Showing posts with label గోవధ. Show all posts
Showing posts with label గోవధ. Show all posts

Monday, 16 May 2016

హిందూ ధర్మం - 209 (యజ్ఞంలో బలి ఖండన - 3)

ఇప్పుడు వేదంలో యజ్ఞాల గురించి, అవి జంతుబలిని ఎలా ఖండించాయో చూద్దాం. వైదిక కర్మకాండకు ముఖ్యమైనది యజుర్వేదం. యజుర్వేద పండితుడిని అధ్వర్యుడు అంటారు. అధ్వర అంటేనే అహింస అని అర్దం. హింసకు పాల్పడనివాడని. ఇక ఆయన ఆధ్వర్యంలో జరిగే యజ్ఞంలో హింస ఎలా ఉంటుంది?

'వెజిటేరియనిజం అండ్ ది వేదాస్' అనే పుస్తకంలో అరుణబ్ తల్వార్ గారు ఇటువంటి అనేక విషయాలు చరించారు. యజ్ఞం జంతుబలిని కోరలేదు. మనిషిలో పశులక్షణాలను మాత్రమే బలి కోరింది. దీనికి సంబంధించిన అంశాన్ని కధ రూపంలో శతపధ బ్రాహ్మణం (1-2, 3, 6-9)లో ఋషులు పొందుపరిచారు. ఆదిలో (ఈ సృష్ట్యాదిలో) దేవతలను మనిషిని యజ్ఞంలో అర్పించారు. వెంటనే మేధ (ఆహుతివ్వాల్సిన వస్తువు), మరణించిన ఆ వ్యక్తి నుంచి వెళ్ళి, అశ్వంలోకి చేరింది. వాళ్ళు అశ్వాన్ని అర్పించారు. అప్పుడు మేధ ఆవులోకి ప్రవేశించింది. వారు ఆవును అర్పించారు. అప్పుడది మేకలోకి ప్రవేశించింది. వారు మేకను కూడా అర్పించారు. అప్పుడు మేధ భూమిలోకి ప్రవేశించింది. మేధను వెతుకుతూ దేవతలు భూమిని తవ్వగా, అది బియ్యం, బార్లో లోకి దాక్కుంది. వాటిని యజ్ఞంలో అర్పించినా, వాటి నుంచి మేధ ఎక్కడకు వెళ్ళలేదు. యజ్ఞ ఫలితానిచ్చింది. కనుక బార్లీ, బియ్యం మొదలైనవి మాత్రమే హవిస్సుకు (యజ్ఞంలో ఆహుతిచ్చే పదార్ధాలను హవిస్సు అంటారు) శ్రేష్టమని తేల్చారు. ఇక్కడొక విషయం గమనించాలి. బ్రాహ్మణాలు వేదానికి (మంత్రసంహిత) వేదద్రష్టలైన ఋషులు ఇచ్చిన బాష్యాలు. అవి ప్రసాదించక ముందు ఏ విధమైన యజ్ఞయాగాది క్రతువులు జరగలేదు. ఎందుకంటే యజ్ఞ ప్రక్రియలను ఋషులే వెలికి తీశారు కనుక. అందువల్ల బ్రాహ్మణంలో చెప్పిన కధ కేవలం సూచకంగానే (symbolic) గ్రహించాలి కానీ, ఐతిహ్యం (Historical event) గా కాదు.

యజ్ఞంలో చెఱువు అన్న పేరుతో హవిస్సు వేయడానికి అన్నం వండుతారు. అది మాములు పద్ధతికి భిన్నంగా ఉంటుంది. అదే కాక కొన్ని యగాల్లో ఆ చెఱువులోనే బార్లీ గింజలు, నవధాన్యాలు కలుపుతారు. యాగం ఏ కారణం నిమిత్తం చేయబడుతున్నదో, దానికి తగిన వస్తువులను అందులో కలుపుతారు. కొన్ని సందర్భాల్లో నవధాన్యాలను పొడి చేసి, హవిస్సుగా అర్పిస్తారు. ఈ చెఱువులోనే పెరుగు, తేనే కలిపి కూడా అర్పిస్తారు. ఇవన్నీ మానవునిలో పశుత్వ లక్షణాలను ఆహుతివ్వడానికి సూచనలు. కొన్ని పెద్ద పెద్ద యాగల్లో మేకబలి ఇస్తారని వక్రీకరించారు. పరాశర మహర్షి పిండితో చేసిన మేకను బలి ఇవ్వాలని తన గ్రంధాల్లో స్పష్టంగా వెల్లడించారు. ఆ పిండి మేక మనిషిలోని పశులక్షణానికి, బద్ధకానికి సూచన. మహిషాసుర మర్ధిని మహిషుడిని మర్దించడమంటే దున్నపోతును చంపడం కాదు. మానవునిలోని మహిషత్వాన్ని, జడత్వాన్ని, నీచమైన పశుస్వభావాన్ని మర్దించడం.

To be continued .....................

Sunday, 10 April 2016

హిందూ ధర్మం - 203 (వేదంలో గోవధ ఖండన - 3)



వక్రీకరణ - ఇంద్రుడు ఆవు, దూడ, ఎద్దు, గుర్రం, దున్నపోతుల మాంసం తింటాడు - 6-17-1
వాస్తవం - ఆ మంత్రం ఏం చెప్తోందంటే యజ్ఞంలో అగ్నికి కలప పుష్టినిచ్చిన విధంగా గొప్ప పండితులు ఈ ప్రపంచాన్ని జ్ఞానంతో కాంతిమయం చేస్తారు. ఈ మంత్రాన్ని అనువాదం చేసిన అవతార్ గిల్ల్ సమూహానికి ఇందులో ఇంద్రుడు, ఆవు, ఎద్దు, గుర్రం ఎలా కనిపించాయో!? వారు చెప్పిన మంత్రంలో 'గవ్యం' అనే పదం ఉంది. పంచగవ్యం ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలకు సంకేతం. కానీ వారు దానికి మాంసం అనే అర్దం కల్పించారు. రాజు గోఘృతం వంటి సాత్విక భోజనం ద్వారా పుష్టిగా తయారై దేశాన్ని శతృవులు, రాక్షసుల బారి నుంచి రక్షించాలని ఆ మంత్రం చెప్తోంది.

వక్రీకరణ - అగ్ని 100 దున్నపోతులను వండాడు. ఓ ఇంద్రా! ఇది మరుత్తులను శక్తివంతం చేస్తుంది. అతడు, పూషన్, విష్ణువు, అందులోకి మూడ పెద్దపాత్రలతో వృత్తాసుర్రున్ని చంపే రసాయనం పోశాడు - ఋగ్వేదం 6-17-11
వాస్తవం - ఓ ఇంద్రా! లోక పరిపాలకుడా! మానవాళి మరియు ప్రకృతి యందున్న సమస్త బలనమైన, సృజనాత్మకమైన శక్తులన్నీ ఏకమై నీ తేజమును, సేవను స్తుతించాలి. సర్వవ్యాపకుడు, విశ్వాన్ని పోషించువాడు, సర్వకాలాల్లో శక్తిమంతుడు, మూడూ లోకాల యందు ఉంటూ పరమానందానిచ్చు విష్ణువు దుష్టులను నశింపజేయు ఇంద్రునకు ఆనందాన్ని, శక్తిని ఇచ్చుగాకా. (ఇది ఆర్యసమాజ స్థాపకులు మహర్షి స్వామి దాయనందుల వారి అనువాద సరళిలో డా. తులసి రాం శర్మ గారి అనువాదం)

వక్రీకరణ - మనుస్మృతి జంతువధను సమర్ధిస్తుంది. 'జంతువులను తినడం పాపం కాదు, ఎందుకంటే భగవంతుడు తినేవారిని, తిను పదార్ధాలను, రెండింటిని సృష్టించాడు - 5-30
వాస్తవం - హిందూ ధార్మిక గ్రంధాల్లో అత్యత ఎక్కువగా ప్రక్షిప్తాలకు గురైంది మనుస్మృతేనని అనేకమంది తేల్చారు. క్రీ.శ. 7 వ శతాబ్దం తర్వాత మొదలైన ఈ ప్రక్షిప్తాలు ఎంతవరకు వెళ్ళాయంటే ఇప్పుడు లభించే మనుస్మృతిలో 50% ప్రక్షిప్తాలే ఉన్నాయి. ఆర్యసమాజం వారు మనుస్మృతిలో ఉన్న ప్రక్షిప్తాలను తొలగించి యదార్ధమైన మనుస్మృతిని విశుద్ధ మనుస్మృతి పేరిట ప్రచురించారు.

అసలు మనుస్మృతిలో జంతువధ గురించి ఏం చెప్పారో చూద్దాం.

अनुमन्‍ता विशसिता निहन्‍ता क्रयविक्रयी ।
संस्‍कर्ता चोपहर्ता च खादकश्‍चेति घातका: ।। – మనుస్మృతి 5 వ అధ్యాయం 51 వ శ్లోకం.

మాంసభక్షణ ప్రోత్సహించేవాళ్ళు, జంతువులను వధించువాడు, మాంసం అమ్మువాడు, వండువాడు, దాన్ని వడ్డించువాడు, తినువాడు, అందరూ ఘాతకులే. వారందరికి పాపం సమానంగా వస్తుంది.

ఏ జీవిని చంపకపోవటం చేతనే వ్యక్తి మోక్షానికి అర్హుడవుతాడు - మనుస్మృతి 6.60

నిస్సహాయ, అహింసాప్రవృత్తి కల జంతువులను తన సంతోషం కోసం వధించువాడు ఇహలోకంలోను, పరలోకంలోనూ ఎన్నటికి సంతోషాన్ని పొందడు - మనుస్మృతి 5-54.

ఎవరికైతే జంతువులను బాధించాలని, వధించాలని కోరిక ఉండదో, అతడు సవ్రజీవులకు హితుడై (సరభూతహితుడై), పరమానందాన్ని పొందుతాడు - మనుస్మృతి 5-46

ఏ జీవికి హానీ చేయనివాడు, ఏ ప్రయత్నం లేకుండానే అతడు అనుకున్నది ఏది అనుకుంటే అది పొందుతాడు, మనసు దేని మీద లగ్నం చేస్తే అది సిద్ధిస్తుంది, అతడు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది - మ.స్మృ.5-47

జీవులను హింసించకుండా మాంసం రాదు. జీవహింస ఆత్మానందానికి అడ్డంకి. కనుక మాంసభక్షణ విడిచిపెట్టండి - మ.స్మృ.5-48

దేవతలను, పితృదేవతలను పూజించకపోయినా ఫర్వాలేదు కానీ, అన్యజీవుల మాంసాన్ని భుజించి తన శరీర సౌష్టవాన్ని పెంచుకోవాలనుకునే వ్యక్తికి మించిన మహాపాపాత్ముడు వేరొకడు ఉండడు - మ.స్మృ.5-52

మనుస్మృతి ఇంత విపులంగా జీవహింస తప్పని చెప్తే, అందులో గోమాంసం భక్షణ ఉందని, వేదంలో ఎద్దులను తినమని చెప్పిందని వక్రీకరించి 'మొద్దులను' ఏమనాలి?

To be continued ................

Sources:
https://ancientindians.in/purusharthas/dharma/vegetarianism-as-per-manusmruti-a-dharma-sastra/
http://www.iskcondesiretree.com/forum/topics/about-being-vegetarian-and-not
http://www.vedicgranth.org/misconceptions-on-vedas/misconception-3---violence-against-animals-meet-eating-etc

Sunday, 3 April 2016

హిందూ ధర్మం - 202 (వేదంలో గోవధ ఖండన - 2)

మాంసం అంటే మనకు తెలిసిందే. కానీ మాంసం అంటే గుజ్జు అనే అర్దం కూడా వస్తుంది. సమయాన్ని, ప్రకరణాన్ని అనుసరించి అర్దం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వక్రీకరణకారులు మాంసం అనే సామాన్యమైన, వాడుకలో ఉన్న అర్దం తీసుకుని యాజ్ఞవల్క్య మహర్షి మాంసం తింటా అన్నారని ప్రచారం చేశారు.

ఇంకొన్ని ఆరోపణలను పరిశీలిద్దాం.

వక్రీకరణ - అతిధి వచ్చినప్పుడు, వివాహ సమయంలో, శ్రాద్ధ సమయంలో గోవును వధించాలి - ఆపస్థంభ గృహసూత్రం 1/3/10
వక్రీకరణ - శ్రాద్ధ సమయంలో భోజనంలో పెట్టిన మాంసాన్ని తినను అన్న బ్రాహ్మణుడు నరకానికి వెళతాడు - వశిష్ట ధర్మసూత్రం 11/34

వాస్తవం - అక్కడ గోవు గురించి చెప్పనేలేదు. శ్రద్ధయా కురుతే ఇతి శ్రాద్ధం అని సూత్రం. శ్రాద్ధకార్మకు శ్రద్ధ ముఖ్యం. దైవకార్యాలకు మడి లేకపోయినా సర్దుకోవచ్చు కానీ శ్రాద్ధ కర్మలకు మాత్రం మడి తప్పనిసరి అని పెద్దల నిర్ణయం. మడికి అర్దం బాహ్యంలో ఉన్న వస్తువులను ముట్టుకోకపోవడం అని కాదు. మనసును, ఇంద్రియాలను అన్యమైన విషయాల మీద వెళ్ళనివ్వక, తదేక దృష్టి కలిగి ఉండడం. మడి వస్త్రం ధరించినా, మనసు అన్య విషయాల మీదకు వెళితే, ఇక ఆ మడికి అర్దంలేదు. పై సూత్రాల్లో కూడా అదే చెప్పబడింది. అతిధి వచ్చినప్పుడు, వివాహ సమయంలో, శ్రాద్ధ సమయంలో ఇంద్రియాలను నియత్రించాలి, అదుపులో పెట్టుకోవాలి. అక్కడ గోవుకు ఇంద్రియాలనే అర్దం స్వీకరించాలి. దాన్ని వక్రీకరించి గోమాంసం తినాలని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు నికృష్టులు.

అతిధి విషయంలో కూడా అంతే. అతిధి సాక్షాత్తు భగవత్స్వరూపం. అతిధికి భోజనం సిద్ధం చేయడం దగ్గరి నుంచి చాలా శుచిగా ఉండాలి. ఆహారం వండే సమయంలో వంట చేసేవారి మనసులోని భావాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయని, అవి తిన్న వారిని ప్రభావితం చేస్తాయని ధర్మశాస్త్రం (ఆయుర్వేద, మంత్ర శాస్త్రాలు ఇత్యాదులు) చెప్తోంది. ఆహారం సిద్ధం చేసే సమయంలో మనసు అనవసరమైన, అధార్మికమైన విషయాల మీద వెళితే అది తిన్నవారి దేహంలోకి వెళ్ళి అదే భావాలను కలిగిస్తుంది. అందుకే సాధకులకు అనేక నియమాలున్నాయి. అతిధికి భోజనం పెట్టకపోతే వచ్చే పాపం కంటే అతడి ఉపాసనకు, నిష్ఠకు, దీక్షకు భంగం కలిగిస్తే వచ్చే పాపం ఇంకా ఎక్కువ. అందువల్ల అతిధి విషయంలో ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి అని ధర్మశాస్త్ర సూత్రాలు తెలియజేస్తున్నాయి.

వక్రీకరణ - కూతురి వివాహ సమయంలో ఆవులను, ఎడ్లను వధించాలి - ఋగ్వేదం 10.85.13
వాస్తవం - అసలు ఈ మంత్రం వివాహానికి సంబంధించినదే కాదు. గో హన్యతే అన్న ఒక్క పదాన్ని తీసుకుని ఇంత పెద్ద కష అల్లారు. శిశిర ఋతువు (చలికాలం) యందు సూర్యకిరణాలు బలహీనపడి మరల వసంత ఋతువులో శక్తిని పొందుతాయి అని ఆ మంత్రం చెప్తున్నది. ఇక్కడ గో అనే శబ్దానికి సూర్యకిరణాలనే అర్దం స్వీకరించాల్సి ఉండగా, నికృష్టులు ఆవును అనే అర్దాన్ని స్వీకరించారు. హన్యతే అనగా ఇక్కడ బలహీనపడుట అనే అర్దం స్వీకరించాలి. అదీగాక, వీళ్ళు పూర్తి మంత్రాన్ని అనువదించకుండా కేవలం గోహన్యతే అనే ఒక్క పదాన్నే అనువదించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ వాదనే నిజం అనుకున్నా, ఆ తర్వాతి మంత్రంలో గోవు తిరిగి తన పూర్వ రూపాన్ని సంతరించుకుంటుందని చెప్తుంది? అక్కడ గోవుకు అర్దం ఆవు అయితే వధించబడిన ఆవు తిరిగి ఎలా బ్రతికి వస్తుంది? వీటికి వక్రీకరణకారుల వద్ద సమాధానం ఉండదు.

ఇంకో విషయం ఏమిటంటే అసలు వివాహాది శుభకార్యాల్లో మాంసం పెట్టడం నిషిద్ధం. వివాహమంత్రాల్లో వేదికకు దేవతలను, ఋషులను, అనేక శక్తులను ఆహ్వానిస్తారు. అటువంటి సమయంలో శుచి ప్రధానం. అప్పుడు కేవలం శాఖాహారమే వండాలి తప్పించి, మాంసాహారం వండకూడదు. అది కొత్తగా వివాహం చేసుకున్న జంట వైవాహిక జీవితానికి కూడా మంచిది కాదు.

To be continued ..................

ఆర్యసమాజం వారి సౌజన్యంతో

Monday, 28 March 2016

హిందూ ధర్మం - 201 (వేదంలో గోవధ ఖండన - 1)

ఇప్పటి వరకు ధార్మిక గ్రంధాల్లో గోవధ లేదన్న సంగతి చూశాం. ఇప్పుడు ధర్మవ్యతిరేకులు చేస్తున్న ఆరోపణలను ఎంత అసత్యమో, కుట్రపూరితమో చూద్దాం. నిజానికి ఈ వాదన ఈనాడు కొత్తగా వచ్చింది కాదు, వేదంలో గోవధ ఉందని ఆంగ్లేయులు వేదాలకు భాష్యాలు రాసే సమయం నుంచి ప్రారంభమైంది. అటు తర్వాత వక్రీకరణ కారులైన డి.ఎన్.జా, మహాదేవ్ చక్రవర్తి, వెండీ డాగ్నిర్ మొదలైన అనేకమంది వేదంలో గోవధ ఉందని ఆరోపించారు. మతమార్పిడి మూర్ఖులు, జాకిర్ నాయిక్ లాంటి అబద్ధాలకోరులు ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తారు. విచిత్రం ఏమిటంటే వీళ్ళకు మద్దతుగా మీడియా కూడా వేదంలో గోవధ ఉందని, వేదకాలం నాటి హిందువులు గోమాంసం తిన్నారని తెగ ప్రచారం చేసింది. ఇటువంటి సమయంలో ఈ వాదనలను తిప్పికొట్టడం ప్రతి ధార్మికుడి తక్షణ కర్తవ్యం.

వినా గోరసం కో రసో భోజనం
వినా గోరసం కో రసో భూపతినాం
వినా గోరసం కో రసో కామీనీనాం
వినా గోరసం కో రసో పండితానాం

ఇందులో గో అనే పదం ఉంది కనుక ఇది ఆవు గురించే అనుకుంటారు. అదే కమ్యూనిష్టులు, వక్రీకరణకారులైతే గోరసం అంటే గోమాంసం అని చెప్పి, గోమాంసం లేని భోజనం రుచికరం కాదంటున్నారు అంటూ తమ పిచ్చి వాదన మొదలుపెడతారు. ఆంగ్ల భాషకు బాగా అలవాటు పడి, అదే గొప్ప అనేకునేవారికి ఇది ఒక కనువిప్పు. ఆంగ్లం సంస్కృతం వలే సాంకేతిక భాష (Technical language) కాదు. దానికి సంస్కృతానికున్నంత విసృతమైన పరిధి లేదు. అసలు విషయం ఇలా ఉంది.

ఇందులో ముఖ్యమైన పదం గో (గోవు). గోవుకు వేదంలో 24 నానార్దాలున్నాయి. అందులో ఆవు, భూమి, ఇంద్రియాలు, వాక్కు కొన్ని. రసానికి కూడా అనేక అర్దాలున్నాయి.

మొదటి పంక్తిలో ఉన్న గోరసం ఆవు నుంచి వచ్చే పాల పదార్ధాల గురించి చెప్తోంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవాటిని ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటాము. మధురపాదార్ధాల్లో నెయ్యి తప్పక వాడతాము. నూనె, డాల్డా కంటే నెయ్యితో చేసినవే మరింత రుచికరంగానూ, పుష్టికరంగానూ ఉంటాయి. భోజనం ఆఖరులో పెరుగు లేదా మజ్జిగ అన్నం తినకుండా లేవకూడదనే ఆచారం కూడా ఉంది. మజ్జిగలో ఉన్న పోషకాలు, జీర్ణశక్తి అలాంటివి. పాలు గురించే చెప్పనవసరమే లేదు. కాల్షియం పొందాటానికి పాలు ముఖ్యమైన ఆహారం. అందువల్ల మొదటి పంక్తికి 'గోవు పాలు- పాల నుంచి వచ్చే పదార్ధాలు లేని భోజనంలో రుచి ఎక్కడ ఉంటుంది?' అని అర్దం.

రెండవ పంక్తిలో గోరసం రాజ్యం గురించి మాట్లాడుతున్నది. గో=భూమి, రసం=రాజ్యం. రాజ్యమే లేకపోతే రాజు అవసరమేంటి అని రెండవ పంక్తికి అర్దం. రాజ్యం ఉన్నప్పుడే పరిపాలన కొరకు, రాజు, మంత్రులు, సభ మొదలైనవన్నీ ఉంటాయి. అసలు ఆ రాజ్యమే లేకపోతే ఇవ్వనీ ఎవరికి కావాలి?

మూడవ పంక్తిలో గో=ఇంద్రియాలు. గోరసం= ఇంద్రియాలు చక్కగా పని చేయడం, లోపాలు లేకపోవటం. ఇంద్రియాలు పని చేయకపోతే (కళ్ళు ఉండీ చూడలేకపోతే, చెవులుండీ వినలేకపోతే, నోరు ఉండీ మాట్లాడలేకపోతే), అనగా వాటి యందు శక్తి లేకపోతే, వ్యక్తి అందమైన స్త్రీని/పురుషుడిని చూసి ఏం లాభం? ఇంద్రియాలే మనసుకు సంకేతాలను పంపిస్తాయి. అసలా ఇంద్రియాలే పని చేయకపోతే ఇక వ్యక్తి ముందు ఎంత అందాన్ని పెట్టినా, అతడు దేన్నీ ఆస్వాదించలేడు. అందమైన జలపాతం వద్దకు తీసుకువెళ్ళినా, శ్రావ్యమైన సంగీతం వినిపించినా, అతడికి ఏ తేడా అనిపించదు.

నాల్గవ పంక్తి లో గో=వాక్కు. గోరసం= మధురమైన పలుకులు. ఎంతటి పండితుడైనా మధురమైన మాటలు మాట్లాడలేకపోతే, కార్యసిద్ధి ఎలా కలుగుతుంది? మాటల చేత ఇతరులను మెప్పించి పనులు జరిపించుకోవచ్చు, నొప్పించి చేదగొట్టుకోవచ్చు. కనుక మధురమైన మాటలు పలకడం రాని పండితుడి ఉపయోగమేమిటి? అని నాల్గవ పంక్తి అర్దం.

ఇప్పుడు ఈ సుభాషితం వలన అర్దం చేసుకోవలసిందేమిటంటే సంస్కృతం అంత త్వరగా అభిప్రాయాలు ఏర్పరుచుకోనుటకు ఉపయుక్తంగా ఉండే చిన్న భాష కాదు. అది ఎంతో విస్తృతమైనది. దాన్ని అర్దం చేసుకోవాలంటే ఎంతో మేధాశక్తి ఉండాలి.

ఇప్పుడు మనం అధార్మికులు చేసే ఒక ఆరోపణనను చూద్దాం.

శతపధ బ్రాహ్మణం 3-1-2-21 లో యాజ్ఞవల్క్య మహర్షి 'నేను గోవు, ఎద్దు మాంసం తింటాను, ఎందుకంటే అది చాలా రుచికరంగా, మృదువుగా ఉంటుంది' అన్నారని వక్రీకరణ కారుల ఆరోపణ. యాజ్ఞవల్క్య మహర్షి గోమాంసం గురించి అక్కడ చెప్పలేదు. ఆ శ్లోకంలో గౌ అన్న శబ్దానికి ఇంద్రియాలు అనే అర్దం వస్తుంది. నేను ఇంద్రియాలను తిని, అనగా ఇంద్రియాలను జయించి, జితేంద్రియుడనవుతాను అని అన్నారు. అట్లాగే ధేను అనగా ఆవు అనే కాకుండా ఆవుపాలు అనే అర్దం తీసుకోవాలి. కాకపోతే వక్రీకరణ కారులు ఆవుపాలకు బదులు ఆవు అని, ఎద్దు దున్నగా వచ్చిన ధాన్యాలకు బదులుగా ఎద్దు మాంసం అని తప్పుడు అర్దాలను ఆరోపించి, యాజ్ఞవల్క్య మహర్షి గోమాంసం, ఎద్దు మాంసం తిన్నారని విషప్రచారం చేశారు. నిజానికి ఆయన 'నేను ఆవుపాలను, ఎద్దు దున్నిన పొలం నుంచి వచ్చిన ధాన్యాలను ఆహారంగా స్వీకరిస్తాను, ఎందుకంటే అవి రుచిగా, మృదువుగా ఉంటాయి' అని అన్నారు. వీటికి ప్రామాణికం పాణిని సూత్రాలు, అమరకోశం. పూర్తి వ్యాఖ్యానం తీసుకున్నప్పుడు ఆయన మాంస భక్షణకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా కనిపిస్తుంది.

To be continued .................

Sunday, 20 March 2016

హిందూ ధర్మం - 200 (జంతుసంరక్షణ - విమర్శల ఖండన, ధార్మికులకు సూచనలు)

మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్షంతం|
మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్షే
మిత్రస్య చక్షుషా సమీక్షామహే|| - యజుర్వేదం 26-18

అన్ని జీవులు నన్ను తమ మిత్రుడి వలే చూచుగాక. నేను కూడా వాటిని నా మిత్రులవలే చూచుదునుగాక. ఓ భగవంతుడా! అందరం (సకల జీవరాసి) పరస్పరం స్నేహ భావంతో మెలిగేలా పరిస్థితులను ఏర్పరుచు.

ఈ విధంగా చెప్పిన వేదం, తదనుగుణంగా సకల జీవరాశుల పట్ల స్నేహ భావంతో మెలిగిన ఋషులు జంతువులను బలివ్వమని వేదంలో చెప్తారా? ఋష్యాశ్రమాల్లో వైరి భావం కలిగిన జీవులు కూడా స్నేహభావంతో మెలిగాయి. ప్రకృతిని తనకంటే నీచమనదిగా కాక, తనతో సమానమైనదిగా దర్శించమనే వైదిక సంస్కృతి చెప్పింది. 'ఆత్మవత్ సత్వభూతేషు' అని పునఃపునః చెప్పింది. అటువంటి ధర్మం ఆకలి కోసం, రుచి కోసం జంతువులను చంపమని చెప్తుందా?

గత భాగంలో వేదంలో జంతుసంరక్షణ గురించి చెప్పుకున్నాం. హిందువుల్లో కొందరు అర్దం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ధర్మం అంటే కేవలం గోసంరక్షణ మాత్రమే కాదు. గోవుతో పాటు సకల జీవరాశి క్షేమంగా ఉండాలి. గోవుకు ప్రాముఖ్యం ఇచ్చినా, మిగితా జీవరాశి కూడా భగవద్ సృష్టిలో భాగమే. వాటి పట్ల కూడా ప్రేమ, కరుణా, వాత్సల్యం కలిగి ఉండాలి. అష్టాంగ యోగంలో మొదటి మెట్టైన యమంలోనే అహింసను ప్రస్తావించారు. యమాలు అహింసతోనే మొదలైతాయి. మాకు మిగితా వాటి గురించి అవసరంలేదు, కేవలం గోవు గురించి మాట్లాడతాం అనడం వేదం ప్రకారం తప్పు.

'ఏ వ్యక్తైనా ప్రేమ, కరుణా మొదలైన గుణాలను ముందు తాను అలవరచుకోకుండా, భగవంతుడు తన పట్ల కరుణ కలిగి ఉండాలని భావన చేసి పూజ, జపం, యోగం మొదలైనవి ఏవి చేసినా, అవి నిష్ఫలమే అవుతాయన్న మాట సత్యం. వ్యక్తికి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, జాలి ఇత్యాది గుణాలు లేకపోతే, తన పట్ల భగవంతుని దయ ఉండాలని ఆశించే అధికారం అతనికి ఎక్కడుంది? ఇతరులకు చేసే సేవ, ఆధ్యాత్మిక ఉద్ధతి కోసం పూజాది సంస్కారాలు, రెండూ ఎలా చేయాలంటే, అవి నిన్ను, అవతలి వ్యక్తిని ......... ఇద్దరిని పవిత్రుల్ని చేయాలి' అని నడిచే దేవుడుగా పేరుగాంచిన అపరశంకరులు, కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చెప్పిన మాట. కాబట్టి కేవలం గోవు గురించి మాత్రమే మాట్లాడే హిందువులు ఈ విషయాన్ని ఆలోచించాలి. వేదం ప్రమాణంగా తీసుకుని సకల జీవుల శ్రేయస్సుకై పాటుపడాలి. ప్రతి సాధువు, గురువు, సన్యాసి సకల జీవరాశుల క్షేమం కోసమే పాటుపడ్డారు.

సమాజంలో ఒక వర్గం ఉంది. వారిని ఏమనాలో నాకు తెలియదు. కమ్యూనిష్టులు, మతమార్పిడి మూర్ఖులు, కుహనామేధావులు, ఇలా అనేకులు ఈ వర్గంలోకి వస్తారు. వీళ్ళు మూర్ఖులంటే మూర్ఖులు. వారికి ధర్మాన్ని వ్యతిరేకించడమే పని. వీరంతా అప్పుడప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతారు. కానీ గోవధకు వచ్చేసరికి వేదంలో గోవధ ఉన్నది అంటారు, గోవధ నిషేధం తప్పంటారు. అలా కాదు, వేదంలో గోవధ లేదు అంటే, గోసంరక్షణ ఉందంటే ........... చూశారా! వేదానికి పక్షపాతం. వేదం కేవలం గో సంరక్షణ గురించి మాత్రమే మాట్లాడింది, మిగితా జీవులను చిన్నచూపు చూసిందంటారు. జాతరల సమయంలో జంతుబలి మూఢనమ్మకం, చూశారా! మతాల కారణంగా జంతువులు ఎంత బాధపడుతున్నాయో అంటారు. అది కూడా కేవలం హిందూ ధర్మం కారణంగానే. అధర్మాల జోలికి వెళ్ళరు.  వీరేదో పెద్ద జంతు ప్రేమికుల మాదిరి భావించుకుంటారు. కానీ వారి జీవితాల్లో మాంసం లేకపోతే ముద్ద దిగదు. అదేంటో మరి? వీరి భావజాలం ఏంటో వీరికే తెలియదు. తాము దేని మీద పోరాటం చేస్తున్నామో కూడా స్పష్టంగా తెలియని (Clarity లేని) అయ్యోమయ్యం (Confused) గుంపు ఇది. వారందరికి ఇది కనువిప్పు కావాలి. ఇప్పుడు చర్చించుకున్న విషయం రెండు విమర్శలను తిప్పికొడుతుంది. ఒకటి వేదం గోవు పట్ల పక్షపాతం ప్రకటించిందని చెప్పడం, రెండవది వేదంలో గోవధ ఉంది అనడం. జంతువధనే వేదం వ్యతిరేకించినప్పుడు ఇక గోవధ ఎక్కడ ఉంటుంది. ఎలా ఉంటుంది?

ఇప్పుడు ధర్మద్వేషుల నుంచి ఇంకొక విమర్శ వస్తుంది. అన్ని జీవులను కాపాడమని వేదం చెప్పినప్పుడు కేవలం గో వధ నిర్మూలనకే చట్టం ఎందుకు? అన్ని రకాల హింసను ఆపివేయుటకు ధార్మికులు పోరాటం చేయచ్చు కదా అని .........
వేదం సకల జీవరాశి యొక్క క్షేమం కోరింది. భారతదేశంలో జంతు సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది. దాని ప్రకారం జంతువులను చంపిన వారికి కారాగార శిక్ష విధిస్తారు. అయితే నెమలి, పులి కూడా దీని చట్రం క్రిందికే రాగా, వాటిని జాతీయ జంతువులుగా ప్రకటించడం మూలంగా వాటికి కొంత ప్రత్యేకత ఉంది. అలానే గోవుకు కూడా. సకలజీవరాశుల క్షేమం కోరిన వేదమే గోవును అత్యంత ప్రధానమైనదిగా చెప్పింది. కనుక ముందు గోవును కాపాడమని హిందువుల ఆకాంక్ష. ధార్మికుల వలె మీకు కూడా అన్ని జీవుల పట్ల మమకారం ఉందంటున్నారు కనుక ముందు గోవధ నిషేధంతో ప్రారంభించి, అన్ని రకాల జీవహింసను నిషేధిద్దాం, కలిసి రండి అని మా ధార్మికుల పిలుపు. ఒక్క అడుగు ముందుకు పడితే, ఆ తర్వాత పెద్ద మార్పే సంభవిస్తుంది. అసలు అడుగే వేయొద్దంటే ఎలా? కనుక ఇలాంటి విమర్శలు చేస్తే మీ వాదన నిలవకపోవటమే కాదు, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన అవసరం వస్తుందని గ్రహించండి.

To be continued ..............

Sunday, 13 March 2016

హిందూ ధర్మం - 199 (వేదంలో జంతుసంరక్షణ)

కేవలం గోరక్షణే కాదు, జంతుసంరక్షణ గురించి కూడా వేదం గట్టిగా చెప్పింది.

ఓ దంతాలు (పళ్ళు) (teeth) ! మీరు అన్నం తింటారు, యవలు (బార్లీ) తింటారు, పప్పులు, నువ్వులు తింటారు. ఈ ధాన్యాలన్నీ ప్రత్యేకించి మీ కోసమే ఏర్పడినాయి. అన్యాయంగా జంతువులను హింసించకండి, వాటిని తినవద్దు - అధర్వణవేదం 6.140.2

వండిన మాంసం, పచ్చిమాంసం, గర్భస్థ పిండాలను, గుడ్లను, స్త్రీపురుషులను చంపి వండిన అన్ని రకాల ఆహారాలను ధ్వంసం చేసేదము - అధర్వణవేదం 8.6.23

అఘ్న్యా యజమానాస్య పశూంపాహీ - యజుర్వేదం 1.1
ఓ మానవులారా! జంతువులన్నీ అఘ్న్యాలు - వధించకూడనివి.

ద్విపాదవ చతుష్పాత్పాహి - యజుర్వేదం 14.8
రెండు కాళ్ళున్న జీవులు, నాలుగు కాళ్ళున్న జీవులను రక్షించండి.

పిశాచ - పిశిత అనగా మాంసం + అశ - తినువాడు = మాంసం తినువాడు.
ఇలా వేదంలో అనేక మార్లు జీవహింసను వ్యతిరేకించింది. మాంసం తినేవారిని రాక్షసులతో సమానంగా పోల్చింది.

ఊర్జం నోదేహి ద్విపదే చతుష్పదే - యజుర్వేదం 11.83
రెండు కాళ్ళున్నవి, నాలుగు కాళ్ళున అన్ని జీవులు శక్తిని, పుష్టిని పొందుగాకా.

ఈ మంత్రాన్ని హిందువులు ఆహారం స్వీకరించే ముందు చదువుతారు. సకల జీవరాశుల క్షేమం కోరిన ధర్మమే వాటిని చంపి తినమని ఎలా చెప్తుంది?

యస్తు సర్వాని భూతాన్యాత్మనేవానుపశ్యతి
సర్వేభూతేషు చాత్మానం తతోనా విచికిత్సతి - యజుర్వేదం 40.6

ఎవరైతే ఆత్మ యందే అన్నీ జీవులను, అన్ని జీవులయందు తన ఆత్మను చూసుకుంటాడో, అతడు ఏ జీవి పట్ల ద్వేషం కలిగి ఉండడు. ఎందుకంటే అతడు అన్ని జీవులయందున్న ఏకత్వాన్ని తెలుసుకుంటాడు.

తనను ఎవరైనా బాధపేడితే, ఎంత వేదన అనుభవిస్తాడో, అంతే వేదన ఇతర జీవరాశి అనుభవిస్తుందని, శరీరాలు వేరు కావాచ్చు కానీ, బాధ వేరు కాదని, మనిషి తన బాధను చెప్పుకునే అవకాశం ఉంది కానీ, మూగజీవాలకు లేదు, మనమే అర్దం చేసుకోవాలని పై మంత్రం చెప్తున్నది. దానిలో ఎంత లోతైన అర్దం దాగి ఉంది.

యస్మిన్ సర్వాని భూతాన్యత్మైవబహుదా విజానతః
తత్రకో మోహః కః శోకః ఎకత్వమనుపశ్యతః - యజుర్వేదం 40.7

ఉపాధులు (శరీరములు) వేరైనా అన్నీ జీవులందున్న ఆత్మను చూసిన చూసినవాడు, ఏ జీవిని చూసి మోహానికి కానీ, శోకానికి గానీ గురికాడు. అతడు వాటిని వీక్షించగానే ఏకత్వం గుర్తుకువస్తుంది, అంతటా వ్యాపించిన ఏకత్వమే, ఆత్మయే కనిపిస్తుంది.

To be continued.................

http://agniveer.com/no-beef-in-vedas/ సౌజన్యంతో

Sunday, 6 March 2016

హిందూ ధర్మం - 198 (వేదంలో గోసంరక్షణ - 3)

ఘృతం దుహానామదితిం జానాయాఘ్నే మా హింసీహీః - యజుర్వేదం 13.49

పుష్టినిచ్చి ఎదుగుదలకు తోడ్పడుతున్న ఆవులు, ఎద్దులు (గోజాతిని) ఎల్లవేళలా రక్షణ పొందాలి.

ఆరే గోహా నృహా వధో అస్తు - ఋగ్వేదం 7.56.17
గోవును చంపటం మనిషిని చంపటంతో సమానమైనది. ఎవరైతే గోహత్యకు ఒడిగడతారో వారికి కఠిన శిక్ష వేయండి.

వైదిక నిఘంటువు గోవును అఘ్న్యా, ఆహీ, అదితి అంటుంది.
ఆహీ అనగా వధించకూడనిది.

అఘ్న్యా అయిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో చంపరాదు. శుద్ధమైన నీరు, పచ్చని గడ్డి పెట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచండి. తద్వారా సద్గుణాలు, జ్ఞానము, సంప్దలు పొందండి. - ఋగ్వేదం 1.164.40, అధర్వణ వేదం 7.73.11, అధర్వణ వేదం 9.10.20.

అఘ్న్యా అయిన ఆవువులు, ఎద్దులు మీకు ఆఇస్వర్యాలను తీసుకువస్తాయి. - యజుర్వేదం 12.73

అంతకాయ గోఘాతం - యజుర్వేదం 30.18
గోవులను వధించేవారిని అంతం చేయండి.

మన ఆవులను, గుర్రాలను, ప్రజలను నశింపజేసేవారిని సీసపు గుళ్ళతో చంపండి.

ధేనుసాధనం రాయేనాం - అధర్వణ వేదం 11.1.34
గోవు అన్న సంప్దలకు సాధనం/కారణం

ఋగ్వేదం 6 మండలం 28 వ ఒక సూక్తం గోవు యొక్క ఖ్యాతిని చాటి చెప్తుంది.

గోవులను అన్ని రకాల దుర్భిక్షాల నుంచి దూరంగా ఆరోగ్యంగా ఉంచండి.
గోవులను రక్షించేవారిని భగవంతుడు ఆశీర్వదిస్తాడు.
శత్రువులు కూడా గోవులపై ఆయుధాలు వాడకూడదు.
గోవును ఎవరూ వధించకూడదు.
ఆవు ఐశ్వర్యము, బలము ఇస్తుంది.
ఆవును ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచితే, స్త్రీపురుషులు కూడా రోగరహితంగా, ఐశ్వర్యవంతులై ఉంటారు.
ఆవులు పచ్చగడ్డి తిని, నీరు త్రాగుగాక. ఆవి వధింపబడకుండు గాక, మరియు మనకు ఐశ్వర్యాన్నిచ్చు గాక.

To be continued ........

Sunday, 28 February 2016

హిందూ ధర్మం - 197 (వేదంలో గోసంరక్షణ - 2)

ఋగ్వేద సామవేదాలు ఆవుని అఘ్న్యా, అదితి అన్నాయి. అనగా వధింపకూడనిద, పూజించదగినది అని అర్థం. ఋగ్వేదంలో 9 సార్లకు పైగా (1.64.27, 5-83-8, 7-68-9, 1-164-40, 8-69-2, 9-1-9, 9-93-3, 10-6-11, 10-87-16) ఆవును అఘ్న్యా అంటూ వధించకూడదని తేల్చి చెప్పింది. గోవు వధించ రానిది, అగౌరవపరచ రానిదని, ఆవుపాలు మనసును శుద్ధి చేసి, పాపముల నుంచి దూరంగా ఉంచుతాయని చెప్పింది.

అఘ్న్యేయం సా వర్ధతాం మహతే సౌభగాయ - ఋగ్వేదం 1.164.27

గోవు - వధింపకూడనిది. అది మాకు ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను తీసుకువస్తుంది.

సుప్రపానం భవత్వఘ్న్యాయః - ఋగ్వేదం 5.83.8

అఘ్న్యా అయిన గోవుకు చక్కని నీటి సదుపాయం ఉండాలి.

అనగో హత్యావై భీమక్రియతే
మా నో గామశ్వం పురుషూం వధీః - అధర్వణ వేదం 10.1.29

అమాయకులను చంపటం మహాపాపం. మన ఆవు లను, గుర్రాలను, మనుష్యులను చంపకండి.

మా గామనాగా మదితిం వధిష్ట - ఋగ్వేదం 8.101.15

ఆవును చంపకండి. ఆవు అమాయకురాలు. అదితి - ముక్కలు చేయకూడనిది అంటూ గోవధకు దేశబహిష్కారం శిక్ష వేయమని చెప్పింది.

యః పౌరుషేయేణ క్రవిషా సమఙ్క్తే యో అశ్వ్యేన పశునా యాతుధానః
యో అఘ్న్యాయా భరతి క్షీరమగ్నే తేషాం శీర్షాణి హరసాపి వృశ్చ - ఋగ్వేదం 10.87.16

ఎవరైతే మనిషి, గుర్రం లేదా ఇతర జంతువుల మాంసం తింటారో, ఎవరైతే పాలతో జనులను పోషించే అఘ్న్యాలను - గోవులను (గోజాతిని) నశింప జేస్తారో వారిని కఠినంగా శిక్షించాలి (capital punishment).

అథర్వణవేదం 8-3-16 మంత్రమైతే గోహత్య మహాపాపం చేసినవారికి శిరశ్చేదనం (తల నరకమని) చేయమని చెప్పింది.

పై మంత్రాన్ని అనుసరించి గోవులను చంపేవారికి కఠినమైన శిక్ష విధించాలని వేదమే చెప్పింది. #వేదం అనగా భగవంతుని ఊపిరి, వేదం - భగవంతుడు, ఇద్దరూ వేరు కాదు. ఒక్క గోవులనే కాదు, ఏ జంతువును చంపినా శిక్ష విధించమంటోంది. మనదేశంలో కొన్ని రాష్ట్రాలు గోవును వధించినవారికి కఠిన శిక్ష ఉండాలని చట్టాలు చేస్తే, అది నేరమని, ఘోరమని కొందరు ధర్మద్వేషులు, అధర్మీయులు తెగ గొడవ చేస్తారు. ఈ దేశంలో ఆయా మతస్థులకు వారి వారి మతగ్రంధాలను అనుసరించి, వాటికి అనుగుణంగా చట్టాలున్నాయి. ఉదాహరణకు ముస్లిమకు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం భారతదేశంలో నేరం కాదు. ఎందుకంటే బహువివాహాలను ఖురాన్ అంగీకరించింది. ఖురాన్‌కు అనుగుణంగానే వారికి షిరియా చట్టం ఏర్పడింది. అలాగే విడాకుల విషయంలో కూడా వారికి వేరే పద్ధతి ఉంది. భారతదేశంలో ఇస్లామేతర ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు కాగా, వారికి కనీస వయసు 15 సంవత్సరాలు.

వారి మతగ్రంధాన్ని అనుసరించి చట్టం ఏర్పడినప్పుడు హిందువులు, తమ ధార్మిక గ్రంధాలకు అనుగుణమైన చట్టం కావాలని అడగడంలో తప్పేంటి? ధర్మం ప్రకారం గోవధ సహిచరాని నేరం. ఈనాడు కొన్ని రాష్ట్రాలు గోవధకు కఠిన శిక్షలు వేయడమంటే ధార్మిక గ్రంధాలకు అనుగుణంగా చట్టం ఏర్పడిందని అర్దం కదా. మరి ఈ ఒక్క విషయాన్నే వ్యతిరేకించడం ఎందుకు? ఇది ఆ కుహన మేధావులది ద్వంద్వనీతి కాదా అని హిందువులు ప్రశ్నించాల్సి ఉంటుంది.

To be continued ....................

Source: http://agniveer.com/no-beef-in-vedas/

Saturday, 27 February 2016

హిందూ ధర్మం - 196 (వేదంలో గోసంరక్షణ - 1)

గోవుకు, ఎద్దుకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకున్నాం కదా. అసలు నిజంగా వేదంలో గోవధ ఉందా లేదా అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

వెజిటెరీయనిజం (Vegetarianism)  అనేది ఈ రోజు ప్రపంచంలో బాగా ప్రజాదరణ పొందింది. భూతాపాన్ని నివారించటం కోసం, కాలుష్యాన్ని అరికట్టడం కోసం, సంపదల దుర్వినియోగాన్ని, అతివినియోగాన్ని తగ్గించటం, ఆరోగ్యం కోసం అందరూ వెజిటెరీయనిజం వైపు మళ్ళాలని ఐరాస (ఐక్య రాజ సమితి) సహా అనేక అంతర్జాతీయ సంస్థలు, అనేక దేశాల ప్రభుత్వాలు, పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమంగా ప్రచారం చేస్తున్నాయి. జంతువులకు కూడా మనుష్యుల వలే హక్కులుంటాయాని, వాటిని చంపడం నేరమని అనేకమంది జంతుప్రేమికులు వాదిస్తున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని వేదం కూడా చెప్పింది. వేదం శాఖాహారాన్నే తీసుకోమని చెప్పింది. ఒక జీవికి ప్రాణం పోయలేని మానవుడికి, ప్రాణం తీసే హక్కు లేదని వేదం చెప్పింది. అనాదికాలం నుంచి ఈ విషయాన్ని అనేక గురువులు నిరంతరం ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణ శ్రీ త్రైలింగ స్వామి వారు.

ఒకసారి ఉత్తరభారతదేశంలోని అడవులలో ఒక పులిని వేటాడటం కోసం కొందరు రాజభటులు వెంబడిస్తున్నారు. ఆ పులి తప్పించుకుని వెళ్ళి, అక్కడికి దగ్గర్లోనే మౌనంగా తపస్సు చేసుకుంటున్న గణపతి స్వామి వద్దకు వెళ్ళి, ఆయన ఒళ్ళో పిల్లిపిల్లలా భయంతో బిక్కుబిక్కుమంటూ చేరింది. అది చూసి ఆశ్చర్యంతో రాజభటులు నిశ్చేష్టులవ్వగా, అక్కడున్న గణపతి స్వామి ఆ భటులతో, 'ఒక జీవికి ప్రాణం పోయలేని మనకు ప్రాణం తీసే హక్కులేదు. ఏ జీవిని చంపరాదు. జీవులను చంపటం పాపం' అని వారికి ఉపదేశం చేస్తారు. అది విన్న ఆ రాజభటులు స్వామికి సాష్టాంగ ప్రణమిల్లి వెళ్ళిపోతారు. ఆ గణపతి స్వామి ఎవరో కాదు, 250 ఎళ్ళకు పైగా జీవించిన యోగి, సిద్ధపురుషులు, శ్రీ త్రైలింగ స్వామి వారు.

భౌద్ధం రాకముందు నుంచే 'అహింస' అనేది ధర్మంలో ముఖ్యమైన లక్షణంగా, వ్రతంగా చెప్పబడి ఉంది. వేరొక విధంగా చెప్పాలంటే వేదంలో ఉన్న అహింసావాదాన్నే భౌద్ధజైనాలు స్వీకరించాయి. కానీ వాటి వాదానికి, ధార్మిక వాదనకు కొంత వ్యత్యాసం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల, కొన్ని కుతంత్రాలను పారించడానికి మార్కిస్టు మేధావులు, అధర్మ ప్రచారకులు వేదంలో గోవధ ఉందని ప్రచారం చేస్తున్నారు.

ముందు ఒక విషయం గ్రహించాలి. వేదంలో గో అన్న మాట అనేక సందర్భాల్లో అనేక అర్దాలను కలిగి ఉంది. ఆవు, జలం, సూర్యకిరణాలు, విద్యావంతులు, వైదిక సూక్తాలు, భూమాత ........ వీటన్నిటికి గో అన్న శబ్దాన్నే వాడారు.

To be continued ................

Sunday, 14 February 2016

హిందూ ధర్మం - 195 (గోవు ప్రాముఖ్యత - 7)

గోవు గురించి ఎంత చెప్పుకున్నా, చెప్పుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అన్ని విశిష్టతలున్నాయి గోమాతకు. అయితే అసలు విషయం పక్కదారి పట్టకూడదు కాబట్టి ఇది ఇక్కడకు ఆపేద్దాం. తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. అయితే గో సంరక్షణ అన్నప్పుడు అందులో వృషభాలను కూడా కలపవలసి ఉంటుంది. ఎందుకంటే ఆవు లేకపోతే ఎద్దు లేదు, ఎద్దు లేకపోతే ఆవు లేదు. ఆ రెండు లేని వ్యవసాయం నిరర్ధకం. ఆవుకు ఎంత ప్రాధాన్యం ఉందో, ఎద్దుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. గోమాత పుత్రుడే వృషభరాజు. 'దేశీఆవుకు పుట్టిన దూడ ఆడదైతే ఆవు అవుతుంది, మగదైతే ఎద్దు అవుతుంది. కేవలం నాటావు కోడేదూడ మాత్రమే ఎద్దు అవుతుంది. జెర్సీకి పుట్టిన కోడేదూడ ఎద్దు అవ్వదు, ఎందుకంటే దానికి నూపురం ఉండదు' అన్నారు రాజీవ్ దీక్షిత్. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన జీవి ఎద్దు. ఎద్దుకు ఉండే నూపురమే నాగలిని, బండ్లను లాగటానికి ఉపయోగపడుతుంది. చెరుకు, నూనె గానుగలను లాగటానికి ఉపయోగపడుతుంది. ఆ నూపురమే లేకపోతే దాని ఉపయోగమేమీ ఉండదు.


ఈశ్వరసృష్టిలో ఇది ఒక అద్భుతం. మానవుడి ఆకలిని తీర్చటానికి, ఆహారాన్ని పండిచటానికి అవసరమైన ఎరువులను, పంటకు వచ్చే పురుగును నివారించే ఔషధాలను ఆవు అందిస్తే, ఎద్దు పొలంలో దుక్కుదున్ని రైతుకు సాయం చేస్తుంది. ఎంతటి బరువునైనా తన మీద మోసి, పొలం దున్నుతుంది. రైతు కుంటుంబంలో కలిసిపోతుంది. అవి చేసే మేలు మరవలేకేనే, వాటి కోసం ఓ పండగ వచ్చింది. అదే కనుమ. కనుమ జంతువులకు కృతజ్ఞత తెలుపుకునే పండగ. అచ్చమైన వ్యవసాయపండుగ.

ఎద్దు వ్యవసాయ క్షేత్రంలో కాళ్ళు పెట్టినప్పుడు దాని గిట్టల నుండి అమృతబిందువులు రాలుతాయని, అందువలన ఎద్దు తిరిగిన పొలం పంటను ఆహారంగా స్వీకరించినవారికి నేత్రవ్యాధులు రావని వేదం చెప్తోంది. ఈ విషయాన్ని అనేకమార్లు చాగాంటి కోటేశ్వరరావుగారు తమ ప్రవచనాల్లో ప్రస్తావించారు. మహానారయణోపనిషత్తు ఇత్యాదులు కూడా రైతులకు సందేశం ఇస్తూ 'ఓ భూమిపుత్రుడా! ఈ భూమి నీ తల్లి, ఈమెను విషములతో కలుషితం చేయ్యకు. గోమయం, గోపంచకాలతో శుద్ధి చేయు, సారాన్ని పెంచి ఆమెను పూజించు' అని రైతుకు సందేశం ఇస్తున్నది. భూమి కలుషితమవడంలో ట్రాక్టర్ల పాత్ర కూడా ఉంది. ట్రాక్టర్లు తిరిగిన భూమి యొక్క సారం త్వరగా క్షీణించిపోతుంది. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ కూడా ఈ విషయాన్ని చెప్తూ, ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నందున రాబోయే 400 ఏళ్ళలో అమెరికాలో భూసారం పూర్తి నశిస్తుందని చెప్పారు. ట్రాక్టర్లతో దున్నే భూమిలో 1000 ఏళ్ళ తర్వాత పచ్చి గడ్డిపరక కూడా మొలవదు. భారతదేశంలో వేళ్ళ ఏళ్ళ నుంచి వ్యవసాయం జరుగుతున్నా, భూసారం క్షీణించకుండా ఉండటానికి కారణం పొలంలో ఎడ్లను ఉపయోగించటమే.

ట్రాక్టర్లతో దున్నినప్పుడు నాగలి అవసరమైన లోతు కంటే ఎక్కువలోతుకు వెళ్ళి, భూమిలోని శత్రుజీవాలతో పాటు మిత్రజీవాలను సైతం నాశనం చేస్తుంది. ఆ కారణంగా భూమి నిస్సారమవుతుంది. అప్పుడు నీరు కూడా ఎక్కువగా అవసరమవుతుంది. అమెరికాలో ఈ పద్ధతి వల్లనే వేల ఎకరాల భూమి నిస్సారమైపోయింది. ట్రాక్టర్ల ఉపయోగం వలన వాయుమండలం కూడా కలుషితమవుతుంది. ఇవన్నీ వనరుల దుర్వినియోగానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద సమస్య భూతాపం (Global Warming). దీనికి గ్రీన్ హౌస్ వాయువులు కారణం. ఇప్పుడు అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతుల వలన భూతపానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువుల్లో మూడింట ఒక వంతు (One-third) వ్యవసాయ క్షేత్రాల నుంచే వెలువడుతుండడం బాధాకరమైన విషయం. వీటిన్నిటికి పరిష్కారం వ్యవసాయంలో ఎద్దును ఉపయోగించటమే. అయితే ఇది భారతీయులకు కొత్త విషయం కాదు.

పాడిపంటలు అనే మాట మనకు భాషలో ఎప్పటి నుంచో ఉంది. పాడి అంటే పశువులు. అందులో ఎడ్లు కూడా వస్తాయి. దున్నడం దగ్గరి నుంచి కోసుకొచ్చిన పంటను ఇంటికి చేర్చడంలో, దాన్ని అంగడికి తీసుకువెళ్ళడంలో ఎద్దు పాత్ర ఉంది. అది రైతుకు, వ్యవసాయానికి వెన్నుముక వంటిది.      

'భగవంతుడు భారతదేశానికిచ్చిన వరం ఆవు అన్నారు మహర్షి వాగ్భటుడు. ఎడ్లలో కూడా రెండు రకాలున్నాయి. తక్కువ పాలిచ్చే ఆవుకు పుట్టినవి చాలా బలం కలిగి ఉంటాయి. ఇది నేను ప్రయోగాత్మకంగా చేసి చూశాను. 3 టన్నుల బరువును ఎలాంటి శ్రమ లేకుండా, ఎక్కడా ఆగకుండా 40 కిలోమీటర్లు లాగగలుగుతాయి. వాటితో పోటీ పడలేము. అదే ఎక్కువ పాలిచ్చే గోసంతతి ఎడ్లు కూడా 3 టన్నుల బరువును లాగగలిగినా, మధ్యలో అక్కడక్కడా ఆగి, విశ్రాంతి తీసుకుంటాయి. ముందు చెప్పిన వాటికంటే కాస్త నెమ్మదిగా పరిగెడతాయి. అయినప్పటి ప్రతి జాతికి దాని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి' అని శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఒక ఉపన్యాసంలో వెళ్ళడించారు.

To be continued ................

Sources -
https://www.youtube.com/watch?v=Xp3o-6OQBAY
https://www.youtube.com/watch?v=yvR-SQ90tPI
http://www.nature.com/news/one-third-of-our-greenhouse-gas-emissions-come-from-agriculture-1.11708

Sunday, 7 February 2016

హిందూ ధర్మం - 194 (గోవు ప్రాముఖ్యత - 6)

శరీరానికి కలిగే అనారోగ్యాలను తొలగించడంలో బంగారానికి కూడా ప్రాముఖ్యత ఉంది. ఎంతో జాగ్రత్తలతో స్వర్ణాన్ని భస్మం చేసి, పసిపిల్లల మొదలుకొని పెద్దలవరకు అందరికి వచ్చే వ్యాధులకు ఔషధంగా ఇచ్చే విధానం ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. ఒక్క స్వర్ణభస్మమే కాక, ఇంకా అనేక రకాల భస్మాలను సైతం తయారు చేసే విధానాన్ని ఋషులు అందించారు. దీనికి ధాతుశోధన (Metallurgy) శాస్త్రం యొక్క సంపూర్ణ విజ్ఞానమే కాదు మానవశరీరంపై ఖనిజాల ప్రభావం గురించి విజ్ఞానం కూడా అవసరం. ఈ విధానం భారతదేశంలో ఎప్పట్నుంచో ఉందంటే పూర్వకాలంలోనే మనకు ఎంత జ్ఞానం అభివృద్ధి చెందిందో అర్దం చేసుకోవచ్చు. అయితే ఈ భస్మాల మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఇది అన్ని సమయాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ కాలంలో అయితే బంగారం ధర పెరగడంతో ఈ రకమైన వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదుతో కూడిన అంశం. కానీ గోమూత్రానికున్న విశేషమిటంటే అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత కొంత భాగం శరీరానికి అవసరమైన బంగారంగా మారి, దేహంలో కలిసిపోతుంది. తద్వారా వ్యాధినివారణ జరుగుతుంది, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ విషయం చెప్పగానే కొందరు కుహనా మేధావులు, అలా అయితే బంగారం కొనడమెందుకు, రోజు గోమూత్రం త్రాగుతుంటే శరీరమే బంగారం అవుతుందిగా! అలా అవ్వడం లేదేమీ అని వ్యంగ్యంగా విమర్శించవచ్చు. వాళ్ళు అర్దం చేసుకోవలసిన విషయం ఒక్కటే. శరీరంలోకి వెళ్ళిన తర్వాత, అక్కడ జరిగే రసాయనిక పరిచర్యల (Chemical reactions) వలన ఏ మేరకు ఏ ధాతువు శరీరానికి అవసరమో, అది ఆ మేరకు ఏర్పడుతుంది. అది కూడా దేహం జీర్ణం (Soluble) చేసుకునే విధంగానే ఏర్పడుతుంది. సంస్కృతి మీద ద్వేషాన్ని ఇలా చూపించి మీ అజ్ఞానాన్ని ప్రదర్శించకండి అని వారికి సమాధానం చెప్పవలసి ఉంటుంది.

మన చుట్టు ఉంటే వాతావరణంలో ఎన్నో విద్యుత్- అయస్కాంత తరంగాలుంటాయి. అవి నిత్యం శరీరంతో సమ్యోగం చెంది, దేహం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. అతి సూక్ష్మమైన ఈ తరంగాలు రాగి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. గోమూత్రం త్రాగడం వలన శరీరానికి తగు మోతాదులో రాగి ఖనిజం కూడా లభిస్తుంది. అందువలన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందు రోజు సూర్యస్తమయానికి పూర్వమే రాగి పాత్రలో నిలువ చేసిన నీటిని త్రాగమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. మహర్షి వాగ్భటుడు ఇత్యాది అనేక మంది సనాతనయోగులు చెప్పిన విషయం ఇది. దాని వెనుక ఉన్న రహస్యం కూడా ఇదే. రాగి పాత్రలో నిలువ చేసిన నీరు మంచి విద్యుత్-అయస్కాంత తరంగాలను తనలో గ్రహించి ఉంటుంది.

'సర్వే రోగాఃహి మందాగ్ని' అనేది సూత్రం. సర్వరోగాలకు కారణం మందాగ్ని అని, మందాగ్ని అనగా ఆకలి సరిగ్గ వేయకపోవడం, తిన్నది అరగకపోవడం. గోమూత్రాన్ని ఔషధంగా స్వీకరిస్తే మందాగ్ని సమస్య తొలగిపోతుంది.

అంతరాత్మ ప్రభోధానికి వ్యతిరేకంగా, అధర్మంగా, అన్యాయంగా పని చేయడం వలన హృదయం (ఇక్కడ చెప్పేది భౌతికమైన హృదయం - గుండె గురించి కాదు), మనసు సంకుచితం అవుతాయి. ఇదే రోగాలను కలిగిస్తుంది. కానీ గోమూత్రం సద్భావనలను కలిగిస్తుంది. అందువల్ల మనసు మంచి పనులు చేయడంలో సహాయపడుతుంది.

గోమూత్రంలో నత్రజని (Nitrogen) ఉంటుంది. అది రక్తంలోని విషాలను, లోపాలను హరిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. అందులో ఉండే సల్ఫర్ పెద్దప్రేగుల్లో కదలికలకు ఉపయుక్తంగా ఉంటుంది. రక్తశుద్ధిని చేస్తుంది. రాగి అనవసరమైన కొవ్వులను ఏర్పడకుండా చూస్తుంది. జన్యుపరంగా సక్రమైంచే కీళ్ళవాతాన్ని నివారించడంలో ఔషధంగా పని చేసే పొటాషియం కూడా గోమూత్రంలో ఉంటుంది. గోమూత్రం కండరాల బలహీనతను, బద్దకాన్ని తొలగిస్తుంది.

To be continued ..................

Source: https://cowurinebenefit.wordpress.com/2012/10/06/cow-urine-benefits/

Sunday, 31 January 2016

హిందూ ధర్మం - 193 (గోవు ప్రాముఖ్యత - 5)

గోమూత్రానికున్న మరిన్ని ఔషధ లక్షణాలు తెలుసుకుందాం. మనం నిత్యం తీసుకునే ఆహారం పూర్తిగా జీర్ణం కాక చాలా కొద్ది భాగం (Residue) శరీరంలో మిగిలిపోతుంది. ఈ విషాలను ఆయుర్వేదం ఆమం (Toxins) అంటుంది. వ్యాయామం, యోగాసనాలు, సరైన జీవనవిధానం, అప్పుడప్పుడు ఉపవాసాల ద్వారా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేసే పద్ధతి సనాతన ధర్మం అందించింది. అయితే ఇలా మిగిలిపోయిన జీర్ణం కానీ పదార్ధాలు శరీరంలో విషాలుగా మారి, జబ్బులను కలిగిస్తాయి. జబ్బులను నయం చేసుకోవటానికి మందులను అధికంగా వాడినప్పుడు, రోగం తగ్గినా, ఆ మందులలోని కొంత భాగం వ్యర్ధ పదార్ధంగా దేహంలో మిగిలిపోతుంది. కాలక్రమంలో అది మురుగిపోయి, ఆమంగా మారి, కొత్త జబ్బులను కలిగిస్తుంది. మానవులకు ఈ ఆమం పెరిగిపోవడం వలన అనేకానేక వ్యాధులు వస్తాయి. శరీరంలో ఇతర మార్గాల ద్వారా ఏర్పడిన ఆమాన్ని తొలగించేందుకు ఔషధాలున్నాయి కానీ, ఔషధాల వలన ఏర్పడిన ఆమాన్ని తొలగించే మందులు ప్రపంచంలో లేవు. దీని విరుగుడు ఒక్క గోమూత్రం మాత్రమే. గోమూత్రాన్ని లేదా పంచగవ్యాన్ని 40 రోజుల పాటు ఉదయం పొరగడుపున నిర్ణీత పద్ధతిలో స్వీకరిస్తే, అది ఆమాన్ని హరించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి గోమూత్రానికుంది.

శరీరం కఫ, వాత, పైత్యాలనే మూడు దోషాలతో ఏర్పడిందని ఆయుర్వేదం చెప్తోంది. వీటినే త్రిదోషాలు అంటారు. ఇవి సమంగా ఉంటేనే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ 3 దోషాలు ఏది ఎక్కువైనా, అది రోగాలను కలిగిస్తుంది. జబ్బు ఒకటే కావచ్చు, కానీ దాన్ని కలిగించిన దోషం వేరై ఉండచ్చు. అందుకనే ఆయుర్వేదంలో బయటకు కనిపించే లక్షణాలను చూసి రోగానికి ఔషధమివ్వరు. మూలం ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ త్రిదోషాలకు జన్యుపరమైన సంబంధం కూడా ఉందని ఈ మధ్యనే సిసిఎంబి వారి పరిశోధనలో తేలింది. వేళ ఏళ్ళుగా ఆయుర్వేదం చెప్తున్న త్రిదోషాలను ఇన్నాళ్ళు అంగీకరించని ప్రపంచం ఈ పరిశోధనతో సత్యమని ఒప్పుకుని తీరాల్సి ఉంటుంది. ఈ త్రిదోషాలను సమంగా ఉంచే లక్షణం గోమూత్రానికుంది.  గోమూత్రాన్ని స్వీకరిస్తే కఫ, వాత, పైత్యాలు అదుపులోకి వస్తాయి.

గోమూత్రం కాలేయ పని తీరును మెరుగుపరుస్తుంది. కాలేయం (Liver) బాగుంటే శుద్ధమైన రక్తం ఏర్పడుతుంది. ఫలితంగా రోగనిరోధశక్తి పెరుగుతుంది.

శరీరానికి శక్తినిచ్చే కొన్ని సూక్ష్మపోషకాలు (micro-nutrients) దేహంలో ఉంటాయి. ఇవి మూత్రవిసర్జన ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వీటిని శరీరం అధికంగా కోల్పోతే వృద్ధాప్యలక్షణాలు త్వరగా వస్తాయి. గోమూత్రంలో ఈ సూక్ష్మపోషకాలను భర్తీ చేసే అనేక తత్త్వాలు ఉండడం చేత, దాన్ని స్వీకరించినవారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావు.

మానసిక ఆందోళన నాడీవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గోమూత్రాన్ని హృద్యమని, మేధ్యమని అన్నారు. అనగా అది మెదడుకు, గుండెకు శక్తినిస్తుందని అర్దం. గోమూత్రం మెదడు, గుండెకు ఆందోళన వలన నష్టం కలగకుండా రక్షిస్తుంది. ఆయా భాగాలను రోగాల నుంచి కాపాడుతుంది.

 Source: https://cowurinebenefit.wordpress.com/2012/10/06/cow-urine-benefits/

To be continued ....................

Sunday, 27 December 2015

హిందూ ధర్మం - 189 (గోవు ప్రాముఖ్యత)

నిరుక్తం గురించి ఇంత వివరంగా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే వేదాలకు ప్రామాణికమైన అర్దాలు కాక తమకు తోచిన అర్దాలను చెప్పి, ధర్మాన్ని నాశనం చేయాలని, మతమార్పిడి చేయాలని అనేక కుట్రలు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పే ఏ విషయాలకు శాస్త్రప్రమాణం ఉండదు. వేదాలకు తప్పుడు అర్దాలు తీసి అందులో లేనివి ఉన్నాయని ప్రచారం చేయడంలో అనేకులు తలమునకలై ఉన్నారు. అందులో వాళ్ళు ప్రధానంగా చేసే కొన్ని ఆరోపణల వెనుకనున్న సత్యాలను తెలుసుకుందాం.

వేదాల్లో గోవధ ఉందనే ప్రధానమైన ఆరోపణ. వేదమే ధర్మానికి మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది, వైదిక సంస్కృతి వచ్చింది. అగ్ని ఆరాధన ప్రతి మానవుడు చేయాలని వేదంలో ఈశ్వరశాసనం. అగ్ని ఆరాధాన చేయడమంటే అగ్నిహోత్రంలో హవిస్సును, ఘృతాన్ని (ఆవునెయ్యి) సమర్పించడం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. అగ్ని ఆరాధాన జరగాలంటే ఆవు ఉండాలి. ఆవు నుంచి వచ్చే పిడకలతోనే ప్రతి దినం రెండు సంధ్యాసమయాల్లోనూ నిత్యాగ్నిహోత్రం చేయాలి. అగ్ని ప్రజ్వరిల్లాలంటే అందులో ఆవునెయ్యి పడాలి. ఏం గేదే నెయ్యి వెయవచ్చు కదా? అని సందేహం వస్తుంది. లేదా మరింకేమైనా మండే పదార్ధం వేయవచ్చు కద, పెట్రోల్, కిరసనాయిల్, డీజీల్ లాంటివి. ఆవునెయ్యే ఎందుకు వేయాలి? అయినా, పది మందికి పెట్టక వాటిని తీసుకెళ్ళి నిప్పులో పోయడం మూర్ఖత్వం కాదా? ఆవుకే ఆ ప్రత్యేకత ఎందుకు? ఇలా అడుగుతారు హైందవ ద్వేషులు.

ముందు గోవు విశిష్టత తెలుసుకుందాం. ఆ తర్వాత వేదాల్లో గోవధ ఖండన చూద్దాం. ఆగ్నికి ఏ పదార్ధాన్ని ఆహుతిచ్చినా అది కార్బన్-డై-ఆక్సయిడ్ ని, ఇతర హానికార, కాలుష్యకారక పదార్ధాలను విడుదల చేస్తుంది. కానీ ఆవు నెయ్యిని అగ్నికి ఆహుతిస్తే, 10 గ్రాముల ఆయినెయ్యి 1 టన్ను ఆకిజెన్ (ప్రాణవాయువు) ను ఉత్పత్తి చేస్తుంది. ఆవు అన్నప్పుడు అది దేశవాళీ ఆవు/ నాటు ఆవు/ భారతీయ ఆవు గానే గ్రహించాలి. జెర్సీ ఆవులకు ఆ శక్తి లేదు. యజ్ఞం అనేది అగ్నిలో ఏవో వస్తువులు వేసి వృధా చేయడం, ప్రకృతిని నాశనం చేసే ప్రక్రియ కాదు. అది ప్రకృతికి నూతన ఉత్తేజాన్ని, శక్తిని, పుష్టినిచ్చే ప్రక్రియ అని వేదం చెప్పింది. దీనిపై కుతూహలంతో పరిశోధించిన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. అదే గాకా, హవిస్సుగా వేయబడిన ఆవునెయ్యి వాసన ఎక్కడ వరకు వ్యాపించబడుతుందో, అంతవరకు గాలిలో సూక్ష్మక్రిములు నశిస్తాయని ధర్మం చెప్పింది, ఆధునిక పరిశోధనలు కూడా ముమ్మాటికి నిజమని నిరూపించాయి. అంతేగాకా హవిస్సులో గేదేనెయ్యి వేస్తే, అది భూమి నుంచి 300 మీటర్ల నుంచి 1000 మీటర్ల పై వరకు మాత్రమే వెళ్ళగలదు. కానీ ఆవునెయ్యి అణువుల రూపంలో మారి భూ ఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల పైకి వెళ్ళి, 10 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపిస్తుంది. అక్కడ ఏవైనా నీటి అణువులు ఉంటే, వాటిని దగ్గరకు చేర్చి, వర్షం కురిపించగల శక్తి ఆవునెయ్యి అణువులు కలిగి ఉన్నాయి. అంతేకాక ఇవి తాము పైకి చేరే క్రమంలో తమ చుట్టు ఉన్న కాలుష్యాన్ని కూడా శుభ్రం చేయగలుగుతాయి. అనగా యజ్ఞం వలన కురిసే వర్షం స్వఛ్ఛమైన నీటిని ఇస్తుంది. అసహజ పద్ధతుల్లో రసాయనాలు చల్లి మేఘాలను వర్షింపజేయడం వలన కురిసిన వాన నీటి బిందువుల్లో హానికారక రసాయనాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిబట్టి ఆవునెయ్యి ఉపయోగం ఏంటో అర్దం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే పెట్రోల్, డీజీల్, లేక చెత్త మొదలైనవి కాల్చినప్పుడు వెలువడే వాయువులు విషాలుగా మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి, పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి, భూతాపాన్ని పెంచుతాయి. అదే ఆవుపిడకలను, ఆయుర్వేద మూలికలను ఆవినెయ్యితో కాల్చినప్పుడు వెలువడే వాయువులు కాలుష్యాన్ని శుద్ధి చేస్తాయి, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఇవన్నీ ఋషులు వేల ఏళ్ళ క్రితమే చెప్పారు. అది నమ్మనివారు, వైదిక ధర్మంపై నమ్మకం ఉండి, కుతూహలంతో పరిశోధించిన అనేకులు ఈ విషయాలను సత్యమని రూఢీ చేసుకున్నారు. ఇంకా ఆవునెయ్యిని యజ్ఞంలో వేయడమెందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే వారు ఎంత వెనుకబడి ఉన్నారో, మార్పును అంగీకరించని మూఢులుగా మిగిలిపోతున్నారో, సత్యం తెలుస్తున్నా, అంగీకరించడానికి అహం అడ్డువచ్చి, దురహంకారులుగా బ్రతుకీడుస్తున్నారో అర్దం చేసుకోవచ్చు.

To be continued ...................