Tuesday 30 September 2014

గాయత్రి మంత్రం

ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గాయంతం అంటే గానం చేయడం,పాడడం. గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి చంధసాం మాత - అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి అని అర్దం.

తద్యత్ ప్రాణం త్రాయతే తస్మాద్ గాయత్రి.ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి వేదమాత. గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది. 24 అక్షరాల ఈ మహా మంత్రానికి 32 మంది అధిదేవతలున్నారు. ఈ మంత్రాన్ని రక్షించేవారు. శివు
డు, విష్ణువు, బ్రహ్మ, నరసింహుడు, ఇంద్రుడు, సూర్యుడు..... ఇలా. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది మన నిత్య జీవితంలో ఏదురయ్యే కష్టాలను తొలగించగల 32 దేవతలను స్మరించిన ఫలితం వస్తుంది.

అందుకే "గాయత్రి పరమో మంత్రః"అన్నారు. అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అని, గాయత్రీ మంత్రమే పరమమంత్రమని అర్దం. జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది గాయత్రి మంత్రం.

ప్రపంచంలో గాయత్రి మంత్రం మీద జరుగినవి, జరుగుతున్న పరిశోధనలు మరే మంత్రం మీద కాని, ఇతర మతాల్లోని ఏ అంశం మీద గాని జరగలేదంటే అతిశయొక్తి కాదు. ఇప్పటివరకు గాయత్రి మంత్రం మీద జరిపిన ఏ అధునిక పరిశోధన విఫలమవకపోవడం ఆశ్చర్యం.

అనాదికాలం నుంచి భారతీయ ధర్మంలో గాయత్రిమంత్రాన్ని వర్ణబేధం లేకుండా స్త్రీపురుషులందరూ ఉపాసించారు.

'ఓ సచ్చిదానందా! అనంతస్వరూప! ఓ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ! ఓ నిరాకారా! సర్వశక్తివంతుడగు న్యాయకారీ! ఓ కరుణామృత వారధీ! నీ దివ్యము, వరేణ్యమూ అగు విజ్ఞానరూపమునుమేము నిత్యము ఉపాసింతుము. మాకు ధారణశక్తి గల బుద్ధినిత్తువు గాక! మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్‌వ్రతాలను ఆచరితుము గాక! విద్యా జ్ఞానము మొదలైన పరమసుఖములను పొందెదము గాక!' అంటూ గాయత్రి మంత్రానికి ఒక అర్దం ఉంది.   

No comments:

Post a Comment