Monday 7 January 2013

సుబోధ

ఓం
సుబోధ
మాస్టర్ మహాశయ్ సందేహాన్ని తీరుస్తూ శ్రీ రామకృష్ణ పరమహంస,"అనురాగం ఏర్పడినప్పుడు భగవల్లాభం సిద్ధిస్తుంది.  తీవ్ర వ్యాకులత కలిగినట్లయితే, మనస్సంతా భగవంతుని మీదే లగ్నమవుతుంది. అప్పుడు భగవంతుడు తప్పక పలుకుతాడు.మనకు దర్శనమిస్తాడు" అని అన్నారు.
 
"జటిలుడనే చిన్న పిల్లవాడి కధ ఒకటి ఉంది.అతడు పాఠశాలకు కొంతదూరం అడవిమార్గం గుండా వెళ్ళవలసి వచ్చేడి. అలా వెళుతున్నప్పుడు అతడికి భయం వేసేది. అతడు తన భయం గురించి తల్లికి చెప్పాడు. అందుకు ఆమె, 'నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మధుసూదనుణ్ణి(శ్రీ మహా విష్ణువు)ను పిలువూ అన్నది. అందుకు ఆ పిల్లవాడు, 'అమ్మా! ఆ మధూసుదనుడెవరు? అని అడిగాడు.'అతడు నీ అన్న ' అని తల్లి బదులు చెప్పింది.

మరునాడు అడవిమార్గంలో వెళుతుండగా జటిలుడికి భయం వేసింది. అప్పుడి వెంటనే'అన్నా! మధూసుధనా!నువ్వెక్కడ ఉన్నావు? ఇక్కడకు రా! నాకు భయం వేస్తొంది 'అని పిలువసాగాడు.ఆర్తితో జటిలుడు పిల్చిన పిలుపుకు మధూసుదనుడు రాకూండా ఉండలేకపోయాడు. 'ఇదుగో!నే నిక్కడ ఉన్నాను తమ్ముడూ! నీకు భయమెందుకు?' అంటూ మాట్లాడుతూ వెళ్ళి పాఠశాల వద్ద వదిలిపెట్టాడు. 'తమ్ముడూ! నువ్వు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాను. భయపడవద్దు ' అని దైర్యం చెప్పి మధూసుదనుడు వెళ్ళిపోయాడు.

విశ్వాసం వ్యాకులత ఉంటే తప్పక భగవంతుడు అనుగ్రహిస్తాడు.
సేకరణ ('శ్రీరామకృష్ణ కధామృతం ' నుండి)-శ్రీ రామకృష్ణప్రభ,ఆధ్యాత్మిక మాసపత్రిక
   

No comments:

Post a Comment