Wednesday, 31 December 2014

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం

ఓం నమో నారాయణాయ

వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధఏకాదశి నాడు పాలసముద్రంలో యోగనిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి తో కలిసి గరుడవాహనం మీద వైకుంఠానికి రాగా వైకుంఠ ఉత్తరద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహా విష్ణువును పూజించారని పురాణ కధనం.

ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు 33 కోట్లమంది దేవతలతో వైకుంఠం నుండి భూమికి దిగివస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు.

కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని 'ముర ' అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండే వాడు. వాడు దేవతలను గాలిస్తూ వచ్చాడు. అప్పుడు దేవతలు వైకుంఠం విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణువు వారి దీనస్థితిని చూడలేక భూమికి దిగివచ్చి మురాసురుణ్ణి అంతం సంహరించాడు. ఆ సంహారం ఈ ఏకాదశి నాడే జరిగింది. విష్ణు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చిన రోజు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అన్నారు.

ఈ రోజున విష్ణుముర్తి ఆలయాలు, ఆయన అవతారాలకు సంబంధించిన ఆలయాల్లో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనిని స్వర్గ ద్వారం అంటారు. ఈ ద్వార వెళ్ళి పరమాత్మను దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుంది.

"ఉత్తరద్వార దర్శనం" గురించి తాత్వికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరం అంటే పైభాగం అని, తరువాత వచ్చేది అని అర్ధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జీవన విధానం నుంచి ఉన్నత స్థితికి, భౌతికజీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి ఇది నాంది పలుకుతుంది.

మన శరీరంలో ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఊర్ధ్వముఖంగా (పైకి) ప్రయాణింపజేసి ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి, బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలోఐక్యమవడమే ఉత్తరద్వార దర్శనం అని చెప్పవచ్చు.

వైకుంఠ ఏకాదశి ఉపవాస విశేషాలు

ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు.

మన ధర్మ శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏకాదశి నాడు అన్నంలో పాపాలు ఉంటుందని, అందువల్ల ఆ రోజు ఉపవసించాలాని తెలుస్తున్నది.

జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది.

మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురుగిపోయి రోగాలకు కారణమవుతుంది. ఇది విషపదార్ధం. ఈనాటి శాస్త్రం దీనిని toxins అంటుంది. వీటివల్లనే మనిషికి 90% రోగాలు వస్తున్నాయి. ఈ toxins ను ఆయుర్వేదంలో ఆమం అంటారు,దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలంటారు. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది. అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70ఏళ్ళ వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్ప్లులు కూడా వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవసించాలని ఆయుర్వేదం చెప్తోంది.

దశమి నాడు ఉదయమే లెచి శిరస్నానం చేసి, ఏకాదశి వ్రతం చేస్తున్నానని పరమాత్మ ముందు చెప్పుకుని, పూజ చేసి,భోజనం చేసి, ఆ రాత్రికి ఉపవసించాలి.ఫలహారం తీసుకోవచ్చు. ఏకాదశి నాడు తలకు ఎటువంటి నూనెలు,ష్యాంపులు పెట్టకుండా కేవలం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి.విష్ణు పూజ చేయాలి. ఉపవాసం చేయాలి. ఆ రాత్రి విష్ణు నామాలతో జాగరణ చేసి మరునాడు అంటే ద్వాదశి నాడు ఉదయం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి. అభ్యంగన స్నానం ఏకాదశి,ద్వాదశి తిధులలో నిషిద్ధం. స్నానం తరువాత విష్ణు పూజ చేసి,  ఉదయం ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి,  పారణ(భోజనం)చేయాలి.ఆ రాత్రికి కేవలం ఫలహారం మాత్రమే తీసుకోవాలి.

ఏకదశి ఉపవాసం వలన ఆరోగ్యం లభిస్తుంది. వివాహం జరిగిన వారందరూ తప్పకుండా ఉపవాసం చేయాలి. బ్రహ్మచారులకు, రోగులకు, 80 ఏళ్ళకు పైన వయసున్నవారు ఉపవసించవలసిన అవసరం లేదు. శ్రీ మహా విష్ణువును ఆరాధించినా చాలు.

ఇందులో చాలా అరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇదంతా మన ఆరోగ్యం కోసం ఆ పరమాత్మ చేసిన శాసనం.
ఆచరిద్దాం. తరిద్దాం. ఆనందిద్దాం.మనశ్శంతిని,తద్వార పరమగతిని పొందుదాం.             

ఓం నమో లక్ష్మీనారాయణాయ

Tuesday, 30 December 2014

జనవరి 1 న్యూఇయర్ కుట్ర

జనవరి 1 కొత్త సంవత్సర వేడుకల గురించి భిన్నాప్రాయాలు వ్యక్తమవుతాయి. కొందరు జరుపుకోవద్దంటారు, కొందరు ప్రపంచమంతా జరుపుకుంటున్న వేడుకను మనం మాత్రం జరుపుకుంటే తప్పేంటీ అంటారు. అసలు ఈ న్యూఇయర్ వేడుకలు ఒక 25 ఏళ్ళ కిందట భారత్‌లో లేవు. మరి ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చాయి? వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వీటి వెనుకనున్న శక్తులేవి? వీటిని ఇంతలా promote చేయడం వల్ల ఆ శక్తులకు వచ్చే లాభం ఏమిటి? ఈ సందేహాలాన్నిటికి సమాధానం తెలుసుకోవాలంటే ఇది చదవండి. (సమయం తక్కువగా ఉన్నందున సంక్షిప్తంగా వివరిస్తున్నా )

భారత్‌లో న్యూఇయర్ వేడుకలను promote చేయడం వెనుక అమెరికా హస్తం ప్రధానంగా ఉంది. అమెరికా, చైనా, ఇతర దేశాల దృష్టిలో భారత్ 120 కోట్ల జనాభా ఉన్న ఒక పెద్ద మార్కెట్. తమ దేశాంలో అమ్ముడుపోనివి వస్తువులను, మందులను, ఇతర ఆహారపదార్ధాలను అమ్మడానికి వాటికి భారత్ కనిపిస్తుంది. ఆయాదేశాల్లో ప్రభుత్వంచే నిషేధించబడిన వస్తువులను కూడా, ఆ ప్రభుత్వాలు భారత్‌లో అమ్మెందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటాయి. ఉదాహరణకు అధిక విషరసాయనాలు కలిగిన ఎరువులు అమెరికాలో నిషేధం అనుకోండి. ఆ ఎరువుల కంపెనీను మూసేస్తే, ఎందరికో నష్టం వాటిల్లుతుందని ఆ ప్రభుత్వం ఎరువులు ఎగుమతి చేస్తామని భారత్‌తో ఒప్పందం చేసుకుంటుంది. మన మేలు కోసం కాదు, వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం. పైగా విషపు రసాయనాలు కలిగిన ఎరువులు, మందులు భారత్‌కు ఎగుమతి చేస్తే, అవి వాడిన భారతీయులు రోగాల బారిన పడతారు. ఆ రోగాలకు కూడా వాళ్ళే మందులు ఎగుమతి చేసి, డబ్బు సంపాదిస్తారు. అదీగాకా, పౌరులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అభివృద్ధికి నిధులు వెచ్చించగలుగుతుంది. అదే పౌరులు అనారోగ్యంగా, బలహీనంగా ఉంటే ప్రభుత్వం నిధులను మందుల కోసం, వైధ్యం కోసం ఖర్చు చేస్తుంది. ఫలితంగా అభివృద్ధికి ఉపయోగించవలసిన నిధులు పక్కదారి మళ్ళుతాయి. ఆర్ధికలోటు కూడా ఏర్పడవచ్చు, ప్రభుత్వం అంతర్జాతీయసంస్థల నుంచి అప్పు తీసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ఒక దేశం అప్పు చేసిందంటే, అదేమి గోప్ప విషయం కాదు, ఆ దేశం తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోతున్నదని చెప్పటానికి అదె నిదర్శనం. ఇదంతా అమలు చేయడానికి అమెరికా సహా అనేక దేశాలు రకరకాల కుట్రలకు పాల్పడుతున్నాయి. ఎక్కడా కూడా ఆయా దేశాలు ఇందులో ఉన్నట్టు అనుమానాలు రాకుండా మిషనరీలు, కొన్ని స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు, సంఘసంస్కరణే తమ లక్ష్యం అని ప్రచారం చేసుకుంటున్న కొన్ని సంస్థలు, మీడియా, సినీదర్శకుల ద్వారా సినిమాలు .............. ఇంకా అనేక మాధ్యమాల ద్వారా, వాటికి నిధులను సమకూరుస్తూ, చాపా కింద నీరులా తమ ప్రణాలికలను అమలు చేస్తున్నాయి. ఇదంతా ఒట్టి కల్పితం అని మీరు అనవచ్చు. ఇది నిజమని చెప్పడానికి చిన్న ఉదాహరణ చూపిస్తాను. భారతీయుల మేధాశక్తి అపారమైంది. భారాత్‌కు స్వతంత్రం వచ్చాకా, అది గొప్పగా అభివృద్ది చెందుతుందని అమెరికా సహా, కొన్ని దేశాలు భయపడి కొన్ని కుతంత్రాలు చేశాయి. వాటిలో ఒకటి తమిళనాట ద్రావిడ జాతీయవాదాన్ని ప్రోత్సహించడం. డిఎంకె రాజకీయ పార్టీ వచ్చిన ముఖ్య ఉద్దేశ్యం కూడా ప్రత్యేక తమిళదేశం ఏర్పాటు చేసుకోవడం. 1962 లొ భారాత్-పాకిస్థాన్ యుద్ధం జరిగే వారకు, డిఎంకెను పావుగా వాడుకుంటూ భారత్‌లో అంతర్గత కలహాలు సృష్టించి జాతీయనాయకులను బెదిరించింది అమెరికా. అదే సమయంలో భారత్ నుంచి వేరు పడిన పాకిస్థాన్‌కు ఆయుధాలు ఎగుమతి చేసి, దానికి బలం అందించింది. చైనా కూడా అంతే. భారత్-చైనా యుద్ధ వచ్చినప్పుడు కూడా అమెరిక్ భారత్‌కు సాయం చేయడానికి బహిరంగంగానే నిరాకరించింది. అప్పుడే అమెరికా బుద్ధి బయటపడింది.

అదే తరహాలో న్యూఇయర్ వేడుకలను ఇంత పెద్దగా promote చేయడం వెనుక కూడా ఒక పన్నాగం ఉంది. న్యూఇయర్ పేరుతో క్లబ్బులు, పబ్బులకు, మద్యానికి, మాదకద్రవ్యాలను యువతకు అలవాటు చేయడం వారి ప్రణాళికలో ప్రధానమైన అంశం. ఇలా చేస్తే ఆయా దేశాలకు 120 కోట్ల జానాభా గల పెద్ద మార్కెట్ వస్తుంది. తమ దేశంలో తయారయ్యే మాదకద్రవ్యాలు, మద్యం ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇప్పుడున్న భారతీయ విద్యావిధానం ఆంగ్లేయుడైన మెకాలే రూపొందించింది. అది భారతీయులను మానసికంగా, నైతికంగా బానిసలు చేయడమే లక్ష్యం. అన్యదేశాల్లో మద్యం, మాదకద్రవ్యాల వ్యసనం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని నిరోధించడం కూడా కష్టమే. కానీ భారతీయకుటుంబ వ్యవస్థ కారణంగా, ఇతర దేశాల్లో వలె మన దేశంలో యువుతకు దురలవాట్లు తక్కువ. ఈ దేశపు యువత మానసికంగా స్కూలోనే బలహీనపడ్డారు. శారీరికంగా కూడా వారిని బలహీనపరిచే ప్రణాళిక భాగమే న్యూఇయర్ వేడుకల పేరుతో జరిగే పార్టీలు. నగరాల్లో ఉండేవారిని, ముఖ్యంగా ఒంటరిగా హాస్టల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఒక పధకం రచించారు. ముందు పార్టీలకు అలవాటు చేయడం, మద్యం అలవాటు చేయడం, తర్వాత మాదకద్రవ్యాలు అలవాటు చేయడం ........... ఇలా ఒక్కొక్కటి చేస్తారు. ఆఖరున కుటుంబవ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి, యువతను నైతికంగా, మానసికంగా ఒంటరిగా చేయడం ఇందులో భాగం. ఒంటరి అయినవారికి సాయం అందిస్తాము, ఒంటరితనం దూరం చేస్తామంటూ మతమార్పిడి చేయడం ఆఖరి ఘట్టం. ఇది పైకి చెప్పినంత బహిరంగంగా జరగదు, చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇదంతా తెలియక చాలా మంది మనం ఎన్నో సంస్కృతులను అంగీకరిస్తున్నప్పుడు, ఈ న్యూఇయర్ వేడుకలను మాత్రం చేసుకుంటే తప్పేంటి అంటూ జరుపుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. భారత్ ఆర్ధికంగా, నైతికంగా, ధార్మికంగా, మానసికంగా, భౌతికంగా పతనమవ్వాలంటే కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అయితే చాలని భారతదేశాన్ని అర్దం చేసుకున్న స్వదేశీ ఆర్ధికవేత్తలకు స్పష్టంగా తెలుసు.

అలాగే పండుగలు జరుపుకోవడం వేరు, న్యూఇయర్ జరుపుకోవడం వేరు. పండుగల సమయంలో ఆకులు, పూలు, ప్రమిదలు, ఇతర సామాన్లు అమ్మేది సాధారణ లేక పేద ప్రజలు మాత్రమే. ప్రభుత్వం వారికి ఇచ్చే సబ్సీడీలు, పధకాలకంటే, వారిని హిందూ సమాజం పండుగల ద్వారనే పోషిస్తోంది. ఒకసారి గమనించండి. మనం పండుగ జరుపుకున్న ప్రతిసారి ఆయా పేద కుటుంబాలకు ఆదాయం వచ్చి కడుపు నిండుతుంది, వారూ పండుగ చేసుకుంటారు. కానీ న్యూ ఇయర్ వేరు. దీంతో పేదవారికి వచ్చేదేమి ఉండకపోగా, తాము అలాంటి పార్టీలకు దూరం అవుతున్నామనే బాధ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బలంగా తీసుకుని, కొన్ని మిషనరీలు వారికి డబ్బు ఆశచూపి మతం మారిస్తున్నాయి.

ఇంకో విషయం గమనించండి, కరువు వచ్చింది, భూకంపం వచ్చింది, తుఫాను వచ్చింది, అందుకని పండుగలు జరుపుకోకండని చెప్పే సంస్థలు, న్యూఇయర్ మాత్రం జరుపుకోవద్దని చెప్పవు. ఎందుకు? ........... పండుగ జరుపుకోకపోతే ఆదాయం లేక నష్టపోయేది పేదలు, కానీ న్యూఇయర్ విషయంలో అలా కాదు. పండుగ జరుపుకోకపోవడం ఒక రకంగా పేదరికాన్ని పెంచుతుంది. పేదరికం పెరిగితే ప్రభుత్వం వారిని ఆదుకోవడం కోసం అభివృద్ధికి వెచ్చించవలసిన నిధులను, వీరి కోసం ఖర్చు చేస్తుంది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతుంది. ఫారిన్ బ్రాండ్లను మన దేశంలో అమ్మడం కూడా ఇందుకోసమే. అర్దం చేసుకోండి. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపరులను నాశనం చేసి, పేదరికాన్ని పెంచడం, ఈ మధ్యలో కొన్ని సంస్థల ద్వారా, వారి పేదరికానికి కారణం మధ్యతరగతి మరియు ధనికవర్గాల ప్రజలని రెచ్చగొట్టి అంతర్గతకలహాలను సృష్టించడం, దేశ సమగ్రతను, సమైఖ్యతను బలహీనపరచడం, ఆకారికి ఆఫ్ఘనిస్థాన్ మీద ఆదిపత్యం చేలించినట్లుగా భారత్ మీద కూడా ఆధిపత్యం పొంది, భారత్‌లో ఉన్న అపారమైన గనులను, సంపదను దోచుకోవడమే లక్ష్యం. మన పండుగలు చేసుకోవద్దని చేప్పే ఏ సంస్థా. న్యూఇయర్ వేడుకలను చేసుకోవద్దని చెప్పదు. ఎందుకంటే అది అన్యదేశాల ఆదాయానికి గండి కొడుతుంది, అప్పుడు వీరికి రావలసిన నిధులు ఆగిపోతాయి. అలాగే పర్యావరణహిత హోలీ చేసుకోండి, ఏకో ఫ్రెండ్లీ గణేశచవితి జరుపుకోండి, దీపావళికి టపాసులు మానండి అని చెప్పేవారు న్యూఇయర్ కి మాత్రం టపాసులు మానమని చెప్పరు. అసలు ఆ ఊసే ఎత్తరు. దీనికి తోడు ఈ న్యూఇయర్ జాడ్యాన్ని పిల్లలకు అంటించిన దాంట్లో పెద్దలు కూడా ఉన్నారు. ముగ్గులో రాసి, కేకులు తీసుకువచ్చి, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి, తలిదండ్రులు ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అదే పిల్లలను కొత్తపుంతలు తొక్కిస్తోంది. కానీ దీని వెనుక ఉన్న కుట్ర పెద్దలకు తెలియదు పాపం.  అందుకే చెప్పోచ్చేదంటంటే, న్యూఇయర్ మనది కాదు, కానీ జరుపుకోవలనుకుంటే ఆ డబ్బును పేదలకు అన్నదానం చేయడానికో, బట్టలు కొన్నివడానికో ఖర్చు చేయండి. పార్టీలకు, పబ్బులకు, మద్యానికి దూరంగా ఉండండి.

Monday, 29 December 2014

హిందూ ధర్మం - 122 (బ్రాహ్మణాలు)

బ్రాహ్మణాలు మంత్రాలకు, ఆయా కర్మలకు మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. అంతా సులువుగా అర్దమైనప్పుడు కొత్తగా వివరించే ప్రయత్నం చేయవు. కానీ ఎక్కడైన సరైన వివరణలు లేకపోతే, అక్కడ బ్రాహ్మణాలు రకరకాల పద్ధతులను ఉపయోగించి, మంత్రాలకు, కర్మలకు మధ్య గల బంధాన్ని వివరిస్తాయి. అందులో ఒక ముఖ్యమైన పద్ధతికి పేరు బంధూతం. అంటే రెండు, లేక అనేకమైన విషయాలను ఒక చోటికి చేర్చి, వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడం.

ఉదాహరణకు సోమాన్ని యాగాన్ని తీసుకువచ్చే సమయంలో దాన్ని ఒక వస్త్రంలో కట్టి, వరుణుడి మంత్రాలను చదవాలని బ్రాహ్మణాలలో ఋషులు చెప్పారు. దానికి కారణం అలా సోమలతలను వస్త్రంలో కట్టినప్పుడు/బంధించినప్పుడు, ఆ బంధనానికి ఆధిపత్యం వరుణుడు వహిస్తాడు. ఆ సోమలతలపై అధికారం ఆ సమయంలో వరుణుడికి ఉంటుంది.

పండితుల అభిప్రాయం ప్రకారం బంధూతపద్ధతిని చాలా అరుదుగానూ, తార్కికంగానూ (logical) వాడుతారు. బంధూతపద్దతితో పాటు మంత్రాలు, కర్మల మధ్యనున్న సంబంధాన్ని ఏర్పరచడం కోసం వివరణలు, శబ్దవ్యుత్పత్తి, ఐతిహ్యాలను, కధలను వివరించారు.

B. అర్ధవాదం - ఇది వివరణాత్మకమైన భాగం. ఇంతకముందు భాగం విహితకర్మలు (చేయదగిన పనులు), నిషిద్ధకర్మలు (చేయకూడని పనులు) గురించి చెప్తే, ఈ భాగం విధులను (విహితకర్మలను) ప్రశంశిస్తూ, నిషిద్ధకర్మలను ఖండిస్తుంది. प्राशस्त्यनिन्दापरं वाक्यम् अर्थवाद:।

బ్రాహ్మణాలలో అర్దవాదం చాలా పెద్దది, ముఖ్యమైనది. అర్దవాదాన్ని విధిపుచ్చం అని కూడా ఉంటారు. పుచ్చం అంటే తోక. విధి తర్వాత వస్తుంది కనుక దీనికి ఈ పేరు. ఇది విధుల గురించి, వాటి నుంచి వచ్చే ఫలితాల గురించి, నిషిద్ధర్మలను ఆచరించడం వలన కలిగే అనర్ధాలను గురించి చెప్తూ, వాటికి కారణాలను కూడా వివిధ కధల రూపంలో వివరిస్తుంది. అర్ధవాదంలో చిన్న చిన్న ఇతిహాసాలు, పురాణాలు, కధలు, ఆఖ్యానాలు, సంభాషణలు చాలా చాలా కనిపిస్తాయి. ఇందులో చాలా భాగం గద్యరూపంలో చెప్పబడింది. ఈ అర్ధవాదం వైదిక కర్మలు చేయుటకు అవశ్యతకతను చెప్తూ, వాటి ఆచరణను బలపరుస్తుంది.

To be continued .......................

Sunday, 28 December 2014

హిందూ ధర్మం - 121 (బ్రాహ్మణాలు)

c. మంత్రాలు
యజ్ఞయాగాది క్రతువులలో, వైదిక కర్మలలో మంత్రం ప్రధానం. వైదికకర్మకు మంత్రం ఎంత ముఖ్యం, మంత్రం తగిన ఫలితం ఇవ్వడానికి చెప్పబడిన కర్మను అనుసరించడం కూడా అంతే ముఖ్యం. ఆ మంత్రాల గురించి, వాటిని ఎప్పుడు, ఎలా చదవాలో చెప్తుందీ భాగం.

एतद् वै यज्ञस्य रूपसमृद्धं यत् क्रियमाणं कर्म ऋग् अनुवदति।
మంత్రము, కర్మ రెండు ఒకేసారి, చెప్పబడినట్లుగానే జరగాలి. అప్పుడే ఫలితం వస్తుంది అని పై శ్లోకం అర్దం.

d.  నామధేయః - యజ్ఞయాగాది క్రతువుల యొక్క పేర్లను చెప్తుందీ భాగం. వివిధ రకాల యజ్ఞకర్మలను అనుసరించి 3 భాగాలుగా ఇది పునర్విభజించబడింది

1. కాలాన్ని అనుసరించి చేయబడు యజ్ఞకర్మలు
a. కొన్ని యాగాలు ఒకే రోజులో ముగుస్తాయి, వాటిని ఏకాహం అంటారు. ఆరు రోజులలో పూర్తయ్యేవాటిని షడాహాలు అని, పన్నెండు రోజులలో చేసేవాటిని ద్వాదశాహాలని అనాలి.
b. కొన్ని ప్రత్యేక తిధులలో చేస్తారు. ఉదాహరణకు దర్శపూర్ణమాసం ప్రతి పూర్ణిమ, అమావాస్యకు చేస్తారు.
c. కొన్ని యాగాలు 12 ఏళ్ళ పాటు చేస్తారు, వాటిని సత్రయాగం అంటారు

2. యాగంలో వేయబడు హవిస్సును అనుసరించి 3 రకాలా యాగాలు ఉంటాయి
a. హవిర్ యజ్ఞాలు - ఆవునెయ్యిని హవిస్సుగా వేసేవి - దర్శపూణ్నమాసాలు, అగ్నిహోత్రం మొదలైనవి
b. సోమ యజ్ఞాలు - సోమరసం (సోమలతలు ఆయుర్వేద మూలికల నుంచి సేకరించిన ఔషధగుణాలు కలిగిన రసం) తో చేసే యజ్ఞకర్మలు - అగ్నిష్టోమం, అతిరాత్రం, వాజపేయం
c. పాక యజ్ఞాలు - వండిన పదార్ధాలను హవిస్సుగా సమర్పిస్తూ చేసేవి - శ్రద్ధకర్మ, శ్రావణి, చైత్రి మొదలైనవి

3. అగ్నిహోత్రం, వైశ్వదేవం వంటివి రోజు చేయాలి, దర్శపూర్ణమాసలు, చైత్రి, శ్రావణి ప్రత్యేకమైన తిధులలో చేయబడేవి, కొన్ని యాగాలు ప్రత్యేకించి కోరికలు తీరడం కోసమే చేస్తారు - పుత్రకామేష్టి, అశ్వమేధం మొదలైనవి

To be continued ..................

Saturday, 27 December 2014

నిష్కామ కర్మ

నిష్కామ కర్మ

ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబాలి కథ చెప్పాడు.

"పూర్వం జాబాలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచ్చుకలు గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబాలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు.

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.

"జాబాలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు.

'అయ్యా వచ్చావా! రా! పిచ్చుకలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు.

జాబాలి ఆశ్చర్యపోయాడు.

'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు.

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు.

'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జాబాలి కొంచెం కోపంగా.

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.

'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబాలి.

'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచ్చుకలను పిలు' అన్నాడు తులాధారుడు.

పిలిచాడు జాబాలి.

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి.

'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు.

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు.

"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు.

"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన.

'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు.

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి.

Source: Brahmasri Chaganti Koteswara RAO

Wednesday, 24 December 2014

హిందూ ధర్మం - 120 (బ్రాహ్మణాలు)

ब्रह्मणं ब्रह्मसंघाते वेदभागे नपुंसकम्।

బ్రాహ్మణాలు అనగానే ఇవి ఒక కులానికి చెందినవి అనుకుంటారు. కానీ శాస్త్రం  చెప్తోంది, బ్రాహ్మణాలు అని చెప్పబడ్డవి ఒక వ్యక్తిగానీ, స్త్రీపురుష బేధానికి కాని, ఒక కులానికి గానీ చెందవు. ఇవి వేదభాగాలు మాత్రమేనని, అదే పై వాక్యం యొక్క అర్దం.

ఈ బ్రాహ్మణాలలో వాడిన పదాలు, భాష సామాన్యమైనవి కావు. వీటికి గొప్ప మహత్తు ఉంటుంది. అవి మంత్రరూపంగా లేకపోయినప్పటికి, సరిగ్గా చదివినప్పుడు అనుకూలఫలితాలను, నియమాలు పాటించకుండా చదివినప్పుడు వ్యతిరేక ఫలితాలని ఇవ్వగలవు.

బ్రాహ్మాణాలు ప్రధానంగా రెండిటి గురించి చెప్తాయి.
A. విధులు / ధర్మాలు
B. అర్ధవాదం

1. విధులు - నియమాలు, నిషేధాలు: ఇందులో అగ్నిహోత్రం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆచరించవలసిన చిన్న చిన్న యాగాలైన దర్శపూర్ణమాసాలు, చాతుర్మాస్యాల గురించి, పెద్దపెద్ద యాగాలైన సత్రయాగం మొదలైనవాటి గురించి వివరణ ఉంటుంది. అవే కాకా, ఆయా యజ్ఞాలు చేయడం వలన కలిగే ఫలితాలు, వాటిని పాటించే విధానం, వివిధ ధర్మాలు ఈ భాగంలో చెప్పబడ్డాయి. మళ్ళీ ఈ భాగం నాలుగు భాగాలుగా విభజింపబడింది.

a. విధి - కర్మల గురించి చెప్పేది
ఉదాహరణకు अग्निष्टोमेन यजेत स्वर्गकाम:।
స్వర్గ సుఖాలను కోరుకునేవారు అగ్నిష్టోమం నిర్వహించాలి

अश्वमेधेन यजेत पृथ्विकाम:।
భూమిని, రాజ్యాలను కోరుకునేవాడు అశ్వమేధ యాగం చేయాలి

आज्याहुतिं दद्यात।
ఆజ్యాన్ని (అవునెయ్యి) యజ్ఞంలో సమర్పించండి

b. నిషేదః: చేయకూడని పనుల గురించి చెప్తుందీ భాగం

ఒక ఉదాహరణ చెప్పుకుందాం
रात्रौ श्राद्धं न कुर्यात्।
రాత్రి సమయంలో శ్రాద్ధకర్మ చేయకూడదు అని అర్దం

To be continued ......................