Wednesday 9 October 2013

శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి

ఓం శ్రీ మాత్రే నమః 

మహామహిమాన్వితమైనది శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి. 

భాస్కరరాయులవారు (1690-1785) బ్రహ్మాండపురాణంలో ఉన్న శ్రీ లలితా సహస్రనామాలకు భాష్యం రాసారు. వారు ఈ సహస్రనామాలకు భాష్యాన్ని (కామెంటరి) రాస్తున్న స
మయంలో ఒక సంఘటన జరిగింది. కాశీలో, అక్కడి పండితులు అహంకారంతో భాస్కర రాయులవారిని విమర్శిస్తూ నీవు లలితా సహస్రనామాలకు భాష్యం రాసేంత పండితుడివా? నువ్వు లలితా సహస్రనామాలకు భాష్యం రాసేంతటి గొప్పవాడివైతే లలితా సహస్రనామంలో 'మహచతుష్షష్టికోటి యోగినీగణ సేవితా' అనే ఒక నామం ఉంటుంది. అంటే లలితా దేవిని 64 కోట్ల మంది మహయోగినులు నిత్యం పూజిస్తూ ఉంటారని అర్దం. ఆ 64 కోట్లమంది యోగినీ గణాల పేర్లు చెప్పు అంటూ సవాల్ చేశారు.

ఆయన మరుసటి రోజు చెప్తా అని ఇంటికి చేరారు. అమ్మవారిని ప్రార్ధించారు. వారి పేర్లు నాకేమి తెలుసు, నీవే రాయిస్తున్నావు, దీనికి కూడా నువ్వే సమాధానం చెప్పాలి అని వేడుకున్నారు. అమ్మవారు నీ వెంట నేను ఉన్నాను. నేను చూసుకుంటా అన్నది. మరునాడు గంగా నదిగట్టున కూర్చున్న ఆ పండితుల దగ్గరికి వెళ్ళారు భాస్కర రాయులు. చెప్పగలవా అంటూ భాస్కరరాయులవారిని ఎగతాళి చేశారు పండితులు.

అంతే అమ్మవారి మహిమ వల్ల ఆ గంగా నది ఒడ్డున ఆకాశంలో 64 కోట్లమంది యోగీని దేవతలు ఒక్కసారిగా ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వరుసగా అందరి పేర్లు చెప్పడమే కాదు, వారిని ప్రత్యక్షంగా చూపించారు భాస్కరరాయులవారు. ఇదంతా అమ్మవారి అనుగ్రహంతోనే సాధ్యపడింది.

భక్తులపాలిట కల్పవృక్షం లలితాపరమేశ్వరీ దేవి.

ఓం శ్రీ మాత్రే నమః 

No comments:

Post a Comment