Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Showing posts with label శివరాత్రి. Show all posts
Showing posts with label శివరాత్రి. Show all posts
Friday, 13 March 2020
Thursday, 12 March 2020
Tuesday, 17 February 2015
శివరాత్రి కధ - 4 (విజ్ఞానం)
శివరాత్రి కధ- 4 (విజ్ఞానం)
త్రిమూర్తులకు భేధం లేదని చెప్పి మహాశివుడు అదృశ్యమవుతాడు. అప్పుడు ఆ శివలింగం అనంతమైన ఆ శూన్యంలో, జలంలో అండంగా మారుతుంది. ఆ అండం నుంచి సృష్టి జరగాలనీ చేయాలని బ్రహ్మ తపస్సు చేస్తాడు. ఈలోగా ఆ అండంలోనికి విష్ణువు ప్రవేశిస్తాడు. విష్ణువంటే ప్రాణశక్తి కనుక విష్ణువు ప్రవేశంతో సృష్టి మొదలవుతుంది. కర్దమ, దక్ష, మరీచి మొదలైన ప్రజాపతులను బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఆ తరువాత జను, పక్షి, క్రిమి, కిటక, రాక్షస, దేవ, మానవ మొదలైన సంతతి పెరిగిందని పురాణం చెప్తున్నది.
పురాణం ఒట్టి కధ కాదు, అందులో చాలా విజ్ఞానం, నీతి, జీవన విధానం, ధర్మం ఇమిడి ఉంటాయి. ఈ శివరాత్రి కధలో అటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
శూన్యం తప్ప ఏమి లేదు అని పురాణం అంటుంది. అవును, ఈ విశ్వం శూన్యం నుంచి వచ్చి, తిరిగి శూన్యంలోనే లయమవుతుందని ఆధునిక సైసు ఒప్పుకుంది. ఒక శూన్యమంతా నీటితో నిండి ఉంది అన్నది పురాణం. అంతరిక్షంలో ఈ భూమిని ముంచెత్తగల స్థాయిలో నీరు ఉన్నదని, అది ఈ భూమికి చాలా దూరంగా ఉందని ఈ నాటి అంతరిక్ష శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు, అంగీకరిస్తున్నారు.
మనకు కనిపించే ఈ విశ్వమే కాదు, వందల కోట్ల విశ్వాలు భగవంతుని సృష్టిలో ఉన్నాయని భారతీయ గ్రంధాలు చెప్తున్నాయి. ఈ విశ్వమంటే ఒక బ్రహ్మాండం. మనకు అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని, వాటికి అనేక బ్రహ్మలు ఉన్నారని పురాణాల్లో కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలం నుంచి పైకి రావడం అంటే, అనంతమైన భగవత్ సృష్టిలో ఒక బ్రహ్మాండం యొక్క ఆవిర్భావం జరగడమని అర్దం. ఇటువంటి అనేక బ్రహ్మాండాలు, ప్రతి క్షణం ఉద్భవిస్తుంటాయి, నశిస్తుంటాయి. సముద్రపుఅలలపై వచ్చే నీటి బుడగలవలే అనేక బ్రహ్మాండాలు ప్రతిక్షణం విష్ణువులో ఐక్యం అవుతాయని, కొత్తవి వస్తుంటాయని మన వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని ఈ నాటి శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ గెలాక్సికి అవతల, భూమిని పోలిన అనేక గ్రహాలు ఉన్నాయని ఈ రోజు చెప్తున్నారు. బ్రహ్మ తన ఉనికిని గురించి తాను బయట శోధించి విఫలం కావడం, తరువాత తపస్సు ఒక సందేశం. విశ్వమంతా వెతికినా, మానవుడి ఉనికి యొక్క రహస్యం బాహ్యప్రపంచంలో దొరకదు, తన ఉనికిని గురించి తెలుసుకోవాలంటే అంతర్ముఖత చెందాలి, అంటే లోపలికి చూడాలి, తనలో ఉన్న ఆత్మను చూడాలి. అప్పుడే తన ఉనికి గురించి సమస్తము తెలుస్తుంది. ఒక రకంగా అష్టాంగయోగంగా అర్ధం చేసుకోవచ్చు.
ఇక శివుడు లింగరూపంలో రావడం అన్నది పెద్ద వైజ్ఞానికి సత్యం. దీన్ని ఆధునిక కాస్మాలజిస్ట్లు ఒప్పుకున్నారు.
ఈశా ఫౌండేషన్ స్థాఫుకులు జగ్గీవాసుదేవ్ గారు శివలింగం గురించి ఈ విధంగా చెప్పారు. 'శివలింగం ellipsoid అంటే 3-Dimensional ellipse ఆకారంలో ఉంటుంది. Modern cosmologistsలు galaxy ల మధ్యభాగాన్ని(core) ఫొటొ తీసినప్పుడు ప్రతి galaxy core కూడా ellipsoid ఆకారంలోనే ఉంది. నిరాకారమైన (unmanifest) శక్తి (energy) ఒక సాకార (manifest) రూపాన్ని సంతరించుకునే క్రమంలో, రూపాంతరం చెందే క్రమంలో, అది మొట్టమొదటగా ellipsoid అంటే లింగాకారాన్ని సంతరించుకుంటుంది అని పురాణం, ఆధునిక సైన్సు చెప్తున్నాయి'. ఈ బ్రహ్మాండమే లింగము, శివలింగం బ్రహ్మాండానికి సంకేతం అంటాయి శివ, లింగ పురాణాలు. ఎప్పుడైన పిల్లలు శివలింగం అంటే ఏంటీ అని అడిగినప్పుడు ఈ విషయాన్ని నిర్భయంగా, గర్వంగా చెప్పండి.
ఈ లింగం ఆద్యంతాలు లేకుండా పెరగడం అంటే, ఈ బ్రహ్మాండం నిత్యం వ్యాపిస్తూ ఉంటుందనడానికి సంకేతం. బ్రహ్మ, విష్ణువులు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణం చేసినా, లింగం యొక్క ఆది, అంతాలను తెలుసుకోలేకపొవడం, ఈ బ్రహ్మాండాన్ని, విశ్వాన్ని దాటి వెళ్ళాలంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరములు పడుతుందని, అది సాధ్యం కాని విషయమని, ఈ బ్రహ్మాండం ఎంత మేర వ్యాపించి ఉన్నదో చెప్పడం కష్టమని తెలియజేయడమే. దీన్నే ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరించలేదా?
లింగపురాణం అంతరిక్షం గురించి, దాని వయసు గురించి ఏ విషయాలైతే స్పష్టం చేసిందో, సరిగ్గా అవే విషయాలను ఆధునిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
ఇవన్నీ మన ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందిన తరువాత చెప్తున్న విషయాలు కాదు, మన పురాణాలు ఏవైతే చెప్పాయి వాటినే చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు మనవన్నీ పుక్కిటి పురాణాలు అని వెక్కిరించిన పాశ్చ్యాతులే ఈ రోజు ఇవన్నీ సత్యాలని అంగీకరిస్తున్నారు, కొత్త కనుగొన్నామని చంకలు గుద్దుకుంటున్నారు. అంతే. కానీ మనం మాత్రం ఇవన్నీ పాతకాలపు మాటలని పక్కనపడేస్తున్నాం.
ఓం నమః శివాయ
Originally published : 27-Feb-2014 (Mahasiva ratri)
Republished 1st time: 17-Feb-2015 (MahaSiva ratri)
శివలింగం దేనికి సంకేతం? Published: 18-Nov-2012
http://ecoganesha.blogspot.in/2012/11/blog-post_18.html
త్రిమూర్తులకు భేధం లేదని చెప్పి మహాశివుడు అదృశ్యమవుతాడు. అప్పుడు ఆ శివలింగం అనంతమైన ఆ శూన్యంలో, జలంలో అండంగా మారుతుంది. ఆ అండం నుంచి సృష్టి జరగాలనీ చేయాలని బ్రహ్మ తపస్సు చేస్తాడు. ఈలోగా ఆ అండంలోనికి విష్ణువు ప్రవేశిస్తాడు. విష్ణువంటే ప్రాణశక్తి కనుక విష్ణువు ప్రవేశంతో సృష్టి మొదలవుతుంది. కర్దమ, దక్ష, మరీచి మొదలైన ప్రజాపతులను బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఆ తరువాత జను, పక్షి, క్రిమి, కిటక, రాక్షస, దేవ, మానవ మొదలైన సంతతి పెరిగిందని పురాణం చెప్తున్నది.పురాణం ఒట్టి కధ కాదు, అందులో చాలా విజ్ఞానం, నీతి, జీవన విధానం, ధర్మం ఇమిడి ఉంటాయి. ఈ శివరాత్రి కధలో అటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
శూన్యం తప్ప ఏమి లేదు అని పురాణం అంటుంది. అవును, ఈ విశ్వం శూన్యం నుంచి వచ్చి, తిరిగి శూన్యంలోనే లయమవుతుందని ఆధునిక సైసు ఒప్పుకుంది. ఒక శూన్యమంతా నీటితో నిండి ఉంది అన్నది పురాణం. అంతరిక్షంలో ఈ భూమిని ముంచెత్తగల స్థాయిలో నీరు ఉన్నదని, అది ఈ భూమికి చాలా దూరంగా ఉందని ఈ నాటి అంతరిక్ష శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు, అంగీకరిస్తున్నారు.
మనకు కనిపించే ఈ విశ్వమే కాదు, వందల కోట్ల విశ్వాలు భగవంతుని సృష్టిలో ఉన్నాయని భారతీయ గ్రంధాలు చెప్తున్నాయి. ఈ విశ్వమంటే ఒక బ్రహ్మాండం. మనకు అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని, వాటికి అనేక బ్రహ్మలు ఉన్నారని పురాణాల్లో కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలం నుంచి పైకి రావడం అంటే, అనంతమైన భగవత్ సృష్టిలో ఒక బ్రహ్మాండం యొక్క ఆవిర్భావం జరగడమని అర్దం. ఇటువంటి అనేక బ్రహ్మాండాలు, ప్రతి క్షణం ఉద్భవిస్తుంటాయి, నశిస్తుంటాయి. సముద్రపుఅలలపై వచ్చే నీటి బుడగలవలే అనేక బ్రహ్మాండాలు ప్రతిక్షణం విష్ణువులో ఐక్యం అవుతాయని, కొత్తవి వస్తుంటాయని మన వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని ఈ నాటి శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ గెలాక్సికి అవతల, భూమిని పోలిన అనేక గ్రహాలు ఉన్నాయని ఈ రోజు చెప్తున్నారు. బ్రహ్మ తన ఉనికిని గురించి తాను బయట శోధించి విఫలం కావడం, తరువాత తపస్సు ఒక సందేశం. విశ్వమంతా వెతికినా, మానవుడి ఉనికి యొక్క రహస్యం బాహ్యప్రపంచంలో దొరకదు, తన ఉనికిని గురించి తెలుసుకోవాలంటే అంతర్ముఖత చెందాలి, అంటే లోపలికి చూడాలి, తనలో ఉన్న ఆత్మను చూడాలి. అప్పుడే తన ఉనికి గురించి సమస్తము తెలుస్తుంది. ఒక రకంగా అష్టాంగయోగంగా అర్ధం చేసుకోవచ్చు.
ఇక శివుడు లింగరూపంలో రావడం అన్నది పెద్ద వైజ్ఞానికి సత్యం. దీన్ని ఆధునిక కాస్మాలజిస్ట్లు ఒప్పుకున్నారు.
ఈశా ఫౌండేషన్ స్థాఫుకులు జగ్గీవాసుదేవ్ గారు శివలింగం గురించి ఈ విధంగా చెప్పారు. 'శివలింగం ellipsoid అంటే 3-Dimensional ellipse ఆకారంలో ఉంటుంది. Modern cosmologistsలు galaxy ల మధ్యభాగాన్ని(core) ఫొటొ తీసినప్పుడు ప్రతి galaxy core కూడా ellipsoid ఆకారంలోనే ఉంది. నిరాకారమైన (unmanifest) శక్తి (energy) ఒక సాకార (manifest) రూపాన్ని సంతరించుకునే క్రమంలో, రూపాంతరం చెందే క్రమంలో, అది మొట్టమొదటగా ellipsoid అంటే లింగాకారాన్ని సంతరించుకుంటుంది అని పురాణం, ఆధునిక సైన్సు చెప్తున్నాయి'. ఈ బ్రహ్మాండమే లింగము, శివలింగం బ్రహ్మాండానికి సంకేతం అంటాయి శివ, లింగ పురాణాలు. ఎప్పుడైన పిల్లలు శివలింగం అంటే ఏంటీ అని అడిగినప్పుడు ఈ విషయాన్ని నిర్భయంగా, గర్వంగా చెప్పండి.
ఈ లింగం ఆద్యంతాలు లేకుండా పెరగడం అంటే, ఈ బ్రహ్మాండం నిత్యం వ్యాపిస్తూ ఉంటుందనడానికి సంకేతం. బ్రహ్మ, విష్ణువులు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణం చేసినా, లింగం యొక్క ఆది, అంతాలను తెలుసుకోలేకపొవడం, ఈ బ్రహ్మాండాన్ని, విశ్వాన్ని దాటి వెళ్ళాలంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరములు పడుతుందని, అది సాధ్యం కాని విషయమని, ఈ బ్రహ్మాండం ఎంత మేర వ్యాపించి ఉన్నదో చెప్పడం కష్టమని తెలియజేయడమే. దీన్నే ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరించలేదా?
లింగపురాణం అంతరిక్షం గురించి, దాని వయసు గురించి ఏ విషయాలైతే స్పష్టం చేసిందో, సరిగ్గా అవే విషయాలను ఆధునిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
ఇవన్నీ మన ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందిన తరువాత చెప్తున్న విషయాలు కాదు, మన పురాణాలు ఏవైతే చెప్పాయి వాటినే చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు మనవన్నీ పుక్కిటి పురాణాలు అని వెక్కిరించిన పాశ్చ్యాతులే ఈ రోజు ఇవన్నీ సత్యాలని అంగీకరిస్తున్నారు, కొత్త కనుగొన్నామని చంకలు గుద్దుకుంటున్నారు. అంతే. కానీ మనం మాత్రం ఇవన్నీ పాతకాలపు మాటలని పక్కనపడేస్తున్నాం.
ఓం నమః శివాయ
Originally published : 27-Feb-2014 (Mahasiva ratri)
Republished 1st time: 17-Feb-2015 (MahaSiva ratri)
శివలింగం దేనికి సంకేతం? Published: 18-Nov-2012
http://ecoganesha.blogspot.in/2012/11/blog-post_18.html
Monday, 16 February 2015
శివరాత్రి కధ - 3
కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. అహంకారమమకారాలు ఎంతటి పనినైనా చేయిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ, తన ఆధిపత్యం కోసం 'తాను లింగం యొక్క పైభాగాన్ని చూసినట్ట్లుగా దొంగసాక్ష్యం చెప్పమన్నాడు. అబద్ధం చెప్పడం పాపం అంటుంది మొగలి పువ్వు. తాను సృష్టికర్తననీ, తన ఆదేశాలనీ పాటించితీరవలసిందే అన్నాడు. చేసేది లేక అసత్యపు సాక్ష్యానికి కేతకీ పుష్పం ఒప్పుకుంది.
ఇంతలో కామధేనువు కనపడింది. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగగా, ఈ దివ్యజ్యోతిర్లింగాన్ని దర్శించి వస్తున్నా అని చెప్తుంది బ్రహ్మతో. నువ్వు దీనీ అగ్రభాగం చూశావా? అని అడుగగా, చూశాను అంటుంది. అయితే నువ్వు కూడా నా తరపున సాక్ష్యం చెప్పాలి అంటాడు.

తాము మొదటి నిశ్చయించుకున్న ప్రదేశానికి మొగలిపువ్వు, కామధేనువుతో చేరుకుంటాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ మాత్రం తాను, లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, తానే గొప్పవాడినని, కామధేనువు, మొగలిపువ్వులే సాక్ష్యాలని చెప్తాడు. ఎప్పుడు, ఎవరు ఏమి చెస్తున్నారో ఆ పరమాత్ముడికి తెలియదా?.
అప్పుడు ఆ లింగం నుంచి 'ఓం','ఓం','ఓం' అని ప్రణవం వినిపిస్తుంది. లింగం యొక్క దక్షిణభాగం నుంచి అకారం, ఉత్తరం నుంచి మకారం, దాని తరువాత నాదం వినిపిస్తున్నాయి. అదే ఓంకారం. వెంటనే ఆ దివ్యలింగం నుండి ఒక మహాశక్తి పుట్టింది. 10 చేతులతో, తెల్లని వర్ణంతో, 5 తలలతో, త్రిశూలం, ఢమరుకం ధరించిన ఒక దివ్యమైన, సుందరమైన ఆకారం ఏర్పడింది. ఆయనే పరమశివుడు. అబద్దం చెప్పిన బ్రహ్మ మీద పరమేశ్వరునికి కోపం కట్టలుతెంచుకుంది. ఆయన కోపం నుండి వీరభధ్రుడు పుట్టాడు. అసత్యాలు పలికితే ఎమవుతుందో, ఎలాంటి శిక్ష పడుతుందో ఇది తెలియజేస్తుంది. అబద్దం చెప్పిన బ్రహ్మ ఇదవ తలను నరికేశాడు వీరబధ్రుడు. బ్రహ్మనే హతమారుద్దాం అనుకున్నాడు, కానీ, బ్రహ్మ పశ్చాతాపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. ఆ భీఖర సన్నివేశం చూడలేక బ్రహ్మను కాపాడమని విష్ణువు కూడా శివుడిని వేడుకున్నాడు. బ్రహ్మను వదిలేశాడు వీరభధ్రుడు.
అబద్దం చెప్పిన మొగలిపువ్వు భయంతో వణికిపోతోంది. దాని వైపు చూసిన శివుడు, నీవు అసత్యం పలికినందుకుగానూ నువ్వు నా పూజకు పనిరావు, నీతో నేను పూజింపబడను అని శపించాడు. అందుకే మొగలిపువ్వు శివపూజకు పనికిరాదు. చేసిన తప్పు తెలుసుకుని భాధపడి ఈశ్వరుని వేడుకుంది మొగలిపువ్వు. చేసిన తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి నీవు నా పూజకు అర్హత కోల్పోయినా, నా పూజల కొరకు చేసే అలంకారాల్లో వాడబడతావు అన్నాడు.
శివుడు కామధేనువు వైపు చూస్తూ "కామధేనువు బ్రహ్మ అగ్రభాగం చూసినట్టూ నిలువుగా తన తల ఊపింది. కాని తోక మాత్రం అబద్దమని చెబుతు అడ్డంగా ఊపింది. అందువల్ల ఆవు తోక భాగం పూజనీయమవుతుంది. ఉదయం లేవగానే ఎవరు ఆవు తోక భాగం చూస్తారో, వారికి సకల శుభాలు కలుగుతాయి. అలా కాకుండా దాని మొహం చూస్తే దరిద్రం పడుతుంది" అని పలికాడు సదాశివుడు.
నిజాయతీగా నిజం ఒప్పుకున్న విష్ణువును చూసి, ఆనందపారవశ్యంతో నువ్వు సర్వలోకములయందు నాతో సమానంగా పూజింపబడతావు అంటూ వరం ఇచ్చాడు. ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. శివుడికి, విష్ణువుకు బేధం లేదు. వాళ్ళను ఇద్దరుగా వేరు చేసి చెప్పడం కూడా దోషం అవుతుందేమో. శివకేశవులు కలిసి ఆడిన మహానాటకం ఇది. అసత్యం పలికేవాళ్ళకు ఏ గతి పడుతుందో చెప్పడానికి, సత్యంగా, నిజాయతీగా బ్రతికేవాళ్ళకు సాక్షాత్తు భగవంతునికి సమాన స్థానం వస్తుందని తెలియపరచడానికి వారు ఆడిన దివ్య క్రీడ ఇది.
అటు తరువాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ లింగాన్ని పూజించారు.
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల బాసిత శోభిత లింగం
జన్మజ దుఖః వినాశక లింగం
తత్ప్రణమామి సదా శివలింగం
ఆఖరున శివుడు, బ్రహ్మ, విష్ణువులతో మనం ముగ్గురం ఒకే శక్తి యొక్క వేర్వేరు తత్వాలము. మన ముగ్గురికి ఎంత మాత్రమూ తేడా లేదు అని పలుకుతాడు.
ఈ మహాలింగం ఉద్భవించిన రోజే శివరాత్రి. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటారు. ఆ కాలంలోనే మహాశివుడు దివ్య లింగంగా ప్రకటితమయ్యాడు. అందుకే శివనామంతో శివరాత్రికి జాగరణ చేస్తూ, ఈ కధను గుర్తు చేసుకుంటూ, మనలో ఉన్న పరమశివుడిని జాగృతం చేస్తాం.
ఓం నమః శివాయ
ఇంతలో కామధేనువు కనపడింది. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగగా, ఈ దివ్యజ్యోతిర్లింగాన్ని దర్శించి వస్తున్నా అని చెప్తుంది బ్రహ్మతో. నువ్వు దీనీ అగ్రభాగం చూశావా? అని అడుగగా, చూశాను అంటుంది. అయితే నువ్వు కూడా నా తరపున సాక్ష్యం చెప్పాలి అంటాడు.

తాము మొదటి నిశ్చయించుకున్న ప్రదేశానికి మొగలిపువ్వు, కామధేనువుతో చేరుకుంటాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ మాత్రం తాను, లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, తానే గొప్పవాడినని, కామధేనువు, మొగలిపువ్వులే సాక్ష్యాలని చెప్తాడు. ఎప్పుడు, ఎవరు ఏమి చెస్తున్నారో ఆ పరమాత్ముడికి తెలియదా?.
అప్పుడు ఆ లింగం నుంచి 'ఓం','ఓం','ఓం' అని ప్రణవం వినిపిస్తుంది. లింగం యొక్క దక్షిణభాగం నుంచి అకారం, ఉత్తరం నుంచి మకారం, దాని తరువాత నాదం వినిపిస్తున్నాయి. అదే ఓంకారం. వెంటనే ఆ దివ్యలింగం నుండి ఒక మహాశక్తి పుట్టింది. 10 చేతులతో, తెల్లని వర్ణంతో, 5 తలలతో, త్రిశూలం, ఢమరుకం ధరించిన ఒక దివ్యమైన, సుందరమైన ఆకారం ఏర్పడింది. ఆయనే పరమశివుడు. అబద్దం చెప్పిన బ్రహ్మ మీద పరమేశ్వరునికి కోపం కట్టలుతెంచుకుంది. ఆయన కోపం నుండి వీరభధ్రుడు పుట్టాడు. అసత్యాలు పలికితే ఎమవుతుందో, ఎలాంటి శిక్ష పడుతుందో ఇది తెలియజేస్తుంది. అబద్దం చెప్పిన బ్రహ్మ ఇదవ తలను నరికేశాడు వీరబధ్రుడు. బ్రహ్మనే హతమారుద్దాం అనుకున్నాడు, కానీ, బ్రహ్మ పశ్చాతాపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. ఆ భీఖర సన్నివేశం చూడలేక బ్రహ్మను కాపాడమని విష్ణువు కూడా శివుడిని వేడుకున్నాడు. బ్రహ్మను వదిలేశాడు వీరభధ్రుడు.
అబద్దం చెప్పిన మొగలిపువ్వు భయంతో వణికిపోతోంది. దాని వైపు చూసిన శివుడు, నీవు అసత్యం పలికినందుకుగానూ నువ్వు నా పూజకు పనిరావు, నీతో నేను పూజింపబడను అని శపించాడు. అందుకే మొగలిపువ్వు శివపూజకు పనికిరాదు. చేసిన తప్పు తెలుసుకుని భాధపడి ఈశ్వరుని వేడుకుంది మొగలిపువ్వు. చేసిన తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి నీవు నా పూజకు అర్హత కోల్పోయినా, నా పూజల కొరకు చేసే అలంకారాల్లో వాడబడతావు అన్నాడు.
శివుడు కామధేనువు వైపు చూస్తూ "కామధేనువు బ్రహ్మ అగ్రభాగం చూసినట్టూ నిలువుగా తన తల ఊపింది. కాని తోక మాత్రం అబద్దమని చెబుతు అడ్డంగా ఊపింది. అందువల్ల ఆవు తోక భాగం పూజనీయమవుతుంది. ఉదయం లేవగానే ఎవరు ఆవు తోక భాగం చూస్తారో, వారికి సకల శుభాలు కలుగుతాయి. అలా కాకుండా దాని మొహం చూస్తే దరిద్రం పడుతుంది" అని పలికాడు సదాశివుడు.
నిజాయతీగా నిజం ఒప్పుకున్న విష్ణువును చూసి, ఆనందపారవశ్యంతో నువ్వు సర్వలోకములయందు నాతో సమానంగా పూజింపబడతావు అంటూ వరం ఇచ్చాడు. ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. శివుడికి, విష్ణువుకు బేధం లేదు. వాళ్ళను ఇద్దరుగా వేరు చేసి చెప్పడం కూడా దోషం అవుతుందేమో. శివకేశవులు కలిసి ఆడిన మహానాటకం ఇది. అసత్యం పలికేవాళ్ళకు ఏ గతి పడుతుందో చెప్పడానికి, సత్యంగా, నిజాయతీగా బ్రతికేవాళ్ళకు సాక్షాత్తు భగవంతునికి సమాన స్థానం వస్తుందని తెలియపరచడానికి వారు ఆడిన దివ్య క్రీడ ఇది.
అటు తరువాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ లింగాన్ని పూజించారు.
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల బాసిత శోభిత లింగం
జన్మజ దుఖః వినాశక లింగం
తత్ప్రణమామి సదా శివలింగం
ఆఖరున శివుడు, బ్రహ్మ, విష్ణువులతో మనం ముగ్గురం ఒకే శక్తి యొక్క వేర్వేరు తత్వాలము. మన ముగ్గురికి ఎంత మాత్రమూ తేడా లేదు అని పలుకుతాడు.
ఈ మహాలింగం ఉద్భవించిన రోజే శివరాత్రి. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటారు. ఆ కాలంలోనే మహాశివుడు దివ్య లింగంగా ప్రకటితమయ్యాడు. అందుకే శివనామంతో శివరాత్రికి జాగరణ చేస్తూ, ఈ కధను గుర్తు చేసుకుంటూ, మనలో ఉన్న పరమశివుడిని జాగృతం చేస్తాం.
ఓం నమః శివాయ
Sunday, 15 February 2015
శివరాత్రి కధ - 2
బ్రహ్మ విష్ణువుతో పోరాటం చేయడం అంతా విష్ణుమాయ. విష్ణుమాయ చేత కప్పబడ్డాడు కనుక బ్రహ్మకు ఏమి గుర్తు రావడం లేదు. ఇద్దరు యుద్ధంలో మునిగియున్న సమయంలో కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో, పెళపెళ శబ్దం చేసుకుంటూ విద్యుత్ స్థభం/మహాతేజో లింగం ఒకటి ప్రత్యక్షమైంది. దానికి ఆది, అంతాలు లేవు. అది అలా వేగంగా పెరుగుపోతూనే ఉంది. అది వ్యక్తావ్యక్తస్వరూపం. సమస్త విశ్వానికి మూలమైనది. విష్ణువు వేసిన మహేశ్వరాస్త్రమూ, బ్రహ్మ వేసిన పాశుపతాస్త్రమూ ఆ మహాకాంతి స్థంభంలో కలిసిపోయాయి.
ఆ లింగాన్ని చూసిన విష్ణువు మోహితుడయ్యాడు. బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ లింగం నుండి 'మీ ఇద్దరిలో ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతమును కానీ, ఎవరు తెలుకుని, ముందు ఈ ప్రదేశానికి చేరుకుంటారో వారే గొప్పవారు' అని మాటలు వినిపించగా, అప్పుడు విష్ణువు బ్రహ్మతో 'ఈ యుద్ధం ఇక్కడితో చాలిద్దాం. ఇప్పుడు మనమిద్దరం కాకుండా మూడవ శక్తి ఇక్కడ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మ! నువ్వు హంస రూపంలో ఈ లింగం యొక్క పై భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయ్యి, నేను వరాహ రూపంలో ఈ లింగం యొక్క క్రింది భాగాన్ని, ఆరంభ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను' అన్నాడు. ఇద్దరూ వారివారి నిర్దేశిత రూపాల్లో అన్వేషణ ప్రారంభించారు.
విష్ణువు కొన్ని కోట్ల సంవత్సరాల పాటు పయనించినా, ఆ లింగం యొక్క ప్రారంభ స్థానం కనుగినలేకపోయాడు. ఎంత క్రిందకు వెళ్ళినా, ఆ లింగం యొక్క మూలం ఇంకా దొరకడంలేదు. తనకు ఇది సాధ్య కాదని శ్రీ మన్నారాయణుడు, యుద్ధం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాడు.
బ్రహ్మదేవుడు ఎంతో కాలం పైకి ప్రయాణించినా, ఆ లింగం చివరి భాగం అంతుబట్టడం లేదు. అది ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఏం చేయాలో బ్రహ్మకు అర్ధం కావడంలేదు. తన అధిపత్యాన్ని నిరూపించుకోవాలని, విష్ణువుకంటే తనకే అధిక గౌరవం దక్కాలని బ్రహ్మ భావించాడు.
ఇంతలో పై నుంచి కేతకీ పుష్పం క్రిందకు వస్తోంది. ఆ పుష్పాన్ని ఆపి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు బ్రహ్మదేవుడు. నేను ఈ మహాలింగాన్ని అర్చించి క్రిందకు వస్తున్నా అంటుంది, అయితే నీకు దీని అగ్రభాగం తెలుసా? నువ్వు చూశావా? అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. చూశానండీ! కానీ ఈ లింగం పెరిగిపోతూనే ఉన్నది. నేను దీని అగ్రభాగాన్ని తాకి, కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి క్రిందకు పడుతూనే ఉన్నాను. ఈ లింగం చాలా పెద్దది. ఇది ఇప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటుంది. దీని అగ్రభాన్ని తెలుసుకోవడం అసాధ్యం అంటుంది కేతకీ పుష్పం.
To be continued............
ఆ లింగాన్ని చూసిన విష్ణువు మోహితుడయ్యాడు. బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ లింగం నుండి 'మీ ఇద్దరిలో ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతమును కానీ, ఎవరు తెలుకుని, ముందు ఈ ప్రదేశానికి చేరుకుంటారో వారే గొప్పవారు' అని మాటలు వినిపించగా, అప్పుడు విష్ణువు బ్రహ్మతో 'ఈ యుద్ధం ఇక్కడితో చాలిద్దాం. ఇప్పుడు మనమిద్దరం కాకుండా మూడవ శక్తి ఇక్కడ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మ! నువ్వు హంస రూపంలో ఈ లింగం యొక్క పై భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయ్యి, నేను వరాహ రూపంలో ఈ లింగం యొక్క క్రింది భాగాన్ని, ఆరంభ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను' అన్నాడు. ఇద్దరూ వారివారి నిర్దేశిత రూపాల్లో అన్వేషణ ప్రారంభించారు.
విష్ణువు కొన్ని కోట్ల సంవత్సరాల పాటు పయనించినా, ఆ లింగం యొక్క ప్రారంభ స్థానం కనుగినలేకపోయాడు. ఎంత క్రిందకు వెళ్ళినా, ఆ లింగం యొక్క మూలం ఇంకా దొరకడంలేదు. తనకు ఇది సాధ్య కాదని శ్రీ మన్నారాయణుడు, యుద్ధం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాడు.
బ్రహ్మదేవుడు ఎంతో కాలం పైకి ప్రయాణించినా, ఆ లింగం చివరి భాగం అంతుబట్టడం లేదు. అది ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఏం చేయాలో బ్రహ్మకు అర్ధం కావడంలేదు. తన అధిపత్యాన్ని నిరూపించుకోవాలని, విష్ణువుకంటే తనకే అధిక గౌరవం దక్కాలని బ్రహ్మ భావించాడు.
ఇంతలో పై నుంచి కేతకీ పుష్పం క్రిందకు వస్తోంది. ఆ పుష్పాన్ని ఆపి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు బ్రహ్మదేవుడు. నేను ఈ మహాలింగాన్ని అర్చించి క్రిందకు వస్తున్నా అంటుంది, అయితే నీకు దీని అగ్రభాగం తెలుసా? నువ్వు చూశావా? అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. చూశానండీ! కానీ ఈ లింగం పెరిగిపోతూనే ఉన్నది. నేను దీని అగ్రభాగాన్ని తాకి, కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి క్రిందకు పడుతూనే ఉన్నాను. ఈ లింగం చాలా పెద్దది. ఇది ఇప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటుంది. దీని అగ్రభాన్ని తెలుసుకోవడం అసాధ్యం అంటుంది కేతకీ పుష్పం.
To be continued............
శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
1.ఉపవాసం
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.
2. జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. కనుక శివరాత్రి రోజున పేదలకు ఆహారం ఇవ్వడం వంటివి చేయడం వలన శివుడి అనుగ్రహం త్వరితంగా లభిస్తుంది. శివుడి మీద పాక్యెట్ పాలు పోయనవసరంలేదు, నీళ్ళు పోసినా శివుడు సంతోషిస్తాడు. కాసిన్ని పాలు శివుడికి సమర్పించి, మిగితావి జీవుల యందున్న శివునికి సమర్పించండి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. వెన్ను నిటారుగా ఉండడమంటే చాలామంది వెన్నుపూస మీద భారం వేసి కూర్చుంటారు, అలా చేస్తే నడుమునొప్పి వస్తుంది. మీ శరీర బరువు చాతి భాగంలో పడేలా కూర్చోవాలంటారు స్వామి వివేకానంద. ఇది మాత్రమే నిటారుగా కూర్చోవడం అనే విషయంగా పరిగణైంచబడుతుంది, శ్రద్ధను పెంచుతుంది. ఒక్కరోజులో నిటారుగా కూర్చోవడం కష్టమవ్వచు. అసలు ఇలాంటి అలవటు నిత్య జీవితంలో చాలా మంది లేకపోవచ్చు. మరి ఏం చేయాలి? శివరాత్రికి కనీసం ఒక రెండు రోజుల ముందు నుంచి నేల మీద నిద్రించడం చేత వెన్ను రోజంతా సహకరిస్తుంది. నేల మీద అనగానే అచ్చంగా నేల మీద నిద్రించమని కాదు, చాప, లేక దుప్పటి, బొంత ...... పరుపు కాకుండా, ఏదో ఒకటి వేసుకుని శయనించడం వలన రోజంతా నిటారుగా కూర్చోవడానికి వెన్ను సహకరిస్తుంది.
3. మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. చాలామంది మౌనవ్రతమని చెప్పి, మాట్లాడకుండా రకరకాల సైగలు చేస్తారు, కొందరు మౌనంగా కూర్చుని టి.వి. చూస్తారు, ఇంకొందరు టైపు చేయడమే కదా, మాటలతో పనేంటీ అని చాటింగ్ చేస్తారు.ఇవేమీ మౌన వ్రతం అనిపించుకోవని అర్దం చేసుకోండి. మీరు మాట్లడటం ఆపేసినంత మాత్రం చేత, మనసుతో మట్లాడటం లేదా? సైగలతో మాట్లాడటం లేదా? వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.
ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.
4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
5.జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.
6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ చేయాలి. దేవాలయానికి వెళ్తే, అక్కడ రుద్రం చదువుతుంటారు. ఆ రుద్ర నమక-చమకాలు వింటూనో, ఇతర ప్రవచనాలు వింటూనో చేసే జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.
శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
1.ఉపవాసం
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.
2. జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. కనుక శివరాత్రి రోజున పేదలకు ఆహారం ఇవ్వడం వంటివి చేయడం వలన శివుడి అనుగ్రహం త్వరితంగా లభిస్తుంది. శివుడి మీద పాక్యెట్ పాలు పోయనవసరంలేదు, నీళ్ళు పోసినా శివుడు సంతోషిస్తాడు. కాసిన్ని పాలు శివుడికి సమర్పించి, మిగితావి జీవుల యందున్న శివునికి సమర్పించండి.
3. మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. చాలామంది మౌనవ్రతమని చెప్పి, మాట్లాడకుండా రకరకాల సైగలు చేస్తారు, కొందరు మౌనంగా కూర్చుని టి.వి. చూస్తారు, ఇంకొందరు టైపు చేయడమే కదా, మాటలతో పనేంటీ అని చాటింగ్ చేస్తారు.ఇవేమీ మౌన వ్రతం అనిపించుకోవని అర్దం చేసుకోండి. మీరు మాట్లడటం ఆపేసినంత మాత్రం చేత, మనసుతో మట్లాడటం లేదా? సైగలతో మాట్లాడటం లేదా? వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.
ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.
4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
5.జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.
6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ చేయాలి. దేవాలయానికి వెళ్తే, అక్కడ రుద్రం చదువుతుంటారు. ఆ రుద్ర నమక-చమకాలు వింటూనో, ఇతర ప్రవచనాలు వింటూనో చేసే జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.
శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.
Saturday, 14 February 2015
శివరాత్రి కధ - 1
శివరాత్రి యొక్క ప్రాశస్త్యం గురించి లింగ, శివ పురాణాల్లో చకట్టి కధ ఒకటి ఉంది. (సంక్షిప్తంగా)
ఒకానొక సృష్టి ఆరంభ సమయంలో విశ్వమంతా శూన్యంతో నిండి ఉంది. నిజానికి అసలు విశ్వమే లేదు. అంతటా పరబ్రహ్మం నిండి ఉంది. ఆ బ్రహ్మ పదార్ధానికి చలి, వేడిములు తెలియవు. ఆది, అంతములు లేవు. శూన్యమంతా నీటితో నిండి ఉన్న ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ నీటిపై యోగనిద్రలో ఉండగా, అతని బొడ్డు నుంచి ఒక పద్మం ఉద్భవించింది. అనేక రేకులు కలిగిన ఆ కలువ పుష్పానికున్న కాడ వేల సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. ఆ పద్మం యొక్క కణాల నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి చుట్టూ పద్మం తప్ప ఏమి కనిపించడంలేదు. దాంతో 'నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనేమి చేయాలి? నేను ఎవరి పుత్రుడిని? నన్నెవరు సృష్టించారు?" అంటూ ప్రశ్నలు వేసుకుంటూ, ఆ కలువపూవ్వు మొత్తం తన ఉనికిని గురించి తెలుసుకునేందుకు వెతకసాగాడు.
తన ఉనికి తెలుస్తుందేమోనని ఆ పద్మం యొక్క మధ్యభాగాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నించాడు. ఆఖరున ఆ పద్మం యొక్క కాడ ద్వారా క్రిందకు దిగి, ఆ పద్మం చుట్టు తిరుగుతూ ఒక 100 ఏళ్ళు గడిపాడు. కానీ దానికి యొక్క మధ్యభాగం కనబడలేదు. తన ఏ కణం నుంచైతే పుట్టాడొ, ఆ కణం దగ్గరకే వెళితే తన ఉనికి తెలుసుకోవచ్చునని, ఆ ప్రదేశాన్ని వెతకడంలో మరో వంద ఏళ్ళు తిరిగినా, సమాధానం దొరకక అలసిపోయాడు, విశ్రాంతి తిసుకుంటున్నాడు.
ఇంతలో ఓ బ్రహ్మ! తపస్సు ఆచరించు అన్న మాటలు వినపడగా ఒక 12 ఏళ్ళు తపస్సు చేయగా, శ్రీ మహా విష్ణువు నాలుగు భుజములతో, శంఖు, చక్ర, గదా, పద్మాలను ధరించి దర్శనమిచ్చాడు. బ్రహ్మను మాయ కప్పేసింది. బ్రహ్మ విష్ణువును నువ్వెవరు? అని అడుగుతాడు. శ్రీ మన్నారాయణుడు 'ఓ పుత్రా! నిన్ను శ్రీ మహావిష్ణువు సృష్టించాడు' అంటూ పరోక్షంగా తన ఎవరో చెప్తాడు.
విష్ణువుతో 'నన్ను నీ పుత్రుడంటున్నావు? ఈ సమస్త జగత్తుకు నేనే విధాతనూ అంటూ వాదించాడు బ్రహ్మ.
నన్ను నీ పుత్రుడు అనడానికి నీకేం అధికారం ఉంది? అంటూ ప్రశ్నించగా, నన్ను గుర్తించలేదా, నేను నీ తండ్రిని, శ్రీ మహా విష్ణువును అంటూ శ్రీ మన్నారాయణుడు జవాబిస్తాడు. అది అంగీకరించని బ్రహ్మ విష్ణువుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త, అస్త్ర శస్త్రాలు ప్రయోగించుకునే వరకు చేరింది.
To be continued............
ఒకానొక సృష్టి ఆరంభ సమయంలో విశ్వమంతా శూన్యంతో నిండి ఉంది. నిజానికి అసలు విశ్వమే లేదు. అంతటా పరబ్రహ్మం నిండి ఉంది. ఆ బ్రహ్మ పదార్ధానికి చలి, వేడిములు తెలియవు. ఆది, అంతములు లేవు. శూన్యమంతా నీటితో నిండి ఉన్న ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ నీటిపై యోగనిద్రలో ఉండగా, అతని బొడ్డు నుంచి ఒక పద్మం ఉద్భవించింది. అనేక రేకులు కలిగిన ఆ కలువ పుష్పానికున్న కాడ వేల సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. ఆ పద్మం యొక్క కణాల నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి చుట్టూ పద్మం తప్ప ఏమి కనిపించడంలేదు. దాంతో 'నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనేమి చేయాలి? నేను ఎవరి పుత్రుడిని? నన్నెవరు సృష్టించారు?" అంటూ ప్రశ్నలు వేసుకుంటూ, ఆ కలువపూవ్వు మొత్తం తన ఉనికిని గురించి తెలుసుకునేందుకు వెతకసాగాడు.
తన ఉనికి తెలుస్తుందేమోనని ఆ పద్మం యొక్క మధ్యభాగాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నించాడు. ఆఖరున ఆ పద్మం యొక్క కాడ ద్వారా క్రిందకు దిగి, ఆ పద్మం చుట్టు తిరుగుతూ ఒక 100 ఏళ్ళు గడిపాడు. కానీ దానికి యొక్క మధ్యభాగం కనబడలేదు. తన ఏ కణం నుంచైతే పుట్టాడొ, ఆ కణం దగ్గరకే వెళితే తన ఉనికి తెలుసుకోవచ్చునని, ఆ ప్రదేశాన్ని వెతకడంలో మరో వంద ఏళ్ళు తిరిగినా, సమాధానం దొరకక అలసిపోయాడు, విశ్రాంతి తిసుకుంటున్నాడు.
ఇంతలో ఓ బ్రహ్మ! తపస్సు ఆచరించు అన్న మాటలు వినపడగా ఒక 12 ఏళ్ళు తపస్సు చేయగా, శ్రీ మహా విష్ణువు నాలుగు భుజములతో, శంఖు, చక్ర, గదా, పద్మాలను ధరించి దర్శనమిచ్చాడు. బ్రహ్మను మాయ కప్పేసింది. బ్రహ్మ విష్ణువును నువ్వెవరు? అని అడుగుతాడు. శ్రీ మన్నారాయణుడు 'ఓ పుత్రా! నిన్ను శ్రీ మహావిష్ణువు సృష్టించాడు' అంటూ పరోక్షంగా తన ఎవరో చెప్తాడు.
విష్ణువుతో 'నన్ను నీ పుత్రుడంటున్నావు? ఈ సమస్త జగత్తుకు నేనే విధాతనూ అంటూ వాదించాడు బ్రహ్మ.
నన్ను నీ పుత్రుడు అనడానికి నీకేం అధికారం ఉంది? అంటూ ప్రశ్నించగా, నన్ను గుర్తించలేదా, నేను నీ తండ్రిని, శ్రీ మహా విష్ణువును అంటూ శ్రీ మన్నారాయణుడు జవాబిస్తాడు. అది అంగీకరించని బ్రహ్మ విష్ణువుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త, అస్త్ర శస్త్రాలు ప్రయోగించుకునే వరకు చేరింది.
To be continued............
Subscribe to:
Posts (Atom)

