ఓం
(1)
గంగేచ యమునెచైవ గోదావరి సరస్వతి.......అంటూ పూజ ప్రారంభంలో గంగా,యమున,గోదావరి,సరస్వతి,నర్మద,సింధు,కావేరి నదులను కలశంలోనికి ఆవాహన చేస్తాం.గంగకు చాలా పవిత్రమైనది. మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది. గంగా అంటే ఏమిటని అడగాలన్న, గంగావతరణం కధ వినాలన్నా, గంగావతరణం చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగాలో మునక వేయాలన్నా, గంగను త్రాగాలన్నా ఈ 6 పనులు చేయాలన్నా, శివానుగ్రహం ఉంటే తప్ప అది జరుగదు. ఎందుకంటే గంగావతరణం తెలుసుకున్నంత మాత్రం చేతనే కొన్ని వందల జన్మల సంచిత పాపం భస్మం అయిపోతుంది. అంత పరమ పవిత్రమైనది గంగ. సాంబశివుడి అనుగ్రహంతో ఈ పవిత్ర కుంభమేళ సమయంలో గంగ గురించి, గంగా ఎలా అవతరించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీ రామాయణంలో బాలకాండలో శ్రీ రాముడు తాటక సంహారం చేశాక విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు శొణా నది తీరం వెంబడి వెళ్తుండగా రాముడు గంగా ఎలా అవతరించిందో చెప్పమని మహర్షిని వేడుకున్నాడు. రాముడికి విశ్వమిత్ర మహర్షి గంగ ఎలా అవతరించిందో సంక్షిప్తంగా చెప్పినా, రాముడు సంతృప్తి చెందక మళ్ళీమళ్ళీ అడిగాడు. తనకు గంగావతరణ ఘట్టం సవివరంగా చెప్పమని ప్రార్ధించాడు శ్రీ రామచంద్రుడు. గంగా ఎలా అవతరించింది, గంగకు "త్రిపధగ" అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమని విశ్వామిత్రుడి పాదాలు పట్టుకుని వేడుకోగా, రాముడి ఆతృతకు, తెలుసుకోవాలన్నా తపనకు చలించిపోయిన విశ్వామిత్ర మహర్షి గంగావతరణం గురించి చెప్పారు.
విశ్వమిత్ర మహర్షి దానిని రెండు భాగాలుగా రామాయణంలోని రెండు ప్రక్కప్రక్క సర్గలలో చెప్పారు. మొదటి భాగంలో స్కందోద్పత్తి(సుబ్రహ్మణ్య స్వామి జననం)లో కొంచం చెప్పారు.
హిమవంతుడు(హిమాలయ పర్వతరాజు)కు మేరువు అనే పర్వతం యొక్క కూమార్తే అయిన 'మనోరమ ' భార్య. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూమార్తె గంగా, రెండవ కూమార్తె ఉమ(పార్వతి). ఉమ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సుచేసి ఆయన్ను వివాహం చేసుకుంది. దేవతకార్యముల కొరకు మాకు మీ పెద్ద కూతురు గంగా కావాలి అని దేవతలు అడుగగా, హిమవంతుడు అంగీకరించి పెద్ద కూమార్తె గంగను దేవతలతో దేవలోకానికి పంపించాడు. దేవతలే గంగను దేవలోకానికి తీసుకుని వేళ్ళారు. అందువల్ల దేవలోకంలో ప్రవహిస్తూండేది గంగ. ఆ సమయానికి భూమి మీద కాని, రసాతలంలో కాని గంగా ప్రవహించేది కాదు. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
to be continued................
(1)
గంగేచ యమునెచైవ గోదావరి సరస్వతి.......అంటూ పూజ ప్రారంభంలో గంగా,యమున,గోదావరి,సరస్వతి,నర్మద,సింధు,కావేరి నదులను కలశంలోనికి ఆవాహన చేస్తాం.గంగకు చాలా పవిత్రమైనది. మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది. గంగా అంటే ఏమిటని అడగాలన్న, గంగావతరణం కధ వినాలన్నా, గంగావతరణం చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగాలో మునక వేయాలన్నా, గంగను త్రాగాలన్నా ఈ 6 పనులు చేయాలన్నా, శివానుగ్రహం ఉంటే తప్ప అది జరుగదు. ఎందుకంటే గంగావతరణం తెలుసుకున్నంత మాత్రం చేతనే కొన్ని వందల జన్మల సంచిత పాపం భస్మం అయిపోతుంది. అంత పరమ పవిత్రమైనది గంగ. సాంబశివుడి అనుగ్రహంతో ఈ పవిత్ర కుంభమేళ సమయంలో గంగ గురించి, గంగా ఎలా అవతరించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీ రామాయణంలో బాలకాండలో శ్రీ రాముడు తాటక సంహారం చేశాక విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు శొణా నది తీరం వెంబడి వెళ్తుండగా రాముడు గంగా ఎలా అవతరించిందో చెప్పమని మహర్షిని వేడుకున్నాడు. రాముడికి విశ్వమిత్ర మహర్షి గంగ ఎలా అవతరించిందో సంక్షిప్తంగా చెప్పినా, రాముడు సంతృప్తి చెందక మళ్ళీమళ్ళీ అడిగాడు. తనకు గంగావతరణ ఘట్టం సవివరంగా చెప్పమని ప్రార్ధించాడు శ్రీ రామచంద్రుడు. గంగా ఎలా అవతరించింది, గంగకు "త్రిపధగ" అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమని విశ్వామిత్రుడి పాదాలు పట్టుకుని వేడుకోగా, రాముడి ఆతృతకు, తెలుసుకోవాలన్నా తపనకు చలించిపోయిన విశ్వామిత్ర మహర్షి గంగావతరణం గురించి చెప్పారు.విశ్వమిత్ర మహర్షి దానిని రెండు భాగాలుగా రామాయణంలోని రెండు ప్రక్కప్రక్క సర్గలలో చెప్పారు. మొదటి భాగంలో స్కందోద్పత్తి(సుబ్రహ్మణ్య స్వామి జననం)లో కొంచం చెప్పారు.
హిమవంతుడు(హిమాలయ పర్వతరాజు)కు మేరువు అనే పర్వతం యొక్క కూమార్తే అయిన 'మనోరమ ' భార్య. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూమార్తె గంగా, రెండవ కూమార్తె ఉమ(పార్వతి). ఉమ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సుచేసి ఆయన్ను వివాహం చేసుకుంది. దేవతకార్యముల కొరకు మాకు మీ పెద్ద కూతురు గంగా కావాలి అని దేవతలు అడుగగా, హిమవంతుడు అంగీకరించి పెద్ద కూమార్తె గంగను దేవతలతో దేవలోకానికి పంపించాడు. దేవతలే గంగను దేవలోకానికి తీసుకుని వేళ్ళారు. అందువల్ల దేవలోకంలో ప్రవహిస్తూండేది గంగ. ఆ సమయానికి భూమి మీద కాని, రసాతలంలో కాని గంగా ప్రవహించేది కాదు. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
to be continued................





