Tuesday 20 February 2024

శ్రీ గరుడ పురాణము (96)

 


ప్రాసాద లక్షణాలు


దేవాలయ నిర్మాణానికి ముందు వాస్తువిదుని పర్యవేక్షణలో అరవై నాలుగడుగుల పొడవు, అంతే వెడల్పు గల ఒక చతుష్కోణ భూఖండాన్ని తయారుచేయాలి. దానిలో నలభై ఎనిమిది అడుగుల మేరను పిట్టగోడలను కట్టి వుంచాలి. నలుదిక్కులలోనూ మొత్తం పన్నెండు ద్వారాలనేర్పాటు చేయాలి.


మనిషికిలాగే దేవాలయానికీ జంఘ వుంటుంది. ఇది మనిషి తొడకి రెండున్నర రెట్ల పరిమాణంలో వుంటుంది. దీనిపైనే గర్భగుడి నిర్మింపబడుతుంది. దీనిని నిర్మించి మూడు లేదా అయిదు భాగాలు చెయ్యాలి. జంఘపై నిర్మింపబడు గర్భగుడి భాగ విస్తార పరిమాపము అనగా కట్టడమును 'శుక్రాంఫ్రి' అంటారు. దీని ద్వారపు యెత్తు శిఖరపు 

యెత్తులో సగముండాలి. నాలుగు శిఖరాలను తయారు చేసి వాటిలో మూడవభాగపు కొలతలో వేదిబంధనం చేయాలి. నాలుగవ భాగంలో మరల ప్రాసాదం కంఠభాగాన్ని నిర్మించాలి. నాలుగు శిఖరాల మధ్యంలో పైకి వుండే భాగాన్ని కంఠభాగమంటారు.

మరోలా కూడా చేయవచ్చు. భవన నిర్మాణానికి సిద్ధం చేసిన భూమి ఖండాన్ని పదహారు సమాన భాగాలుగా చేసి వాటిలో నాలుగవ ముక్కలో గర్భగుడిని నిర్మించి, మిగిలిన పన్నెండు భాగాలనూ పిట్టగోడచే ఆవృతం చేయించాలి. ఈ చతుర్థభాగం ఎత్తును అనుసరించే మిగతా అన్ని భాగాల కొలతలూ నిర్ణయింపబడతాయి. భిత్తి (గోడ)కి శిఖరం రెండింతల ఎత్తు. ప్రదక్షిణభాగం విస్తృతి శిఖరం ఎత్తులో చతుర్థాంశం.


దేవప్రాసాదానికి నాలుగు దిక్కులలోనూ బయటికి పోడానికి ద్వారాలుండాలి. ద్వారం గర్భగుడి గోడలో అయిదవ వంతు కొలతలతో నుండాలి. గర్భగుడిలో ప్రతి అంశము యొక్క కొలతలూ వాస్తు శాస్త్రాన్ని అనుసరించే వుండాలి. ఎక్కడా ఏ మాత్రమూ తేడా ఉండరాదు.


ఇక లింగ నిర్మాణ పరిమాణం.


లింగపు కొలతలను బట్టే దాని పీఠం కొలతలుండాలి. పీఠభాగానికి రెండింతల పరిమాణంలో దానికి నలువైపులా గర్భభాగం వుండాలి. పీఠగర్భాన్ని అనుసరించి దాని గోడ, ఆ గోడ విస్తీర్ణంలో అర్ధభాగం కొలతలో లింగపీఠము యొక్క జంఘభాగము కట్టబడాలి. దానికి రెండింతల ఎత్తు శిఖరానికుండాలి. ద్వారాలు నాలుగు హస్తాల (ఆరడుగుల) పొడవుండాలి. (ఇదే వాస్తు చెప్పే అష్టభాగం)


No comments:

Post a Comment