Friday 11 January 2013

వివేకానంద

ఓం
1000 సంవత్సరాల విదేశీ ఆక్రమణలు, క్రైస్తవ మిషనరీల మతమార్పుడులు,భారతదేశం మీద బ్రిటిష్ ఆక్రమణ, మరొక ప్రక్కన మన హిందూ ధర్మంలో గొప్పతనమేముంది అనుకునే సమయంలో, అంధకారంలో మగ్గుతున్న హిందూ జాతిలో చైతన్యం నింపడానికి జనవరి 12 1863 న భారతదేశంలో ఉధ్భవించిన సూర్యుడు స్వామి వివేకానందుడు. 

ప్రజలలో చైతన్యం, దేశభక్తి నింపి గాంధీ వంటి అనేక దేశభక్తులకు స్పూర్తినిచ్చిన భరతమాత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద. 

3000 సంవత్సరాలకు పైగా భారతదేశానికే పరిమితమైన హిందూ ధర్మాన్ని సమస్త ప్రపంచానికి తెలియపరిచారు స్వామి.మన దేశంలో అధ్యాత్మిక సంపదకు లోటు లేదు, అదే విధంగా అనేకమంది పేదలు ఆకలి కేకలకు కూడా లోటు లేదు. మన దగ్గరున్న జ్ఞాన సంపదను విదేశీయులకు అందించి వారి దగ్గరున్న డబ్బుతో పేద భారతీయుల కడుపు నింపాలన్నది వివేకానందుని ఆశయం. అందుకోసం ఆయన అనేక ఇబ్బందులను ఓర్చి, తన మిత్రులు, శిష్యుల చందా డబ్బులతో చికాగోలో జరుగుతున్న ప్రపంచ సర్వమత మహా సభలకు హిందూ ప్రతినిధిగా హజరయ్యారు.

అప్పటివరకు మతం అంటే రక్తపాతం, ఇతర మతాలను తొక్కిపెట్టి పైకిరావడం, పరదేశీయులను పీడించడం అని భావించింది ప్రపంచం. మా మతమే గొప్పది, మిగితావని అబద్దాలు. మిగితా దేవుళ్ళు సైతాన్ లంటూ ప్రచారం చేయడమే మతం అనుకునేవారు. సర్వమతమహాసభలలో కూడా అన్ని మతాలవారు తమ ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నించారు. కాని హిందూ ధర్మ ప్రతినిధిగా వెళ్ళి అక్కడా వివేకానందుడు చేసిన ప్రసంగం చారిత్రాత్మికం. ఈనాటికి అది విన్నా, చదివినా హిందువుల హృదయంలొ తెలియని దైర్యం, ఆనందం కలుగుతాయి. ఆ సర్వమత మహాసభలలో చివరివక్తగా స్వామి వివేకానందా అవకాశం తీసుకున్నారు. మొట్టమొదట ఆయన తన ప్రసంగంలో "Sisters and Brothers of America" అనగానే అప్పటివరకు ఎంతో దీనంగా కూర్చున్న 7000 మంది సభికులు తమకేదో ఆయన ఒక క్రొత్త విషయం చెప్పినట్టుగా ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టారు. 3 నిమిషాలపాటు చపట్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. అది తరువాత ఎంతో ధీరంగ్, గంభీరంగా సాగిన వివేకానందా ప్రసంగం విన్న ప్రజలు తమనితాము మర్చిపోయారు. ఆయనతో కరచాలనం చేయడానికి స్ర్తీలు అక్కడున్న బెంచీలు దూకడం మొదలుబెట్టారు. మరొక వింత, ఆయన ప్రసంగం విన్న తరువాత అక్కడకు వచ్చిన Judaism మాతానికి సంబంధించిన jew మతగురువు,స్వామి ప్రసంగం విన్నాక తాను తోలిసారి తన Judaism మతం కూడా సత్యమే అని తెలుసుకున్నాని పలికాడు. అటు తరువాత జనం రోజు స్వామి ఇచ్చే పావుగంట ప్రసంగాల కోసం ఆ సభకు వచ్చి గంటల సమయం వేచి ఉండేవారు. ఆ తరువాత ఆయన ప్రపంచమంతా యాత్రలు చేసి సనాతన ధర్మాన్ని(హిందూ ధర్మాన్ని) విశ్వావ్యాపితం చేశారు. ఈ రోజు మన హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అందుకు కారణం స్వామి వివేకానందుడే.

say it with pride: we are hindus. హిందువునని ప్రపంచానికి గర్వంగా చాటి చెప్పండి అని వివేకానందా ఆనాడే హిందువులకు పిలుపునిచ్చారు. అటువంటి మహోన్నత జ్ఞానజ్యోతి స్వామి వివేకనందుడి 150వ జయంతి 12 జనవరి 2013.


No comments:

Post a Comment