Thursday, 2 April 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (3వ భాగం)



ఇప్పుడు ప్రపంచమైనా ఎదురుకొంటున్న అతి పెద్ద సమస్య నీటి ఎద్దడి. ఎండాకాలం వచ్చిందంటే చాలు మనకీ సమస్య తీవ్రత అర్ధమవుతుంది. నగరాల్లో ఉన్నవారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నగరాలకు నీటి సర్ఫరాలో ఆటంకం రాకుండా ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ గ్రామాల్లో ఉన్నవారికి తెలుసు ఆ కష్టం. కొన్ని గ్రామాల ప్రజలైతే ఎన్నో కిలోమీటర్లు నడిచి మరీ నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు నీటి ఎద్దడికి ఎలా కారణమవుతున్నాయో చూద్దాము.


యూ.ఎస్.జి.ఎస్. వారి లెక్కల ప్రకారం 1 పౌండ్ (453 గ్రాములు) గొడ్డు మాంసం (భీఫ్) ఉత్పత్తి చేయడానికి కనీసం 9000 లీటర్ల నీరు ఖర్చవుతాయి. అంటే నాలుగున్నర కిలోల గొడ్డు మాంసం ఉత్పత్తికి ఒక స్విమ్మింగ్ పూల్ నింపడానికి సరిపడా నీటిని ఉపయోగిస్తారు. ఇవన్నీ కాకిలెక్కలు, గాలిమాటలు కాదు. సశాస్త్రీయంగా శాస్త్రవేత్తలు లెక్కగట్టి నివేదికలు ఇచ్చినవి. మెక్ డోనాల్డ్స్ సంస్థ రోజుకు 86,183 కిలోల గొడ్డు మాంసం విక్రయిస్తుందని అంచనా. అంటే ఎంతమంది ఎన్ని నెలల పాటు త్రాగేనీటిని వారు కేవలం కొంతమంది కడుపు నింపడానికి వినియోగిస్తున్నారో చూడండి. దానికి అయ్యే నీటి ఖర్చు 1,26,18,03,928 లీటర్లు, అవును అక్షరాల నూట ఇరవై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది లీటర్లు. ఇంత నీటితో ఎంత పంట పండిచవచ్చు, ఎంతమంది దాహర్తిని తీర్చవచ్చో మీకు అర్ధమవుతోందా ... పైగా ఇది భూమికి పెద్ద భారం. ఎన్నో వేలమంది కొన్ని సంవత్సరాల పాటు సుఖంగా జీవించడానికి తోడ్పడే అద్భుతమైన నీరు అనే వనరును కేవలం జిహ్వచాపల్యం కోసం కొందరు ఒక రోజులో వాడేస్తున్నారు.

ఇప్పుడు మిగితా వాటి సంగతి చూద్దామా? 1 కిలోగ్రాము కోడిమాంసం ఉత్పత్తికి 4,325 లీటర్లు, 1 కిలో మేకమాంసం ఉత్పత్తికి 5,520 లీటర్లు అవసరం. అదే ఒక కిలో వరి ఉత్పత్తికి 3,600 లీటర్ల నీరు మాత్రమే అవసరము. గోధుమలకు 1,375 లీటర్లు, చిరుధాన్యాల ఉత్పత్తికి 300 లీటర్లు అవసరము. ఇవన్నీ కనీసం లెక్కలు. కొన్ని సందర్భాల్లో ఈ వినియోగం ఇంకా పెరగచ్చు.


ఒక వ్యక్తి మాంసాహారన్ని వదిలి శాఖాహారం వైపు అడుగులేస్తే, ఆ వ్యక్తి ఒక ఏడాదిలో సుమారు 5,67,812 లీటర్ల నీటిని ఆదా చేసినవాడవుతాడు. మరి పునరాలోచన చేస్తారా ?

To be continued.....

Source: https://www.zmescience.com/science/domestic-science/eat-vegetarian-save-water/   

సద్గురు శివాయ శుభ్రమునీయ స్వామి సూక్తి



"You can give money or food and provide for the physical aspects of the being, but if you can find a way to give the dharma, the illumined wisdom of the traditions of the Sanatana Dharma, then you are giving to the spirit of the person, to the soul...Giving through education is a glorious fulfillment for the giver, as well as for the receiver."

-~ Gurudeva, Satguru SIVAYA SUBRAMUNIYASWAMI

Wednesday, 1 April 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (2వ భాగం)



ఇప్పుడు అమెజాన్ అడువులైనా, ఆస్ట్రేలియా అడవులైనా, లేక ప్రపంచంలో ఏ అడవులైనా, ఇవాళ వాటిని తగలబెట్టి, నేలను చదును చేసి, వ్యవసాయ భూమిగా మారుస్తున్నారు. ఆయా దేశాల జనాభకు ఆహారం అందించడానికి సరిపడా భూమి లేక కాదు, దేశప్రజల దురాశను తీర్చలేక. ప్రపంచమంతా ఇదే జరుగుతోంది.
అది ఎలా అంటారా? ప్రపంచమంతా కలిపి 150 కోట్ల గోసంతతి ఉందని అంచనా. మనుషుల తర్వాత అత్యధిక జనభా ఉన్న క్షీరదాల్లో ఆవులు ప్రధానమైనవి. అయితే వీటిలో చాలా వాటిని పెంచేది పాల కోసం కాదు, వాటిని చంపి భీఫ్ తినడానికి. కేవలం ఆవుల విషయమే కాదు, పందులు, మేకలు, గొఱ్ఱెలు, కోళ్ళు, గేదెలు మొదలైన ఇతర జంతువుల పరిస్థితి కూడా అంతే. మాంసాహర ఉతపత్తులకు మంచి డిమాండ్ ఉండటంతో, వీటిని పెంచడానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. మరి వీటి పెంపకానికి సరిపడా భూమి కావాలి, వాటిని పొషించడానికి తగినంత ఆహారం, నీరు కావాలి. అందుకోసమే అడువులు నరికేస్తున్నారు. అమెజాన్ లో కాల్చబడిన అడవిలో 80% కేవలం ఈ మాంసహారం కోసమే.

దీని గురించి రాజీవ్ దీక్షిత్ ఒక ప్రసంగంలో చెప్పారు. ఆయన చెప్పిన సమయంలో ప్రపంచ జనాభా 650 కోట్ల. ఆయన ఇలా అన్నారు - "ఇప్పుడు ప్రపంచ జనాభా 650 కోట్లు. కానీ ఈ ప్రపంచం (అన్ని దేశాలు కలిపి) 1300 కోట్ల జనాభాకు సరిపడా ఆహారం పండిస్తోంది. ఒకవేల ఉన్నపళంగా ప్రపంచ జనాభా రెండితలైనా అందరికీ కడుపు నింపగలశక్తి భూమాతకు, ప్రకృతికి ఉంది. కానీ ఆ ఆహరం, నీరు అంతా ఏమవుతోంది ? ప్రపంచంలో అత్యధికంగా తినబడే జీవజాతి గోజాతి (గోజాతికి చెందిన ఆవు, ఎద్దు, దూడలు). ఆ తర్వాత పంది, గేదె, మేక, కోడి, అటుతర్వాత ఇతర పక్షులు, జంతువులు. వీటిలో చాలా జంతువులు తమ ధర్మాన్ని (లక్షణాన్ని) అనుసరించి గడ్డి తింటయి. కానీ వీటి శరీరంలో మాంసం బాగా వృద్ధి చెందడానికి వీటికి గోధుమలు, వరి, పప్పులు, సోయా గింజలు, ఇతర ఆహారాధాన్యాలన్నీ పెడుతున్నారు. ఇవన్నీ తిని వాటి కండపుష్టి ఎంత బాగా పెరిగితే, మాంసం అమ్ముకునే కంపెనీలకు అంత లాభం. భారత్, పాకిస్థాన్, ఇండొనేషియా లాంటి పేద దేశాలు తమ మానవులు తినే ఆహార ఉత్పత్తుల్లో సరాసరి 40% జంతువులకు పెడుతుండగా, అమెరికా, బ్రిటన్, జెర్మని లాంటి దేశలు 70% ఆహార ఉత్పత్తులను జంతువులకు పెడుతున్నాయి. మొత్తం కలిపి చూస్తే సగటున ప్రపంచం మానవుల ఆకలి తీర్చడానికి పండిచిన ఆహార ఉత్పత్తుల్లో 55% శాతం జంతువులకు పెట్టి, వాటిని మేపి, వాటిని తింటున్నారు. అందుకే ఈ ప్రపంచంలో అనేక కోట్ల మంది తినడానికి తిండి లేక ఆకలితో మరణిస్తున్నారు. ఆహార్న్ని పండించి, ఆ మొత్తాన్ని జంతువులకు పెట్టి, వాటిని చంపి తినేకంటే, జంతువధను ఆపి, శాఖాహరం తినడం ప్రారంభిస్తే, ఎంతో మందికి భోజనం దొరుకుతుంది. వనరులు వృధా కావు."

ఇప్పుడు మీకు అర్ధమయ్యే ఉంటుంది, మన దురాశ మరియు జిహ్వచాపల్యం కారణంగా జంతువులు మరణించడమే కాదు, వేల ఎకరాల్లో అడవులు నాశనమవుతున్నాయి. మన ఆహారపు అలవాట్ల కారణంగా కొన్ని కోట్లమంది ఆకలితో అలమటించాలా ? మరి జరుగుతున్న వినాశనంలో మనకు వాటా లేదా ? మన అలవాట్లను మార్చుకుంటే తప్పేంటి ? 

To be continued.... 

స్వామి శివానంద సూక్తి



Thoughts gain strength by repetition of sensual enjoyments. Sensual enjoyments leave on the mind, subtle impressions.

- Swami Sivananda

Tuesday, 31 March 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (1 వ భాగం)



ఎక్కడో వూహాన్ నగరంలో పుట్టిన ఒక చిన్న క్రిమి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వేల సంఖ్యలో మనుషులను బలిగొంటొండి. అది మానవుల సృష్టించిందా లేదా సహజంగా ప్రకృతిలో ఏర్పడిందా అనేది ఇంకా మనకు తెలియదు... కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మానవాళికి మృత్యువు ఎక్కడి నుంచి ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి. ఎవరికీ ఎలా ఉందో, ఎవరిని నమ్మవచ్చో, ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి. అందరూ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ గడిపే స్థితి. దేశాల సరిహద్దులు మూతబడ్డాయి, రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దులు సైతం మూసివేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది ఉంది.. ప్రకృతి ఈ విపత్తు ద్వారా మనకేమీ నేర్పిస్తోంది....
ఈ విపత్తు తొలగాలని, అందరూ బాగుండాలని ఆశిద్దాము. కానీ మన తప్పులు కూడా మనం తెలుసుకుందాము, పునరాలోచన చేద్దాము. ఈ వ్యాసాల ఉద్దేశం భయం కలిగించడం కాదు, మన పంథాను మార్చుకోవాలని గుర్తు చేయడమే....

అయితే ఒకసారి మనం వెనక్కు అనగా 2019 ఆగస్టుకు వెళదాము. అమెజాన్ అడవుల్లో నిప్పు రాజుకుంది....
ప్రపంచంలోనే అతి పెద్ద అడవులు అమెజాన్ అడవులు. అవి బ్రెజిల్, పేరు, బొలివియా మొదలైన తొమ్మిది దక్షిణ అమెరికా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. జీవరాశి మనుగడకు ఇవి విడుదల చేసే ప్రాణవాయువు (ఆక్సిఎజ్ఞ్) ను ద్ర్ష్టిలో ఉంచుకుని వీటిని ప్రపంచానికి ఊపిరితిత్తులుగా చెబుతారు. వీటిలో ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం ఉంటుంది. ఇవి దాదాపు 60 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అమెజాన్ అడవుల్లో నిప్పురాజుకుంది, కాదు వాటికి నిప్పు పెట్టారు మానవులు. శాస్త్రవేత్తల అనచాన ప్రకారం దాదాపు 23 లక్షల జంతువులు ఈ అగ్నిలో మరణించాయి. లక్షల ఎకరాల వృక్ష సంపద నాశనం అయింది. కేవలం ఒక్క జూలై 2019 లోనే బ్రెజిల్లో 7200 చదరపు మైళ్ళు తగలబడింది. దీనికి ఆగస్టు నెల మరియు ఇతర దక్షిణ అమెరికా దేశల్లో తగలబడిన అడవి అదనం.

ఇప్పుడు ఆస్ట్రేలియా లో 2019 నవంబర్ లో జరిగినది ఒకసారి చూద్దామా ? ఆస్ట్రేలియాలోని అడవుల్లో కూడా అగ్గి రాజుకుంది, కాదు ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే స్థానికులు అగ్గి రాజేసారని అక్కడి ప్రజలే చెబుతున్నారు. ఇప్పటి వరకు అనగా మార్చి 2020 వరకు 4,60,50,750 ఎకరాల అటవీ సంపద ఈ అగ్నికి దగ్ధమైంది. దాదాపు ఒక బిలియన్ అనగా సుమారు వందకోట్ల జీవరాశి (పక్షులు, జంతువులు, కీటకాలు) అగ్నిలో పడి మరణించాయి.
కేవలం బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా గురించి చెప్పుకున్నాము, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇలాంటి విధ్వంసం కొనసాగింది, ఇంకా కొనసాగుతోంది. ఈరోజు మనం ఎలా అయితే బయటకి వెళ్లలేక, ఇంట్లో ఉండలేక, ఆమవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చున్నామో, అడవుల్లో ఉన్న జీవరాశి కూడా అలానే గడిపింది. వాటికి ఎక్కడి నుంచి మృత్యువు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తోందో తెలియదు. తప్పించుకునే మార్గం లేదు... ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని ఇంట్లో ఉండమంటున్నా, కొందరు వినక బయట తిరుగుతూ వాళ్ళు ప్రమాదంలో పడుతూ, మానవాళిని ప్రమాదంలో పడేస్తున్నారు... బహుసా ఆ రోజు కూడా ఆ అడవుల్లోని జీవరాశి అలాగే అనుకుని ఉంటాయి. మనిషేమీ ఉన్నతమైన, ప్రకృతికి అతీతమైన జీవి కాదు కద... ప్రకృతిలో భాగమైన మనిషే ప్రకృతికి నిప్పు పెట్టినప్పుడు, ప్రకృతి కూడా 'వద్దు రా నాయనా! ఇది నీకు కూడా ముప్పు తెస్తుంది, నా మాట విను!' అని మౌనంగా చెప్పే ఉంటుంది. అయిన మనం వినలేదు. అప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మనదీ అలానే ఉంది... ఇది ప్రకృతి పెట్టిన శాపమా? లేక స్వయంకృతాపరాధమా?

కానీ ఎంత ఆశ్చర్యం... ఈ కరోనా మొదలైన తర్వాత ప్రపంచంలో అడవులు నరకడం ఆగిపోయింది...


మరి ఎక్కడో అడవులను తగలబెడితే, మొత్తం ప్రపంచం దానికి మూల్యం అనుభవించాలా అని అడుగుతారేమో... దాని గురించి కూడా చెబుతాను....

స్వామి వివేకానంద సూక్తి



It is a privilege to serve mankind, for this is the worship of God. God is here, in all these human souls. He is the soul of man

- Swami Vivekananda

Monday, 30 March 2020

స్వామి సచ్చిదానంద సూక్తి



Love Yourself

“Begin to love yourself. You have to find the peace within you. If you recognize the peace and joy within, then, you’ll be able to give the same to everyone. Actually, you’re not really giving that peace and joy, you’re helping them to find their own peace and joy. First, find it within yourself, because everything begins at home. There is a proverb: ‘Charity begins at home.’ But I would say everything begins at home. If you have joy, you give joy to others by your very presence and example.

- Swami Satchidananda