Sunday 13 January 2013

పతంగులు

సంక్రాంతి పండుగలో పతంగులు ఎగురవేయడం కనిపిస్తుంది. వీటిని ఎగురవేయడంలో ఆంతర్యం ఏమిటి?

సంక్రాంతితో దక్షిణాయనం ముగుసి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారభంవుతుంది. ఖగోళ శాస్త్ర రీత్యా ఉత్తరాయణంలో సూర్యుడు భూమికి దగ్గరగా జరుగుతాడు. ఆకురాలిన వృక్షాలు తిరిగి చిగురిస్తాయి. సూర్యరశ్మి భూమికి బాగా అందుతుంది. సూర్య్డు భూమికి దగ్గరగా వస్తున్నాడు, ఇక మన జీవితం రంగులమయం అవుతుందని తెలియజేయడానికి చిహ్నంగా రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. మకర సంక్రమణంతో మకర రాశిలోనికి ప్రవేసించే సూర్యభగవానుడి దర్శించే ప్రక్రియ అని కొందరు చెబుతారు.

గాలిపటాలకు వాడే మాంజాలు(దారాలు) గాజుపోడితో తయారుచేస్తారు. అవి పావురాలు, పిచ్చుకలు మొదలైన అనేక రకాల పక్షులకు ప్రాణంతకంగా మారుతాయి. పావురాలు, పిచ్చుకల శరీరాలు అతి సునీతంగా ఉంటాయి. ఈ పదునైన దారం వాటి శరీరాలకు తగలగానే, శరీరభాగాలు తెగిపోయి అవి మరణిస్తాయి. పండుగ పూట హింస చేయడం ఎందుకు? పాపాన్ని మూట కట్టుకోవడం ఎందుకు? అందుకే పదునుగా ఉండే దారాలను వాడకండి.

పతంగుక్లు ఎగురవేసేవారు జాగ్రత్తలు పాటించండి. పిట్టగోడలు చాలా జాగ్రత్తగా ఉండండి. పతంగుల కోసం రోడ్ల మీద పరుగెత్తడం, రోడ్ల మీద పతంగులు ఎగురవేయడం చేసి రోడున్న పోయే వాహానాల వలన ప్రమాదాలకు గురికాకండి.

సంప్రదాయాలను పాటించండి. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడండి.

సంక్రాంతి పండుగు శుభాకాంక్షలు.              

No comments:

Post a Comment