Wednesday, 16 January 2013

గంగావతరణం(1)

ఓం
(1)
గంగేచ యమునెచైవ గోదావరి సరస్వతి.......అంటూ పూజ ప్రారంభంలో గంగా,యమున,గోదావరి,సరస్వతి,నర్మద,సింధు,కావేరి నదులను కలశంలోనికి ఆవాహన చేస్తాం.గంగకు చాలా పవిత్రమైనది. మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది. గంగా అంటే ఏమిటని అడగాలన్న, గంగావతరణం కధ వినాలన్నా, గంగావతరణం చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగాలో మునక వేయాలన్నా, గంగను త్రాగాలన్నా ఈ 6 పనులు చేయాలన్నా, శివానుగ్రహం ఉంటే తప్ప అది జరుగదు. ఎందుకంటే గంగావతరణం తెలుసుకున్నంత మాత్రం చేతనే కొన్ని వందల జన్మల సంచిత పాపం భస్మం అయిపోతుంది. అంత పరమ పవిత్రమైనది గంగ. సాంబశివుడి అనుగ్రహంతో ఈ పవిత్ర కుంభమేళ సమయంలో గంగ గురించి, గంగా ఎలా అవతరించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీ రామాయణంలో బాలకాండలో శ్రీ రాముడు తాటక సంహారం చేశాక విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు శొణా నది తీరం వెంబడి వెళ్తుండగా రాముడు గంగా ఎలా అవతరించిందో చెప్పమని మహర్షిని వేడుకున్నాడు. రాముడికి విశ్వమిత్ర మహర్షి గంగ ఎలా అవతరించిందో సంక్షిప్తంగా చెప్పినా, రాముడు సంతృప్తి చెందక మళ్ళీమళ్ళీ అడిగాడు. తనకు గంగావతరణ ఘట్టం సవివరంగా చెప్పమని ప్రార్ధించాడు శ్రీ రామచంద్రుడు. గంగా ఎలా అవతరించింది, గంగకు "త్రిపధగ" అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమని విశ్వామిత్రుడి పాదాలు పట్టుకుని వేడుకోగా, రాముడి ఆతృతకు, తెలుసుకోవాలన్నా తపనకు చలించిపోయిన విశ్వామిత్ర మహర్షి గంగావతరణం గురించి చెప్పారు.

విశ్వమిత్ర మహర్షి దానిని రెండు భాగాలుగా రామాయణంలోని రెండు ప్రక్కప్రక్క సర్గలలో చెప్పారు. మొదటి భాగంలో స్కందోద్పత్తి(సుబ్రహ్మణ్య స్వామి జననం)లో కొంచం చెప్పారు.
హిమవంతుడు(హిమాలయ పర్వతరాజు)కు మేరువు అనే పర్వతం యొక్క కూమార్తే అయిన 'మనోరమ ' భార్య. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూమార్తె గంగా, రెండవ కూమార్తె ఉమ(పార్వతి). ఉమ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సుచేసి ఆయన్ను వివాహం చేసుకుంది. దేవతకార్యముల కొరకు మాకు మీ పెద్ద కూతురు గంగా కావాలి అని దేవతలు అడుగగా, హిమవంతుడు అంగీకరించి పెద్ద కూమార్తె గంగను దేవతలతో దేవలోకానికి పంపించాడు. దేవతలే గంగను దేవలోకానికి తీసుకుని వేళ్ళారు. అందువల్ల దేవలోకంలో ప్రవహిస్తూండేది గంగ. ఆ సమయానికి భూమి మీద కాని, రసాతలంలో కాని గంగా ప్రవహించేది కాదు. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
       
to be continued................

Tuesday, 15 January 2013

కుంభమేళ

ఓం
జై గంగా మాతా

సనాతన ధర్మం(హిందూ ధర్మం), భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధన విశిష్టవంతమైన అంశం. అందులో భాగంగా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమం, త్రివేణీ సంగమంగా పిలువబడే ప్రయాగ(అల్లహాబాదు)లో కుంభమేళ జరుగుతున్నది.కుంభమేళకున్న పురాణ ప్రాశస్త్యం ఏమిటి?

(క్లుప్తంగా వివరిస్తున్నా)పూరాణాల ప్రకారం పూర్వం దేవతలు, దానవులు అమృతం కోసం మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలసముద్రాన్ని చిలికారు. శ్రీ కూర్మ రూపం(తాబేలు)లో శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని తన వీపు పై మొయగా, వాసూకిని తాడుగా చేసి, దాని తలను రాక్షసులు, తోకను దేవతలు పట్టుకుని చిలుకగా, అందులో నుండి ఐరావతం, ఉచ్చైశ్రవం(గుర్రం),జ్యేష్ఠా దేవి, లక్ష్మీ దేవి, హాలహలం మొదలైనవి ఉద్భవించిన తరువాత అమృతం బయటకు వచ్చింది. అమృతం కోసం దేవదానవులు కొట్టుకోసాగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి, రాక్షసులను దారి మళ్ళించి అమృతబాంఢాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు. అది గమనించిన రాక్షసులు గరుత్మంతుడు మీద యుద్ధం చేయడం, ఆ సమయంలో ఆ అమృత కలశంలో నుంచి నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాల్లో పడడం జరిగింది. ఒక్కొక్క బిందువు 12 సంవత్సరాల తేడాతో అల్లహాబాదు(ఉత్తర ప్రదేశ్), నాసిక్(మహారాష్ట్ర), హరిద్వార్( ఉత్తర ప్రదేశ్), ఉజ్జైని(మధ్య ప్రదేశ్)లో పాడడం వలన ప్రతి 12 ఏళ్ళకు ఒకమారు ఈ ప్రదేశాల్లో ఉన్న నదుల్లో కుంభమేళ ఉత్సవం నిర్వహిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం కూడా కుంభమేళ గురించి ప్రస్తావించింది.గురువు మేష రాశిలోనికి, సూర్య చంద్రులు మకర రాశిలోనికి ప్రవేశించిన సమయంలో ప్రయాగలో కుంభమేళ నిర్వహిస్తారు.

జై గంగా మాతా
ఓం శాంతిః శాంతిః శాంతిః                  

Sunday, 13 January 2013

పతంగులు

సంక్రాంతి పండుగలో పతంగులు ఎగురవేయడం కనిపిస్తుంది. వీటిని ఎగురవేయడంలో ఆంతర్యం ఏమిటి?

సంక్రాంతితో దక్షిణాయనం ముగుసి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారభంవుతుంది. ఖగోళ శాస్త్ర రీత్యా ఉత్తరాయణంలో సూర్యుడు భూమికి దగ్గరగా జరుగుతాడు. ఆకురాలిన వృక్షాలు తిరిగి చిగురిస్తాయి. సూర్యరశ్మి భూమికి బాగా అందుతుంది. సూర్య్డు భూమికి దగ్గరగా వస్తున్నాడు, ఇక మన జీవితం రంగులమయం అవుతుందని తెలియజేయడానికి చిహ్నంగా రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. మకర సంక్రమణంతో మకర రాశిలోనికి ప్రవేసించే సూర్యభగవానుడి దర్శించే ప్రక్రియ అని కొందరు చెబుతారు.

గాలిపటాలకు వాడే మాంజాలు(దారాలు) గాజుపోడితో తయారుచేస్తారు. అవి పావురాలు, పిచ్చుకలు మొదలైన అనేక రకాల పక్షులకు ప్రాణంతకంగా మారుతాయి. పావురాలు, పిచ్చుకల శరీరాలు అతి సునీతంగా ఉంటాయి. ఈ పదునైన దారం వాటి శరీరాలకు తగలగానే, శరీరభాగాలు తెగిపోయి అవి మరణిస్తాయి. పండుగ పూట హింస చేయడం ఎందుకు? పాపాన్ని మూట కట్టుకోవడం ఎందుకు? అందుకే పదునుగా ఉండే దారాలను వాడకండి.

పతంగుక్లు ఎగురవేసేవారు జాగ్రత్తలు పాటించండి. పిట్టగోడలు చాలా జాగ్రత్తగా ఉండండి. పతంగుల కోసం రోడ్ల మీద పరుగెత్తడం, రోడ్ల మీద పతంగులు ఎగురవేయడం చేసి రోడున్న పోయే వాహానాల వలన ప్రమాదాలకు గురికాకండి.

సంప్రదాయాలను పాటించండి. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడండి.

సంక్రాంతి పండుగు శుభాకాంక్షలు.              

Friday, 11 January 2013

వివేకానంద

ఓం
1000 సంవత్సరాల విదేశీ ఆక్రమణలు, క్రైస్తవ మిషనరీల మతమార్పుడులు,భారతదేశం మీద బ్రిటిష్ ఆక్రమణ, మరొక ప్రక్కన మన హిందూ ధర్మంలో గొప్పతనమేముంది అనుకునే సమయంలో, అంధకారంలో మగ్గుతున్న హిందూ జాతిలో చైతన్యం నింపడానికి జనవరి 12 1863 న భారతదేశంలో ఉధ్భవించిన సూర్యుడు స్వామి వివేకానందుడు. 

ప్రజలలో చైతన్యం, దేశభక్తి నింపి గాంధీ వంటి అనేక దేశభక్తులకు స్పూర్తినిచ్చిన భరతమాత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద. 

3000 సంవత్సరాలకు పైగా భారతదేశానికే పరిమితమైన హిందూ ధర్మాన్ని సమస్త ప్రపంచానికి తెలియపరిచారు స్వామి.మన దేశంలో అధ్యాత్మిక సంపదకు లోటు లేదు, అదే విధంగా అనేకమంది పేదలు ఆకలి కేకలకు కూడా లోటు లేదు. మన దగ్గరున్న జ్ఞాన సంపదను విదేశీయులకు అందించి వారి దగ్గరున్న డబ్బుతో పేద భారతీయుల కడుపు నింపాలన్నది వివేకానందుని ఆశయం. అందుకోసం ఆయన అనేక ఇబ్బందులను ఓర్చి, తన మిత్రులు, శిష్యుల చందా డబ్బులతో చికాగోలో జరుగుతున్న ప్రపంచ సర్వమత మహా సభలకు హిందూ ప్రతినిధిగా హజరయ్యారు.

అప్పటివరకు మతం అంటే రక్తపాతం, ఇతర మతాలను తొక్కిపెట్టి పైకిరావడం, పరదేశీయులను పీడించడం అని భావించింది ప్రపంచం. మా మతమే గొప్పది, మిగితావని అబద్దాలు. మిగితా దేవుళ్ళు సైతాన్ లంటూ ప్రచారం చేయడమే మతం అనుకునేవారు. సర్వమతమహాసభలలో కూడా అన్ని మతాలవారు తమ ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నించారు. కాని హిందూ ధర్మ ప్రతినిధిగా వెళ్ళి అక్కడా వివేకానందుడు చేసిన ప్రసంగం చారిత్రాత్మికం. ఈనాటికి అది విన్నా, చదివినా హిందువుల హృదయంలొ తెలియని దైర్యం, ఆనందం కలుగుతాయి. ఆ సర్వమత మహాసభలలో చివరివక్తగా స్వామి వివేకానందా అవకాశం తీసుకున్నారు. మొట్టమొదట ఆయన తన ప్రసంగంలో "Sisters and Brothers of America" అనగానే అప్పటివరకు ఎంతో దీనంగా కూర్చున్న 7000 మంది సభికులు తమకేదో ఆయన ఒక క్రొత్త విషయం చెప్పినట్టుగా ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టారు. 3 నిమిషాలపాటు చపట్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. అది తరువాత ఎంతో ధీరంగ్, గంభీరంగా సాగిన వివేకానందా ప్రసంగం విన్న ప్రజలు తమనితాము మర్చిపోయారు. ఆయనతో కరచాలనం చేయడానికి స్ర్తీలు అక్కడున్న బెంచీలు దూకడం మొదలుబెట్టారు. మరొక వింత, ఆయన ప్రసంగం విన్న తరువాత అక్కడకు వచ్చిన Judaism మాతానికి సంబంధించిన jew మతగురువు,స్వామి ప్రసంగం విన్నాక తాను తోలిసారి తన Judaism మతం కూడా సత్యమే అని తెలుసుకున్నాని పలికాడు. అటు తరువాత జనం రోజు స్వామి ఇచ్చే పావుగంట ప్రసంగాల కోసం ఆ సభకు వచ్చి గంటల సమయం వేచి ఉండేవారు. ఆ తరువాత ఆయన ప్రపంచమంతా యాత్రలు చేసి సనాతన ధర్మాన్ని(హిందూ ధర్మాన్ని) విశ్వావ్యాపితం చేశారు. ఈ రోజు మన హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అందుకు కారణం స్వామి వివేకానందుడే.

say it with pride: we are hindus. హిందువునని ప్రపంచానికి గర్వంగా చాటి చెప్పండి అని వివేకానందా ఆనాడే హిందువులకు పిలుపునిచ్చారు. అటువంటి మహోన్నత జ్ఞానజ్యోతి స్వామి వివేకనందుడి 150వ జయంతి 12 జనవరి 2013.


Wednesday, 9 January 2013

"మనలో మార్పు రావాలి".


"మనలో మార్పు రావాలి". 
మొత్తానికి ఆయనగారు అరెస్ట్ అయ్యారు.హై కోర్టు మొట్టికాయలు కూడా మొట్టింది. కొద్ది రోజుల క్రితం అతను హిందూవులు,వారి దేవిదేవతల పట్ల చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. అవేమి మనకు కొత్తకాదు.గతంలో హైద్రాబాదులో హనూమాన్ జయంతిని నిషేధించాలని మన రాష్ట్ర అసేంబ్లీలో అన్నాడు. అప్పుడైతే మరీ దరిద్రం. ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా ఖండించలేదు. అదేమంటే అప్పుడు ఉప ఎన్నికల హడావుడి కదా, ఖండిస్తే వారి ఓట్లు కోల్పోతామన్నారు. అంతకముందు శ్రీరాముడి గురించి ,కౌసల్య దేవి గురించి కూడా ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అసలు 80% హిందూ ప్రజానీకం ఉన్న హిందూ దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం మనలో ఐక్యత లేకపోవడం.మనం కులం, భాష, ప్రాంతం పేరున విడిపోయాం. అసలు మనకు మనమంతా ఒక్కటే అన్న భావన ఉంటే కదా. కొందరు శైవం అంటారు, మరికొందరు శ్రీ వైష్ణవం అంటారు, ఇంకొందరు ఇంకేదో అంటారు. ఉన్న దేవుడు ఒక్కడే అని అందరికి తెలుసు. మనమంతా హిందువులమని తెలుసు. కానీ మనమంతా ఒక్కటని చస్తే ఒప్పుకోము. ఇదే కాదు మనలో మనము రాజకీయ పార్టీల పేరున విడిపోయాము. ఎప్పుడొ 5 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి ఎన్నికలు. అప్పుడు మాత్రమే కనిపిస్తారు మన "మేతలు". ఎప్పుడో కనిపించేవారి కోసం మనం రోజు వాదులాడుకుంటాం. ఈ విధంగా మనం ముక్కలు, చెక్కలుగా విడిపొయాం కనుకే "వాళ్ళు" మన మీద అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. కులాలను, ప్రాంతాలను, భాషలను, రాజకీయాలను ప్రక్కన పెట్టి మనకోసం, మన సనాతన హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే మనమంతా ఏకం కావాలి. మనం రాజకీయ పార్టీల గురించి తగాదాలు పడడం కాదు.మనమంతా ఏకమైతే మన ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కొట్టుకునే రోజు వస్తుంది. "వాళ్ళంతా" ఐక్యంగా ఉన్నారు కాబట్టే ఈరోజు అన్ని రాజకీయ పార్టిలు మేము "మీకు న్యాయం చేస్తాం"అని వాళ్ళతో అంటున్నాయి. మనకు ఆ రోజు రావాలి. కనీసం ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలిపెడదాం. కళ్ళు తెరుద్దాం. మన మధ్య ఉన్న కుల, రాజకీయ, భాష గోడలు కూల్చేద్దాం. ఎంత భిన్నత్వం ఉన్నా మనమంతా హిందువులమని ప్రపంచానికి చాటుదాం. హిందువులం ఐక్యం అవుదాం. కలిసి నడుద్దాం.మన అస్తిత్వాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం.
జై హింద్                  

Monday, 7 January 2013

సుబోధ

ఓం
సుబోధ
మాస్టర్ మహాశయ్ సందేహాన్ని తీరుస్తూ శ్రీ రామకృష్ణ పరమహంస,"అనురాగం ఏర్పడినప్పుడు భగవల్లాభం సిద్ధిస్తుంది.  తీవ్ర వ్యాకులత కలిగినట్లయితే, మనస్సంతా భగవంతుని మీదే లగ్నమవుతుంది. అప్పుడు భగవంతుడు తప్పక పలుకుతాడు.మనకు దర్శనమిస్తాడు" అని అన్నారు.
 
"జటిలుడనే చిన్న పిల్లవాడి కధ ఒకటి ఉంది.అతడు పాఠశాలకు కొంతదూరం అడవిమార్గం గుండా వెళ్ళవలసి వచ్చేడి. అలా వెళుతున్నప్పుడు అతడికి భయం వేసేది. అతడు తన భయం గురించి తల్లికి చెప్పాడు. అందుకు ఆమె, 'నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మధుసూదనుణ్ణి(శ్రీ మహా విష్ణువు)ను పిలువూ అన్నది. అందుకు ఆ పిల్లవాడు, 'అమ్మా! ఆ మధూసుదనుడెవరు? అని అడిగాడు.'అతడు నీ అన్న ' అని తల్లి బదులు చెప్పింది.

మరునాడు అడవిమార్గంలో వెళుతుండగా జటిలుడికి భయం వేసింది. అప్పుడి వెంటనే'అన్నా! మధూసుధనా!నువ్వెక్కడ ఉన్నావు? ఇక్కడకు రా! నాకు భయం వేస్తొంది 'అని పిలువసాగాడు.ఆర్తితో జటిలుడు పిల్చిన పిలుపుకు మధూసుదనుడు రాకూండా ఉండలేకపోయాడు. 'ఇదుగో!నే నిక్కడ ఉన్నాను తమ్ముడూ! నీకు భయమెందుకు?' అంటూ మాట్లాడుతూ వెళ్ళి పాఠశాల వద్ద వదిలిపెట్టాడు. 'తమ్ముడూ! నువ్వు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాను. భయపడవద్దు ' అని దైర్యం చెప్పి మధూసుదనుడు వెళ్ళిపోయాడు.

విశ్వాసం వ్యాకులత ఉంటే తప్పక భగవంతుడు అనుగ్రహిస్తాడు.
సేకరణ ('శ్రీరామకృష్ణ కధామృతం ' నుండి)-శ్రీ రామకృష్ణప్రభ,ఆధ్యాత్మిక మాసపత్రిక
   

Sunday, 6 January 2013

మన దేవాలయాలు-6

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-6
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)


ఆలయ ప్రవేశంలో గోపురం దాటగానే,మనకు కనిపించేది ధ్వజస్థంభం.ధ్వజస్థంభం ప్రాముఖ్యత ఏమిటి?

ధ్వజస్థభం భూలోకానికి,స్వర్గలోకానికి మధ్య వారధి.అంతరిక్షంలో ఉన్న దైవ శక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది.అనతమైన విశ్వంలో ఉండే దివ్యశక్తులను,కాస్మిక్ కిరణాలను దేవాలయంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది.ధ్వజస్తంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జిని ఆకర్షిస్తాయి.

ధ్వజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండీ రక్షిస్తుంది.అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వలన అది విద్యుత్ శక్తిని గ్రహించి,భూమిలోకి పంపించివేసి,ఆలయాన్ని కాపాడుతుంది.

ధ్వజస్థభం ప్రతిష్ట ముందు దానిక్రింద పంచలోహాలు(బంగారం,వెండి,ఇత్తడి,రాగి,కంచు)ను వేస్తారు.అవి భూమిలోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి(electro-magnetic energy)ని గ్రహిస్తాయి.అందుకే ధ్వజస్థభం వద్ద విద్యుత్ అయస్కాంత్ క్షేత్రం(electro-magnetic energy) ఏర్పడుతుంది.అంతేకాదు ద్వజస్థభానికి వేసే పంచలోహ్ల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత్ శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ ఆయస్కాంత్ క్షేత్రానికి మరింత శక్తిని చేకూరుస్తుంది.దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.ధ్వజస్థంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం.

ధ్వజం అంటే జెండా.బ్రహ్మోత్సావాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్థంబానికి జెండాను ఎగిరేస్తారు.దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది.

ధ్వజస్తంభం అడుగుభాగంలో శివుడు,మధ్యభాగంలో బ్రహ్మ,పై భాగంలో శ్రీ మహావిష్ణువు కోలువై ఉంటారు.విశ్వాసం శ్వాస కంటే గొప్పది.వేదం పరమాత్ముడి శ్వాస.నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ద్వజస్థంభం.

మనం దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను,ఒత్తిళ్ళను విడిచిపెట్టి ప్రవేశిస్తాం.ధ్వజస్థంభం దగ్గరకు రాగానే,మనలో మిగిలి ఉన్న చెడు భావనలను,అహకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.

ధ్వజము అంటే మరొక అర్ధం పతాకం అని.మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు,అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి.అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని,అతను జీవితంలో అత్యున్నతస్థాయిలో నిలబడతాడని గుర్తుచేస్తుంది ధ్వజస్థంభం.

ఇంత ప్రాముఖ్యం ఉన్న ద్వజస్థంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసువచ్చి పెట్టరు.ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్థంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి.ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు.కొమ్మలు ఉండకూడదు.ఎలాంటి పగుళ్ళుఉండకూడదు.ఏ మాత్రం వంకరగా ఉండకూడదు.సుమారు 50  అడుగులకంటే ఎత్తు ఉండాలి.ఇలాంటి మానునే ధ్వజస్థంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది.

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............