Sunday 12 March 2017

హిందూ ధర్మం - 238 (జ్యోతిష్యం- 18) (కాలగణన - 2)



1 యామం- ఒక రోజులో 4 వ వంతు, 1/4 దినం≈ 3 గంటలు
1 యామం= 7½ ఘటిలు= 3¾ ముహూర్తాలు= 3 హోరలు
1 హోర= 1/24 రోజు
4 యామాలు= పగలు లేదా రాత్రి; సగం రోజు.
8 యామాలు = 1 అహోరాత్రము (పగలు+రాత్రి)
పక్షం = 15 రోజులు
శుక్ల పక్షం+ కృష్ణ పక్షం = ఒక చాంద్రమాన మాసం

పితృమానం

మానవులకు 15 రోజులు (1 పక్షం) = పితృదేవతలకు సగం రోజు
మానవుల 30 రోజుల కాలం = పితృదేవతలకు 1 రోజు
పితృదేవతల 30 రోజులు = పితృదేవతల 1 నెల = 30*30= 900 మానవదినములు
పితృదేవతలకు 12 నెలలు = 1 సంవత్సరం= 10,800 మానవదినములు
పితృదేవతల వయసు 100 సంవత్సరాలు (= పితృదేవతలకు 36,000 దినములు = 10,80,000 మానవ దినములు = 3000 మానవ సంవత్సరాలు)
దేవతలకు 1 రోజు = మానవులకు 1 సంవత్సరం
దేవతలకు 1 నెల/మాసం = దేవతల 30 రోజులు (మానవుల 30 ఏళ్ళ కాలం)
దేవతలకు 1 సంవత్సరం (దివ్య సంవత్సరం) = దేవతలకు 12 నెలల కాలం = 360 మానవ సంవత్సరములు
12,000 దివ్య సంవత్సరములు = దేవతల వయస్సు = 1 మహాయుగం

ఇక్కడ దేవతలంటే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు ఇత్యాది దేవతలని అర్దం చేసుకోవాలి. శివ, విష్ణు, శక్తి మొదలైన వారు పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు. పరబ్రహ్మం సనాతనము, ఎల్లప్పుడూ ఉంటుంది. మానవ జన్మ వలన కలిగిన సదవకాశాన్ని వినియోగించుకుని, శాస్త్రంలో చెప్పబడ్డ పుణ్యకర్మలను, తపస్సును ఆచరిచిన జీవులు, తమ పుణ్యకర్మ చేత స్వర్గం మొదలైన లోకాలను చేరుతారు. ఇంద్రుడు మొదలైన దేవతలుగా మారి తమ పుణ్య కర్మను అనుభవిస్తారు. భగవద్గీతలో చెప్పింటలు 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశ్మతి' అని, పుణ్యం క్షీణించగానే తిరిగి మానవ లోకంలో పుడతారు. గత జన్మలో చేసుకున్న పుణకర్మ వలన, వాసనల వలన ఉన్నతమైన సిరిసంపదలుకుటుంబంలో పుట్టి, తిరిగి ధర్మమార్గంలో నడుస్తారు.  

ఇంద్ర, వాయు, వరుణ మొదలైన దేవతలు మానవుల వంటి జీవులే. ఇంద్రాది నామాలను పదవులను సూచిస్తాయి. ఉదాహరణకు మన దేశానికి ప్రధాన మంత్రి పదవి ఉంది. ఆ పదవిలో కూర్చున్న వారు ఎవరైనా ప్రధానమంత్రి అవుతారు. అంతేకానీ ప్రధానమంత్రి అనేది జన్మతో వచ్చే పదవి కాదు. అలానే దేవలోకంలో కూడా. అయితే ఇక్కడే మనకూ, అన్యమతాలకు బేధం ఉంది. దేవ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఊర్ధ్వలోకల జీవులు ఉన్నారని గుర్తించింది, వారికి కూడా ధర్మంలో స్థానం కల్పించింది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ఆయా మతాలు స్వర్గం వరకే చెప్పగలిగాయి. కానీ సనాతన ధర్మం స్వర్గానికి భిన్నమైన లోకాలను సైతం చెప్పింది. అక్కడ ఇంద్రాది దేవతలు లేరు. పుణ్యకర్మను అనుభవించి, తిరిగి మర్త్యలోకంలో జన్మించడం లేదు. పునర్జన్మ సిద్దాంతానికి అవి వ్యతిరేకం. మనమున్న భూలోకంలో నిర్వహించబడే యజ్ఞయాగాది కర్మలు, ఇతర వైదిక కర్మలు కేవలం మానవుల మేలు కోసమే కాదు. ఇక్కడ జరపబడే కర్మలు అన్యలోక జీవులకు ఆహారాన్ని, శక్తిని ఇస్తాయి. ఇవి వారికి కూడా మేలు చేస్తాయి. అన్ని లోకాలను కాపాడతాయి. అందుకే హిందువులు, తమ ప్రార్థన చివరలో లోకాసమస్తాః సుఖినోభవంతు అంటారు. సమస్త లోకాలు సుఖంగా, క్షేమంగా ఉండాలని దాని అర్దం. ఇలా కోరేది కూడా సనాతన ధర్మమే. అన్యమతాల్లో తమ మతస్థులు బాగుండాలనే కోరుకుంటే, సనాతనధర్మం 'శతృబుద్ధిం వినాశాయ' - శతృవు కూడా బాగుండాలి, కానీ అతనిలోనున్న శతృత్వం నశించాలని కోరుకుంటుంది.

To be continued ..................

Source: https://en.wikipedia.org/wiki/Hindu_units_of_time

No comments:

Post a Comment