Tuesday 2 June 2015

పరమాచార్య వాణి

వ్యక్తికి సత్ప్రవర్తన ఉంటే చాలు, దైవభక్తి అవసరంలేదనే భావన కొందరికుంది. ఈ అభిప్రాయం తప్పు. భక్తి లేని సత్ప్రవర్తన, సువాసన లేని పువ్వు వంటిది. ఈ దేశపు ప్రజలు స్వతంత్రం కోసం తీవ్రమైన పోరాటాలు, త్యాగాలు చేస్తున్న సమయంలో 'దేశమే ప్రధానం. మిగితావి తరువాత' అని పిలుపిచ్చారు. నాకు కొందరు నాయకులతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు, దైవాన్ని, ధర్మాన్ని వెనక్కుతోసి దేశం మీదే మొత్తం దృష్టి కేంద్రీకరించండం సబబేనా అని ప్రశ్నించాను. ఒకసారి దేశానికి స్వతంత్రం వస్తే అన్నీ అవే సర్దుకుంటాయాని వారు సమాధానం ఇచ్చారు. కానీ అలా జరగలేదు సరికదా ఈ దుష్పరిణామం యొక్క ఫలితం అన్ని రంగాల్లో కనిపిస్తోంది, చిన్న పిల్లవాడిని అదుపు చేయడం కూడా కష్టమైపోతోంది.

కంచి పరమాచార్య


No comments:

Post a Comment