Friday 27 October 2017

శివయోగసాధన- శివమానస పూజ & పంచాక్షరి మంత్రలేఖనం

శివమానస పూజ
మానసపూజ అంటే మానసికంగా పూజించడం. పువ్వులు, చందనం మొదలైనవాటితో చేసే బాహ్యపూజ కంటే మానసపూజ చాలా ప్రభావంతమైనది. మానసపూజ చేసినప్పుడు మీకు మరింత ఏకాగ్రత ఉంటుంది.

మానసికంగా స్వామిని వజ్రాలు, ముత్యాలు, పచ్చలు మొదలనవి పొదిగిన సింహాసనంపై కూర్చోబెట్టండి. ఆయనకు ఆసనం ఇవ్వండి. అర్ఘ్యం, మధుపర్కం మరియు అనేక రకాల పుష్పాలు, వస్త్రాలు మొదలనవి ఇవ్వండి. ఆయన నుదుటన మరియు శరీరానికి చందనం పూయండి. అగరబత్తీలు వెలిగించండి. దీపములు చూపించండి. కర్పూరం వెలిగించి, హారతి చూపించండి. అనేకరకాల ఫలాలు, మధురపదార్ధాలు, పాయసము, కొబ్బరికాయ మరియు మహానైవేద్యం సమర్పించండి. షోడశోపచారపూజ చేయండి.

పంచాక్షరి మంత్రలేఖనం
చక్కని పుస్తకంలో 'ఓం నమః శివాయ' అని అరగంట లేదా ఎక్కువ సమయం రాసుకోండి. ఈ సాధనను చేయడం ద్వారా మీకు మరింత ఏకాగ్రత వస్తుంది. ఇంకుతో మంత్రాన్ని స్పష్టంగా రాయండి. మంత్రాన్ని రాసేటప్పుడు మౌనాన్ని పాటించండి. మంత్రాన్ని మీరు ఏ భాషలోనైనా రాయవచ్చు. అటుఇటు చూడటం విడిచిపెట్టండి. మంత్రాన్ని రాసేటప్పుడు మానసికంగా మంత్రాన్ని ఉచ్ఛరించండి. మంత్రం మొత్తాన్ని ఒకేసారి రాయండి. మంత్రం రాసే పుస్తకం పూర్తవ్వగానే దాని మీరు ధ్యానం చేసుకునే గదిలో ఒక పెట్టెలో పెట్టుకోండి. సాధనలో క్రమబద్ధంగా ఉండండి.

చిన్న నోటుపుస్తకాన్ని మీ జేబులు పెట్టుకుని, ఆఫీస్ లో ఖాళీ సమయం దొరికినప్పుడు రాయండి. మీ జేబులు మూడు వస్తువులు పెట్టుకోండి, అవి భగవద్గీత, మంత్రం కోసం చిన్న పుస్తకం మరియు జపమాల. మీరు గొప్పగా ప్రయోజనం పొందుతారు.

- స్వామి శివానంద  

No comments:

Post a Comment