Monday 30 December 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 35 వ భాగము



205. గురువే నీకు నిజమైన రక్షకుడు మరియు ముక్తి నిచ్చువాడు. ఆయనను ఎల్లవేళలా గౌరవించి పూజించు.
206. గురు స్థానాన్ని పొందాలి అనుకోవడమే ఒక భయంకరమైన శాపము.
207. సత్, చిత్, ఆనంద స్వరూపుడై నీ గురువు ముందు ప్రతిరోజు సాష్టాంగ నమస్కారం చేయి.
208. శిష్యుడు తన గురువు రూపాన్ని గుర్తుంచుకోవాలి, గురువు యొక్క పవిత్ర నామాన్ని మననం చేయాలి, గురువు ఆజ్ఞను పాటించాలి మరియు గురువు గురించి తప్ప అన్యమైన వాటి గురించి ఆలోచించకూడదు. సాధనలోని రహస్యమంతా ఇక్కడే ఇమిడి ఉంది.
209. గురువు కంటే గొప్ప వాడు లేడనే విధంగా ప్రతి వ్యక్తి గురువును గౌరవించాలి.
210. శ్రీ గురుచరణామృతము సంసారమనే సాగరాన్ని ఎండగట్టి ఆత్మసాక్షాత్కారమనే అత్యవసరమైన సంపద పొందేలా చేస్తుంది.
211. గురుని యొక్క చరణామృతము శిష్యుని దాహాన్ని/ తృష్ణను తీరుస్తుంది.
212. నీవు ధ్యానమునకు కూర్చున్న సమయంలో నీ గురువు మరియు ఋషులను స్మరించు. వారి దీవెనలు అందుతాయి.
213. మహాత్ములు చెప్పే జ్ఞానవంతమైన మాటలు విని వాటిని అనుసరించు.
214. శాస్త్రాలు మరియు గురు ఏది సరైనదని చెప్పారో, ఆ కర్మలనే ఆచరించు.
215. శాంతికి మార్గాన్ని చూపుటకు గురువు ఖచ్చితంగా అవసరము.
216. 'వాహే గురు' అనేది గురు నానక్ అనుయాయులకు గురు-మంత్రం. గురు గ్రంథ సాహిబ్ చదువు. గురువు యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది.
217. గురువును ఎల్లప్పుడు గుర్తు పెట్టుకొని పూజిస్తూ ఉండు. నువ్వు ఆనందాన్ని పొందుతావు.
218. శాస్త్రములందు, గురువాక్యముల యందు, ఈశ్వరుని యందు మరియు తన ఆత్మ యందు ఉన్న విశ్వాసమే శ్రద్ధ.
219. ఎటువంటి ఫలితం ఆశించకుండా గురుసేవ చేయడమే ఉత్కృష్టమైన సాధన.
220. సద్గురుని పాదపద్మాల వద్ద కూర్చుని శృతులను వినడమే శ్రవణము.

No comments:

Post a Comment