Wednesday 9 January 2013

"మనలో మార్పు రావాలి".


"మనలో మార్పు రావాలి". 
మొత్తానికి ఆయనగారు అరెస్ట్ అయ్యారు.హై కోర్టు మొట్టికాయలు కూడా మొట్టింది. కొద్ది రోజుల క్రితం అతను హిందూవులు,వారి దేవిదేవతల పట్ల చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. అవేమి మనకు కొత్తకాదు.గతంలో హైద్రాబాదులో హనూమాన్ జయంతిని నిషేధించాలని మన రాష్ట్ర అసేంబ్లీలో అన్నాడు. అప్పుడైతే మరీ దరిద్రం. ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా ఖండించలేదు. అదేమంటే అప్పుడు ఉప ఎన్నికల హడావుడి కదా, ఖండిస్తే వారి ఓట్లు కోల్పోతామన్నారు. అంతకముందు శ్రీరాముడి గురించి ,కౌసల్య దేవి గురించి కూడా ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అసలు 80% హిందూ ప్రజానీకం ఉన్న హిందూ దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం మనలో ఐక్యత లేకపోవడం.మనం కులం, భాష, ప్రాంతం పేరున విడిపోయాం. అసలు మనకు మనమంతా ఒక్కటే అన్న భావన ఉంటే కదా. కొందరు శైవం అంటారు, మరికొందరు శ్రీ వైష్ణవం అంటారు, ఇంకొందరు ఇంకేదో అంటారు. ఉన్న దేవుడు ఒక్కడే అని అందరికి తెలుసు. మనమంతా హిందువులమని తెలుసు. కానీ మనమంతా ఒక్కటని చస్తే ఒప్పుకోము. ఇదే కాదు మనలో మనము రాజకీయ పార్టీల పేరున విడిపోయాము. ఎప్పుడొ 5 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి ఎన్నికలు. అప్పుడు మాత్రమే కనిపిస్తారు మన "మేతలు". ఎప్పుడో కనిపించేవారి కోసం మనం రోజు వాదులాడుకుంటాం. ఈ విధంగా మనం ముక్కలు, చెక్కలుగా విడిపొయాం కనుకే "వాళ్ళు" మన మీద అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. కులాలను, ప్రాంతాలను, భాషలను, రాజకీయాలను ప్రక్కన పెట్టి మనకోసం, మన సనాతన హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే మనమంతా ఏకం కావాలి. మనం రాజకీయ పార్టీల గురించి తగాదాలు పడడం కాదు.మనమంతా ఏకమైతే మన ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కొట్టుకునే రోజు వస్తుంది. "వాళ్ళంతా" ఐక్యంగా ఉన్నారు కాబట్టే ఈరోజు అన్ని రాజకీయ పార్టిలు మేము "మీకు న్యాయం చేస్తాం"అని వాళ్ళతో అంటున్నాయి. మనకు ఆ రోజు రావాలి. కనీసం ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలిపెడదాం. కళ్ళు తెరుద్దాం. మన మధ్య ఉన్న కుల, రాజకీయ, భాష గోడలు కూల్చేద్దాం. ఎంత భిన్నత్వం ఉన్నా మనమంతా హిందువులమని ప్రపంచానికి చాటుదాం. హిందువులం ఐక్యం అవుదాం. కలిసి నడుద్దాం.మన అస్తిత్వాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం.
జై హింద్                  

No comments:

Post a Comment