Wednesday 2 October 2013

దేవి శరన్నవరాత్రి విశేషాలు

దేవి శరన్నవరాత్రి విశేషాలు తెలుసుకుందాం.

పౌర్ణమితిధి  రోజున అశ్విని నక్షత్రం ఉన్న నెలను ఆశ్వీయుజ మాసం అంటారు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి(అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి) నుండి నవమి వరకు గల తొమ్మిది రాత్రులను దేవినవరాత్రులు అంటారు.

ఈ నవరాత్రులలో దేవిని ఆరాధిస్తాం కనుక వీటిని దేవి నవరాత్రులు అని, ఇవి శరత్ ఋతువులో వస్తాయి కనుక వీటిని శరన్నవరాత్రులు అని అంటారు.

ఒక ఏడాదిలో ఆషాఢ నవరాత్రులు, శారదా నవరాత్రులు, మహానవరాత్రులు, వసంత నవరాత్రులు అనే నాలుగు నవరాత్రులు ఉంటాయని అగ్నిపురాణం చెప్తోంది. వీటిలో ఆశ్వీయుజమాసంలో వచ్చే దేవి నవరాత్రులు(శరన్నవతారులు), వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రులు ముఖ్యమైన., ఈ రెండు కాలాలను యమద్రంస్టలు అంటారు. ఈ సమయంలో యముడి నోటి నుంచి కోర్లు బయటకు వస్తాయి కనుక ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, మృత్యువు నుంచి తప్పించుకోవాలంటే ఈ సమయంలో అమ్మవారిని విశేషంగా ఆరాధించాలని పురాణవచనం.

శరత్కాలం నిర్మలత్వానికీ,శరశ్చంద్రుడు ప్రశాంతతకూ ప్రతీకలు. నిర్మలమైన ప్రేమ, కరుణ కురిపించే చల్లని మనస్సు మాతృ మూర్తి సహజ లక్షణాలు. అందుకే నిర్మల,ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలం అంటే జగన్మాతకు అత్యంత ప్రీతి.

ఈ సమయంలో అమ్మవారిని ధ్యానించడం, పగలు ఉపవసించి రాత్రి పూజించాలని, దుర్గా సప్తశతి, దేవి భాగవతం పారాయణ చేయాలని శ్రీ దేవీ భాగవతం చెప్తోంది.

No comments:

Post a Comment