Monday 14 October 2013

పాలపిట్ట కనిపించకపోతే

విజయదశమికి పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని శకున శాస్త్రం అంటుంది. మరి పాలపిట్ట కనిపించకపోతే ఏమవుతుంది? అరిష్టమా?...... అపశకునమా?......... తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి.

ఒక 5 ఏళ్ళ క్రితం మాట. ఒకసారి విజయదశమికి దేవాలయ దర్శనానికి వెళ్ళి వస్తుంటే, రోడ్డు మీద జనం మూగు ఉన్నారు. ఏమని ఆరా తీస్తే, ఎవరో పాలపిట్టను తీసుకువచ్చారని, దాన్ని ఈ రోజు చుడడం వలన మంచి జౌరుగుతుందని చెప్పాడు. మేము చూడలనుకున్నాం, పది రూపాయల తీసుకున్నాడు. ఒక చిన్న పంజరం, ఆ పంజరం చుట్టు నల్లని గుడ్డ కప్పేశాడు, అందుఓ ఒక పిట్ట/పక్షి ఉన్నది. అది కాకో, పావురమో, పాలపిట్టో, చిలకో, అసలదెంటో కూడా తెలియడం లేదు. చుశామా అంటే చూశామని చెప్పుకోవాలి, కానీ ఏం చూశామో ఇంతవరకు తెలియదు.

అసలు పాలపిట్ట అనేది ఉనందన్న సంగతి కూడా మనకు వాళ్ళకు తెలియదు. పాలపిట్ట అంటే పాలుతాగే పిట్ట అన్నాడు ఒక గడుగ్గాయి. పాలపిట్టను మన రాష్ట్రానికి, కర్ణటక, బీహార్, మరికొన్ని రాష్ట్రాలాకు ఇది రాష్ట్ర పక్షి. అది ఎక్కువగా పంటపొలాల్లో కనిపిస్తుంది (కనిపించేది). పంటలకు వచ్చే చీడలను, పురుగును తిని రైతుకు సహాయంచేస్తుంది.అలాగే కీటకాలను, సీతకోకచిలుకలను, వానపాములను, చిన్న చిన్న పాములు వంటివి దీని ఆహారం. ఒకప్పుడు ఇవి 1 చదరపు కిలోమీటరుకు సగటున 50 కనిపించేవి. ఇప్పుడివి అంతరించిపొయే పక్షుల జాతుల జాబితలో చేరిపోయాయి, ప్రమాదపుటంచున ఉన్నాయి.

మనిషికి అత్యాశ పెరిగిపోయింది. ఒక ఎకరం పొలంలో 10 బస్తాల పంట రావల్సి ఉంటే, 50 బస్తాలు ఆశిస్తున్నాడు, అదే కొవలో ప్రభుత్వాలు ఉన్నాయి. మంచి దిగుబడి కోసం రసాయన (కెమికల్) ఎరువుల్లు, పురుగుల మందులు వాడతారు. ఈ రోజు మనం తినే ఆహారం మొత్తం రసాయనాలే, మన శరీరం మొత్తం కలుషితమైపోయింది. చిన్నవయసులోనే తెల్లవెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? అందరికి మధుమేహం ఎందుకు వస్తోంది? రకరకాల రోగాలు ఎందుకు పుడుతున్నాయి? మనం అభివృద్ధి చెందిన కొద్ది కొత్త రోగాలు కూడా ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఎందుకంటే మనకు పౌషకాహారం అవసరం లేదు. ఎంత తిన్నామన్నది చూస్తున్నాం కనీ, తిన దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి చూడడం లేదు. మనకు కేవలం దిగుబడి మాత్రమే కావాలి, కానీ అది మనకు శక్తినివ్వాలని మనం మర్చిపోయాం. మనం తింటున్నాం, కేవలం తింటున్నాం, ఎందుకంటే తినాలి కాబట్టి. అంతే. మనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు.

బియ్యం అనేకమార్లు పోలిష్ పట్టి తెల్లగా కనిపించాలి. తెల్లటి బియ్యం మాత్రమే తినాలని మనం కోరిక. అందుకే చిన్నవయసులో జుట్టు తెల్లబడుతోంది. రసాయన ఎరువుల చేత పెంచబడిన ఆహారం వలన మనకు మధుమేహం (షుగర్) మొదలు అనేక వ్యాధులు వస్తున్నాయి. దంపుడు బియ్యం తింటే ఏమవుతుంది? అది పర్వౌతక్కువ పనిగా భావిస్తాం, మనం పిల్లలకు మనం రోగాలు అంటగడుతున్నాం.

ఇప్పుడు ఇది చెప్పవలసి వచ్చిందంటే పాలపిట్ట కనిపించకపోవడానికి ప్రధాన కారణం ఈ రసాయన, కెమికల్ ఎరువులు, పుర్గుల మందులే. పాలపిట్ట కనిపించకపోతే ఏమవుతుంది? పాలపిట్ట అంతరించిపోతే ఏమవుతుంది? .......... ఏమవ్వదు, త్వరలో మానవజాతి కూడా రోగాలతో సర్వనాశనమవుతుంది, అంతే. ఆరోగ్యం భారతావని కాస్తా రోగాల భారతవనిగా మారుతుంది. అదే మనకు ఈ దసరా గుర్తుచేస్తోంది.  

మనం ఇప్పుడే మేల్కోవాలి. మనం పంధాను, మన వ్య్వసాయ పద్ధతులను, జివన విధానాన్ని, ప్రక్టిపట్ల మన దృష్టిని మార్చుకోవాలి. దీనికి సమాధానం సేంద్రియ వ్యవసాయం కానే కాదు ఎందుకంటే సేంద్రియ ఎరువుల ఒక ఉష్ణోగ్రత వరకే పనిచేస్తాయి. మరి మనకు మార్గం లేదా?

ఉన్నది ఒక్కటే మార్గం. అదే ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధపద్ధతులలో సాగే వ్యవసాయం. వేదంలో చెప్పబడ్డ వ్యవసాయ పద్ధతి. పాలేకర్ రైతు ఆశ్రయించి, ఫిలితాలు చూపిన వ్యవసాయపద్ధతి. గోమాత మీద సంపూర్ణంగా ఉపయోగపడ్డ వ్యవసాయం ఇది. మన కోసం, మన బిడ్డలకోసం, భావితరాలకోసం, బంగారు భారతభూమి ఆరోగ్యంగా ఉంచడం కోసం మన ప్రభుత్వాలు ప్రోత్సహించవల్సిన వ్యవసాయపద్ధతి. భూసారన్ని పెంచే వ్యవసాయ పద్ధతి.

ఈ విజయదశమి మనకు గుర్తుచేస్తున్నది ఇదే. మనం మారితే, భవిష్యత్తులో మనకన్ని విజయలే, లేకుంటే మానవజాతికి అపజయాలే.
               

No comments:

Post a Comment