Sunday 6 January 2013

మన దేవాలయాలు-6

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-6
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)


ఆలయ ప్రవేశంలో గోపురం దాటగానే,మనకు కనిపించేది ధ్వజస్థంభం.ధ్వజస్థంభం ప్రాముఖ్యత ఏమిటి?

ధ్వజస్థభం భూలోకానికి,స్వర్గలోకానికి మధ్య వారధి.అంతరిక్షంలో ఉన్న దైవ శక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది.అనతమైన విశ్వంలో ఉండే దివ్యశక్తులను,కాస్మిక్ కిరణాలను దేవాలయంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది.ధ్వజస్తంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జిని ఆకర్షిస్తాయి.

ధ్వజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండీ రక్షిస్తుంది.అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వలన అది విద్యుత్ శక్తిని గ్రహించి,భూమిలోకి పంపించివేసి,ఆలయాన్ని కాపాడుతుంది.

ధ్వజస్థభం ప్రతిష్ట ముందు దానిక్రింద పంచలోహాలు(బంగారం,వెండి,ఇత్తడి,రాగి,కంచు)ను వేస్తారు.అవి భూమిలోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి(electro-magnetic energy)ని గ్రహిస్తాయి.అందుకే ధ్వజస్థభం వద్ద విద్యుత్ అయస్కాంత్ క్షేత్రం(electro-magnetic energy) ఏర్పడుతుంది.అంతేకాదు ద్వజస్థభానికి వేసే పంచలోహ్ల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత్ శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ ఆయస్కాంత్ క్షేత్రానికి మరింత శక్తిని చేకూరుస్తుంది.దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.ధ్వజస్థంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం.

ధ్వజం అంటే జెండా.బ్రహ్మోత్సావాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్థంబానికి జెండాను ఎగిరేస్తారు.దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది.

ధ్వజస్తంభం అడుగుభాగంలో శివుడు,మధ్యభాగంలో బ్రహ్మ,పై భాగంలో శ్రీ మహావిష్ణువు కోలువై ఉంటారు.విశ్వాసం శ్వాస కంటే గొప్పది.వేదం పరమాత్ముడి శ్వాస.నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ద్వజస్థంభం.

మనం దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను,ఒత్తిళ్ళను విడిచిపెట్టి ప్రవేశిస్తాం.ధ్వజస్థంభం దగ్గరకు రాగానే,మనలో మిగిలి ఉన్న చెడు భావనలను,అహకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.

ధ్వజము అంటే మరొక అర్ధం పతాకం అని.మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు,అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి.అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని,అతను జీవితంలో అత్యున్నతస్థాయిలో నిలబడతాడని గుర్తుచేస్తుంది ధ్వజస్థంభం.

ఇంత ప్రాముఖ్యం ఉన్న ద్వజస్థంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసువచ్చి పెట్టరు.ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్థంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి.ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు.కొమ్మలు ఉండకూడదు.ఎలాంటి పగుళ్ళుఉండకూడదు.ఏ మాత్రం వంకరగా ఉండకూడదు.సుమారు 50  అడుగులకంటే ఎత్తు ఉండాలి.ఇలాంటి మానునే ధ్వజస్థంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది.

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............
           

No comments:

Post a Comment