Monday 29 September 2014

అన్నపూర్ణదేవి

అన్నం పరబ్రహ్మస్వరూపం. ఇది తరచూ పెద్దలు చెప్పే మాట. శాస్త్రమూ చెప్పిన మాట. అన్నం నుండే సమస్త జీవరాసి పుడుతోంది. ఆహారం తీసుకోవడం చేత, అది సప్తధాతువులుగా మారి, శరీరపోషణకు కారణమవుతోంది. సప్తధాతువుల్లో చివరివైన వీర్యం/అండంగా మారి, జీవరాశి ఉద్భవించడానికి కారణమవుతోంది. ఆహారం చేతనే సకల జీవరాశి జీవనం సాగిస్తోంది. 

అన్నం అనగానే మన తెలుగిళ్ళలో బియ్యం ఉడకబెట్టగా తయారయ్యే పదార్ధం అని కాకుండా, సంస్కృత భాషలో అన్నం అంటే ఆహారం అన్న అర్దం ఉంది. ఈ లోకంలో ఆయా వాతావరణపరిస్థితులు, ప్రాంతాలను బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. సంస్కృతభాషలో ఏ రకమైన పదార్ధానైనా అన్నం అనే అన్నారు. అందువల్ల ఏ విధమైన ఆహారపదార్ధానైనా పారేయడం దోషం అంటుంది శాస్త్రం. అంతే కాదు అహారం తినే సమయంలో కింద పడ్డ ఒక్కొక్క అన్నం మెతుక్కి 10,000 సంవత్సరాల నరకం అనుభవించవలసివస్తుంది. ఎన్నో జన్మలు ఆహారంలేక బాధపడవలసిన అగత్యం పడుతుందని శాస్త్రం చెప్పిన మాట.

ఎప్పుడు కూడా అన్నం మీద కోపం చూపించకూడదదు. పరబ్రహ్మస్వరూపమైన ఆహారాన్ని వృధా చేయకుండా తినడమే మనం అన్నపూర్ణదేవికి ఇచ్చే గౌరవం. ఆకలితో మానవులకు, ఇతర జీవరాశులకు ఆహారాన్ని అందించి క్షుద్(ఆకలి) బాధ తీర్చడమే మనం అన్నపూర్ణాదేవికి చేసే నిజమైన అర్చన.

ఆదిభిక్షువైన 
ఆ సదాశివునికి భోజనవే నిత్యం బంగారుపాత్రలో ఉన్న ఆహారన్ని, బంగారు గరిటెతో వడ్డించే ఆ అన్నపూర్ణదేవి ఈ లోకంలో అందరికి యొక్క ఆకలిని తీర్చుగాకా. అందరికి జ్ఞానాన్ని, వివేకవైరాగ్యాన్ని ప్రసాదించుగాకా. 

No comments:

Post a Comment