్తి చేశాడు.

ఈనాటి ఆధునికసమాజం చేపట్టిన గ్రహాంతర ప్రయాణాల్లో వెలుగు చూసిన అనేకానేక విషయాలను వరాహమిహిరుడు ఆనాడే చెప్పారు. తన పంచ సిద్దాంతికం అనే గ్రంధంలో బుధ, శుక్ర, అంగారక, శని, గురు గ్రహ వ్యాసాలను వివరించారు. అలాగే మనకు చెప్పబడ్డ నక్షత్రాలే కాక ఇతర తారల వివరణ కూడా ఆయన గ్రంధం అందిస్తుంది. ఆ గ్రంధంలో కాలం యొక్క వివిధ అంశాలు, దేవతలు, రాక్షసుల సంవత్సర కాలమానం, బ్రహ్మదేవుని పగలు, రాత్రి సమయం, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎంతకాలం గడిచింది మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తుంది.

సూర్యసిద్ధాంతం అనే గ్రంధంలో అంగారక గ్రహం యొక్క వ్యాసం చెప్పబడింది. అందులో 3,772 మైళ్ళని చెప్పగా, ఈ రోజు 4,218 మైళ్ళని చెప్తున్నారు. నాటికి, నేటికి 11% వ్యత్యాసం కనిపిస్తోంది. అలాగే అంగారక గ్రహం చుట్టుకొలత, అంగారక గ్రహం మీద ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణ గణనలు, ఆ చంద్రుని రంగు, అందులో పదార్ధాల వివరణ ఉంది.

అలాగే వరాహమిహిరుడు అంగారక గ్రహం మీద నీరు ఉన్నదని చెప్పారు. ఆ గ్రంధంలో అంగారక గ్రహం యొక్క పూర్తి వివరణ ఉన్నది. అంగారకుని మీద నీరు, ఐరన్ ఉందని ఆయన చెప్పారు, ఈనాడు ఇస్రో, నాసా చేసిన పరిశోధనలు దీన్ని ధృవపరిచాయి.

సూర్యుడు ద్వారానే అన్ని గ్రహాలు ఏర్పడి, ఆయన కేంద్రంగా ఎలా పని చేస్తున్నాయన్నది చెప్పిన నేటి యుగంలో తొలి వ్యక్తి ఆయనే. అంటే భారతీయ జ్యోతిష్యం 1500 ఏళ్ళ పూర్వమే ఎంత ఉన్నత స్థాయికి చేరిందో అర్దం చేసుకోవచ్చు.

To be continued ..................

సేకరణ: http://www.mysteryofindia.com/2016/03/varahamihira-predicted-water-on-mars.html

No comments:

Post a Comment