Sunday 11 February 2024

శ్రీ గరుడ పురాణము (87)

 


ఉపవాసం చేసి ఈ సూత్రాలను కుంకుమ, పసుపు, చందనాలతో చర్చితం చేసి అధివసితం గావించాలి. ప్రతి పవిత్రకాన్నీ వేరు వేరుగా అభిమంత్రితం చేసి పూజించాలి. తరువాత, అప్పటికే మండలంలో స్థాపించి వుంచిన దేవ ప్రతిమకెదురుగా పవిత్రకాన్ని పెట్టాలి.


బ్రహ్మాది అన్య దేవతలను కూడా మండలంలో స్థాపించి పూజించాలి. సూత్రాలను సిద్ధం చేసుకొని మూడు నుండి తొమ్మిది మార్లు వాటిని తిప్పివేది చుట్టూ కట్టాలి. తరువాత కలశ, నెయ్యి. అగ్నికుండం, విమానం, మండపం, గృహాలను సూత్రాలతో కట్టి తనను కూడా సూత్రంతో నుదుట చుట్టుకొని, ఒక పవిత్రకాన్ని దేవత మస్తకంపై వుంచాలి.


సంపూర్ణ సామగ్రిని విష్ణుదేవునికి నివేదించి, పూజించి ఈ మంత్రాన్ని పఠించాలి. ఆవాహితో సి దేవేశ పూజార్థం పరమేశ్వర ॥


తత్ప్రభాతే ర్చయిష్యామి సామగ్ర్యాః సన్నిధోభవ । (ఆచార 43/28, 29)


ఇలా 'ప్రాతఃకాలమే నీకు పూజ చేస్తాను స్వామీ' అన్ని విన్నపం చేసి ఆ రాత్రంతా జాగరం చేసి తెల్లారగానే కేశవస్వామిని పూజించి పవిత్రకాలను ఆయన కర్పించాలి. తరువాత స్వామికీ పవిత్రకాలకూ సుగంధిత ఆహ్లాదక ధూపాన్ని వేసి మంత్రాన్ని చదవాలి. (ఇలాటపుడే నాలుగు పాదాల గాయత్రిని పఠిస్తారు)


అనంతరం పవిత్రకాలతో దేవుని పూజించి వాటిని ఆయన ఎదుట పెట్టి ఇలా ప్రార్థించాలి.


విశుద్ధ గ్రంథికంరమ్యం మహాపాతక నాశనం । 

సర్వపాప క్షయం దేవతవాగ్రే ధారయామ్యహం ॥ (ఆచార 43/33)


తరువాత ఈ మంత్రం చదువుతూ సాధకుడు పవిత్రకాన్ని ధరించాలి.


పవిత్రం వైష్ణవం తేజః

సర్వపాతక నాశనం ॥

ధర్మకామార్థ సిద్ధ్యర్థం

స్వకంఠే ధారయామ్యహం ॥


(ఆచార 43/34,35)


No comments:

Post a Comment