Sunday 27 December 2015

హిందూ ధర్మం - 189 (గోవు ప్రాముఖ్యత)

నిరుక్తం గురించి ఇంత వివరంగా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే వేదాలకు ప్రామాణికమైన అర్దాలు కాక తమకు తోచిన అర్దాలను చెప్పి, ధర్మాన్ని నాశనం చేయాలని, మతమార్పిడి చేయాలని అనేక కుట్రలు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పే ఏ విషయాలకు శాస్త్రప్రమాణం ఉండదు. వేదాలకు తప్పుడు అర్దాలు తీసి అందులో లేనివి ఉన్నాయని ప్రచారం చేయడంలో అనేకులు తలమునకలై ఉన్నారు. అందులో వాళ్ళు ప్రధానంగా చేసే కొన్ని ఆరోపణల వెనుకనున్న సత్యాలను తెలుసుకుందాం.

వేదాల్లో గోవధ ఉందనే ప్రధానమైన ఆరోపణ. వేదమే ధర్మానికి మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది, వైదిక సంస్కృతి వచ్చింది. అగ్ని ఆరాధన ప్రతి మానవుడు చేయాలని వేదంలో ఈశ్వరశాసనం. అగ్ని ఆరాధాన చేయడమంటే అగ్నిహోత్రంలో హవిస్సును, ఘృతాన్ని (ఆవునెయ్యి) సమర్పించడం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. అగ్ని ఆరాధాన జరగాలంటే ఆవు ఉండాలి. ఆవు నుంచి వచ్చే పిడకలతోనే ప్రతి దినం రెండు సంధ్యాసమయాల్లోనూ నిత్యాగ్నిహోత్రం చేయాలి. అగ్ని ప్రజ్వరిల్లాలంటే అందులో ఆవునెయ్యి పడాలి. ఏం గేదే నెయ్యి వెయవచ్చు కదా? అని సందేహం వస్తుంది. లేదా మరింకేమైనా మండే పదార్ధం వేయవచ్చు కద, పెట్రోల్, కిరసనాయిల్, డీజీల్ లాంటివి. ఆవునెయ్యే ఎందుకు వేయాలి? అయినా, పది మందికి పెట్టక వాటిని తీసుకెళ్ళి నిప్పులో పోయడం మూర్ఖత్వం కాదా? ఆవుకే ఆ ప్రత్యేకత ఎందుకు? ఇలా అడుగుతారు హైందవ ద్వేషులు.

ముందు గోవు విశిష్టత తెలుసుకుందాం. ఆ తర్వాత వేదాల్లో గోవధ ఖండన చూద్దాం. ఆగ్నికి ఏ పదార్ధాన్ని ఆహుతిచ్చినా అది కార్బన్-డై-ఆక్సయిడ్ ని, ఇతర హానికార, కాలుష్యకారక పదార్ధాలను విడుదల చేస్తుంది. కానీ ఆవు నెయ్యిని అగ్నికి ఆహుతిస్తే, 10 గ్రాముల ఆయినెయ్యి 1 టన్ను ఆకిజెన్ (ప్రాణవాయువు) ను ఉత్పత్తి చేస్తుంది. ఆవు అన్నప్పుడు అది దేశవాళీ ఆవు/ నాటు ఆవు/ భారతీయ ఆవు గానే గ్రహించాలి. జెర్సీ ఆవులకు ఆ శక్తి లేదు. యజ్ఞం అనేది అగ్నిలో ఏవో వస్తువులు వేసి వృధా చేయడం, ప్రకృతిని నాశనం చేసే ప్రక్రియ కాదు. అది ప్రకృతికి నూతన ఉత్తేజాన్ని, శక్తిని, పుష్టినిచ్చే ప్రక్రియ అని వేదం చెప్పింది. దీనిపై కుతూహలంతో పరిశోధించిన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. అదే గాకా, హవిస్సుగా వేయబడిన ఆవునెయ్యి వాసన ఎక్కడ వరకు వ్యాపించబడుతుందో, అంతవరకు గాలిలో సూక్ష్మక్రిములు నశిస్తాయని ధర్మం చెప్పింది, ఆధునిక పరిశోధనలు కూడా ముమ్మాటికి నిజమని నిరూపించాయి. అంతేగాకా హవిస్సులో గేదేనెయ్యి వేస్తే, అది భూమి నుంచి 300 మీటర్ల నుంచి 1000 మీటర్ల పై వరకు మాత్రమే వెళ్ళగలదు. కానీ ఆవునెయ్యి అణువుల రూపంలో మారి భూ ఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల పైకి వెళ్ళి, 10 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపిస్తుంది. అక్కడ ఏవైనా నీటి అణువులు ఉంటే, వాటిని దగ్గరకు చేర్చి, వర్షం కురిపించగల శక్తి ఆవునెయ్యి అణువులు కలిగి ఉన్నాయి. అంతేకాక ఇవి తాము పైకి చేరే క్రమంలో తమ చుట్టు ఉన్న కాలుష్యాన్ని కూడా శుభ్రం చేయగలుగుతాయి. అనగా యజ్ఞం వలన కురిసే వర్షం స్వఛ్ఛమైన నీటిని ఇస్తుంది. అసహజ పద్ధతుల్లో రసాయనాలు చల్లి మేఘాలను వర్షింపజేయడం వలన కురిసిన వాన నీటి బిందువుల్లో హానికారక రసాయనాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిబట్టి ఆవునెయ్యి ఉపయోగం ఏంటో అర్దం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే పెట్రోల్, డీజీల్, లేక చెత్త మొదలైనవి కాల్చినప్పుడు వెలువడే వాయువులు విషాలుగా మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి, పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి, భూతాపాన్ని పెంచుతాయి. అదే ఆవుపిడకలను, ఆయుర్వేద మూలికలను ఆవినెయ్యితో కాల్చినప్పుడు వెలువడే వాయువులు కాలుష్యాన్ని శుద్ధి చేస్తాయి, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఇవన్నీ ఋషులు వేల ఏళ్ళ క్రితమే చెప్పారు. అది నమ్మనివారు, వైదిక ధర్మంపై నమ్మకం ఉండి, కుతూహలంతో పరిశోధించిన అనేకులు ఈ విషయాలను సత్యమని రూఢీ చేసుకున్నారు. ఇంకా ఆవునెయ్యిని యజ్ఞంలో వేయడమెందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే వారు ఎంత వెనుకబడి ఉన్నారో, మార్పును అంగీకరించని మూఢులుగా మిగిలిపోతున్నారో, సత్యం తెలుస్తున్నా, అంగీకరించడానికి అహం అడ్డువచ్చి, దురహంకారులుగా బ్రతుకీడుస్తున్నారో అర్దం చేసుకోవచ్చు.

To be continued ...................

No comments:

Post a Comment