Tuesday 30 December 2014

జనవరి 1 న్యూఇయర్ కుట్ర

జనవరి 1 కొత్త సంవత్సర వేడుకల గురించి భిన్నాప్రాయాలు వ్యక్తమవుతాయి. కొందరు జరుపుకోవద్దంటారు, కొందరు ప్రపంచమంతా జరుపుకుంటున్న వేడుకను మనం మాత్రం జరుపుకుంటే తప్పేంటీ అంటారు. అసలు ఈ న్యూఇయర్ వేడుకలు ఒక 25 ఏళ్ళ కిందట భారత్‌లో లేవు. మరి ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చాయి? వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వీటి వెనుకనున్న శక్తులేవి? వీటిని ఇంతలా promote చేయడం వల్ల ఆ శక్తులకు వచ్చే లాభం ఏమిటి? ఈ సందేహాలాన్నిటికి సమాధానం తెలుసుకోవాలంటే ఇది చదవండి. (సమయం తక్కువగా ఉన్నందున సంక్షిప్తంగా వివరిస్తున్నా )

భారత్‌లో న్యూఇయర్ వేడుకలను promote చేయడం వెనుక అమెరికా హస్తం ప్రధానంగా ఉంది. అమెరికా, చైనా, ఇతర దేశాల దృష్టిలో భారత్ 120 కోట్ల జనాభా ఉన్న ఒక పెద్ద మార్కెట్. తమ దేశాంలో అమ్ముడుపోనివి వస్తువులను, మందులను, ఇతర ఆహారపదార్ధాలను అమ్మడానికి వాటికి భారత్ కనిపిస్తుంది. ఆయాదేశాల్లో ప్రభుత్వంచే నిషేధించబడిన వస్తువులను కూడా, ఆ ప్రభుత్వాలు భారత్‌లో అమ్మెందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటాయి. ఉదాహరణకు అధిక విషరసాయనాలు కలిగిన ఎరువులు అమెరికాలో నిషేధం అనుకోండి. ఆ ఎరువుల కంపెనీను మూసేస్తే, ఎందరికో నష్టం వాటిల్లుతుందని ఆ ప్రభుత్వం ఎరువులు ఎగుమతి చేస్తామని భారత్‌తో ఒప్పందం చేసుకుంటుంది. మన మేలు కోసం కాదు, వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం. పైగా విషపు రసాయనాలు కలిగిన ఎరువులు, మందులు భారత్‌కు ఎగుమతి చేస్తే, అవి వాడిన భారతీయులు రోగాల బారిన పడతారు. ఆ రోగాలకు కూడా వాళ్ళే మందులు ఎగుమతి చేసి, డబ్బు సంపాదిస్తారు. అదీగాకా, పౌరులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అభివృద్ధికి నిధులు వెచ్చించగలుగుతుంది. అదే పౌరులు అనారోగ్యంగా, బలహీనంగా ఉంటే ప్రభుత్వం నిధులను మందుల కోసం, వైధ్యం కోసం ఖర్చు చేస్తుంది. ఫలితంగా అభివృద్ధికి ఉపయోగించవలసిన నిధులు పక్కదారి మళ్ళుతాయి. ఆర్ధికలోటు కూడా ఏర్పడవచ్చు, ప్రభుత్వం అంతర్జాతీయసంస్థల నుంచి అప్పు తీసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ఒక దేశం అప్పు చేసిందంటే, అదేమి గోప్ప విషయం కాదు, ఆ దేశం తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోతున్నదని చెప్పటానికి అదె నిదర్శనం. ఇదంతా అమలు చేయడానికి అమెరికా సహా అనేక దేశాలు రకరకాల కుట్రలకు పాల్పడుతున్నాయి. ఎక్కడా కూడా ఆయా దేశాలు ఇందులో ఉన్నట్టు అనుమానాలు రాకుండా మిషనరీలు, కొన్ని స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు, సంఘసంస్కరణే తమ లక్ష్యం అని ప్రచారం చేసుకుంటున్న కొన్ని సంస్థలు, మీడియా, సినీదర్శకుల ద్వారా సినిమాలు .............. ఇంకా అనేక మాధ్యమాల ద్వారా, వాటికి నిధులను సమకూరుస్తూ, చాపా కింద నీరులా తమ ప్రణాలికలను అమలు చేస్తున్నాయి. ఇదంతా ఒట్టి కల్పితం అని మీరు అనవచ్చు. ఇది నిజమని చెప్పడానికి చిన్న ఉదాహరణ చూపిస్తాను. భారతీయుల మేధాశక్తి అపారమైంది. భారాత్‌కు స్వతంత్రం వచ్చాకా, అది గొప్పగా అభివృద్ది చెందుతుందని అమెరికా సహా, కొన్ని దేశాలు భయపడి కొన్ని కుతంత్రాలు చేశాయి. వాటిలో ఒకటి తమిళనాట ద్రావిడ జాతీయవాదాన్ని ప్రోత్సహించడం. డిఎంకె రాజకీయ పార్టీ వచ్చిన ముఖ్య ఉద్దేశ్యం కూడా ప్రత్యేక తమిళదేశం ఏర్పాటు చేసుకోవడం. 1962 లొ భారాత్-పాకిస్థాన్ యుద్ధం జరిగే వారకు, డిఎంకెను పావుగా వాడుకుంటూ భారత్‌లో అంతర్గత కలహాలు సృష్టించి జాతీయనాయకులను బెదిరించింది అమెరికా. అదే సమయంలో భారత్ నుంచి వేరు పడిన పాకిస్థాన్‌కు ఆయుధాలు ఎగుమతి చేసి, దానికి బలం అందించింది. చైనా కూడా అంతే. భారత్-చైనా యుద్ధ వచ్చినప్పుడు కూడా అమెరిక్ భారత్‌కు సాయం చేయడానికి బహిరంగంగానే నిరాకరించింది. అప్పుడే అమెరికా బుద్ధి బయటపడింది.

అదే తరహాలో న్యూఇయర్ వేడుకలను ఇంత పెద్దగా promote చేయడం వెనుక కూడా ఒక పన్నాగం ఉంది. న్యూఇయర్ పేరుతో క్లబ్బులు, పబ్బులకు, మద్యానికి, మాదకద్రవ్యాలను యువతకు అలవాటు చేయడం వారి ప్రణాళికలో ప్రధానమైన అంశం. ఇలా చేస్తే ఆయా దేశాలకు 120 కోట్ల జానాభా గల పెద్ద మార్కెట్ వస్తుంది. తమ దేశంలో తయారయ్యే మాదకద్రవ్యాలు, మద్యం ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇప్పుడున్న భారతీయ విద్యావిధానం ఆంగ్లేయుడైన మెకాలే రూపొందించింది. అది భారతీయులను మానసికంగా, నైతికంగా బానిసలు చేయడమే లక్ష్యం. అన్యదేశాల్లో మద్యం, మాదకద్రవ్యాల వ్యసనం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని నిరోధించడం కూడా కష్టమే. కానీ భారతీయకుటుంబ వ్యవస్థ కారణంగా, ఇతర దేశాల్లో వలె మన దేశంలో యువుతకు దురలవాట్లు తక్కువ. ఈ దేశపు యువత మానసికంగా స్కూలోనే బలహీనపడ్డారు. శారీరికంగా కూడా వారిని బలహీనపరిచే ప్రణాళిక భాగమే న్యూఇయర్ వేడుకల పేరుతో జరిగే పార్టీలు. నగరాల్లో ఉండేవారిని, ముఖ్యంగా ఒంటరిగా హాస్టల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఒక పధకం రచించారు. ముందు పార్టీలకు అలవాటు చేయడం, మద్యం అలవాటు చేయడం, తర్వాత మాదకద్రవ్యాలు అలవాటు చేయడం ........... ఇలా ఒక్కొక్కటి చేస్తారు. ఆఖరున కుటుంబవ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి, యువతను నైతికంగా, మానసికంగా ఒంటరిగా చేయడం ఇందులో భాగం. ఒంటరి అయినవారికి సాయం అందిస్తాము, ఒంటరితనం దూరం చేస్తామంటూ మతమార్పిడి చేయడం ఆఖరి ఘట్టం. ఇది పైకి చెప్పినంత బహిరంగంగా జరగదు, చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇదంతా తెలియక చాలా మంది మనం ఎన్నో సంస్కృతులను అంగీకరిస్తున్నప్పుడు, ఈ న్యూఇయర్ వేడుకలను మాత్రం చేసుకుంటే తప్పేంటి అంటూ జరుపుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. భారత్ ఆర్ధికంగా, నైతికంగా, ధార్మికంగా, మానసికంగా, భౌతికంగా పతనమవ్వాలంటే కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అయితే చాలని భారతదేశాన్ని అర్దం చేసుకున్న స్వదేశీ ఆర్ధికవేత్తలకు స్పష్టంగా తెలుసు.

అలాగే పండుగలు జరుపుకోవడం వేరు, న్యూఇయర్ జరుపుకోవడం వేరు. పండుగల సమయంలో ఆకులు, పూలు, ప్రమిదలు, ఇతర సామాన్లు అమ్మేది సాధారణ లేక పేద ప్రజలు మాత్రమే. ప్రభుత్వం వారికి ఇచ్చే సబ్సీడీలు, పధకాలకంటే, వారిని హిందూ సమాజం పండుగల ద్వారనే పోషిస్తోంది. ఒకసారి గమనించండి. మనం పండుగ జరుపుకున్న ప్రతిసారి ఆయా పేద కుటుంబాలకు ఆదాయం వచ్చి కడుపు నిండుతుంది, వారూ పండుగ చేసుకుంటారు. కానీ న్యూ ఇయర్ వేరు. దీంతో పేదవారికి వచ్చేదేమి ఉండకపోగా, తాము అలాంటి పార్టీలకు దూరం అవుతున్నామనే బాధ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బలంగా తీసుకుని, కొన్ని మిషనరీలు వారికి డబ్బు ఆశచూపి మతం మారిస్తున్నాయి.

ఇంకో విషయం గమనించండి, కరువు వచ్చింది, భూకంపం వచ్చింది, తుఫాను వచ్చింది, అందుకని పండుగలు జరుపుకోకండని చెప్పే సంస్థలు, న్యూఇయర్ మాత్రం జరుపుకోవద్దని చెప్పవు. ఎందుకు? ........... పండుగ జరుపుకోకపోతే ఆదాయం లేక నష్టపోయేది పేదలు, కానీ న్యూఇయర్ విషయంలో అలా కాదు. పండుగ జరుపుకోకపోవడం ఒక రకంగా పేదరికాన్ని పెంచుతుంది. పేదరికం పెరిగితే ప్రభుత్వం వారిని ఆదుకోవడం కోసం అభివృద్ధికి వెచ్చించవలసిన నిధులను, వీరి కోసం ఖర్చు చేస్తుంది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతుంది. ఫారిన్ బ్రాండ్లను మన దేశంలో అమ్మడం కూడా ఇందుకోసమే. అర్దం చేసుకోండి. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపరులను నాశనం చేసి, పేదరికాన్ని పెంచడం, ఈ మధ్యలో కొన్ని సంస్థల ద్వారా, వారి పేదరికానికి కారణం మధ్యతరగతి మరియు ధనికవర్గాల ప్రజలని రెచ్చగొట్టి అంతర్గతకలహాలను సృష్టించడం, దేశ సమగ్రతను, సమైఖ్యతను బలహీనపరచడం, ఆకారికి ఆఫ్ఘనిస్థాన్ మీద ఆదిపత్యం చేలించినట్లుగా భారత్ మీద కూడా ఆధిపత్యం పొంది, భారత్‌లో ఉన్న అపారమైన గనులను, సంపదను దోచుకోవడమే లక్ష్యం. మన పండుగలు చేసుకోవద్దని చేప్పే ఏ సంస్థా. న్యూఇయర్ వేడుకలను చేసుకోవద్దని చెప్పదు. ఎందుకంటే అది అన్యదేశాల ఆదాయానికి గండి కొడుతుంది, అప్పుడు వీరికి రావలసిన నిధులు ఆగిపోతాయి. అలాగే పర్యావరణహిత హోలీ చేసుకోండి, ఏకో ఫ్రెండ్లీ గణేశచవితి జరుపుకోండి, దీపావళికి టపాసులు మానండి అని చెప్పేవారు న్యూఇయర్ కి మాత్రం టపాసులు మానమని చెప్పరు. అసలు ఆ ఊసే ఎత్తరు. దీనికి తోడు ఈ న్యూఇయర్ జాడ్యాన్ని పిల్లలకు అంటించిన దాంట్లో పెద్దలు కూడా ఉన్నారు. ముగ్గులో రాసి, కేకులు తీసుకువచ్చి, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి, తలిదండ్రులు ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అదే పిల్లలను కొత్తపుంతలు తొక్కిస్తోంది. కానీ దీని వెనుక ఉన్న కుట్ర పెద్దలకు తెలియదు పాపం.  అందుకే చెప్పోచ్చేదంటంటే, న్యూఇయర్ మనది కాదు, కానీ జరుపుకోవలనుకుంటే ఆ డబ్బును పేదలకు అన్నదానం చేయడానికో, బట్టలు కొన్నివడానికో ఖర్చు చేయండి. పార్టీలకు, పబ్బులకు, మద్యానికి దూరంగా ఉండండి.

No comments:

Post a Comment