Monday 16 October 2017

ప్రపంచ ఆహార దినోత్సవం- ప్రపంచ ఆహార దినోత్సవం



16 అక్టోబరు ను ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుతారు. ఆ సందర్భంగా ప్రపంచ ఆహార దినోత్సవం....

ఆహారం మన జీవితంలో భాగం. ఆహారం లేకపోతే జీవనం లేదు. ఆహార దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ప్రపంచమంతా ఆహారభద్రత, పౌష్టికాహార లోపం గురించి మాట్లాడుతోంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం విస్మరిస్తున్నాం. అదే మారుతున్న ఆహారపు అలవాట్లు. ఆహారం కేవలం ఆకలి తీర్చేదే కాదు, అది మన జన్యువుల పై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆధునిక పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి. మన పూర్వీకులు ఏ ఆహారం తీసుకున్నారో, దానికి అనుగుణంగా మన జన్యువులు స్పందిస్తాయి. కొత్తరకం ఆహారం తీసుకుంటే శరీరవ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. దాని ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుంది.....  

ఉదాహరణకు మన పూర్వీకులకు పొద్దుతిరుగుడు పూల నూనె, బియ్యపు పొట్టు (రైస్ బ్రాన్) నూనె మొదలైన తెలియవు. ఆయా ప్రాంతాలను బట్టి కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పల్లీనూనె, కుసుమనూనె, ఆవనూనెను ఉపయోగించేవారు. ఇప్పుడు మనం వాటిని విడిచి, కొత్తరకం నూనెలు వాడటం వలన అనేక రోగాలు ఉత్పన్నమవుతున్నాయి.

ఒక 50 ఏళ్ళ క్రితం వరకు అన్నం అంటే జొన్న అన్నం, సజ్జ అన్నం, సామ బియ్యం మొదలైనవిగా పేర్కొనేవారు. ఇప్పుడు అన్నం అంటే మనకు తెలిసింది వరి అన్నం ఒక్కటే. అది కూడా పొట్టు తీసిన తెల్ల బియ్యం మాత్రమే. ఒకపట్టు బియ్యం, దంపుడు బియ్యం అసలు తినము. రాగులు, కొర్రలు, వరిగెలు, సజ్జలు మొదలైన చిరుధాన్యాలను మన పూర్వీకులు విరివిగా ఉపయోగించేవారు. అందుకే వారు ఆరోగ్యంతో షుగర్, బిపీ లాంటివి లేకుండా హాయిగా జీవించారు. మరి మన సంగతి?..... నిజానికి బి విటమిన్స్, ఐరన్ మరియు ఇతర పోషకాలు ఉండేది చిరుధాన్యాల్లోనే కాని తెల్ల అన్నంలో కాదు. చిరుధాన్యాలు మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం. తెల్లబియ్యంలో ఉండేది పిండి పదార్ధం మాత్రమే.

అదే కాక ఆహారదిగుబడి కోసం వాడే రసాయనిక ఎరువులు, పురుగుల మందులు పంటదిగుబడిలోకి చేరి, తినేవారి శరీరంలోకి చేరుతున్నాయి. అవి క్యాన్సర్ మొదలైన భయానకమైన వ్యాధులను కలిగిస్తున్నాయి. అంతేకక జన్య్వులను సైతం నాశనం చేసి, భావితరాలకు పుట్టుకతోనే రోగాలను, అవిటి తనాన్ని కలిగిస్తున్నాయి. ఆహారం దినోత్సవం అంటే కేవలం ఆకలి గురించే కాక, ప్రస్తుత ఆహారం మానవులకు చేస్తున్న కీడును సైతం గుర్తు చేసేదిగా ఉండాలి.

ఆహారం గురించి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏ ప్రాంతంలో ఉంటామో, ఆ ప్రాంతంలో దొరికే ఆహరమే స్వీకరించాలి. ఆయా ప్రాంతాలవారికి అన్ని పోషకాలు అందించడానికి స్థానిక జాతుల్లో అన్ని పోషకాలు లభించేలా ఏర్పాటు చేసింది. ఉదాహర్ణకు ఇప్పుడు మన మార్కెట్ లో కివి పండు దొరుకుతోంది. ఇది ఆస్ట్రేలియాలో పండుతుంది. విటమిన్ సి అధికంగా ఉందని ఇప్పుడు దాన్ని ఇక్కడ అలవాటు చేస్తున్నారు. కానీ కివి కంటే అధికంగా విటమిన్ సి ఉసిరి, జామ కాయలో లభిస్తుంది. ఉసిరికాయ మనదేశంలో పండుతుంది. దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. అలా కాక విదేశీ పండ్లను స్వీకరిస్తే, అవి జన్యువులపై వ్యత్రిఏక ప్రభావాన్ని చూపి, భవిష్యత్తులో సమస్యలను సృష్టిస్తాయి.

అన్నిటికంటే ముందు రసాయనిక వ్యవసాయం ఆగిపోవాలి. గోఆధారిత ప్రకృతి వ్యవసాయం విస్తరించాలి. అప్పుడు మాత్రమే అందరికి సంతులిత పౌష్టికాహారం అందుతుంది. అప్పుడే ప్రపంచం నిజమైన ఆహార దినోత్సవం జరుపుకుంటుంది.

No comments:

Post a Comment