Sunday 18 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 5వ భాగము



భగవంతుని నుంచి గుహ్యమైన సహాయము 

కొన్ని సందర్భాల్లో భక్తులకు భగవంతుడు ఏ విధంగా సహాయపడ్డాడో చూడు. ఏకనాథుడు ఆకాశవాణి విన్నాడు. అది ఏమన్నదంటే "దేవగిరిలో ఉన్న జనార్ధన పంత్‌ను దర్శించు. ఆయన నిన్ను సరైన మార్గంలో పెట్టి నడిపిస్తాడు". అతను ఆ విధంగా నడుచుకొని తన గురువును పొందాడు. తుకారాం 'రామకృష్ణ హరి' అనే మంత్రాన్ని స్వప్నంలో పొందాడు. ఆయన ఈ మంత్రాన్ని మననం చేసి కృష్ణ దర్శనం పొందాడు. శ్రీకృష్ణుడు నామదేవుడిని తన యొక్క దీక్ష కోసం మల్లికార్జున దగ్గరున్న సన్యాసిని దర్శించమని ఆదేశించాడు. రాణి చూడాలి 'కుంభ ముని' రూపాన్ని పొంది, తన భర్త అయిన సిఖద్వజుని ముందు అడవిలో కనిపించి, కైవల్యం యొక్క రహస్యాలను అతనికి ఉపదేశించింది. మధురకవి మూడు రోజులపాటు ఆకాశంలో కాంతిని చూసాడు. అది అతనికి మార్గదర్శనం చేసి, తిన్నేవెలిలో చింత చెట్టు కింద సమాధిలో కూర్చున్న తన గురువైన నమ్మాళ్వార్ వద్దకు తీసుకెళ్ళింది. బిల్వమంగళుడు నాట్యగత్తె, చితామణిని చూసి బాగా ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత ఆమయే అతనికి గురువయ్యింది. తులసీదాసు అగోచరమైన ఒక జీవి (బ్రహ్మరాక్షసుడు) ద్వారా సూచనలు పొంది హనుమంతుని దర్శనం పొందగలిగాడు. హనుమంతుని ద్వారా, అతనికి రాముని దర్శనం.

అర్హత కలిగిన శిష్యునకు సద్గురువును అన్వేషించే పరిస్థితికి ఎన్నడూ తలెత్తదు. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవులు అరుదైనవారు కాదు. సామాన్యమైన అజ్ఞానంతో కూడిన మనస్సు గల వ్యక్తులు వారిని సులువుగా గుర్తించలేరు. కేవలం కొందరు వ్యక్తులు, ఎవరైతే శుద్ధమై, సర్వ సద్గుణాలను కలిగి ఉంటారో, వారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిని అర్థం చేసుకుని, వారి సాన్నిధ్యం వలన లాభం పొందగలరు. 

ఆత్మసాక్షాత్కార పథంలో పోరాడుతున్న లేదా శ్రమిస్తున్న జీవులకు మార్గదర్శనం చేయుటకు ఈ ప్రపంచం ఉన్నంతవరకు గురువులు మరియు వేదాలు ఉంటాయి. సత్యయుగం తో పోల్చుకుంటే కలియుగంలో జ్ఞానోదయం పొందిన జీవుల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. కానీ సాధకులకు సహాయం చేయటానికి వారు ఎల్లప్పుడూ ఉంటారు. ప్రతి వ్యక్తి తన శక్తి సామర్ధ్యాలు, స్వభావము మరియు అవగాహన శక్తికి తగిన మార్గం ఎంచుకోవాలి. ఆ మార్గంలో అతను తన సద్గురువు కలుస్తాడు.

1 comment:

  1. మీ అనువాదం సరళంగా సుబోధకంగా సాగుతోంది. ఐతే ముద్రారాక్షసాలు చాలానే వస్తున్నాయి. దయచేసి అవన్నీ తీరుబడి చూసుకొని సవరించుకొన వలసిందిగా విజ్ఞప్తి.

    ReplyDelete