Tuesday, 5 November 2019

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరభారతీ మహాస్వామి సూక్తి



TRUE SEEKERS ARE RARE
In today's materialistic world, most people have no regard for any religion or God; the few that profess such regard have only a formal sense of allegiance to their religion, which will disappear in no time, if it conflicts with their personal, selfish interests. Very, very few people are true seekers of God.
- Jagadguru Sri Chandrashekhara Bharati Mahaswamigal

Monday, 4 November 2019

నీతి శాస్త్రం నుంచి సూక్తి


స్వామి శివానంద విరచిత గురుతత్వము - 23 వ భాగము



ఎనిమిదవ అధ్యాయము
సన్యాసులతో సంభాషణ

ఆపాతవైరాగ్యవతో ముముక్షూన్
భవాబ్ధిపారం ప్రతియాతుముద్యతాన్ ।
ఆశాగ్రహో మజ్జయతేఽన్తరాలే
నిగృహ్య కణ్ఠే వినివర్త్య వేగాత్ ॥

కేవలం వైరాగ్యం మాత్రమే కలిగి ఉండి, సంసార సాగరాన్ని దాటగోరే ముముక్షువులు, వారు కాంక్ష లేదా కోరిక అనేది తిమింగళం చేత పట్టుకోబడుతున్నారు. మరియు అది వారి మెడ పట్టుకొని బలవంతంగా మధ్యలోకి లాగి వారిని ముంచేస్తోంది.
వివేకచూడామణి

హరిః ఓం! బ్రహ్మమునకు నమస్కారములు! శ్రీ శంకరాచార్యులకు, మహాపురుషులకు మరియు సన్యాసులకు వందనాలు! దేహ అధ్యాస్యము (శరీర భావనను) స్వార్ధాన్ని, వాసనలను, అహంకారాన్ని, అభిమానాన్ని న్యాసము అనగా త్యజించినవాడే సన్యాసి. బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనత్కుమార ,సనత్సుజాతులు, దత్తాత్రేయులవారు, మరియు శ్రీ ఆది శంకరాచార్యులు నివృత్తి మార్గంలో అగ్రగణ్యులు, పథనిర్ణేతలు. ఈ సన్యాస ఆశ్రమానికి వారు మూల పురుషులు.

ఈ కాలపు ధోరణి

ఈ ప్రపంచానికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ, మానసిక మరియు అలాగే ఆధ్యాత్మికతను ఉన్నతి కావాలి. ఆధ్యాత్మికతను ఏనాడు విస్మరించరాదు. అదే మూలము. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజులలో కర్మయోగాన్ని ఆచరించే నేతలు కేవలం కర్మ మీద మాత్రమే తమ దృష్టిని నిలుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవనాన్ని వారు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎన్నో మఠాలకు చెందిన సన్యాసులు కూడా కేవలం సామాజిక సేవలోనే ఉన్నారు. కొందరు సన్యాసులకు పాడిత్యం ఉంది మరియు వారు కొంత కాలం గౌరవాన్ని పొందుతారు. వారు కూడా ధ్యాన పరమైన జీవితాన్ని అవతల పడవేసారు. జనుల మనసులో వారు నిజమైన మరియు దీర్ఘకాలం ఉండగలిగిన ప్రభావాలను చూపలేకపోతున్నారు, ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక శక్తి లేదా ఆంతరంగికమైన ఆత్మశక్తి అనేదు వారి వద్ద లేదు.

ఆధ్యాత్మికవేత్తలు, యోగులు, జ్ఞానులు మరియు సన్యాసులు తోకచుక్క వలె లేదా కార్తీకమాసంలో వచ్చే విదియ నాటి చంద్రునివలె బయట కనిపించి, వారి యొక్క శక్తిని జనులకు ధారపోసి, గొప్ప కార్యాలకు శ్రీకారం చుట్టి, ఆ క్షేత్రం నుంచి మాయం అవ్వాలి. ఆశ్రమాల్లో చాలాకాలం పాటు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహించడం మరియు ఆశ్రమాలు స్థాపించడం అనేది చిన్న సన్యాసులు చేయాలి. ఇది ఉగ్రమైన, అగ్ని వంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తల స్వభావానికి సరిపోదు. గంగా కేవలం ఏడాదిలోనే నాలుగు నెలల్లోనే ముంచెత్తినట్టుగా, వారు ఈ భూమిని ఆధ్యాత్మిక జ్ఞానం లేదా దివ్య జ్ఞానంతో ముంచెత్తుతారు.

సౌకర్యవంతమైన జీవనం యొక్క ఆకర్షణ

సన్యాసి లేదా గృహథు కూడా తన యొక్క సౌకర్యవంతమైన జీవనం కోసం ఆశ్రమాన్ని స్థాపించకూడదు. ఆశ్రమాన్ని స్థాపించిన సమయంలో ఎందరో సన్యాసులు చాలా పవిత్రంగా ఉండేవారు, అంటే నా అర్ధంలో వారు పేదవారిగా ఉన్నారు. ఒక్కసారి వారు ధనికులవ్వగానే, వారిని పొగిడేవారు, కీర్తించేవారు మరియు భక్తులు సరిపడినంత మంది దొరకగానే, నిస్వార్థ సేవ అనే ఆలోచన వెళ్ళిపోతుంది, స్వార్ధ ఆలోచనలు అనేవాటికి హృదయాల్లో చోటు లభిస్తుంది. వారు ఏ ఉద్దేశంతో ఆశ్రమాన్ని స్థాపించారో అది విచ్చిన్నం, నిష్ఫలం అవుతుంది. అప్పుడది కేవలం ధనాన్ని సంపాదించి పెట్టే వ్యవస్థగా మారుతుంది. జనులకు దాని పట్ల ఆకర్షణ ఉండదు. ఒక వ్యవస్థకు అధిపతి అయిన వ్యక్తి వైరాగ్యంతో కూడిన జీవనం గడుపుతూ, పూర్తిగా అన్నింటినీ త్యజించి ఉంటే అటువంటి ఆశ్రమం ఈ భూ ప్రపంచంలోనే శాంతికి, ఆనందానికి, సంతోషానికి కేంద్రబిందువు మరియు వేదిక అవుతుంది. అది కొన్ని లక్షల మంది జనులను ఆకర్షిస్తుంది. ఈ ప్రపంచానికి అటువంటి గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు అధిపతులుగా గల అటువంటి ఆశ్రమాల అవసరం ఉంది.

కొందరు యువ సన్యాసులు ముష్టి కాయను గింజలు స్వీకరిస్తారు. రెండు సంవత్సరాల్లో 120 విత్తనాలను మింగుతారు. సిద్ధాంత కౌముది మరియు న్యాయ శాస్త్రాన్ని మూడు సంవత్సరాలు అభ్యసిస్తారు. వారు నిజమైన సిద్ధులు అని భావిస్తారు మరియు ప్రాపంచిక మనసు కలిగిన వ్యక్తులతో స్వేచ్ఛగా కలుస్తారు/ విహరిస్తారు. ఇది ఎంతో తప్పు. ముష్టి కాయ లేదా ముషిణి చెట్టు గింజ నంపుస్కత్వాన్ని కలిగిస్తుంది. నపుంసకత్వం బ్రహ్మచర్యం కాదు. వారు త్వరగా పతనం అవుతారు. ఇది ప్రత్య్కేమగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద, మహా జ్ఞానులు మరియు గొప్ప యోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు విచక్షణారహితంగా, ఇష్టం వచ్చినట్లుగా భౌతిక ఆలోచనలు కలిగిన వ్యక్తులతో కలువకూడదు. రెండు చేపల మధ్య జరుతున్న కామకలపం అది చూసిన ఒక గొప్ప ఋషి మనస్సును ఉద్రేకపరచింది. స్త్రీ యొక్క గాజుల సవ్వడిలేదా అంచు కలిగిన మరియు రంగు రంగుల వస్త్రాలు సైతం మనస్సులో తీవ్రమైన ఉద్రేకాన్ని మనసులో కలిగిస్తాయి. వాటికి వాటి యొక్క సొంతమైన అపవిత్ర సాంగత్యం ఉంటుంది. కామం అనేది చాలా శక్తివంతమైనది. మాయ నిదూఢమైనది. కనుక ఓ సాధకులారా! జాగ్రత్త పడండి!

క్రమశిక్షణారహితులైన యువ సాధకులు, బ్రహ్మచారులు మరియు సన్యాసులు గృహస్థుల వద్ద సత్సంగం నిర్వహిస్తున్నామనే అనే ముసుగులో, వారి దగ్గరకు వెళ్ళడాంకి కారణం నాలుక మరియు రసేంద్రియం. ఓ సాధకులారా! కేవలం రన్సేంద్రియాన్ని సంతృప్తి పరచడానికి తల్లిదండ్రులను వదిలిపెట్టి, మీ ఆస్తులను సామాజిక హోదాను త్యజించి, సన్యాసం స్వీకరించారా? లేదా ఆత్మ సాక్షాత్కారం కోసం స్వీకరించారా? అది ఒకవేళ మీ రసేంద్రియాన్ని సంతృప్తిపరచడం కోసమే అయితే ప్రపంచంలో ఉంటూనే బాగా డబ్బు సంపాదించి ఆ పని చేసి ఉండవచ్చు. సన్యాస ఆశ్రమాన్నికి చెడ్డ పేరు తీసుకు రావద్దు. మీరు నాలుకను అదుపు చేయలేనప్పుడు, కాషాయాన్ని వదిలిపెట్టి, ప్రపంచంలోకి వెళ్లి, పని చేసి డబ్బు సంపాదించండి. కర్మ యోగం ద్వారా అభివృద్ధి చెందండి. నాలుకను నియంత్రించలేనప్పుడు మనస్సును నియత్రించడం సాధ్యం కాదు.

Sunday, 3 November 2019

స్వామి కృష్ణానంద సూక్తి



The pain generally felt at death is due to the nature of the intensity of the desires with which one continued to live in the physical body. The more is the love for the Universal Being entertained in life, the less would be the pain and agony of departing from the body.

- Swami Krishnananda

Saturday, 2 November 2019

స్వామి రామతీర్థ సూక్తి


If you seek ease and comfort for your bodies and waste your time in sensual pleasures and luxury, there is no hope for you.

- Swami Rama Tirtha

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 22 వ భాగము

దత్తస్వరూపులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు 


నిజమైన గురువు యొక్క లక్షణాలు
నిజమైన గురువు యొక్క లక్షణాలు ఇవిగో. మీరు గనక ఈ లక్షణాలను ఏ వ్యక్తి లో చూసినా, ఆ వెంటనే అతడిని మీ గురువుగా అంగీకరించండి. సద్గురువు అనేవాడు బ్రహ్మనిష్ఠ మరియు బ్రహ్మశ్రోత్రియుడై ఉంటాడు. అతనికి ఆత్మ మరియు వేదాల గురించి పూర్తి జ్ఞానము ఉంటుంది. అతడు సాధకుల సందేహాలను నిర్మూలిస్తారు. అతనికి సమదృష్టి మరియు మనస్సంయమనం ఉంటుంది. అతడు రాగద్వేషాలు, హర్షశోకాలు, అహంకారము, కోపము, లౌల్యము, దురాశ, మోహము, పొగరు మొదలైన గుణాల నుంచి విముక్తుడై ఉంటాడు. అతడు దయాసముద్రుడు. అతని యొక్క సన్నిధిలోనే మనకు శాంతి లభిస్తుంది మరియు మనసు ఉన్నతమైన స్థాయికి వెళుతుంది. కేవలం ఆయన యొక్క సన్నిధిలో ఉండడం చేతనే సాధకుల యొక్క సకల సందేహాలు నివృత్తి అవుతాయి. అతడు ఎవరి నుంచి ఏమీ ఆశించడు. అతడు ఎంతో ఉన్నతమైన, గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అతడు ఎల్లప్పుడు బ్రహ్మానందంతో నిన్డి ఉంటాడు. అతడు నిజమైన సాధకుల కోసం వెతుకుతూ ఉంటాడు.

గురువు యొక్క పాదపద్మాలకు నమస్కారములు! నేను నిజమైన గురువు యందు పూర్తి విశ్వాసం ఉంచుతాను.గురువు పట్ల నాకు ఎంతో గొప్ప ఆదరము మరియు గౌరవము ఉన్నాయి. ఆయన యొక్క పాదపద్మాలను ఎల్లవేళలా సేవించడానికి నా హృదయం తపిస్తుంది. మనస్సు యొక్క దుష్పరిణామాలను తొలగించడంలో గురుసేవ కంటే మరేది శక్తివంతమైనది కాదని నేను నమ్ముతాను. ఈ సంసారమనే సాగరం నుంచి అమృతతత్త్వమనే అవతలి ఒడ్డుకి తీసుకువెళ్ళే సురక్షితమైన నౌక గురువు సన్నిధి అని నేను పూర్తిగా నమ్ముతాను.

గురుత్వము పేరుతో వ్యాపారం

కానీ నేను గురుత్వాన్ని వ్యాపారంగా చేయడాన్ని మెచ్చుకొను, నాకు నచ్చదు. ఎవరైతే మూర్ఖులు గురువులుగా ఆచార్యులుగా ప్రదర్శించుకుంటూ, శిష్యులను తయారు చేసుకుంటూ, ధనము పోగు చేస్తారో అటువంటి వారిని చూసి నేను ఎంతగానో అసహ్యించుకుంటాను, అవమానంగా తలుస్తాను. మీరు ఈ విషయంలో నాతో అంగీకరిస్తారు. ఇందులో రెండవ అభిప్రాయానికి తావులేదు. వారు సమాజానికి పట్టిన చీడ పురుగులు. గురుత్వం అనేది ఈనాడు వ్యాపారంగా మారిపోయింది. దీనిని భారతదేశపు భూమి నుంచి పూర్తిగా నిర్మూలించాలి. ఇది భారత ప్రజానీకానికి ఎంతో నష్టాన్ని మరియు హానిని కలిగిస్తోంది. పాశ్చాత్యులు మరియు ఇతర దేశస్థులు మనస్సులలో ఎంతో చెడు ముద్రను సృష్టిస్తోంది. ఈ గురుత్వమనే వ్యాపారం వలన భారత దేశము తన యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని కోల్పోతోంది. అతి త్వరగా భయంకరమైన ఈ వ్యాధిని త్రుంచి వేసి వేళ్ళతో సహా పెకిలించి వేయడానికి తీవ్రమైన చర్యలు చేపట్టాలి. దీని నిర్మూలించడంలో ఏ అవకాశాన్ని వదలకూడదు. అది ఈ ఈనాడు ఎంతో భయంకరమైన రూపాన్ని సంతరించుకుంది. అది ఎంతో త్వరగా అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. చాలా సులభంగా, మర్యాదగల జీవనాన్ని గడపడానికి ఎంతోమంది ఈ గురుత్వం అనే వ్యాపారాన్ని తీసుకున్నారు. కుహనా గురువుల వలన ఎంతో మంది అమాయకమైన స్త్రీలు మరియు పురుషులు దోచుకోబడ్డారు. ఎంత సిగ్గుచేటు!

ఎందరో గురువులు అంతటా తిరుగుతారు. ఎన్నో చోట్ల ఉపన్యాసాలు ఇచ్చి ప్రవచనాలు చెబుతారు. బ్రహ్మ సూత్రాలు మరియు గీత అర్ధం చేసుకున్నా, వారు జ్ఞానశూన్యులు మరియు ధ్యానం గురించి అవగాహన లేదు. వారు సులభంగా ఆగ్రహానికి గురి అవుతారు. వారి యొక్క అభిమాని ఎంతో మృదువైనది. వారిలో దివ్య గుణాలు మరియు సాధుత్వం లేదు. వారికి సేవా భావం లేదు. వారు సేవ, కీర్తనలు మొదలైన వాటి గురించి చెడుగా మాట్లాడుతారు. వారు జనుల చెయ్యి పట్టుకొని దగ్గరకు పిలుస్తారు. వారి వెనుక భాగంలో చేతులు వేసి, వారిని దీవిస్తారు. కానీ వారు కనీసం ఒక్కడిని కూడా మోక్షానికి పంపలేకపోతున్నారు.

ఒక వ్యక్తి కొన్ని సిద్ధులను ప్రదర్శిస్తే జనులు అతడిని గురువుగా తీసుకుంటారు. ఇది ఎంతో ఘోరమైన తప్పిదము. ఇది అంత సులభంగా నమ్మే విషయం కాదు. ఇటువంటివారు దొంగ యోగుల వలన సులభంగా మోసపోతారు. వారు బుద్ధిమరియు విచక్షణాధికారాన్ని ఉపయోగించాలి. వారు గురువులుగా భావించే వ్యక్తుల గురించి ఏదైనా ఒక నిర్ణయానికి ముందు, ఆ గురువుల మార్గము, అలవాట్లు, స్వభావము, నడవడిక, వృత్తి, ప్రకృతి మొదలైనవి, క్షుణ్ణంగా పరిశీలించి; గ్రంథముల పట్ల, శాస్త్రముల పట్ల అతని జ్ఞ్ఞాన్ని, పరీక్షించాలి.

అటువంటి మేకవన్నె పులిలు, ఎవరైతే మన దేశ ప్రజలను తప్పు ద్రోవ పట్టించి, దోచుకునే ప్రయత్నం చేస్తారో, వారిని ఆశ్రయించడం కంటే కృష్ణుడు, రాముడు శివుడు, లేదా నీ హృదయంలో ఉన్న భగవంతుడిని గురువుగా భావించి, ఆయన యొక్క మంత్రాన్ని మననం చేయడం ఉత్తమము.

ప్రసిద్ధమైన, మహత్తరమైన భారతదేసంలో శ్రీ శంకరులు, దత్తాత్రేయులు వంటి నిజమైన గురువులు అంతటా వ్యాపించి ఉండుగాక! కుహనా గురువులు మరియు వ్యాపారపరమైన గురుత్వం అనే భయంకరమైన శాపం నుంచి భారతమాత సంపూర్తిగా స్వేచ్ఛను పొందుగాక! సనాతన ధర్మం యొక్క విశ్వజనీయమైన సూత్రాలు ప్రపంచమంతా తేజరిల్లు గాక! వివిధ మత శాఖలు మరియు మత వర్గాలను మధ్య ఐకమత్యం ఏర్పరచడంలో ఆధ్యాత్మికవేత్తలు తమకు సాధ్యమైన అన్ని ప్రయత్నములు చేయుదురుగాక! వారు కొత్త శాఖలను ఏర్పాటు చేయకుండా ఉండుదురుగాక! వర్గపరమైన బేధములు మరియు గొడవలు ఎల్లప్పటికీ నశించిపోవు గాక! ఋషులు, ద్రష్టలు, యోగులు, భక్తులు మరియు సన్యాసులు త్యాగము, సన్యాసం మరియు ఆత్మసాక్షాత్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆధ్యాత్మిక దేశమైనా ఈ భూమి యొక్క గొప్ప కీర్తి ప్రతిష్టలను నిలబెట్టుదురుగాక! ప్రపంచమంతా ఐకమత్యం, శాంతి మరియు సామరస్యం వర్ధిల్లుగాక! గురువుల యొక్క ఆశీర్వచనాలు మనందరిపై ఉండుగాక! ఆధ్యాత్మిక పథంలో వారు మనల్ని మార్గదర్శనం చేయుదురుగాక!

ఏడవ అధ్యాయము సమాప్తము 

Friday, 1 November 2019

కోరవద్దు, వృధా చేయవద్దు - స్వామి సచ్చిదానంద సూక్తి



Want Not, Waste Not

The minute you want something, you miss the joy. Who is the most joyful person? The one who doesn’t want anything. That’s why the proverb goes, ‘Want not, waste not.’ Don’t waste your life by wanting external things. Instead of your wanting the wants, let the wants want you. When will the wants want you? When you don’t want anything. Seek the kingdom within you. When you realize that, you won’t want anything else, then, everything will want you.

- Swami Satchidananda