Monday, 5 June 2017

పర్యావరణాన్ని పరిరక్షించడం ఎలా?

ప్రకృతిలో అనేక రకాలైన జీవులున్నాయి. ఉదాహరణకు బాక్టీరియా, క్రిములు, పక్షులు, చెట్లు, జంతువులు, మానవులు. ఈ భూమిపైన ఇన్ని రకాల జీవులు వుండవలసినదే. ఎందుకంటే జీవులన్నీ పరస్పరం ఒకదానిమీద ఒకటి ఆధారపడ్డాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక జాతిజీవి నశిస్తే అనేక జీవులు నశించే ప్రమాద ముంది. రైతుల నిత్య జీవితానికి సంబంధించిన రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం.

మినుము, పెసర, జనుము వంటి మొక్కల వేళ్ళలో బుడిపెలు వుంటాయి. అవి నత్రజని నిల్వలు. భూమికి కావలసిన నత్రజనిని ఆ వేళ్ళు అందిస్తాయి. కాని ఆ వేళ్ళలో నత్రజని బుడిపెలు తయారు కావాలంటే భూమిలో ఒక రకమైన బాక్టీరియా, ఆ వేళ్ళుద్వారా మొక్క విసర్జించే పదార్థాన్ని తిని నత్రజని బుడిపెలను తయారుచేస్తాయి. అలాగే వానపాములు భూమిని నిరంతరం గుల్లగా వుంచుతాయి. దానివలన ఆ భూమి ఎంత వాననీటినైనా పట్టి వుంచగలుగుతుంది. రైతులు చీడపీడల నివారణకు ప్రకృతి సిద్ధమైన పద్ధతులు అవలంబించక, రసాయనిక మందులను అధిక మోతాదులో వాడితే, ఆ మందులు వానకు భూమిలోకి ఇంకి ఆ బాక్టీరియాను, వానపాములను చంపుతాయి. దానివలన ప్రకృతి సహజసిద్ధంగా భూమిలో వుండే నత్రజని ఎరువును ఆ భూమిలో వేసినా, భూమి స్వీకరించలేని పరిస్థితి వస్తుంది. అలాగే వానపాములు చచ్చిపోతే నేల గట్టిపడి, వాననీరు భూమిలోకి ఇంకలేక వృధాగా పోతుంది. ఈ రెండింటి వలన భూమి సేద్యానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇది తీవ్రమైన ఆహార కొరత సమస్య సృష్టిస్తుంది. అంటే మానవాళి మనుగడయే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉదాహరణకు అమెరికాలో 1949-68 మధ్య రసాయనిక మందుల వినియోగం, వాటి వలన రసాయనిక నత్రజని వినియోగం 40శాతం పెరిగింది. దానిని భూమిసరిగా తీసుకోలేక పోవడం వల్ల అది నైట్రేట్‌ రూపంలో కాలువలు, చెరువుల లోకి చేరి ఆ నీరు కలుషితమయింది.

మరి రసాయనిక మందులు అతిగా వాడకుండా చీడపీడల నివారణ ఎలా? ప్రకృతిలోనే అనేక కీటకాలు చీడపురుగులను ఆహారంగా కలిగినవి వున్నాయి. వాటిని పెంచి చేలలో వదిలితే చాలు, సస్యరక్షణ అద్భుతంగా జరుగుతుంది. ఇటీవల మన పత్రికలలో చీడపురుగులను కీటకాలు ఆహారంగా స్వీకరిస్తున్న దృశ్యాలు ప్రచురించి, మనకు అవగాహన కలిగించాయి. ఈ పద్ధతిని రైతులలోకి విస్తృతంగా తీసుకు వెళ్ళాలి.

కాబట్టి జీవవైవిధ్యం నాశనమయితే పర్యావరణం పెను ప్రమాదంలో పడుతుంది. అదొక్కటే కాదు. కార్బన్‌డయాక్సైడ్‌, మిథన్‌, క్లోరోఫ్లోరా కార్బన్‌ వంటి గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌ కలిగించే వాయువుల వలన కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ జరిగి పర్యావరణ ప్రమాదం పెరుగుతుంది. ఈ గ్లోబల్‌ వార్మింగ్‌కి ప్రధానంగా పరిశ్రమల నుండి వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విషవాయువులు 23శాతం, విచక్షణా రహితంగా చేసే అడువుల నరికివేత మరో 23శాతం కారణాలవుతున్నాయని శాస్త్రజ్ఞుల అంచనా.

కాబట్టి పర్యావరణం, తద్వారా ఈ భూమి, సంరక్షింపబడాలంటే జీవ వైవిధ్యం కాపాడబడాలి. గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల తగ్గించబడాలి. కాని వాస్తవంగా ఏం జరుగుతోంది? పారిశ్రామిక అభివృద్ధి ఫలాలన్నీ అనుభవిస్తున్న అమెరికా, అభివృద్ధి కారణంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పట్టించుకోవడం లేదు. ఈ అమానుష చర్య అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ కాలం నుండి చేపట్టబడింది.

జార్జివాషింగ్టన్‌ 1779 మార్చి 31న సైనికాధికారి జనరల్‌ సల్లివాన్‌కు ఈ క్రింది విధంగా ఆదేశాలిచ్చాడు. ''మీరు శతృవులైన ఆరు స్థానిక ఇండియన్‌ జాతులను అదుపు చేయండి. దీనికి గాను వారి పంటలను పొలాల్లోనే నాశనం చేయడం అవసరం. ఇతర పంటలేవీ పండించ బడకుండా చూడాలి.'' (అయ్యో భూగోళం, పేజీ 29) అంతే! వాషింగ్టన్‌ ఆదేశాల మేరకు ఏ ఒక్క మొక్కనూ వదలకుండా వలస సైనికులు ధ్వంసం చేశారు. ఎంతగా ధ్వంసం చేశారంటే ''నయాగరా ప్రాంతంలో గతంలో ఇండియన్‌ జాతులు నివసించి వుండేవనేందుకు ఆధారాలైన వారి ఆహార పంటలు లేకుండా నాశనం చేశాము'' అని సల్లివాన్‌ తన నివేదికలో పేర్కొన్నాడు.

ఇక వియత్నాం యుద్ధంలో విజయానికి ఆమెరికా అనుసరించిన వ్యూహం పర్యావరణ యుద్ధం. అడవులను సర్వనాశనం చేయడం, విషపూరితమైన రసాయనాలను ప్రయోగించడం అనే పద్ధతులు అవలంబించబడ్డాయి. విషరసా యనాలను ప్రయోగించడంలో ముఖ్య బాధ్యతల్లో వున్న ఒక అధికారి 1984లో ఇలా రాశారు.
''అమెరికా అనుసరించిన రసాయన యుద్ధంలో కోట్లాది మొక్కలు, వృక్షాలు చనిపోవడమే కాక నేటికీ పచ్చగడ్డి మొలకెత్తని ప్రాంతాలున్నాయి. నేలలోని పోషక జీవులు అంతరించడంతో ఆ నేల నిస్సారమైంది. వన్య మృగాలు అదృశ్యమయ్యాయి. జలచరాల ఉనికి మాయమైంది. కాలక్రమంలో వింత రూపాలతో శిశువుల జననం లాంటి దీర్ఘకాల ప్రభావాలకు ఈ యుద్ధం కారణమైంది.'' విశేషమే మంటే రసాయనిక యుద్ధానికి సైన్యాధికారులు వెనుకాడినా, అధ్యక్షుడు కెనెడీ పూర్తిగా ప్రోత్సహించాడు.

నికరాగ్వాలో కూడ శాంతినిష్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ప్రతీఘాత సైన్యాన్ని ప్రోత్సహించింది. ఈ సైన్యం పంట చేలపైన దాడికి దిగింది. 75 మందికి పైగా పర్యావరణ శాస్త్రజ్ఞులను కిడ్నాప్‌ చేయడం గాని, చంపడం గాని చేసింది. నికరాగ్వా రైతులకు విత్తనాలు సరఫరా చేసే ప్రధాన విత్తనశుద్ధి సేకరణ కేంద్రంపై దాడి చేసింది. ఇదీ ఆదేశ పర్యావరణంపై దాడి జరిగిన తీరు!

ఇక రీగన్‌ పరిపాలనా కాలంలో అమెరికా ప్రభుత్వం పథకం ప్రకారం పర్యావరణ పరిరక్షణ చట్టాలను తుంగలో తొక్కి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది. పర్యావరణ ప్రమాణాలు పరిశీలించే కౌన్సిల్‌లో ఉద్యోగులందరినీ రీగన్‌ తొలగించాడు. పర్యావరణ పరిరక్షణ సంస్థ ఉద్యోగులను నాల్గవవంతుకి తగ్గించాడు. బడ్జెట్‌లో పర్యావరణ పరిరక్షణకి కేటాయింపులు మూడో వంతుకీ, పరిశోధనల కోసం సగానికీ కోత విధించాడు. ఇటువంటి చర్యల కారణంగా బహుళజాతి సంస్థలు పర్యావరణాన్ని నాశనం చేసే చర్యల్లో అమితోత్సాహంగా ముందుకెళుతున్నాయి.
ఈ విషయంలో మన ప్రభుత్వాలు కూడా అమెరికా సామ్రాజ్యవాదానికీ, బహుళజాతి గుత్తసంస్థలకూ అనుకూలంగా వ్యవహరి స్తున్నాయి. జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే బిటి విత్తనాలకు ఎర్రతివాచీ పరచడం వంటి పనులు చేస్తున్నాయి. బిటి విత్తనాలు, వాటితో వ్యవసాయం చేసే చేలలోనే కాకుండా, వాటి పుప్పొడి పాకినంత మేర, విత్తనాల పునరుత్పత్తి లేకుండా చేస్తుంది. దానితో మరుసటి సంవత్సరం విదేశీ కంపెనీవారి విత్తనాలను పక్కచేల రైతులు కూడా కొనకతప్పని పరిస్థితి వస్తుంది. కొంతకాలానికి దేశమంతా విదేశీ కంపెనీల విత్తనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశీ విత్తనాలు లేకపోతే మనకు మనుగడ లేని పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా బిటి విత్తనాలు మన స్వాతంత్య్రాన్ని హరించి, మనల్ని అమెరికాకి బానిసల్ని చేస్తాయి. ఇది నా ఊహకాదు. అమెరికా వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి ఎర్లబట్జ్‌ స్వయంగా అన్నమాట. ఆయనేమన్నాడంటే ''ఒకవేళ ఆహారాన్ని ఆయుధంగా వాడుకోదలిస్తే, సంతోషంగా దాన్ని మేం వాడుకుంటాం''. అమెరికా ఆ ప్రయత్నంలో ముందడుగు వేస్తుంటే, మన ప్రభుత్వం దానిపట్ల ఉదాసీనంగా ఉంటోంది. ఇది క్రమంగా బానిసత్వానికి దారితీయదా?

మన ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణపై ఎంత చిన్న చూపంటే, ''ఔషధ పరిశ్రమలు ఉత్పత్తి చేసి విక్రయించే రసాయనాల మొత్తం టర్నోవర్‌పై 1శాతం పన్ను విధించి దాన్ని పర్యావరణ సంస్థల వద్ద డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల క్రితమే ఆదేశించింది. కాని ఈ ఆదేశాన్ని అమలు పరచడంలో ప్రభుత్వాలు ఇప్పటివరకూ శ్రద్ధ చూపడమే లేదు.

కాబట్టి దేశభక్తులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, పర్యావరణ విధ్వంసకారు లెవరు? వారి తైనాతీలెవరు? అనే విషయాలను ప్రజలకు వివరించి, మన భూమిని కాపాడుకొనే చర్యలను ముమ్మరం చేయాలి. భావితరాలకు పచ్చనైన భూమిని వారసత్వంగా అందజేయాలి.

కె.ఎల్‌. కాంతారావు
సెల్‌: 9490300449
సేకరణ: http://www.navatelangana.com/article/net-vyaasam/36515

చెట్లు నరకడం గురించి విష్ణుపురాణం



Asipatravana/Asipatrakanana (forest of sword leaves): The Bhagavata Purana and the Devi Bhagavata Purana reserve this hell for a person who digresses from the religious teachings of the Vedas and indulges in heresy.The Vishnu Purana states that wanton tree-felling leads to this hell. Yamadutas beat them with whips as they try to run away in the forest where palm trees have swords as leaves. Afflicted with injury of whips and swords, they faint and cry out for help in vain.

Sunday, 4 June 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



Every one should develop a keen sense of responsibility unto one self.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 245 (14 లోకాలు - 14 చక్రాలు)

ఈ 14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది, అలాగే ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుంచి పైకి, క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలనే 6 చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7 చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14. వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి, అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు. కైలాసనాథ పరంపర నందినాథ సంప్రదాయానికి చెందిన గురువు, శైవాగమ పండితులు, జగదాచార్యులు శ్రీ శ్రీ శ్రీ సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి వారు చెప్పిన ఆ విశేషాలు తెలుసుకోండి.

1. మూలాధారం - వెన్నుపూస అంత్యభాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం. మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం - బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది. వివేకము దీని లక్షణం.
3. మణిపూరం - నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం.
4. అనాహతం - హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం.
5. విశుద్ధం - కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ - కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం - తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.

నరకాలు, పాతాళ లోకాల గురించి చూద్దాము.

1. అతలం - అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.
2. వితలం - నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతలం - బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇది స్థానం.
5. రసాతలం - కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు.
6. మహాతలం - అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.
అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.7.
7. పాతాళం - కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.

కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.

To be continued .........

Saturday, 3 June 2017

స్వామి శివానంద సూక్తి



Your mind will sometimes shudder when evil thoughts enter your mind. This is a sign of your spiritual progress. You are growing spiritually. You will be much tormented when you think of your evil actions committed in the past. This is also a sign of your spiritual upheaval. You will not repeat now the same actions. Your mind will tremble. Your body will quiver whenever a wrong thought of some evil action urges you to do the same act through force of habit. Continue your meditation with full vigour and earnestness. All memories of evil actions, all evil thoughts, all evil promptings of Satan, will die by themselves. You will be established in perfect purity and peace.

- Swami Sivananda

Friday, 2 June 2017

స్వామి సచ్చిదానంద సూక్తి



Healthy People

People who are healthy don’t hurt anyone. They are not afraid of anyone. Not only are they unafraid, but they see that others are not afraid of them either. The ‘others’ include animals, plants, everything. Healthy people emit always and only loving and pure vibrations.

- Swami Satchidananda