Showing posts with label దీపావళి. Show all posts
Showing posts with label దీపావళి. Show all posts

Tuesday, 2 November 2021

దీపావళి - దివిటీలు - పితృ ఆరాధన




దీపావళి అమావాస్యలో లక్ష్మీపూజ ఎంత ముఖ్యమో పితృదేవతా స్మరణ కూడా అంతే ముఖ్యం. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సంక్రాంతికి కూడా పితృదేవతలతో సంబంధం వుంది. అందునా ఇది దక్షిణాయనం, అంటే పితృదేవతల కాలం. 


పితృ ఆరాధన అంటే అశుభం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. పితృదేవతల అనుగ్రహం లేకుండా కుటుంబంలో శుభకార్యాలు జరగవు. కనుక ప్రతి శుభకార్యానికి ముందు వారిని స్మరించాలి. పెళ్ళిలో కూడా ముందుగా నాందీ శ్రాద్ధం అని క్రతువు ఉంటుంది. అందులో పెళ్ళికి పితరులను ఆహ్వానిస్తారు. కనుక పితృకర్మలు అశుభం అనే అపోహను హిందువులు వీడాలి.


దీపావళి నాడు పితృదేవతలకు తర్పణాలు తప్పకుండా వదలాలి. 

తర్పణాలు ఎవరైనా వదలవచ్చా అని అడుగుతున్నారు. తర్పణాలు కేవలం తల్లిదండ్రులు లేనివారు మాత్రమే వదలాలి. మిగితవారు పితృదేవతలను మనఃస్ఫూర్తిగా స్మరించాలి.

దీపావళి సాయంకాలం పితృదేవతల ప్రీత్యర్ధమై దివిటీలను వెలిగించి చూపించే ఆచారముంది. దీన్ని దివిటీలి కొట్టడమంటారు. కొన్ని ప్రాంతాల్లో కర్రలకు, కొన్ని చోట్ల గోంగూర కాడలకు వస్త్రం చుట్టి నూనెతో వెలిగించి వెలిగించి చూపించాలి. ఇది పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. కాకరపువ్వొత్తులు కాల్చామా, చిచ్చుబుడ్డీలు కాల్చామా అన్నది ప్రధానం కాదు, దీపావళి నాడు దివిటీలు వెలిగించామా లేదా అన్నది ప్రధానం. ఈ దివిటీలను కూడా పురుషులే కొట్టాలని, స్త్రీలు పక్కన నిల్చుని చూడాలని నండూరి శ్రీనివాస్ గారి విడియోలో చూశాను.


అలాగే దీపావళి పండుగ రోజు సూర్యోదయవేళ కూడా దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టాలి. మా చిన్నప్పుడు మా పెద్దలు ఇంట్లో ఇలా చేయడం మేము చూసాము. కార్తీకమాసంలో కూడా ఇప్పుడు అందరూ సాయంకాల వెళ మాత్రమే కార్తీకదీపాలు వెలిగిస్తున్నారు గానీ ఈ నరకచతుర్దశి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రతి రోజు ఉదయం వేకువఝామునే దీపాలను వెలిగించి ఇంటి గడపల వద్ద, తులసిచెట్టు వద్ద పెట్టాలి.


నరకచతుర్దశి సాయంకాల వేళ కాళీమాతను, దీపావళి అమావాస్య సాయంకాలం వేళ మహాలక్ష్మీని పూజించాలి. 


వీటి గురించి అనేక విషయాలను తెలుసుకొనుటకు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, చాగంటి కోటేశ్వర రావు గారు, నండూరి శ్రీనివాస్ గార్ల ప్రవచనాలను వినవచ్చు.

Sunday, 30 October 2016

స్వామి శివానంద దీపావళి సందేశం



O Ram! The light of lights, the self-luminous inner light of the Self is ever shining steadily in the chamber of your heart. Sit quietly. Close your eyes. Withdraw the senses. Fix the mind on this supreme light and enjoy the real Deepavali, by attaining illumination of the soul.

He who Himself sees all but whom no one beholds, who illumines the intellect, the sun, the moon and the stars and the whole universe but whom they cannot illumine, He indeed is Brahman, He is the inner Self. Celebrate the real Deepavali by living in Brahman, and enjoy the eternal bliss of the soul.

- Swami Sivananda

Saturday, 29 October 2016

స్వామి కృష్ణానంద దీపావళి సందేశం



Bhagavati Mahalakshmi, the Goddess of prosperity, does not merely mean the Goddess of wealth in a material sense. Lakshmi does not mean only gold and silver. Lakshmi means prosperity in general, positive growth in the right direction, a rise into the higher stages of evolution. This is the advent of Lakshmi. Progress and prosperity are Lakshmi. In the Vishnu Purana we are told if Narayana is like the sun, Lakshmi is like the radiance of the sun. They are inseparable. Wherever Narayana is, there is Lakshmi. Wherever is divinity, there is prosperity. So on this day of Dipavali we worship the Supreme God who is the source of all conceivable virtues, goodness and prosperity, which is symbolised in illumination, lighting and worship in the form of Arati and a joyous attitude and feeling in every respect. So, in short, this is a day of rejoicing over the victory of Sattva over the lower Gunas, the victory of God Himself over the binding fetters of the soul.

- Swami Krishnananda

Friday, 28 October 2016

స్వామి చిదానంద సరస్వతి గారి దీపావళీ సందేశం



The significant act during Diwali is the lighting of lamps to brighten every nook and corner. Within the interior of thy own being, do likewise.Wisdom is the Light to dispel this Darkness of spiritual Ignorance. The Presence of God pervades this universe. O Man: Know this and live in virtue and holiness. For thou art ever in the Presence of the Most High. HE alone is the reality indwelling all names and forms and all beings are verily His moving tabernacles. This is Wisdom. Light up thy life with this wisdom and dispel the darkness of worldliness and materialism from your life.

- Swami Chidananda saraswati

Wednesday, 11 November 2015

దీపావళి గురించి భగవాన్ రమణ మహర్షి



నరక సదృశమైన శరీరమే 'నేను' అనుకునే అభిమానమే నరకుడు. ఆ అభిమానమును నిర్మూలించి, తాను తాను(ఆత్మ)గా ప్రకాశించడమే దీపావళి.

భగవాన్ రమణ మహర్షి

అందరికి దీపావళి శుభాకాంక్షలు

దీపావళీ విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_22.html

నరక చతుర్దశి విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_21.html

ధన త్రయోదశి విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/11/blog-post_1.html

Wednesday, 22 October 2014

దీపావళి విశేషాలు

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం.


పురాణప్రాశస్త్యం - త్రేతాయుగంలో రావణాసురిడిని చంపిన శ్రీ రామచంద్రుడు ఆశ్వీయుజ అమావాస్య రోజునే అయోధ్యకు చేరుకున్నాడు. తమకు ప్రియాతిప్రియమైన రాముడు 14 ఏళ్ళ తర్వాత తిరిగి తమ వద్దకు వస్తున్నాడనే సంతోషంతో అయోధ్యలో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రజలు శ్రీ రాముడిని దీపాలు వెలిగించి ఆహ్వానించారట. అయోధ్య మొత్తం దీపకాంతులతో అలంకరించారని, చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా దీపావళీ జరుపుకుంటారని ఒక కధనం.

ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు నరకాసుర వధ చేసిన తర్వాత అనేకమందికి విముక్తి లభించింది, అనేకమంది స్త్రీల జీవితాల్లో వెలుగు వచ్చింది. నరకాసురవధకు సంతొషించిన ప్రజలు అమావాస్య రోజున దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి, ఆనందాన్ని వ్యక్తం చేసారు. అది కూడా ఈ రోజునే. నరకుడంటే అహకారం. అహకారం నశించినవారికి జీవితంలో చీకటి అనేదే ఉండదు. అహం నశించడం, జ్ఞానం కలగడం ఒకేసారి జరుగుతాయి. జ్ఞానం వ్యక్తిలో ఉన్న సంచితకర్మ ఫలాలను, పూర్వజన్మ వాసనలను నశింపజేస్తుంది. దానికి ప్రతీకగా అమావాస్య రాత్రి దీపాలు వెలిగిస్తారు.

ఆచరించవలసినవి -  ఈ రోజున తెల్లవారు జామున్నే(వెకువ జామున/సూర్యోదయానికి గంటన్నర ముందు)తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల కొమ్మలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈరోజు చేసే అభ్యంగనస్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది.

దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా,మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళ వుంచిపోతుందని చెప్పబడింది. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి.

ఇక సాయంకాలం ఇంటి ముంగిట, ఆలయాలు, మఠాల ముంగిట, గో శాలల్లోనూ దీపాలను వెలిగించాలి. చీకటిపడే సమయాంలో దీపదానం చేసి, మండుతున్న కట్టేల్ని త్రిప్పాలి. ఇలా త్రిప్పడం చేత పీడ పొతుందని చెప్తారు. నిజానికి దీపావళి కొంతవరకు పితృదేవతలకు సంబంధిచిన పండుగ.  దీపావళీ సాయంత్రం గొంగూర కాడల మీద దీవిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయి. తద్వారా పితృదేవతలు సంతసిస్తారు, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుంది.  తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. ఆకులతో దొన్నెలు కుట్టి, దీపాలు వెలిగించి, నదుల్లోనూ, చెరువుల్లోనూ, సరోవరాల్లోనూ, బావుల్లోనూ వదలాలి. దీపావళీ అర్దరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, అలక్ష్మీని బయటకు పంపాలి.

నూతన వస్త్రాలు ధరించాలి. అన్నదానం చేయాలి. అర్ధరాత్రివేళ చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళతోనూ, డిండిమం అనే వాయిద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం.
(ఇందులో కొంత భాగం  సేకరణ: శ్రీ శైలప్రభ,అక్టోబరు 2012,సప్తగిరి,అక్టోబరు 2011  )

దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి.

అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్థంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించండి. మట్టి ప్రమిదలనే వాడండి. 

శాస్త్రీయ కారణం -  కొద్దిపాటి టపాసులు పేల్చడం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకములైన క్రిమికీటకాలు రోగాలను కలిస్తాయి. దీపావాళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజేస్తుంది. కానీ మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. 

అందరికి దీపావాళి శుభాకాంక్షలు.

నరకచతుర్దశికి, దీపావళికి నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలంటొంది శాస్త్రం.


నరకచతుర్దశికి,దీపావళికి నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలంటొంది శాస్త్రం. ప్రతి సంవత్సరం క్రొత్త మట్టి ప్రమిదలు కొని వాటిని వాడాలి.

మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. అందులో నువ్వులనూనె మన పూర్వజన్మ వాసనలకు (గత జన్మ నుండి మనకు ప్రాప్తించిన పాపపుణ్యాలు, అలవాట్లు, సంస్కారాలు) ప్రతీక. అందులో వేసే వత్తి అహంకారానికి గుర్తు.  దీపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానమనే దీపం మన పూర్వజన్మవాసనలను, అహంకారాన్ని, చెడు అలవాట్లను కాల్చేసి, పరమాత్ముడిని చేరుస్తుంది అన్నది దీపం వెలిగించడం వెనుక ఉన్న అర్ధం. అందువల్ల దీపావళికి మట్టి ప్రమిదలనే కొనండి.

ఈ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ రోజుల్లో నువ్వుల నూనె దీపాన్నే వెలించాలి. నువ్వుల నూనె క్రిమిసంహారిణి. యాంటి-బ్యాక్టీరియల్ (anti-bacterial) లక్షణాలు కలిగి ఉంటుంది. అందువల్ల నువ్వుల నూనె దీపం వాతావరణంలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. ఈ దీపపు కాంతి కళ్ళకు మంచిది. దృష్టిని (eye-sight) మెరుగుపరుస్తుంది. ఇక దీపావళి నాడే ఎందుకు నువ్వుల నూనె దీపం పెట్టాలి అంటే దీపవళి చలికాలంలో వస్తుంది. సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు. చల్లటి వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయి. అలాగే శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు వస్తాయి. ప్రమిదలో నూనె అయిపోయాక వత్తి కూడా కాలిపోతుంది. ఆ వత్తి కాలడం వల్ల వచ్చిన వాసన పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు (lungs), గుండెకు(heart) సంబంధించిన రోగాలు రాకుండా నిరోధింపబడతాయి. అలాగే ఈ దీపం కొంత వేడిని కూడా పుట్టిస్తుంది. ఏదైన ఒక వస్తువు కాలినప్పుడు carbon విడుదలవుతుంది. అది గాలిలో ఉన్న తేమను పీల్చేస్తుంది.

మార్కెట్లో దీపావళి కి ప్రత్యేకమైన క్యాండిల్ దీపాలు అమ్ముతున్నారు. అవి వెలిగించకూడదు. సంప్రదాయ దీపం ప్రకృతిలో ఉన్న positive energy ని, దైవి శక్తులను ఆకర్షిస్తే, క్యాండిల్ negative energies ని, దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. కావాలంటే మీరు ఒక చీకటి గదిలో క్యాండిల్ వెలిగించి కాసేపు కూర్చొండి. మరొకసారి అదే గదిలో దీపారాధన చేసి కూర్చోండి. మీరే గమనిస్తారు తేడా. క్యాండిల్ శోకానికి కారణమవుతుంది. దీపం శుభాలను తీసుకువస్తుంది.

ఎక్కడ దీపం పేడితే అక్కడ దేవతలు వస్తారు. అందువల్ల దీపకాంతులలో శ్రీ మహా లక్ష్మీని మీ ఇంట్లొకి ఆహ్వానించండి.

అందరికి నరకచతుర్దశి,దీపావళి శుభాకంక్షలు.

Tuesday, 21 October 2014

నరక చతుర్దశి విశేషాలు

ఆశ్వీయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి

పురాణ ప్రాశస్త్యం: పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రాక్ జ్యోతిష్యపురాన్ని పరిపాలించేవాడు. ఆ ప్రాక్ జ్యోత్సిహ్యపురం అనే ప్రాంతం ఈ రోజు ఈశాన్య భారతంలో అస్సాంలోని గౌహతి ప్రాంతం. వాడు 16,000 మంది కన్యలను తన కారాగారంలో బంధించగా, శ్రీ కృష్ణుడు సత్యంభామ సమేతంగా వెళ్ళి, వాడితో యుద్ధం చేసి, వాడిని చంపి, ఆ కన్యలను విడిపిస్తాడు. నరకాసుర వధ జరిగి, స్త్రీలకు దుష్టుడైన నరకుడిని నుంచి విముక్తి లభించినందుకు ప్రతీకగా ఈ రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు.  నరకుడి వధతో వాడు చేత హింసించబడి అంధకారంలో మగ్గుతున్న అనేకమంది బయటకు వచ్చారు, విముక్తి పొందారు, అందుకు ప్రతీకగా దీపాలు వెలిగిస్తారు. ఈ నరక చతుర్దశికి అంతరిక్షంలో జరిగే కొన్ని వింతల కారణంగా కూడా దీనికి ఈ ప్రత్యేకత వచ్చింది.   

నరక చతుర్దశి సంధర్భంగా అందరూ ఆచరించవలసిన విషయాలు తెలుసుకుందాం.
నరక చతుర్ద రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి గంటన్నర ముందే నువ్వుల నూనెతో తల అంటుకొని స్నానం చేయాలి. దీనినే తైలాభ్యంగనస్నానం అంటారు. ఇది నరక చతుర్దశి రోజు తప్పక చేయవలసిన విధి. స్నానానికి ఉపయోగించే నీటిలో ఉత్తరేణి, తగిరస, తుమ్మి చెట్లకొమ్మలను కలియబెట్టాలి. స్నానం మధ్యలో ఉత్తరేణి ఆకులను తలపై త్రిప్పుకొని పారేయాలి. ఈరోజు చేసే స్నానం నరక భయాన్ని పొగొడుతుందని, మంగళకరమని చెప్పబడింది. ఆ సమయంలో స్నానం చేయకపోతే దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రం చెప్తోంది.

నరకుడనే అహకారాన్ని వెతికి చంపినందుకు గుర్తుగా చేసే స్నానం ఇది. నరకాసురుడంటే అహకారం. జ్ఞానం మాత్రమే అహాన్ని నశింపజేస్తుంది. కనుక చతుర్దశి రోజు చేస్తున్న ఈ స్నానం జ్ఞానానికి సంకేతం అన్నారు భగవాన్ రమణ మహర్షి.

ఈ రోజున సూర్యోదయానికి ముందు నువ్వులనూనెలో లక్ష్మి దేవి, నీటిలో గంగా దేవి ఉంటారని, అందువల్ల ఆ సమయంలో చేసే పైన చెప్పిన విధంగా చేసే స్నానం వల్ల లక్ష్మీదేవి, గంగాదేవిల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. స్నానాంతరం దక్షిణదిశగా తిరిగి యమనామాలు స్మరిస్తూ మూడుసార్లు యమునికి తర్పణం విడువాలి. తల్లిదండ్రులు లేనివారు మాత్రమే ఈ తర్పణాలు వదలాలి.

ఈరోజు ప్రదోషంలో అంటే సాయంకాలం ఇంటిముందు, ఆలయాల్లోనూ దీపాలను వెలిగించాలి. నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి దీపదానం చేయాలి. 

Monday, 20 October 2014

ధనత్రయోదశి విశేషాలు

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి - దీనికే ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి అని పేరు.

ధనత్రయోదశి విశేషాలు:

పురాణప్రాశస్త్యం : పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు #ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన్ను పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ధనత్రయోదశి కధ:

పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు. కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనకి వివాహం జరిగిన నాలుగో రొజుకు మరణిస్తాడని పురోహితులు చెప్తారు. అయినా, ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపధం చేస్తుంది. నాలుగవ రోజు...... రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోస్తుంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవతయైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. రాకుమారుడుఇ ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి. ఆ నెరుపు తళుకులకు ఈ పాము చూపు మందగిస్తుంది. ఆదుగు ముందుకు వేయలేకపోతాడు. ఈ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి, ఆమె సంగీతం వింటూ ఉంటాడు.  ఇంతలోనే తెల్లారిపోతుంది. యమ ఘడియలు దాటిపోవడంతో, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు.

అందువల్ల ఈ రోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఉత్తరాదిలో ఈ రోజు సాయంత్రం ఆరుబయట, అన్నాన్ని రాశిగా పోసి యమదీపం వెలిగిస్తారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి (అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిధి).దీన్నే "ధన త్రయోదశి" అంటారు.ఈనాటి రాత్రి అపమృత్యువు (unnatural death) నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి, ఇంటి ముందు ఉంచాలి. దీనికి "యమ దీపం" అని పేరు. యముని అనుగ్రహం పొందడం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి.

కాగా ఈ మధ్యకాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైంది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపధ్యంలో దేశంలోకి బహుళజాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి, లాభలు ఆర్జించడమే ధ్యేయంగా ఉన్న సంస్థలు మార్కెట్ చేసుకోవడం కోసం అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదట. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్దం చేసుకోవచ్చు. పురాతనకాలంలో భారతదేశంలో పండుగ రోజంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవడం కాకుండా, ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకుని, వచ్చే జన్మలకు ఉపయోగించుకోవడం భారతీయుల విధానం. ధనత్రయోదశి రోజున చేసే దానం, పూజ, జపం అధికఫలాన్ని ఇస్తాయి. 17 వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమనీ, భారత్‌లో బంగారం పొంగిప్రవహించేదనీ ఆంగ్లేయుల రికార్డులే చెప్తున్నాయి. అటువంటి బంగారాన్ని భారతీయులు ఎప్పుడు కొనగోలు చేయలేదు, ఆ అవసరం కూడా రాలేదు. వచ్చిన అతిధులకు బంగారం దానం చేసిన సంస్కృతి మనది.

ధనత్రయోదశి శుభాకాంక్షలు