Showing posts with label జాగో హిందూ. Show all posts
Showing posts with label జాగో హిందూ. Show all posts

Thursday, 21 March 2019

ఇంతకీ మోదీ మనకు ఏం చేశాడు ?


ఇంతకీ మోదీ మనకు ఏం చేశాడు ? 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసలు బిజెపి దేశం కోసం ఏం చేసిందో తెలుసుకోవడం చాలా అవసరం ఏమో. మోదీ-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండు సంవత్సరాల్లోనే దాదాపు 32 వేల ఎన్జీవోలకు నోటీసులు ఇచ్చి, వాటి లైసెన్స్ రద్దు చేసిందని మీకు తెలుసా? 

నిజానికి సేవ ముసుగులో ఎన్నో ఎన్జీవోలు మన దేశంలో పని చేస్తూ విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నాయి. అయితే అవి చేసేది సేవ కాదు, మత మార్పిడి. కొన్ని సందర్భాల్లో ఈ మత మార్పిడి ఎంత ప్రమాదకరంగా ఉందంటే- అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే విధంగా ఆ ఎన్జీవోలు స్థానిక ప్రజానీకాన్ని ఉసిగొల్పుతున్నాయి. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ- తమిళనాడులో ఉన్న అణు విద్యుత్ కేంద్రం వద్ద జరిగిన ఆందోళనలు. ఆ ఆందోళనలను పసిగట్టిన స్వామినాధన్ గురుమూర్తిగారు అక్కడ ఉన్న స్థానిక చర్చిని రద్దు చేయమని సలహా ఇచ్చారు. అక్కడ చర్చి వచ్చిన తర్వాతే ఆ ఆందోళనలు మొదలయ్యాయి.

మేఘాలయాలో కాశీ పర్వతాలని ఉన్నాయి. ఈ పర్వతాల్లో యూరేనియం దొరుకుతుందని, ఆ యూరేనియం భారతదేశ అవసరాలకు వాడుకుంటే, ఇతర దేశాల మీద ఆధారపడకుండా భారతదేశం అణు రంగంలో స్వయం ప్రతిపత్తి సాధిస్తుందని తెలిసిన కొన్ని విదేశాలు, అక్కడ ఎన్జీవోలు మతమార్పిడులకు పాల్పడి, కొనిన్ బోధనల ద్వారా ఉద్యమం లేవనెత్తాయి. ఫలితంగా అక్కడ జరగాల్సిన అభివృద్ధి ఆగిపోయింది. 

అలాగే గిరిజనులకు వైద్య సేవలు చేస్తామంటూ చత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల్లో పనిచేసే కొన్ని ఎన్జీవోలు, మావోయిస్టులకు, నక్సలైట్లకు సాయం చేస్తున్నట్టు కూడా బయటపడింది. ఈ విధంగా సేవ ముసుగులో అనేక ఎన్జీవోలు విదేశాల నుంచి నిధులు తెచ్చుకొని దేశంలో, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇటువంటివి జరగరాదని భావించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్జీవోల నుంచి వారి సేవా వివరాలు అడిగింది. ఏవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటూ ఆరా తీసింది. FEMA, FERA చట్టాలను ఉపయోగించింది. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అనేక ఎన్జీవోలు, దాదాపు 20 వేల ఎన్జీవోల లైసెన్స్లను రద్దు చేసింది. 

నిజానికి ఈ ఎన్జీవోలు మావోయిస్టులకు, మతమార్పిడి మూకలకు, భారతదేశ వ్యతిరేక సాహిత్యాన్ని రాసే దేశద్రోహులను ప్రోత్సహిస్తున్నాయి, ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. ఇందులో విదేశాల నుంచి డబ్బులు పొందుతూ లెక్కలు చూపని హిందూ సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం ఎక్కడ పక్షవాతం చూపించలేదు. కాకపోతే దేశవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడే ఎన్జీవోలే కనుక వాటికి గట్టి దెబ్బ తగిలింది.

మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి నిధులు రావడం ఆగిపోయింది. ఫలితంగా వారిలో అసహనం పెరిగింది. మీకు గుర్తు ఉండే ఉంటుంది, మోడీ ప్రభుత్వం వచ్చిన తొలి రెండేళ్లలో మనదేశంలో అసహనం (Intolerance) పెరుగుతోంది అంటూ కొన్ని ఉద్యమాలు వచ్చాయి. కొందరు తమకు వచ్చిన అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు, విదేశాలకు వెళ్ళిపోతామని ప్రకటనలు చేశారు. నిజానికి మన దేశంలో అప్పుడు హిందుత్వవాదులు అసహనం పెరగడం కాదు, తమకు రావలసిన నిధులు అందకపోవడంతో ఈ దేశంలో ఉన్న ఎందరో 'మేధావులకు', మిషనరీలకు కడుపు మండింది. నిజానికి ఇక్కడ మనం ప్రభుత్వాన్ని గట్టిగా మెచ్చుకోవాలి ఎందుకంటారా? చట్టపరమైన వివరాలు ఇవ్వనందుకు, ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థల్లో ఒకటైన ఫోర్డ్ ఫౌండేషన్ వారి కార్యకలాపాలను కూడా భారతదేశంలో స్తంభింపజేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. వారికి తాఖీదులు ఇచ్చింది. దీని మీద అమెరికా ప్రభుత్వం మోదీని ఎంతో ఒత్తిడికి గురిచేసినా, చాలా కాలం మన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. CIA లాంటి సంస్థలు కూడా మోదీ ప్రభుత్వం యొక్క పట్టుదలను చూసి భయపడ్డాయి. ఇవన్నీ వార్తల్లో వచ్చిన అంశాలే. ప్రభుత్వం ఇంత గట్టిగా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక మన దేశంలో అసహనం పెరిగింది ఉద్యమాలు చేశారు. నిజానికి ఒక గట్టి కేంద్ర ప్రభుత్వం, సుస్థిర ప్రభుత్వం ఉంది కాబట్టే ఈ విధంగా చేయడం సాధ్యమైంది. 

ఇలాంటి సాహసోపేత నిర్ణయం ఇంతవరకు మన దేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఆ విధంగా చూసినప్పుడు మోదీ భారతదేశానికి మేలు చేసే విధంగా తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని, హిందూ సమాజం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఇలాంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడమే కాదు ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ఇలా మతమార్పిడులు చేస్తున్న వారిని పాల్పడుతున్నవారు మీద కఠినంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి మనం అండగా నిలబడకపోతే, ఇంకెవరు నిలబడతారు? అలాంటి వారికి మనం మద్దతు పలకకపోతే, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటారా ఆలోచించి చెప్పండి. #NamoAgain 

Saturday, 12 August 2017

భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు? - డా.సుబ్రమణియన్ స్వామి సమాధానం

నిజమైన భారత దేశ చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక దేశ భక్తుడి బాధ్యత !

నేను హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నపుడు ఒక సౌదీ అరేబియా విద్యార్ధి నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: "భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు? " నేను అన్నాను "నువ్వు అడగదలుచుకున్నది ఏమిటి?"

ఆ విద్యార్ధి ఈ విధంగా చెప్పాడు: "రియాద్ లో మా విశ్వవిద్యాలయం లో జరిగిన పరిశోధనలో ఎక్కడ ఇస్లాం ప్రవేశిస్తే ఆ దేశం 100% ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది అని తెలుసుకున్నాను. ఉదా: ఇరాన్ ఒక జొరాస్ట్రియన్ (మతం) దేశం, కాని ఇస్లామిక్ దండయాత్ర జరిగిన తరువాత అక్కడ జనాభ మొత్తం 100% ఇస్లాం లోకి మారిపోయారు, 17 సంవత్సరాలలో ఇరాక్ కూడా ఇస్లామిక్ దేశం గా మారిపోయింది, 21 సంవత్సరాలలో ఈజిప్ట్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. అలాగే క్రైస్తవ మతం కూడా ఐరోపాలో 50 సంవత్సరాలలో వ్యాపించింది. కాని భారత దేశం మాత్రం 800 సంవత్సరాలు ముస్లిం పాలనలో, 200 సంవత్సరాలు బ్రిటీషు(క్రైస్తవ) పాలనలో ఉంది. కాని ఇంకా భారత దేశం లో 80% హిందువులు ఎలా ఉన్నారు?"  

నా సమాధానం: మన దేశం పై దండ యాత్ర చేసిన విదేశీయులతో మనం ఎన్నో యుధ్ధాలలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మన పూర్వీకులు పోరాటాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వారి తుది శ్వాస వరకు పొరాటం చేశారు. అందుకే ఈ దేశంలో ఇంకా సనాతన ధర్మం మిలిగి ఉంది.

-సుబ్రమణియన్ స్వామి


నిర్విరామంగా మన పూర్వీకులు దాదాపు 2000 సంవత్సరాలకు పైగా ధర్మం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎంతో దారుణమైన, కష్టమైన పరిస్థితులను ఎదురుకుని నిలిచారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఎందుకోసం? ఎవరి కోసం? ....... అందుకే మనం ఇవాళ హిందువులుగా జన్మించగలిగాము అంటే అది వారి బిక్షయే..... ఇంత గొప్ప సంస్కృతికి వారసులము కాగలిగాము. వాళ్ళ శ్రమ, త్యాగాలు వృధా కాకూడదు. ఈ ధర్మాన్ని రక్షించి, మన తర్వాతి తరాలకు అందించడం మినహా మరే ఇతర విధంగానూ మనం వారి ఋణం తీర్చుకోలేము. ధర్మాచరణ, ధర్మ ప్రచారం, ధర్మ రక్షణ, దేశరక్షణ మన తక్షణ కర్తవ్యాలు. అవే మన తాతముత్తాలకు, పితృదేవతలకు ఇచ్చే పెద్ద గౌరవం.

Sunday, 15 January 2017

హిందూ ధర్మం - 234 (జ్యోతిష్యం - 16)



వారి మీద మన ప్రభావం అధికంగా ఉండేది. మనకు వారానికి 7 రోజులు, వారు అదే తీసుకున్నారు. మనకు సంవత్సరానికి 12 నెలలు. కలియుగంలో అది చైత్రం నుంచి మొదలవుతుంది, ఫాల్గుణంతో ముగుస్తుంది. వారు కూడా 12 నెలల లెక్క తీసుకున్నారు. అందులో ఆ నెలలకు కాలక్రమంలో ఆగస్టస్ మొదలైన రాజులు పేర్లు పెట్టినప్పటికీ, సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఉన్న నెలల పేర్లకు అర్దం మాత్రం మారలేదు. ప్రస్తుత గ్రిగేరియన్ క్యాలెండర్‌కు పూర్వం, జూలియన్ క్యాలెండర్ ఉండేది, దానికి పూర్వం రోమన్ క్యాలెండర్ ఉండేది. వారు వీటికి ఏ ప్రాతిపదికన పేర్లు పెట్టారంటే సెప్టెంబరు అంటే 7 నెల (సప్త =సెప్టే) అని అర్దం. అక్టోబరు అంటే 8 వ నెల (అష్ట = అక్టో), నవంబరు 9 వ నెల (నవ = నవ), డిసెంబరు 10 వ నెల (దశ = డిసెం). ఇంతకీ ఇవి ఎవరికి? హిందువులకు. హిందువులకు చైత్రంతో సంవత్సరం ప్రారభమవుతుంది. అంటే మార్చి - ఏప్రిల్ మధ్య. అక్కడి నుంచి క్రమంగా లెక్కించుకుంటూ వస్తే, మనకు 7, 8, 9, 10 నెలలని మనము ఏది అంటూన్నామో, వారూ దాన్నే స్వీకరించారు. ఇంతకంటే ఋజువేమీ కావాలి? వారు మన దగ్గరి నుంచి జ్యోతిష్యం, కాలగణనం తీసుకున్నారని చెప్పడానికి.

మనము మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. ఇప్పుడు సంక్రాంతి జనవరి నెల 14, 15 తేదీల్లో వస్తోంది. వివేకానంద స్వామి జన్మించింది మకర సంక్రాంతి రోజున, జనవరి 12, 1863 లో. అంటే అప్పట్లో సంక్రాంతి జనవరి 12. భూమి అయనగతి (Axial precession) కారణంగా sidereal zodiac అసలు స్థితిలో ప్రతి 72 ఏళ్ళకు 1 డిగ్రీ మార్పు వస్తుంది. అందువలన మకర సంక్రాంతి ప్రతి కొనేళ్ళకు (నిర్ణీత సమయానికి) ఒక రోజు ముందుకు జరుగుతుంది. దీనికి ఈనాడు శాస్త్రవేత్తలు చెప్పే శీతాకాల అయనాంతం (వింటర్ సొలిస్టిక్) కు సంబంధం ఉంది. ఇలా వెనక్కు లెక్కించుకుంటూ పోతే, చరిత్రలో ఒకానొక సమయంలో మకర సంక్రాంతి, వింటర్ సొలిస్టిక్ ఒకటే రోజున జరిగిన సందర్భం ఉంది.

The actual position of winter solstice in the sidereal zodiac changes gradually due to the Axial precession of the Earth, shifting westwards by approximately 1 degree in every 72 years. Hence, if Makara Sankranti at some point of time did mark the actual date of winter solstice, it would have been so around 300 CE, the heyday of Indian mathematics and astronomy

ఇది ముఖ్యంగా గ్రీకు సామ్రాజ్యం వర్దిల్లిన కాలంలో, అంతకు ముందు మహాభారత కాలంలో కూడా ఉండి ఉండవచ్చు. ఇలా లెక్కించుకుంటూ పోతే, పరాశర మహర్షి సమాజంలో మానవ దేహంతో సాధారణంగా తిరిగిన రోజుల్లో డిసెంబరు 25 న మకర సంక్రాంతి జరుపుకుందీ ప్రపంచం. మహాభారత యుద్ధం కేవలం సైనికులనే కాదు, మహర్షులను, వేద పండితులను, బ్రాహ్మణులను సైతం బలి తీసుకుందని, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ధర్మ ప్రచారకులు లేక ధర్మ ప్రచారం సన్నగిల్లిందని అన్నారు మహర్షి దయానంద సరస్వతీ. తిరిగి భారతీయులు క్రీస్తు పూర్వం నాటికే గ్రీకులుతో వ్యాపర సంబంధాలు కలిగి ఉండి, అక్కడ కాలనీలు ఏర్పరుచుకోవడంతో మళ్ళీ అక్కడికి ధర్మ పవనాలు వీచాయి. అలా గ్రీకులు కూడా మన దేవతలనే తీసుకుని పూజించారు. భారతీయులు మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు. దానినే గ్రీకులు స్వీకరించారు. అప్పుడు మకర సంక్రాంతి జరిగింది డిసెంబరు 25 న. వారు కూడా దాన్ని సెలవు దినంగా, పవిత్ర దినంగా భావించి సుర్యారాధన చేశారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం కుప్పకూలి రోమన్ సామ్రాజ్యం నిర్మితమైంది. వారు కూడా ఈ ఆచారాన్ని విడువలేదు. పైగా డిసెంబరు 17 నుంచి 25 వరకు సెలవు రోజు పాటించి, వారం పాటు పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత క్రైస్తవం పుట్టింది. అది రోమన్, గ్రీకు నాగరికతలను, తనలో కొంత కలుపుకుని, కలుపుకోవడానికి విరుద్ధంగా ఉన్నవాటిని అవతల పారేసింది. గ్రీకు, రోమన్ నాగరికతలను పురావస్తు శాలలకు పరిమితం చేసింది. దీని గురించి రాజీవ్ మల్హోత్రా గారు అద్భుతంగా చెప్తారు. Digestion అనే concept ను సృష్టించి, దీన్ని విశదీకరించారు. అలాంటి సందర్భంలో రోమన్లు సూర్యుని కోసం నిర్వహించే పండుగలో Sun కు బదులుగా Son (As per Christian belief, Jesus is the son of God)ను తీసుకువచ్చింది. నిజానికి జీసెస్ పుట్టింది మార్చి, ఏప్రియల్ కాలంలో. ఆయన డిసెంబరు 25 న పుట్టినట్లు చరిత్రలో కానీ, బైబిల్ లో కానీ ఏ విధమైన ఆధారం లేదు. నిజానికి క్రిస్టమస్ పేగన్ల పండుగ. విగ్రహారాధన, చెట్లను, నదులను, జంతువులను పూజించడం బైబిల్ అంగీకరించదు. క్రిస్టమస్ ట్రీ అనేది కూడా స్థానికి జాతులు (హిందువులు!?) పూజించే వృక్షం. అక్కడి వారిని మతమార్పిడి చేసి, ఆ మతాన్ని నాశనం చేయడం కోసం, క్రైస్తవం, అక్కడి స్థానిక తెగల వారి ఆచారాలను కాపీ కొట్టింది. మా దగ్గర కూడా చెట్లను పూజిస్తారు, సరిగ్గా డిసెంబరు 25 నే మేము పండుగ చేసుకుంటాము అంటూ ............ ఇప్పుడు భారతదేశంలో వేంకటేశ్వర సుప్రభాతాన్ని పోలిన ఏసు సుప్రభాతం, ఆలయాన్ని పోలిన చర్చి నిర్మాణం, అందులో ధ్వజస్థంభం, సన్యాసులను పోలిన వస్త్రధారణ, క్రైస్తవులు కూడా ఏసు మాల ధారణ, వేదాలు, ఉపనిషత్తులు ఏసు ......... ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్లే అక్కడ చేశారు. వాళ్ళు మనలని కాపీ కొట్టడం కాదు, అనుకరించి, మీ దగ్గర ఉన్నవే మా దగ్గరా ఉన్నాయి, కనుక మారినా మీరేమీ నష్టపోరు అంటూ మార్చే ప్రయత్నం (మన ఆత్మ సిద్ధాతాన్ని అనుకరించలేరు, మూలాలను కాపీ చేస్తే క్రైస్తవమే అంతరిస్తుంది). ఇప్పుడు మనం అంటాం కదా, నదులన్నీ సముద్రంలోనే కలవాలి, మతాలన్నీ హిందూత్వంలోనే కలవాలి అని. బహుసా వాళ్ళు కూడా అప్పుడు అలా అనుకున్నారో లేదో కానీ ఇదే వ్యూహాన్ని క్రైస్తవులు అమలు పరిచి ఎన్నో మతాలను నాశనం చేశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి.

విషయంలోకి వస్తే, అలా గ్రీకు, రోమన్లు జరుపుకునే మకర సంక్రాంతి నేటి క్రిస్టమస్ అయ్యింది.

To be continued ...............

Wednesday, 16 March 2016

దేశం మేలు కోరే ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం

యూరోపులో 16 వ శతాబ్దంలో మొదలైన భారతదేశ అధ్యయనం 19 వ శతాబ్దం నాటికి తన విషపడగ విప్పడం మొదలు పెట్టింది, భారతదేశాన్ని అస్థిరపరచడం, అసలు భారతదేశమే లేదని చెప్పడం, సనాతనధర్మాన్ని నశింపజేయడం, ధర్మంలోని అంశాలను క్రైస్తవీకరించడం, ప్రత్యేక అస్థిత్వవాదాలను ప్రోత్సహించడం, విఛ్ఛినకర సాహిత్యాన్ని అందించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటన్ కేంద్రంగా సాగిన ఈ కుట్ర, స్వాతంత్రానంతరం అమెరికా కేంద్రంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని అస్థిరపరచడంలో తమ వంతు ప్రణాలికలను పక్కగా అమలు చేసి చాలా వరకు విజయం సాధించాయి విఛ్ఛినకర శక్తులు. ఈ శక్తుల చేతిలో భారతీయులే పావులై దేశాన్ని విఛ్ఛినం చేయాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి అనేక కుట్రలను బట్టబయలు చేసిందీ పుస్తకం. విఛ్ఛినకర శక్తులు ఏవీ? వాటికి ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? అవి ఎలా పని చేస్తాయి? మనం వాటిని ఎలా అనుసరిస్తూ, మనకు తెలియకుండానే దేశానికి విఘాతం కలిగితున్నామో ఈ పుస్తకం చదివితే అర్దమవుతుంది. ఈ అంశంపై రాజీవ్ మల్హోత్రా గారు 5 ఏళ్ళు పరిశోధించి, వారి జీవితాన్ని పణంగా పెట్టి, అరవిందన్ నీలకందన్‌తో కలిసి కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు’ పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

ఇప్పుడు భారతీయ యువత చదువుకున్నారు, వారు విఛ్ఛినకర శక్తులకు పావులుగా మారరు, వారు చాలా తెలివైనవారని లేదా భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవరెన్ని చేసినా ఈ దేశానికి ఏమీ కాదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. సమస్యను తెలుసుకోకుండా, దానికి తగిన విధంగా స్పందించకుండా, ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేయడాన్ని వెర్రితనం అంటారు. శరీరంలో జబ్బు ఉంది, అయినా అది లేదని, నాకేం కాదని దాటవేస్తూ కూర్చుంటే ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇది కూడా అంతే.

ఈ పుస్తకమేదో సంచలనం కోసమో, రెచ్చగొట్టడం కోసమో రాసింది కాదు. విఛ్ఛినకర శక్తులు సమాజంలో ఉన్నాయి. ఈ పుస్తకం చదివిన తర్వతా వారెవరో అర్దమవుతుంది. చదవకుండానే ఇదంతా ట్రాష్ అని తీర్పులివ్వకండి. కొంచం ఓప్పిగ్గా ఈ పుస్తకం చదవండి.

ఇది అందరూ చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా విద్యార్ధులు, తల్లులు. స్కూల్లు, కాలేజీలకు వెళ్ళిన మీ పిల్లలు విఛ్ఛినకర శక్తుల మాయమాటలు నమ్మి రోహిత్, కన్నయ్య కూమార్ లాగా బలి కాకుండా ఉండాలంటే ప్రతి తల్లి ఈ పుస్తకం చదివి, తన పిల్లలను జాగృతం చేయాలి.

Wednesday, 15 July 2015

పుష్కరాల నెపంతో హిందూసంస్కృతిపై పై తెదేపా దాడి

పుష్కరాల ముందు నుంచి కొందరి వ్యాఖ్యలు చూస్తుంటే హిందువులను పనిగట్టుకుని ఇన్ని మాటలు ఎందుకంటున్నారా అని బాధేస్తుంది. ఒకడేమో పుష్కరాలు మతాతీతం అంటాడు. ఇంకొకడు అసలు పుష్కరాలు జరపడమే తప్పు, అదంతా మూఢనమ్మకం అంటాడు. ఇంకొకడు హిందువులకు వెర్రి, ఆ వెర్రి వాళ్ళ ఓట్ల కోసమే మా నాయకుడు పుష్కరాలకు పూనుకున్నాడు, ముహూర్తం చూసుకుని మునకేశాడు అంటున్నాడు. నిన్న జరిగిన తొక్కిసలాటకు బాధ్యత హిందూత్వ వాదులు, ఆధ్యాత్మిక జీవులు, ప్రజలు కూడా వహించాలని ఇంకో కుహనా మేధావి విమర్శ. వీళ్ళంతా ఏవరో అనామాకులు కాదు, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, ఆయన భజన బృందం.
మళ్ళీ ఈ స్నానాలు చేయడం పిచ్చి అంటున్నారు ఆ పార్టీ వాళ్ళే. అసలు వాళ్ళు తప్ప మనకు ఇంకెవరు దిక్కులేరని అనుకుంటున్నారేమో? మరి మాకు పిచ్చి పడితే అది బహిరంగంగా చెప్పచ్చు కదా, అలా దాచుకుని మీరు పిచ్చి నటించడం ఎందుకు?

పుష్కరాలు, లేక హైందవ ధర్మానికి చెందిన ఉత్సవాలు, పండుగలు చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఊరుకోండి. ఏమీ చేయకండి. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారు. దేవాలయాలని మీ గుప్పిట పెట్టుకుని, ఆలయ హుండీల్లో సొమ్మును ప్రభుత్వం తీసుకుంటూ, పండుగలు, ఉత్సవాలు, పుష్కరాల సమయంలో టూరిజం ప్రమోట్ చేసుకుని డబ్బు సంపాదిస్తూ, తిరిగి హిందువుల మీద పడి ఏడ్చే మిమ్మల్ని ప్రజలు ఏమనాలి?

అసలు పుష్కరాలు మతాతీతం అని వాళ్ళు ఎలా చెప్తారు? పుష్కరుడు, బృహస్పతి, పితృదేవతలు, నదులకు పూజ, ప్రకృతి పూజ, నదీస్నానం .......... ఇవన్నీ ఏ మతగ్రంధం అంగీకరిస్తుంది? ఒక్క హిందూ ధర్మం తప్పించి మరే మతగ్రంధమూ వీటిని అంగీకరించదు. పుష్కరాల్లో ఎవరైనా స్నానం చేయవచ్చు. అంతమాత్రానా పుష్కరాలు మతాతీతం కావు. పుష్కరలు హిందూ ఐక్యతకు నిదర్శనం.

ఈ దేశంలో పుష్కరాలు ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. వాటికి ఏ ప్రచారమూ లేదు, అవసరంలేదు. పంచాంగంలో చెప్పిన ఒక చిన్న తిధిని గుర్తుపెట్టుకుని వేలాదిమంది స్వచ్చందంగా హాజరవుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు, పుష్కరాల పేరుతో తమను తాము మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు పుష్కరాల్లో రకరకాల వస్తువులు అమ్మెవారు, ఇప్పుడు ఏకంగా పుష్కరాలనే అమ్మేస్తున్నారు. ప్రభుత్వాలు ఏర్పడకముందు కూడా పుష్కరాలు జరిగాయని మర్చిపోకండి. పుష్కరాలు విజయవంతమైతే, అది మీ పార్టి ఖాతాలో వేసుకుంటారా? అందులో అపశృతి జరిగితే దానికి హిందువులు బాధ్యులా?  ఆధ్యాత్మిక గురువులు బాధ్యులా? ఆధ్యాత్మికతయే భారతదేశానికి ఊపిరి. ప్రవచనాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అందులో వారు చెప్పే విలువలతో కూడిన మాటలే ఈ దేశాన్ని నడిపిస్తున్నాయి. అసలు పుష్కరాలకు ముందు మీరెంత మంది సాధుసంతులతో సమావేశం జరిపారు? అసలు అలాంటి ఆలోచన వచ్చిందా? ఇందులో స్వయం సేవకులు, విహెచ్‌పిని భాగాస్వామ్యం చేశారా? అనేక ఇతర హిందూ ధార్మిక సంస్థలను పిలిచారా? కేవలం మీ పార్టీ కార్యక్రమంలా జరిపారు. మిత్రకూటమిలోని మంత్రిని కూడా పక్కన పడేశారు. అలాంటీ మీరా హిందూసమాజాన్ని విమర్సించేది. ఎక్కడైనా తొలిస్నానం పుణ్యమూర్తులు, సాధువులు, సన్యాసులు చేస్తారు. మరి మీ దగ్గరో? అందరిని పక్కన పెట్టారు. ఘోరం జరిగాకా హిందువుల మీద నింద వేస్తారా? ఎన్ని చేసినా మేము భరించాలని మీరు భావిస్తున్నారా?

ఎప్పుడూ ఏదో ఒక రకంగా హిందువుల మీద దాడి చేస్తూనే ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇకనైన ఇలాంటి అర్దంపర్దం లేని వ్యాఖ్యలకు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలకు స్వస్తి చెప్పాలి.  
(ఈ వ్యాఖ్యలు ఎవరో కార్యకర్తలు చేయలేదు, తెదేపాలో మంచి స్థానంలో ఉన్నవారు చేసినవి.)

Saturday, 20 June 2015

యోగా దినోత్సవం

21 జూన్ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగా గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం.

ఇప్పుడు ప్రపంచమంతా యోగా అనే పదమే జపిస్తోంది. మనశ్శాంతి కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, పనిలో మంచి ఫలితాల కోసం, ఆరోగ్యం కోసమంటూ రకరకాల కారణాలతో యోగాసనాలు చేస్తున్నారు. యోగకు ఎంత ఖ్యాతి వచ్చిందంటే 21 జూన్ ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించేంత. ఈ సందర్భంలో అసలు యోగా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

జన్మలపరంపరకు కారణమైన చిత్తవృత్తులను నిరోధించి, జననమరణ చక్రం నుంచి ఉద్ధరించేది యోగం/యోగ అన్నారు యోగసూత్రాల్లో పతంజలి మహర్షి. మనం యోగా అంటున్నాం కానీ నిజానికి దాన్ని యోగ్ లేదా యోగం అనే అనాలిట. యోగం అనే సంస్కృతపదం యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్దం కలియకు. ఎవరి కలియక? జీవాత్మ, పరమాత్మల కలియకకు, లేక ఆ కలియకలు కారణమయ్యే ప్రక్రియకే యోగం అని పేరు.

యోగ అంటే కేవలం ఆసనాలే అని అనుకుంటున్నారు. కాదు కాదు అలా చేశారు. ఒకప్పుడూ యోగ్ కేవలం భారతదేశానికి, తూర్పు ఆసియాదేశాలకు, సనాతనహిందూ ధర్మం వ్యాపించిన దేశాలకే పరిమితమైంది. దానికి కారణం కర్మసిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతానికి యోగకు అవినాభావ సంబంధం ఉంది. యోగకు 8 అంగాలు ఉన్నాయి. 8 అంగాల్లో ఆఖరిది సమాధి - భగవంతునిలో లీనమైపోవటం- మోక్షం. ఆసనాలు 3 వ మెట్టు. ధ్యానం చేయండి అంటూ తరుచూ ప్రకటనలు, సలహాలు ఇస్తుంటారు. ధ్యానం యోగంలో 7 వ మెట్టు. యోగం అంటే కేవలం ఆసనాలు కాదు. యోగం యమనియమాలతో మొదలవుతుంది. యోగకు ఆహారనియమాలు తప్పనిసరి. కానీ ఈరోజు దాన్ని ప్రపంచంలో అనేకమంది మార్కెటింగ్ చేసి వ్యాపారం చేస్తున్న కారణంగా అసలు విషయాలు చెప్పడంలేదు. యోగం అనేది ఒక జీవనవిధానం. యోగం ద్వారా పరమాత్మను ప్రాతి పొందాలంటే అష్టాంగ యోగాన్ని అవలంబించాలి.

హిందూధర్మమే జీవనవిధానం. అందులో యోగం ఒక భాగం. హిందూ ధర్మం, పునర్జన్మ సిద్ధాంతం లేని యోగం అసంపూర్ణం. యోగం హిందూ షట్ దర్శనాల్లో ఒకటి. అది భగవంతుని కనుగొనే విధానం. యోగ మతాతీతం అంటున్నారు. యోగం మతాతీతమే కానీ అది హిందూధర్మంలో భాగం. దాన్ని ప్రతి హిందువు తప్పకుండా ఆచరించాలి. ఇక అన్యమతాల విషయానికి వస్తే, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే, హైందవేతరుల గ్రంధాలు యోగంతో విభేధిస్తాయి. క్రైస్తవం, ఇస్లాం మొదలైన అబ్రహామిక్ మతాలకు హిందూ ధర్మానికి అసలు ఎక్కడ పొంతన ఉండదు. ఆత్మపరమాత్మతో సమ్యోగం చెందడం, ప్రతి జీవిలో భగవంతుడు ఉండడం, జీవుడు భగవంతుడి అంశ అనడం, పునర్జన్మ, కర్మ మొదలైన అనేక విషయాలను ఆయా మతాలు అసలు ఒప్పుకోవు. కనుక వారు యోగాభ్యాసం చేయడమంటే వారి మత గ్రంధాలను వదిలేయడమే అవుతుంది. ఈ మాత్రం కూడా అవగాహన లేక, యోగం యొక్క శక్తిని తక్కువ చేయలేక క్రైస్తవయోగ అని కొత్తగా యోగకు నామకరణం చేశాయి మిషనరీలు. అంతకంటే విడ్డూరం ఇంకోటి లేదు.

యోగను ఎవరైన చేయవచ్చు అన్నమాట వాస్తవం కానీ యోగ చేసేవారు క్రమంగా వారికి తెలియకుండానే హిందువులవుతారు. యోగను చేయడం వలన క్రమంగా వారిలో మార్పు కలిగి, వారు కూడా ఆత్మానుభూతిని పొందుతారు. అయితే ఆత్మను నమ్మడం కూడా భారతీయమతాల్లోనే ఉంది. భౌద్ధం శూన్యవాదాన్ని, నిరీశ్వర వాదాన్ని చెప్పింది. కానీ భౌద్ధులు సనాతనధర్మం నుంచి యోగాన్ని స్వీకరించారు, పరమాత్మను చేరుకున్నారు. దీనిబట్టి మనం అర్దం చేసుకోవలసిందేమిటంటే యోగం మాత్రమే మతాలకు, జీవితానికి సంపూర్ణతను ఇస్తుంది. బౌద్ధ సన్యాసులు ప్రారంభంలో బౌద్ధమతాన్ని ఆచరించినా, క్రమంగా మంత్ర, తంత్ర, యంత్ర, యోగ ప్రక్రియల ద్వారా సనాతనధర్మాన్నే పాటిస్తూ బ్రహ్మానందాన్ని పొందుతున్నారు.    

యోగం వలన ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. అవును యోగం ఆరోగ్యాన్నిస్తుంది, కానీ యోగం యొక్క లక్ష్యం భగవంతునితో కలయిక. ఎలాగైతే చెరుకు రసం తీయడంలో క్రమంగా కాస్త చెరుకుగడలు నలిగి వ్యర్ధపదార్ధం వస్తుంది, అలాగే బ్రహ్మైక్యం కోసం యోగాన్ని ఆచరిస్తే ఆరోగ్యం కూడా వస్తుంది. యోగాకున్న నియమాలను ఏమీ పాటించకుంటేనే అద్భుతఫలితాలు కనబడుతుంటే, ఇక యోగాన్ని సంప్రదాయపద్ధతిలో పాటిస్తే, ఇంకేంత ప్రయోజనం ఉంటుందో ఆలోచించండి.

చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే 'నువ్వు చేశావా?' అంటే అమ్మో, నేను కాదు, నేను కాదు అన్నట్టుగా హిందువులు యోగా మాది కాదు, మాది కాదు అనడం మూర్ఖత్వం. యోగ లంటిది అద్భుతప్రక్రియలు ఇంకేదైనా మతంలో ఉంటే వారు ఇలాగే అంటారా? అందరూ బాగుపడలాన్న నిస్వార్ధ ఆకాంక్ష హిందువులదే కావచ్చు కానీ దానికోసం యోగాన్ని త్యాగం చేయనవసరంలేదు. యోగం తమదేనని, తమ పూర్వీకులైన ఋషులు అందించారని హిందువులు గర్వంగా చెప్పుకోవాలి.

భారతదేశం ఇంతవరకు నరేంద్రమోదీ లంటి ప్రధానిని చూడలేదు. మోదీ స్వయంగా ఒక యోగి, యోగం యొక్క ఫలాలు ఎలా ఉంటాయో మోదీగారికి బాగా తెలుసు. అందుకే యోగాకు విస్తృత ప్రచారం కల్పించి, అందరి జీవితంలో భాగం చేయాలనే సంకల్పంతో యోగాకు కూడా ఒక రోజు ఉండాలని సంకల్పించారు, దానికి ఆమోదం కూడా లభించింది. కానీ ఇప్పుడు యోగకు కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించాలి. అందుకుగానూ హైందవ యోగులతో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి, యోగ మీద భారతదేశం పేటెంట్‌లు తీసుకోవాలి. యోగ సంకరం కాకుండా చూసుకోవాలి. యోగాను నేర్పుతున్న సంస్థల నుంచి, ముఖ్యం హైందవేతర సంస్థల నుంచి రాయల్టీ తీసుకుని దాన్ని దేశంలో ఉన్న పేదలకు ఉపయోగించాలి.

అందరం యోగాను నేర్చుకుందాం. జీవితాన్ని మార్చుకుందాం.

అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

మీ అభిప్రాయాలు కామెంట్ చేసి తెలియపరచండి

Sunday, 17 May 2015

హిందూ ధర్మం - 158 (భారతీయులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు)

వేదాల్లో సైన్సు ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వేదం అంటే తెలుసుకోవలసినది అని అర్దం. వేదంలో సైన్సు ఉంది. ఆ మాటకు వస్తే, సూర్యుడు వెలుగునిస్తాడా అనడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అజ్ఞానంగా ఉంటుందో, వేదంలో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయా? అనడం కూడా అలాగే ఉంటుంది. వేదం విశ్వంలో ఉన్న అన్ని అంశాల గురించి వివరించింది. ఆయా వేదాల్లో ఏ ఏ రకాల సైన్సు విభాగాలు ఉన్నాయో, గత భాగాల్లో చెప్పుకున్నాం. అయితే, అవే కాక వేదాల్లో చెప్పబడ్డ మరికొన్ని వైజ్ఞానిక అంశాలు కూడా చెప్పుకుందాం.


-----------------------------------------------------------------------------------------------

కాకపొతే ముందుగా  Satyanarahari Mallisetty గారు అధర్వణ వేదం గురించి అందించిన  అమూల్యమైన ఈ సమాచారం అందరూ తెలుసుకోదగింది.

అధర్వణ వేదం ఐరోపా ఖండ వాసులు ఏనాడో మన దేశం నుంచి తీసుకొని పోయారు. ఈ వేదం మన దేశం అంతరించడానికి చాల కారణాలు ఉన్నా అందులో ముఖ్య కారణం మాత్రం మోక్షం లేదా ముక్తి సాధనం లేదా ఒక జీవున్ని విశ్వా సంసారం నుంచి బయట పడవేసే, ముక్తి, తాత్విక చింతన ఇందులో కొంచం తక్కువ.  ఆ కారణంగా ఇది ఒకప్పుడు మనదేశంలో భాగమైన  ఆఫ్గానిస్తాన్ (ఆఫ్ఘనిస్థాన్‌ని గాంధారదేశమని పిలిచేవారు. ఒకప్పుడు గాంధార దేశం కూడా భారతావని లో భాగమే) నుంచి  గుండా టర్కీ ద్వారా ఐరోపా ఖండంలో ప్రవేశించి అక్కడ వచ్చి రాని సంస్కృత పండితుల చేతులలో పడింది. ఆ రోజుల్లో వాళ్ళ పాలకుల దృష్టిని ఆకర్షించిన ముఖ్య అంశం "చింతామణి", వాళ్ళ భాష లో చెప్పాలంటే "ఫిలోసోఫెర్ స్టోన్". దాని ద్వారా ఏదైనా ఒక వస్తువుని బంగారంగా మార్చ వచ్చు అని పిచ్చిగా నమ్మే వాళ్ళు. దానిని తయారు చేయమని వాళ్ళ పాలకులు ఆయా దేశాల మేధావులని ఆదేశించే వాళ్ళు  అలా అధర్వణవేదాన్ని క్షుణ్ణంగా అధ్యయం చేసి ఆధునిక భౌతిక, రసాయన శాస్త్రం అభివృద్ధి చేశారు. కొన్ని కొన్ని సత్యాలు తెలుసుకొంటూ వచ్చారు. తెలుసు కొన్నసత్యాలు ఆధారం చేసుకొని ఒక్కో పరికరం, లేదా యంత్రం అభివృద్ధి చేసుకొంటూ వచ్చారు. అణువులు , ఎలేక్ట్రోన్లు, కేంద్రక వంటి సూక్ష్మ సత్యాలు అవగాహన చేసుకొనే కొలది కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, సెల్ ఫోన్ వంటి పరికరాలు, యంత్ర తంత్రాలు వృద్ధి జరిగాయి. యంత్ర , తంత్ర , మంత్రాలూ కర్మ- ప్రతి కర్మలకు కారణం అవుతాయి. ఇవి జీవున్ని బానిసని చేస్తాయి. ఎన్నటికి మోక్షాన్ని ఇవ్వవు. మన భారతీయులు మోక్ష కాములు కనుక ఈ అధర్వణ శాస్త్రం జోలికి వీలైనంత తక్కువ పోయారు. ఈ నాటికి జెర్మన్లు ఎందుకు సంస్కృతం అభ్యసిస్తున్నారు అంటే అది మన సంస్కృతం మీద వాళ్లకు గౌరవం కాదు, ఆ అధర్వణ వేదంలో చెప్పబడ్డ సూక్ష్మ రహస్యాలు గ్రహించాడానికే. ఈ అధర్వణ శాస్త్రాన్ని "సాయనాచార్యుడు" అనే ఆయన ఎందుకు దీనిని మాయలు మర్మాలు చేసే శాస్త్రం అని అన్నాడు అంటే ఈ అధర్వణ శాస్త్రంలో వచ్చే యంత్ర, తంత్ర, మంత్రం, కుతంత్రాలు అన్నియును కూడా ప్రకృతి మాయ భ్రాంతిలో ఉండే వ్యక్తుల పైనే పని చేస్తుంది. ప్రకృతి మాయని దాటినా వాళ్ళు (యోగులు) పైన ఈ శాస్త్ర ఫలిత పరికరాలు ఏది పని చేయవు.

-------------------------------------------------------------------------------------------------------------------

ఈ విషయాన్ని బలపరిచేది, భారతీయులకు తెలియంది అయిన మరొక విషయాన్ని చెప్పుకోవాలి.

ఇదేకాక జీ.పుల్లారెడ్డిగారి అభినందన సంచిక 'మధుకోశం' లో ప్రచురించబడిన ఈ విషయం చూడండి.

ఇందిరాగాంధీగారు ప్రధానమంత్రిగా ఉన్నా కాలంలో భారతదేశం నుంచి పశ్చిమ జెర్మనీకి ఒకరు రాయబారిగా వెళ్ళారు. అక్కడి అధికారులు ఈ రాయబారికి తమ కార్యాలయాలను చూపుతూ, అక్కడ ఉన్న ఒక భారతీయుడి చిత్రపటం చూపించి, ఈయన ఎవరో మీకు తెలుసా? అని అడిగారు. తనకు తెలియదని భారతరాయబారి సమాధానం ఇచ్చారు. అప్పుడు జెర్మన్ అధికారులే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు చెప్పి, అతనికి తమ దేశంలో అంతటి ప్రాముఖ్యం రావడానికి గల కారణం కూడా చెప్పారు. ఆ వ్యక్తి పేరు దండిబొట్ల విశ్వనాధశాస్త్రి. రాజమండ్రి వాస్తవ్యులు. సంస్కృత భాషలో మహాపండితులు. యజుర్వేదానికి కర్మకాండ పరంగా, తాంత్రిక విద్యాపరంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, నాలుగు విధాలుగా అర్దం చెప్పగలిగిన మహామేధావి. 1938 లో జెర్మన్ గూఢాఛారులు భారత్‌కు వచ్చి, ఆయన్ను జెర్మనీ తీసుకొనిపోయారు. వేదశాస్త్రములలో ఉన్న వైజ్ఞానిక విషయాలు వీరి నుంచి జెర్మన్ శాస్త్రవేత్తలు గ్రహించి, యుద్ధకాలంలో ఆయుధ నిర్మాణానికి వాటిని వినియోగించుకున్నారు. దానికి కృతజ్ఞతగా విశ్వనాధశాస్త్రిగారి చిత్రపటాన్ని తమ విదేశాంగ కార్యాలయంలో పెట్టుకున్నారట.

-------------------------------------------------------------------------------------------------------

అందుకే ఇప్పటికి జెర్మన్లకు హిందూ విజ్ఞానశాస్తమన్నా, పురాణాలన్నా, వేదాలన్నా అమితమైన ఆసక్తి. రామసేతువు మీద అమెరికా కుటిల బుద్ధితో తప్పుడు నివేదిక ఇస్తే, రామసేతువు మీద జెర్మనీ కూడా పరీక్షలు నిర్వహించి, దాని అసలు వయసును లెక్కగట్టింది. తమ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత భాషను ప్రత్యేకంగా నేర్పిస్తోంది. సంస్కృతం వచ్చిన పండితులను అక్కడికి తీసుకెళ్ళి, గ్రంధాలను అనువదించే పనిలో పడింది. అలా అనువాదం చేసినందుకు వారికి అధికమొత్తంలో ధనం ఇస్తుంది. ఆంగ్లేయులు మనకు చేసిన ద్రోహాల్లో పెద్ద ద్రోహం ఇదే. 16 వ శతాబ్దంలోనే యూరోప్‌లో సంస్కృత భాషాధ్యయనం మొదలైంది. 17 వ శతాబ్దం నుంచి చాలా గ్రంధాలను ఎత్తుకెళ్ళడం మొదలుపెట్టారు. 19 వ శాతాబ్దం నాటికి ఇక్కడున్న గ్రంధాలను మొత్తం ఎత్తుకెళ్ళి, ఇక్కడ వేల ఏళ్ళ నుంచి నిర్వహింపబడుతున్న విశ్వవిద్యాలయాలను పూర్తిగా నాశనం చేశారు. కొన్ని తప్పులు ఉన్నప్పటికి, వారి వద్ద కూడా వేదానికి అనువాదాలు ఉన్నాయి. వేదాలను ఎత్తుకెళ్ళడమే కాకుండా వాటిని పరిశోధించి రాసిన గ్రంధాల మీద 'పేటెంట్' హక్కులు తీసుకున్నారు. అంతేకాదు, ఒకానొక జెర్మన్ కంపెనీ 'వేద' అనే పదం మీద, మరొక కంపెనీ 'వాస్తు' అనే పదం మీద పేటెంట్ తీసుకున్నాయి. ఇప్పటికైనా హిందువులు జాగృతమవ్వాలి. తమ ధర్మాన్ని, ధార్మిక గ్రంధాలను కాపాడుకోవాలి.

To be continued ..............................

Thursday, 30 April 2015

చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం!

పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూఢ విశ్వాసాలు విదేశీ దురాక్రమణదారుల వారసత్వ శకలాలు. ఒక్కొక్క ‘శకలం’ సకలంగా మారి మన జీవన రంగాలను ముక్కలు ముక్కలుగా మార్చివేస్తున్నాయి. మన వ్యవహారంలో, విజ్ఞానంలో సమన్వయం, సమగ్రత్వం లోపించడానికి హేతునిబద్ధత అడుగంటి పోవడానికి ఇలా ‘శకలం’ సకలమై కూర్చుని ఉండడం ప్రధాన కారణం. శకలాలను మళ్లీ ఒకటిగా కూర్చి సకలత్వాన్ని సాధించడానికి ఇప్పుడైనా కృషిజరగాలి. విద్యాప్రణాళికలలో, పాఠ్యపుస్తకాలలో, భాషాస్వరూపంలో సంస్కరణలు జరిగిపోవాలని ప్రచారం చేస్తున్నవారు ‘తవ్వకాల’ద్వారా బయటపడుతున్న చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలను మన జాతీయ జీవనంతో సమన్వయం చేసుకోవాలి! భారతీయ సంస్కృతి గొప్పదని అంటున్నవారే ‘ఆర్యు లు’అనేవారు బయటినుంచి మన దేశానికి వచ్చిపడినారని కూడ పాఠ్యాంశాలలో ఇప్పటికీ ఇరికిస్తూ ఉన్నారు. ఇది మూఢ విశ్వాస చిహ్నం....
‘చరిత్ర’కు ప్రారంభ బిందువును నిర్దేశించడం పాశ్చాత్యుల విశ్వవిజ్ఞాన అవగాహనా రాహిత్యానికి శతాబ్దుల సాక్ష్యం! ఆ చారిత్రక ప్రారంభ బిందువునకు ముందున్న కాలాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా చిత్రీకరించడం కాలగతికి పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ఘోరమైన గాయం... ఈ ‘తథాకథిత’- సోకాల్డ్- చరిత్ర పూర్వయుగం- ప్రి హిస్టారిక్ ఏజ్-లో మాత్రం మానవులు లేరా? కనీసం ప్రాణులు లేవా? వారిది లేదా వాటిది మాత్రం చరిత్రకాదా?? చరిత్ర కాదనడం చరిత్రకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం చేసింది మిడిమిడి జ్ఞానం కలిగిన పాశ్చాత్య మేధావులు! ఈ ‘శకల’మే ‘సకల’మని ఐరోపా చరిత్రకారులు మనకు క్రీస్తుశకం పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దులలో పాఠాలను చెప్పారు. ఆ పాఠాలను ఆ తరువాత మరింత నిష్ఠతో శ్రద్ధతో వల్లెవేస్తున్నాం! అందువల్లనే గొప్ప విషయాలను చెప్పదలచుకున్న మేధావులు, లేదా చెబుతున్నట్టు అభినయిస్తున్న మహా మేధావులు ‘చరిత్ర పూర్వయుగం’-ప్రిహిస్టారిక్ ఏజ్- అన్న విచిత్ర పద జాలాన్ని ఉటంకించడంతో ప్రారంభిస్తున్నారు! ప్రాచీన రాజధాని అమరావతి నవ్యాంధ్రప్రదేశ్‌కు మళ్లీ రాజధాని అవుతున్న సందర్భంగా ఈ ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న అర్థంలేని పదజాలం మళ్లీ విరివిగా ప్రచారవౌతోంది! ఈ ప్రచారం అతి ప్రాచీన అమరావతికి అవమానం. ఎందుకంటె అమరావతి లేదా కొందరు అంటున్నట్టు ‘్ధన్యకటకం’ ఐదువేల వంద ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఉంది. అంతకు పూర్వం వేలాది ఏళ్లుగా ఉంది! కానీ బ్రిటిష్‌వారు మప్పిపోయిన ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న విచిత్ర పదార్థాన్ని ప్రచారం చేస్తున్నవారు ‘అమరావతి’ చరిత్రను రెండువేలు లేదా రెండు వేల ఐదువందల ఏళ్లకు పరిమితం చేస్తున్నారు! బ్రిటిష్‌వారు కాలాంతకులు, కాలాన్ని అంతంచేసినవారు... వారి వారసులు కూడ కాలాంతకులే! ‘‘చరిత్ర పూర్వయుగం’’ ఒకటుందని నమ్మడం ప్రచారం చేయడం మూఢ విశ్వాసబద్ధమైన బుద్ధికి నిదర్శనం! చరిత్ర అనాది... అనంతం... అందువల్ల చరిత్ర క్రమం ఆద్యం త రహితం! ‘‘చరిత్ర పూర్వయుగం’’,‘‘కోతి యుగం’’,‘‘రాతి యుగం’’,‘‘లోహ యు గం’’ అన్నవి బ్రిటిష్‌వారు, పాశ్చాత్యులు ‘‘విజ్ఞా నం’’గా భ్రమించిన మూఢవిశ్వాసాలు... బ్రిటిష్‌వారు మన దేశాన్ని వదలి వెళ్లినప్పటికీ, వారు అంటించిపోయిన ఈ మూఢ విశ్వాసాలు మన పుస్తకాలను, మస్తకాలను వదలకపోవడం భావదాస్య ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం!

పురాతత్త్వశాఖ వారి త్రవ్వకాలలో బయటపడుతున్న ప్రాచీన అవశేషాలు ‘‘హరప్పా మొహంజాదారో నాగరికత’’ కాలంనాటివని, అంతకు పూర్వంనాటివని వర్గీకరణలు జరుగుతున్నాయి. అంతవరకు కాలానికి సంబంధించిన పేచీలేదు. కాని ‘‘హరప్పా నాగరికత’’ లేదా ‘‘సింధునదీ పరీవాహక ప్రాంత- ఇండస్ వ్యాలీ- నాగరికత’’అన్న పదజాలం మన జాతీయ అద్వితీయ తత్త్వానికి విఘాతకరమైనవి! ఈ దేశంలో గతంలో రెండుమూడు జాతులవారు పరస్పరం కొట్టుకొని చచ్చారన్న అబద్ధాన్ని ప్రచారం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ‘‘హరప్పా నాగరికత’’ను ‘‘కనిపెట్టి’’ పోయారు. ఈ హరప్పా నాగరికత కాలంనాటి మానవ అస్థిపంజరాలు నాలుగు ఇటీవల హర్యానాలో జరిగిన తవ్వకాలలో బయటపడినాయి. ఈ అస్థిపంజరాలు ఐదువేల ఏళ్లనాటివట! హరప్పా, మొహంజోదారో అన్న ప్రాచీన నగరాలు సింధూ పరీవాహ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఉండి ఉండవచ్చు. కానీ నగరాల పేరుతో ‘నాగరికత’లు, ‘‘రాజ్యాలు’’ ఉండడం భారతీయ చరిత్రలో సంభవించలేదు. ఇలా ఉండడం గ్రీకుల పద్ధతి పాశ్చాత్యుల పద్ధతి! నగరాలు మన దేశంలో రాజధానులు మాత్రమే. ‘‘నాగరికత’’అన్నది దేశమంతటా విస్తరించి ఉండిన ఒకే ఒక అద్వితీయ సాంస్కృతిక వ్యవస్థ! అందువల్ల బ్రిటిష్‌వారు కనిపెట్టిన ‘‘హరప్పా నాగరికత’’ నిజానికి భారతదేశమంతటా సమకాలంలో విస్తరించి ఉండిన అద్వితీయ సామాజిక వ్యవస్థ! అది వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి....

ఇలా దేశమంతటా ఉండిన దాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం పాశ్చాత్యుల పరిమిత బుద్ధికి నిదర్శనం. ‘తక్షశిల’ప్రాచీన విద్యాకేంద్రం, రాజ్యంకాదు, రాజధాని కూడ కాదు. కానీ గ్రీకు బీభత్సకారుడైన అలెగ్జాండరు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలో కొంత భాగాన్ని గెలిచాడన్న అబద్ధాన్ని పాశ్చాత్య చరిత్రకారుడు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దిలో ప్రచారం చేశారు. ఈ అబద్ధ ప్రచారంలో భాగంగా విశ్వవిఖ్యాత విద్యాకేంద్రమైన ‘తక్షశిల’ను ఒక ప్రత్యేక రాజ్యంగా కల్పించారు!! ఇదే పద్ధతిలో దేశమంతటా ఒకే జాతీయ సంస్కృతి అనాదిగా ఉండడం వాస్తవం కాగా, ఈ వేద సంస్కృతికి భిన్నమైన ‘‘హరప్పా నాగరికత’’ను పాశ్చాత్యులు ఏర్పాటుచేశారు. పైగా ఈ ‘‘హరప్పా నాగరికత’’ ధ్వంసమైన తరువాత మాత్రమే క్రీస్తునకు పూర్వం పదిహేనవ పనె్నండవ శతాబ్దుల మధ్య వేద సంస్కృతి ఈ దేశంలో పుట్టుకొచ్చిందన్న మరో భయంకర అబద్ధాన్ని కూడ పాశ్చాత్యులు మన చరిత్రకు ఎక్కించిపోయారు!! ఈ దేశంలో ‘యుగాలు’గా వేద సంస్కృతి పరిఢవిల్లుతోందన్నది వాస్తవ చరిత్ర. ఈ చరిత్రను చెరచి, వేదాల ప్రాచీనతను కేవలం మూడువేల ఐదువందల ఏళ్లకు కుదించడానికి బ్రిటిష్‌వారు చేసిన కుట్రలో ఈ తథాకథిత ‘‘హరప్పా నాగరికత’’ భాగం... ఈ కుట్రను భగ్నంచేయడానికి వీలైన అవశేషాలు తవ్వకాలలో అనేక ఏళ్లుగా బయటపడుతున్నాయి. ఇప్పుడు హర్యానాలో జరిగిన త్రవ్వకాలలో ఏడువేల ఐదువందల ఏళ్లనాటి పట్టణం బయటపడింది! ‘‘హరప్పా నాగరికత’’ కేవలం ఐదువేల ఏళ్ల ప్రాచీనమైనదన్న పాశ్చాత్య అబద్ధాన్ని ఈ ‘‘పట్టణం’’ ఇలా బట్టబయలుచేసింది.. భూస్థాపిత సత్యమిలా భువనమెల్ల మార్మోగెను....

హరప్పా నాగరికతను ధ్వంసంచేసిన తరువాత వేదాలు వైదిక సంస్కృతి విలసిల్లాయన్న పాశ్చాత్యుల ‘‘అబద్ధాల చరిత్ర’’కు పెద్ద అవరోధం మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం కలియుగం పుట్టడానికి పూర్వం ముప్పయి ఆరవ ఏట జరిగింది! కలియుగం పుట్టిన తరువాత మూడువేల నూట రెండేళ్లకు క్రీస్తుశకం పుట్టింది. ఇలా క్రీస్తునకు పూర్వం 3138 ఏళ్లనాడు మహాభారతయుద్ధం జరిగిందని అమెరికా శాస్తవ్రేత్తలు సైతం నిర్ధారించిన సంగతి దశాబ్దిక్రితం ప్రముఖంగా ప్రచారమైంది. అమెరికా శాస్తవ్రేత్తలు నిర్ధారించకపోయినప్పటికీ ప్రాచీన భారత చరిత్రకారులు చేసిన నిర్ధారణలు నిజంకాకుండా పోవు. కాని పాశ్చాత్య భావదాస్య సురాపానం మత్తుదిగని భారతీయ మేధావులు అమెరికావారి ఐరోపావారి నిర్ధారణలను నమ్ముతున్నారు. ఆ నిర్ధారణ కూడ జరిగింది కనుక ఇకనైనా ‘హరప్పా’నాగరికత అన్న మాటలను వదలి పెట్టి దేశమంతటా అనాదిగా ఒకే వేద సంస్కృతి కొనసాగుతున్న వాస్తవాన్ని చరిత్రలో చేర్చాలి! ప్రాథమిక స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకు గల విద్యార్థులకు బోధించాలి! మహాభారత యుద్ధం జరిగిననాటికి, క్రీస్తునకు పూర్వం మూడువేల నూటముప్పయి ఎనిమిదేళ్లనాటికి, దేశమంతటా ఒకే జాతీయత ఒకే సంస్కృతి నెలకొని ఉన్నాయి! అలాంటప్పుడు అదే సమయంలో ‘‘వేద సంస్కృతితో సంబంధం లేని, వేదాలకంటె ముందు ఉండిన’’ ఈ హరస్పా ఎలా ఉండి ఉంటుంది??

చరిత్రను ఆవహించిన మూఢవిశ్వాసాన్ని ఇకనైనా వదలగొట్టాలి!

‘రాతియుగం’, ‘కోతియుగం’వంటివి కృతకమైన కల్పితమైన కాలగణన పద్ధతులు. ‘చరిత్ర పూర్వయుగం’అన్నది ఉండడానికి వీలులేదు. ఎందుకంటె సహజమైన విశ్వవ్యవస్థ తుది మొదలు లేకుండా వ్యవస్థీకృతమై ఉంది! ఈ ‘తుది మొదలులేనితనం’ కాలానికీ- టైమ్- దేశానికీ- స్పేస్-వర్తిస్తున్న శాశ్వత వాస్తవం. ఈ వాస్తవం ప్రాతిపదికగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం, కలియుగం వరుసగా తిరుగుతున్నాయి. శిశిర ఋతువు తరువాత వసంత ఋతువువలె రాత్రి తరువాత పగటివలె కలియుగం తరువాత మళ్లీ కృతయుగం రావడం చరిత్ర! ఇది సనాతనమైన నిత్యనూతనమైన హేతుబద్ధమైన వాస్తవం! ఈ వాస్తవం ప్రాతిపదికగా విద్యార్థులకు ఇకనైనా చరిత్రను బోధించాలి! ‘రాతియుగం’తోకాక కృతయుగంతో చరిత్రను మొదలుపెట్టాలి. కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒకదానితరువాత ఒకటి రావడం ఖగోళ విజ్ఞానపు గీటురాయిపై నిగ్గుతేలిన నిజం!

ఈ ఖగోళ వాస్తవాలను ఎవ్వరూ మార్చలేరు... వక్రీకరించలేరు. ఈ ఖగోళ వాస్తవం ప్రకారం ‘సప్తర్షులు’అన్న అంతరిక్ష సముదాయం భూమినుండి చూసినప్పుడు వందేళ్లపాటు ‘అశ్వని’వంటి నక్షత్రాలతో కలసి ఉదయిస్తుంది. ఈ సప్తర్షి మండలం అలా ‘రేవతి’వరకూ గల నక్షత్రాలతో ఉదయించే కాలఖండం రెండువేల ఏడువంద ఏళ్లు. ఈ ఖగోళ వాస్తవం ప్రాతిపదికగా కలియుగంలో ఇది యాబయిరెండవ శతాబ్ది! ఇది 5117వ సంవత్సరం. శాతవాహన ఆంధ్రులు కలియుగంలో 2269నుండి 2775వరకు 506 ఏళ్లపాటు మొత్తం భారతదేశాన్ని పాలించారు, దేశానికి రాజధాని గిరివ్రజం...!! ధాన్యకటకం అప్పటికే ఉంది, ధాన్యకటకం అమరావతి కావచ్చు, కోటిలింగాల కావచ్చు!్ధన్యకటకం రాజధానిగా సహస్రాబ్దులు పాలించిన తరువాతనే ఆంధ్రులు గిరివ్రజం రాజధానిగా భారత సమ్రాట్టులయ్యారు. ఇదీ యుగాల చరిత్ర.... ‘చరిత్ర పూర్వయుగం’ లేదు!

- హెబ్బార్ నాగేశ్వరరావు 30/04/2015 (ఆంధ్రభూమి విశ్లేషణ)
http://www.andhrabhoomi.net/content/main-feature-58

Saturday, 11 April 2015

ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు?

జస్టిస్ ముర్తాజా ఫాజిల్ ఆలీ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1975-85 కాలంలో వ్యవహరించేరు. 1980లలో లక్నోలో మైనారిటీ విద్యా సంస్థల గురించి జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించేరు. ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవడంపై ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చేరు.

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు భాగస్వాములు కాలేదు? దానికి ఎవరు బాధ్యులు?
"నాకు బాగా గుర్తుంది. నా చిన్నతనంలో నేనొక గ్రామంలో ఉండేవాడిని. మా గ్రామంలో హిందూ-ముస్లిం సమస్య ఉండేది కాదు. మా మొహర్రం ఉత్సవంలో హిందువులు పాల్గోనేవాళ్ళు. హోలీ, దీపావళి పండగలలో మేమూ పాల్గోనేవాళ్ళం. కాలేజీ చదువు కోసం నేను పట్నం వచ్చేను. పేదవాణ్ణి కాబట్టి ఒక మురికివాడలో ఉండేవాణ్ణి. అక్కడ కూడా నాకు హిందూ-ముస్లిం సమస్య కనబడలేదు.

"స్వరాజ్యం వచ్చిన తరువాతే హిందూ-ముస్లింల సమస్య ఇంతగా పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటి? ముస్లింల వద్దకి వివిధ రకాల హిందూ రాజకీయ నేతలు వచ్చి ఏం చెబుతున్నారు? ముస్లింల అస్తిత్వం నేడు ప్రమాదంలో పడిందనీ, మెజారిటీ సమాజం వారిని కబలించి వేస్తుందనీ, తమ పార్టీలు మాత్రేమే వారిని కాపాడగలదనీ, కనుక తమకే వోటు వేయందనీ చెబుతున్నారు.

"ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి ముస్లింల 30 శాతం ప్రత్యేక అధికారం కల్పిస్తామంటే, వేరొకరు 50 శాతం ప్రత్యేక అధికారాలు కల్పిస్తామంటారు. అధికార దాహంతో అన్ని పార్టీల హిందూ నేతలూ ముస్లిం వోట్ల కోసం, ముస్లింలకు తమ పార్టీనే ఎక్కువ సదుపాయాలూ కలగజేస్తుందని పోటీపడి మా ముందు జుట్లు పట్టుకుంటూ ఉంటే, మేము (ముస్లింలు) అమాయకంగా మాకు ప్రత్యక అధికారాలు వద్దు మేము జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోతాం అని చెప్పమంటారా? ఎందుకు కలిసిపోవాలి? ముస్లిమ్లకేమన్నా పిచ్చా?

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవాలంటే ముందు అధికార దాహం కల రాజకీయ నాయకులను సరిచేయండి. వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకురండి. ఈ రాజకీయ నేతలే నేడు ప్రధాన జీవన స్రవంతిలో లేరు. వారిలో అధికార దాహం మాత్రమే ఉంది. అధికారం కోసం వాళ్ళు దేశాన్ని కూడా ముక్కలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నాయకులు సరైన రీతిలో మారితే ఒక్క సంవత్సరంలోనే ముస్లింలంతా జాతీయ జీవన స్రవంతిలో భాగస్వాములు కాగలరు అని నేను వాగ్దానం చేస్తున్నాను."

ఇవి జస్టిస్ ముర్తాజా గారు చెప్పిన మాటలు. ఇవి నూటికి నోరు పాళ్ళూ నిజం కూడా.

అయితే నాకొక సందేహం. పార్శీలు బయటి నుంచి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందినవారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి మన పాలకులు ముస్లింలు, క్రైస్తవుల లాగే పార్శీలకు కూడా మైనారిటీలుగా హోదా ఇచ్చి ప్రత్యేక హక్కులు ఇస్తామంటే దానిని పార్శీలు తిరస్కరించేరు. ఈ దేశంలో ఆశ్రయం పొందిన తాము ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపునూ పొందాలనుకోవటంలేదనీ, ఈ జాతి ప్రధాన జీవన స్రవంతిలో తామూ భాగస్వాములుగా కొనసాగుతామనీ అన్నారు. జంషెడ్ జీ టాటా, రతన్ టాటా వంటి వారు ఎందరో పారశీకులే. వారు పారిశ్రామికంగా దేశాభివృద్ధికి అందించిన సేవలు ఎవరూ మరచిపోలేనివి. మరి ముస్లింలు పార్శీల వలె ఎందుకు మైనారిటీ సౌకర్యాలను తిరస్కరించరు? జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు? దీనికి బాధ్యులు ఒక్క హిందూ రాజకీయ నాయకులేనా? ముస్లిం నాయకులు, మత పెద్దలు ఇందుకు బాధ్యులు కారా? వారు తమ స్వార్థం కోసం సాధారణ ముస్లిం ప్రజానీకాన్ని జాతీయ ప్రధాన స్రవంతిలో కలవకుండా వేరు చేయటం లేదా? దేశంలోని మతపరమైన కల్లోలాలకు వారు కూడా కారణం కాదా?

Source: రాజసులోచనం 

Tuesday, 30 December 2014

జనవరి 1 న్యూఇయర్ కుట్ర

జనవరి 1 కొత్త సంవత్సర వేడుకల గురించి భిన్నాప్రాయాలు వ్యక్తమవుతాయి. కొందరు జరుపుకోవద్దంటారు, కొందరు ప్రపంచమంతా జరుపుకుంటున్న వేడుకను మనం మాత్రం జరుపుకుంటే తప్పేంటీ అంటారు. అసలు ఈ న్యూఇయర్ వేడుకలు ఒక 25 ఏళ్ళ కిందట భారత్‌లో లేవు. మరి ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చాయి? వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వీటి వెనుకనున్న శక్తులేవి? వీటిని ఇంతలా promote చేయడం వల్ల ఆ శక్తులకు వచ్చే లాభం ఏమిటి? ఈ సందేహాలాన్నిటికి సమాధానం తెలుసుకోవాలంటే ఇది చదవండి. (సమయం తక్కువగా ఉన్నందున సంక్షిప్తంగా వివరిస్తున్నా )

భారత్‌లో న్యూఇయర్ వేడుకలను promote చేయడం వెనుక అమెరికా హస్తం ప్రధానంగా ఉంది. అమెరికా, చైనా, ఇతర దేశాల దృష్టిలో భారత్ 120 కోట్ల జనాభా ఉన్న ఒక పెద్ద మార్కెట్. తమ దేశాంలో అమ్ముడుపోనివి వస్తువులను, మందులను, ఇతర ఆహారపదార్ధాలను అమ్మడానికి వాటికి భారత్ కనిపిస్తుంది. ఆయాదేశాల్లో ప్రభుత్వంచే నిషేధించబడిన వస్తువులను కూడా, ఆ ప్రభుత్వాలు భారత్‌లో అమ్మెందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటాయి. ఉదాహరణకు అధిక విషరసాయనాలు కలిగిన ఎరువులు అమెరికాలో నిషేధం అనుకోండి. ఆ ఎరువుల కంపెనీను మూసేస్తే, ఎందరికో నష్టం వాటిల్లుతుందని ఆ ప్రభుత్వం ఎరువులు ఎగుమతి చేస్తామని భారత్‌తో ఒప్పందం చేసుకుంటుంది. మన మేలు కోసం కాదు, వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం. పైగా విషపు రసాయనాలు కలిగిన ఎరువులు, మందులు భారత్‌కు ఎగుమతి చేస్తే, అవి వాడిన భారతీయులు రోగాల బారిన పడతారు. ఆ రోగాలకు కూడా వాళ్ళే మందులు ఎగుమతి చేసి, డబ్బు సంపాదిస్తారు. అదీగాకా, పౌరులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అభివృద్ధికి నిధులు వెచ్చించగలుగుతుంది. అదే పౌరులు అనారోగ్యంగా, బలహీనంగా ఉంటే ప్రభుత్వం నిధులను మందుల కోసం, వైధ్యం కోసం ఖర్చు చేస్తుంది. ఫలితంగా అభివృద్ధికి ఉపయోగించవలసిన నిధులు పక్కదారి మళ్ళుతాయి. ఆర్ధికలోటు కూడా ఏర్పడవచ్చు, ప్రభుత్వం అంతర్జాతీయసంస్థల నుంచి అప్పు తీసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ఒక దేశం అప్పు చేసిందంటే, అదేమి గోప్ప విషయం కాదు, ఆ దేశం తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోతున్నదని చెప్పటానికి అదె నిదర్శనం. ఇదంతా అమలు చేయడానికి అమెరికా సహా అనేక దేశాలు రకరకాల కుట్రలకు పాల్పడుతున్నాయి. ఎక్కడా కూడా ఆయా దేశాలు ఇందులో ఉన్నట్టు అనుమానాలు రాకుండా మిషనరీలు, కొన్ని స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు, సంఘసంస్కరణే తమ లక్ష్యం అని ప్రచారం చేసుకుంటున్న కొన్ని సంస్థలు, మీడియా, సినీదర్శకుల ద్వారా సినిమాలు .............. ఇంకా అనేక మాధ్యమాల ద్వారా, వాటికి నిధులను సమకూరుస్తూ, చాపా కింద నీరులా తమ ప్రణాలికలను అమలు చేస్తున్నాయి. ఇదంతా ఒట్టి కల్పితం అని మీరు అనవచ్చు. ఇది నిజమని చెప్పడానికి చిన్న ఉదాహరణ చూపిస్తాను. భారతీయుల మేధాశక్తి అపారమైంది. భారాత్‌కు స్వతంత్రం వచ్చాకా, అది గొప్పగా అభివృద్ది చెందుతుందని అమెరికా సహా, కొన్ని దేశాలు భయపడి కొన్ని కుతంత్రాలు చేశాయి. వాటిలో ఒకటి తమిళనాట ద్రావిడ జాతీయవాదాన్ని ప్రోత్సహించడం. డిఎంకె రాజకీయ పార్టీ వచ్చిన ముఖ్య ఉద్దేశ్యం కూడా ప్రత్యేక తమిళదేశం ఏర్పాటు చేసుకోవడం. 1962 లొ భారాత్-పాకిస్థాన్ యుద్ధం జరిగే వారకు, డిఎంకెను పావుగా వాడుకుంటూ భారత్‌లో అంతర్గత కలహాలు సృష్టించి జాతీయనాయకులను బెదిరించింది అమెరికా. అదే సమయంలో భారత్ నుంచి వేరు పడిన పాకిస్థాన్‌కు ఆయుధాలు ఎగుమతి చేసి, దానికి బలం అందించింది. చైనా కూడా అంతే. భారత్-చైనా యుద్ధ వచ్చినప్పుడు కూడా అమెరిక్ భారత్‌కు సాయం చేయడానికి బహిరంగంగానే నిరాకరించింది. అప్పుడే అమెరికా బుద్ధి బయటపడింది.

అదే తరహాలో న్యూఇయర్ వేడుకలను ఇంత పెద్దగా promote చేయడం వెనుక కూడా ఒక పన్నాగం ఉంది. న్యూఇయర్ పేరుతో క్లబ్బులు, పబ్బులకు, మద్యానికి, మాదకద్రవ్యాలను యువతకు అలవాటు చేయడం వారి ప్రణాళికలో ప్రధానమైన అంశం. ఇలా చేస్తే ఆయా దేశాలకు 120 కోట్ల జానాభా గల పెద్ద మార్కెట్ వస్తుంది. తమ దేశంలో తయారయ్యే మాదకద్రవ్యాలు, మద్యం ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇప్పుడున్న భారతీయ విద్యావిధానం ఆంగ్లేయుడైన మెకాలే రూపొందించింది. అది భారతీయులను మానసికంగా, నైతికంగా బానిసలు చేయడమే లక్ష్యం. అన్యదేశాల్లో మద్యం, మాదకద్రవ్యాల వ్యసనం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని నిరోధించడం కూడా కష్టమే. కానీ భారతీయకుటుంబ వ్యవస్థ కారణంగా, ఇతర దేశాల్లో వలె మన దేశంలో యువుతకు దురలవాట్లు తక్కువ. ఈ దేశపు యువత మానసికంగా స్కూలోనే బలహీనపడ్డారు. శారీరికంగా కూడా వారిని బలహీనపరిచే ప్రణాళిక భాగమే న్యూఇయర్ వేడుకల పేరుతో జరిగే పార్టీలు. నగరాల్లో ఉండేవారిని, ముఖ్యంగా ఒంటరిగా హాస్టల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఒక పధకం రచించారు. ముందు పార్టీలకు అలవాటు చేయడం, మద్యం అలవాటు చేయడం, తర్వాత మాదకద్రవ్యాలు అలవాటు చేయడం ........... ఇలా ఒక్కొక్కటి చేస్తారు. ఆఖరున కుటుంబవ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి, యువతను నైతికంగా, మానసికంగా ఒంటరిగా చేయడం ఇందులో భాగం. ఒంటరి అయినవారికి సాయం అందిస్తాము, ఒంటరితనం దూరం చేస్తామంటూ మతమార్పిడి చేయడం ఆఖరి ఘట్టం. ఇది పైకి చెప్పినంత బహిరంగంగా జరగదు, చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇదంతా తెలియక చాలా మంది మనం ఎన్నో సంస్కృతులను అంగీకరిస్తున్నప్పుడు, ఈ న్యూఇయర్ వేడుకలను మాత్రం చేసుకుంటే తప్పేంటి అంటూ జరుపుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. భారత్ ఆర్ధికంగా, నైతికంగా, ధార్మికంగా, మానసికంగా, భౌతికంగా పతనమవ్వాలంటే కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అయితే చాలని భారతదేశాన్ని అర్దం చేసుకున్న స్వదేశీ ఆర్ధికవేత్తలకు స్పష్టంగా తెలుసు.

అలాగే పండుగలు జరుపుకోవడం వేరు, న్యూఇయర్ జరుపుకోవడం వేరు. పండుగల సమయంలో ఆకులు, పూలు, ప్రమిదలు, ఇతర సామాన్లు అమ్మేది సాధారణ లేక పేద ప్రజలు మాత్రమే. ప్రభుత్వం వారికి ఇచ్చే సబ్సీడీలు, పధకాలకంటే, వారిని హిందూ సమాజం పండుగల ద్వారనే పోషిస్తోంది. ఒకసారి గమనించండి. మనం పండుగ జరుపుకున్న ప్రతిసారి ఆయా పేద కుటుంబాలకు ఆదాయం వచ్చి కడుపు నిండుతుంది, వారూ పండుగ చేసుకుంటారు. కానీ న్యూ ఇయర్ వేరు. దీంతో పేదవారికి వచ్చేదేమి ఉండకపోగా, తాము అలాంటి పార్టీలకు దూరం అవుతున్నామనే బాధ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బలంగా తీసుకుని, కొన్ని మిషనరీలు వారికి డబ్బు ఆశచూపి మతం మారిస్తున్నాయి.

ఇంకో విషయం గమనించండి, కరువు వచ్చింది, భూకంపం వచ్చింది, తుఫాను వచ్చింది, అందుకని పండుగలు జరుపుకోకండని చెప్పే సంస్థలు, న్యూఇయర్ మాత్రం జరుపుకోవద్దని చెప్పవు. ఎందుకు? ........... పండుగ జరుపుకోకపోతే ఆదాయం లేక నష్టపోయేది పేదలు, కానీ న్యూఇయర్ విషయంలో అలా కాదు. పండుగ జరుపుకోకపోవడం ఒక రకంగా పేదరికాన్ని పెంచుతుంది. పేదరికం పెరిగితే ప్రభుత్వం వారిని ఆదుకోవడం కోసం అభివృద్ధికి వెచ్చించవలసిన నిధులను, వీరి కోసం ఖర్చు చేస్తుంది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతుంది. ఫారిన్ బ్రాండ్లను మన దేశంలో అమ్మడం కూడా ఇందుకోసమే. అర్దం చేసుకోండి. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపరులను నాశనం చేసి, పేదరికాన్ని పెంచడం, ఈ మధ్యలో కొన్ని సంస్థల ద్వారా, వారి పేదరికానికి కారణం మధ్యతరగతి మరియు ధనికవర్గాల ప్రజలని రెచ్చగొట్టి అంతర్గతకలహాలను సృష్టించడం, దేశ సమగ్రతను, సమైఖ్యతను బలహీనపరచడం, ఆకారికి ఆఫ్ఘనిస్థాన్ మీద ఆదిపత్యం చేలించినట్లుగా భారత్ మీద కూడా ఆధిపత్యం పొంది, భారత్‌లో ఉన్న అపారమైన గనులను, సంపదను దోచుకోవడమే లక్ష్యం. మన పండుగలు చేసుకోవద్దని చేప్పే ఏ సంస్థా. న్యూఇయర్ వేడుకలను చేసుకోవద్దని చెప్పదు. ఎందుకంటే అది అన్యదేశాల ఆదాయానికి గండి కొడుతుంది, అప్పుడు వీరికి రావలసిన నిధులు ఆగిపోతాయి. అలాగే పర్యావరణహిత హోలీ చేసుకోండి, ఏకో ఫ్రెండ్లీ గణేశచవితి జరుపుకోండి, దీపావళికి టపాసులు మానండి అని చెప్పేవారు న్యూఇయర్ కి మాత్రం టపాసులు మానమని చెప్పరు. అసలు ఆ ఊసే ఎత్తరు. దీనికి తోడు ఈ న్యూఇయర్ జాడ్యాన్ని పిల్లలకు అంటించిన దాంట్లో పెద్దలు కూడా ఉన్నారు. ముగ్గులో రాసి, కేకులు తీసుకువచ్చి, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి, తలిదండ్రులు ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అదే పిల్లలను కొత్తపుంతలు తొక్కిస్తోంది. కానీ దీని వెనుక ఉన్న కుట్ర పెద్దలకు తెలియదు పాపం.  అందుకే చెప్పోచ్చేదంటంటే, న్యూఇయర్ మనది కాదు, కానీ జరుపుకోవలనుకుంటే ఆ డబ్బును పేదలకు అన్నదానం చేయడానికో, బట్టలు కొన్నివడానికో ఖర్చు చేయండి. పార్టీలకు, పబ్బులకు, మద్యానికి దూరంగా ఉండండి.

Monday, 22 December 2014

బట్ట బయలైన క్రైస్తవమిషనరీల కుట్ర

దయచేసి అందరు ఇది చదవండి వాళ్ళ ధోరణి మచ్చుకి
బట్ట బయలైన క్రైస్తవుల కుట్ర.

భారత దేశాన్ని క్రైస్తవమయం చేయాలనే మిషనరీల పన్నాగం కోర్టు విచారణలో బయట పడింది. " ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్" అనే సంస్థ చాలాసంవత్సరాల నుండి మన దేశం లో పని చేస్తూ, సంవత్సరానికి 40 లక్షల మంది హిందువులను మతం మార్చాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. అందుకు 5000 వేల మంది కార్య కర్తలను నియమించి, విదేశాలనుండి వచ్చే అపరిమితమైన డబ్బుతో ఈ కార్యకర్తలను కొనుగోలు చేసి వీరి మనస్సులో క్రైస్తవమత విషాన్నినురిపోస్తుంది.

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కోర్టులో శ్రీ సుధీర్ కుమార్ అగర్వాల్ బలవంతపు మతమార్పిడుల నేరం పై కేసు దాఖలు చేయగానే " ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్" ప్రముఖ సంచాలకుడు 'సుధీర్ జేవియర్' ను అరెస్ట్ చేసి విచారించినపుడు ఎంతో ఆశ్చర్య కరమైన సమాచారం లభించింది. 'స్వతంత్ర ధర్మపరివర్తన' చట్టం లోని 1968 అధికరణలో 3,4 సెక్షన్ల క్రింద సుధీర్ జేవియర్ పై విచారణ సాగుతుంది.
ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే 'ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్' ప్రధాన కార్యాలయం మన సికింద్రాబాద్ లో ప్రాన్సిస్స్ట్రీట్ లో ఉంది. ఈ కార్యాలయానికి అనుగుణంగా 33 ప్రాంతీయ కార్యాలయాలు, 4 క్షేత్రీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. 2007 డిసెంబర్ 20 వ తేదీన ఈ కార్యాలయమునుండి సుధీర్ జేవియర్ కు ఒక నివేదిక పంపబడింది, ఆ నివేదిక ఏమంటే 2007 లో ఈ సంస్థ కార్యకర్తలు 25,10,810 ల హిందువుల ఇళ్ళకు వెళ్లి, 47,46,842 మంది హిందువులను మతం మార్చుటకు అనేక రకాలుగా ప్రలోభ పెట్టి, 1,92,868 మందిని మతం మార్చారు.

కోర్టులో విచారణ జరుగుతున్న సమయం లోనే ఇంకొక మిషనరీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. 'వరల్డ్ ఫేయిర్ సమిత్' అనే ఈ సంస్థ మధ్యప్రదేశ్ లో ౭౦ గ్రామాల్లో మత మార్పిడులు ప్రారంభించింది. అనిల్ థామస్ దీనికి అధిపతి, 'పాంచజన్య' పత్రికా ప్రతినిధులు ఆ గ్రామస్థులను కలిసినపుడు ఆశ్చర్య కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మతం మారిన రైతుకు 5000 వేళ రూపాయలను చేల్లిస్తున్నాడు. కముద్ కేవట్ అనే రైతును మతం మారమని ప్రలోభ పెట్టాడు. నెలకు అయిదు వేళ రూపాయలే కాక అతని స్థలములో చర్చిని నిర్మించీ కముద్ ని ఫాదరీగా నియమిస్తామని అందుకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశ చూపారు. కముద్ ఆ గ్రామం లోని 'ధర్మసేన' వారికి కబురందించారు. ధర్మసేన ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ సుధీర్ కుమార్ అగ్రవాల్ అనిల్ థామస్ పై కేసు పెట్టాడు. పోలీసులు అనిల్ థామస్ ను అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. శ్రీ సుధీర్ కుమార్ అగ్రవాల్ మధ్య ప్రదేశ్ 'ధర్మ జాగరణ' విభాగ్ సహా సంయోజకులు.

suryam mangalamapalli

Sunday, 6 April 2014

చావో రేవో ఆలోచించండి

ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ప్రతి రాజకీయపార్టీ ప్రచారంలో మునిగిపోయింది. కుల సంఘాలు, మతపెద్దలు ఏ పార్టీలకు ఓటు చేయాలో చెప్తున్నారు. ఇటువంటి సమయంలో హిందువులు ఓటు వేసే ముందు కొన్ని నిజాలు తెలుసుకోండి.

కాంగ్రెస్ ముస్లిం, ఇతర మైనారటీ సంస్థలను మెప్పించడానికి మతహింస నిరోధక బిల్లు 2011 తెచ్చింది. దీనిలో స్వల్పమార్పులతో మతహింసనిరోధక బిల్లు 2014ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ మతహింస నిరోధక బిల్లు గురించి ప్రతి హిందువు తెలుసుకోవాలి.

మతహింస నిరోధక బిల్లు - దేశంలో మతహింసను నిరోధించడానికి, లౌకికవాదాన్ని(సెక్యులరిసం) కాపాడటానికి ఉపకరిస్తుందని ఈ బిల్లు చేసిన సభ్యుల అభిప్రాయం. ఆ బిల్లు ఏం చెప్తుందో చూడండి.

ఈ బిల్లు ప్రకారం మెజారటిలు అంటే కేవలం ఓ.సి., బీ.సి, హిందువులు మాత్రమే, ఎస్సి.,ఎస్టీలు హిందువుల చేత పీడింపడుతున్నవారు. మైనారటీలు అంటే ఇతర మతస్థులు, ఎస్సీ, ఎస్టీలు. ఈ బిల్లు కేవలం హిందువులకే వర్తిస్తుంది.

ఈ బిల్లు ప్రకారం దేశంలో ఉన్న హిందువులంతా సహజంగానే దోషులు, నేరస్థులు, హింసను ప్రేరేపించేవారు, ఆందోళంకారులు. దేశంలో మేజార్టీశాతం ఉన్నారు కనుక హిందువులు మాత్రమే దేశంలో భయాందోళనలు సృష్టిస్తారు. ఇదే ప్రధాన అంశం. అందువల్ల దేశంలో ఎక్కడ మతఘర్షణ జరిగినా, ఎక్కడ ఉగ్రవాదులు బాంబు పేల్చినా, నిజానిజాలతో సంబంధం లేకుండా, ఎవరు చేశారు, ఏ దేశం యొక్క ప్రోద్బలంతో చేశారన్నది కూడా పట్టించుకోకుండా దానికి హిందూ సమాజాన్నే బాధ్యులను చేస్తుంది ఈ బిల్లు. అంటే ఉగ్రవాదుల దాడి జరిగితే, దాడి చేసినవారిని కాకుండా, దేశంలో హిందువులు మెజారటీ కనుక వారినే అరెస్ట్ చేస్తారు. అది ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్న హిందునాయకులను, పీఠాధిపతులను జైల్లో వేస్తారు. ఇతర మతస్థులు దాడు చేశారనంటే ఈ బిల్లు అంగీకరించదు.

మెజారీటీ జనాభా అధికంగా ఒక ప్రాంతంలో చేరితే, అది ఉద్రిక్తతకు, ఆందోళనకు దారి తీస్తుందన్నది, ఇతర మతస్థులపై దాడులకు కారణమవుతుందని ఈ బిల్లు చెప్తుంది. కనుక హిందువులు అందరూ ఒక చోట చేరే సభలను, ర్యాలీలను, ఉత్సవాలను ప్రభుత్వం నిషేధించవచ్చు. అంటే వినాయకచవితి, దుర్గానవరాత్రి, బతుకమ్మ, జాతరలు మొదలైనవి ఈ బిల్లు ప్రకారం నిషేధింపబడతాయి.

ఈ బిల్లు హైందవేతరుల మనోభావల గురించి నొక్కి చెప్తుంది. హిందువులు ఇతర మతస్థుల మనోభాలను ఏ విధంగా దెబ్బ తీసినా, హిందువులు శిక్షార్షులు. మీరు అవతలవారిని దూషించవలసిన అవసరంలేదు. వారి భయాందోళనలకు హిందువే కారణం అన్న ఒక చిన్న కంప్లైంట్ చాలు, నాన్-బెయిలబుల్ కేస్ క్రింద హిందువులను జైల్లో పెడతారు.

మనోభావాలు దెబ్బతీయడం అంటే? ఉదాహరణకు మీ ఇంట్లో మీరు దైవానికి పూజ చేసుకుంటున్నారు. ఒక హైందవేతరుడు వచ్చి, మీరు పూజిస్తున్న దైవాన్ని ప్రక్కకుతోసి తన దైవాన్ని పెడితే, మీరు నోరు మూసుకుని పూజ చేయాలి. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించినా, నేను ఒప్పుకోను అన్నా, అతని మనోభావలు గాయపరిచినవారవుతారు. అతను కంప్లైంట్ చేస్తే కనుక మీరు శిక్షార్హులు. ఇదే కాదు, మిమ్మల్ని మతం మారమని బలవంత పెట్టినా, నేను మారను అని మీరు సమాధనం చెప్తే, అది వారి మనోభావలను దెబ్బతీయటమేనట. ఇక్కడ జరిగిన సంఘటన్ గురించి ఈ చట్టానికి అనవసరం. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అన్నదే ప్రధానం.

ఇక భయాందోళనల విషయానికి వద్దాం. హిందువులు ఒక చోట ఉత్సవం పేరున గుమ్మిగూడటం మాలో భయాన్ని కలిగిస్తోందన్న ఒక్క కంప్లైంట్ చాలు హైందవేతరుల నుంచి, ఆ ఉత్సవాన్ని నిషేధించవచ్చు. బిల్లు ప్రకారం ఇంట్లో పూజ సమయంలో గంటలు కొట్టడం, దేవాలయాల్లో సుప్రభాతాలు పెట్టడం, లౌడ్ స్పీకర్లలో ప్రవచనాలు చెప్పడం కూడా బ్యాన్ చేయబడతాయి. అసలు ప్రవచనాలు, ధర్మప్రచారాలను నిషేధించినా ఆశ్చర్యపడనవసరంలేదు. ఈ బిల్లు అమలైతే సంగీత కచేరీలు, భరతనాట్యాలు ఇక కలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కచేరీలో మన భగవంతుని గుణగణాలను మెచ్చుకుంటాం, కచేరి పేరిన ఈ హిందువులు తమ దేవుడే గొప్పని చెప్పుకుంటున్నారని వారి కంప్లైంట్ చేసినా అది వర్తిస్తుంది.

పిండప్రధాలు, తర్పణాలు చేయడం, శవాలను ఊరేగించడం వలన మాకు భయం వేస్తోంది అని ఏ హైందవేతరుడు కంప్లైంట్ చేసినా శవయాత్రలు, పిండప్రధానాలు, శ్రద్ధకర్మలు నిషేధిస్తారు. మీ ఇంట్లో మీరు చేసుకున్నా, మీ పక్క ఇంట్లో ఉన్నవాడు కంప్లైంట్ చేస్తే, వాడిని భయపెట్టినందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తారు.

పెళ్ళి సమయంలో మ్రోగించే మంగళవాయిద్యాలు మాలో ఆందోళన కలిగిస్తున్నాయి, ఇబ్బంది కలిగిస్తున్నాయి అంటే చాలు, ఆ పెళ్ళివాళ్ళని జైల్లో పెట్టవచ్చు. వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో జరుగుతున్న యజ్ఞాలు, యాగాలు, వేదపారాయణలు ఈ బిల్లుతో ఆగిపోయే పరిస్థితి. దేవాలయాలు పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు.

ఒక ప్రాంతంలో ఇద్దరు వ్యాపారులు ఉన్నారు, ఒకరు హిందువు, మరొకరు హైందవేతరుడు. జనం అధికంగా హిందువు షాపులో వస్తువులు తీసుకుంటే, ఈ హిందువు నా వ్యాపారానికి అడ్డవస్తున్నాడు, ఇతని వల్లనే నేను నష్టపోతున్నాను, తద్వారా నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అన్న ఒక కంప్లైంట్‌తో ఆ హిందువు వ్యాపరిని అరెస్ట్ చేసి, అతడి వ్యాపారాన్ని, అస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని బిల్లు చెప్తోంది.

ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవినీతిపరుల ఆస్తిని జప్తు చేయాలని చట్టం చేయలేని రాజకీయపార్టీలు కేవలం నింద పడిన కారణంగా హిందువు ఆస్తిని స్వాధీనపరుచుకునే హక్కు కల్పించడం!

ఈ బిల్లులోని మరొక ఆశ్చర్యకరమైన విషయం చూడండి. సాధారణంగా చట్టం ప్రకారం ఒక వ్యక్తి మీద పడిన నేరారోపణ ఋజువు అయ్యేవరకు అతడు కేవలం నిందితుడు మాత్రమే. ఋజువు చేస్తేనే అతడిని దోషిగా పరిగణించి శిక్ష వేస్తారు. కానీ మతహింస నిరోధక బిల్లు అందుకు పూర్తి విరుద్ధం. హిందువు మీద హైందవేతరుడు కంప్లైంట్ చేస్తే, దానికి సాక్ష్యం అవసరమేలేదు. నేను తప్పు చేయలేదని హిందువు నిరూపించుకునేవరకు అతడు దోషే. అతడు శిక్షార్హుడు. అతని ఆస్తిని జప్తు చేయవచ్చు. ఒకవేళ హైందవేతరుడే తప్పు కంప్లైంట్ ఇచ్చాడని తేలితే, అతని శిక్షపడదు, అతడిని విడిచిపెట్టేస్తారు. అదే బిల్లులో సుస్పష్టం.

ఈ బిల్లు ప్రకారం హిందువులపై 1950 నుంచి ఉన్న కేసులన్నీ రీఓపెన్ చేసి విచారణ చేపట్టవచ్చు. ఒక చిన్న కంప్లైంట్ చాలు. కానీ ఇది ఇతర మతాలవారికి వర్తించదు.

ఏదైనా ఒక రాష్ట్రంలో మతఘర్షణ జరుగుతుందన్న నెపంతో అక్కడున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి, కేంద్ర బలగాలను దింపి, ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అమలు చేసే సదుపాయం ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది, ఫెడరల్ వ్యవస్థను నాశనంచేస్తుంది.

ఈ బిల్లు మొత్తం హిందువుల గురించే మాట్లాడుతుంది. మైనారటీలు ఎన్ని అకృత్యాలు చేసినా దీనికి సంబంధం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ బిల్లు ప్రకారం మైనారటీలు చెప్పేవన్నీ నిజాలు, హిందువులు అబద్దాలకోరులు. దీనికి ప్రత్యేక కమీషన్ ఒకటి కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటవుతాయి. వాటికి ప్రత్యేక నిధి కూడా ఉంటుంది. ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటుంది.

ఇది కేవలం హిందువులు మెజారాటిలుగా ఉన్న రాష్ట్రాలకే పని చేస్తుంది. ఎక్కడ హిందువులు తక్కువ సంఖ్యలో ఉంటారో, ఆ రాష్ట్రాల్లో ఏ చట్టం అమలు జరగదని బిల్లే స్పష్టం చేస్తోంది. ఎందుకంటే ఈ దేశంలో అల్లర్లకు హిందువులే కారణమట.

ఇంత దిక్కుమాలిన బిల్లును యూ.పీ.యే ప్రభుత్వం పార్లమెంటు రాజ్యసభలో ప్రవేశపెట్టడం కూడా జరిగిపోయింది. ఒక హిందూ దేశంలో హిందువులకు ఎంతో అన్యాయం చేసే ఈ బిల్లు మీద బీ.జే.పి. తప్ప ఇతర రాజకీయపార్టీలు స్పందించకపోవడం, తప్పని చెప్పకపోవడం ఈ దేశపు హిందువులు దౌర్భాగ్యం. ప్రతి చిన్న విషయాన్ని పదేపదే చూపించే మీడియా ఈ భయానక బిల్లు గురించి జనానికి చెప్పకపోవడం, మీడియా యొక్క కుహనాలౌకికవాదానికి నిదర్శనం.

కనీసం ఇప్పటికైనా హిందువులు కులాలకు అతీతంగా సంఘటితం కావాలి. తమదైన ఓటు బ్యాంకును నిర్ముచుకోవాలి. కేంద్రంలో హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని మతాలను ఆదరిస్తూనే, హిందు ధర్మాన్ని ఆచరించాలి, కాపాడుకోవాలి.

కేంద్రంలో ఈసారి కూడా కూహనాలౌకికవాద ప్రభుత్వం ఏర్పడి ఈ చట్టం తీసుకువస్తే, ఈ దేశంలో హిందువులకు మూడే దారులు ఉంటాయి.

ఒకటి మతమార్చుకోవడం, రెండవ చచ్చిపోవడం, లేకుంటే బాధలు పడటం.

ఓటు వేసే ముందు కాస్త ఆలోచించండి. ముస్లింలు, క్రైస్తవులందరూ గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. హిందువులేమో కులాల పేరున కొట్టుకుచస్తున్నారు. కమ్మలు ఒక పార్టీకి, రెడ్లు ఒక పార్టీకి, కాపులు వేరే పార్టీకంటూ మనలో మనమే గుద్దుకుని ఓట్లు చీల్చుకుంటున్నాం. హిందువుల ఓట్లు కూడా గంపగుత్తగా ఒకే పార్టికి పడాలి. మనకోసం, మన ధర్మం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, భారతదేశ రక్షణ కోసం.

ఇప్పుడు మనం రెండు పనులు చేయాలి. త్వరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి కనుక హిందువుల ఓట్లు చీలకుండా జాగ్రత పడాలి, మన గురించి మాట్లాడేవారిని గెలిపించుకోవాలి. దీర్ఘకాలంలో హిందువులంతా రాజకీయాలకు అతీతంగా ఒక ఉమ్మడి ఓటు బ్యాంకుగా మారాలి. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, అన్ని రాజకీయపార్టిలు హిందువులకు జై కొట్టాలి.

ఒక పక్క ఇల్లు తగలబడుతుంటే, వాటాల కొసం కొట్టుకుచావడమేమిటి? ముందు ఇల్లు తగలబడకుండా ఆపుదాం. ఆ తర్వాత మిగితా సంగతి చూసుకుందాం. ఓటు వేసే ముందు ఆలోచించండి.

Sunday, 23 March 2014

సెక్యులర్ మడిబట్ట జాగ్రత్త!

Courtesy : http://www.andhrabhoomi.net/content/secular-madi-batta-jegratha

ఇండోనేసియా ప్రపంచంలోకెల్లా పెద్ద ముస్లిం దేశం. అక్కడి జనాభాలో నూటికి 87 మంది మహమ్మదీయులు. తమ సాంస్కృతిక మూలాలను ఇండోనేసియన్లు మరచిపోరు. ఏవగించుకోరు.
అక్కడి నేషనల్ ఎయిర్‌లైన్ పేరు ‘గరుడ’
(ప్రస్తుతం మూతపడ్డ) డొమెస్టిక్ ఎయిర్‌లైన్ పేరు ‘జటాయు’.
ఇండోనేసియన్ కరెన్సీ నోటుమీద గణేశుడి బొమ్మ!
రాజధాని జకార్తాలో ముఖ్యకూడలివద్ద అర్జునుడికి కృష్ణుడు రథం మీద గీతోపదేశం చేస్తున్న నిలువెత్తు ప్రతిమ!!
గరుత్మంతుడు, జటాయువు, కృష్ణుడు, గణేశుడు హైందవ మత సంబంధంగల పేర్లు. తమ దేశంలో హిందూమతం శతాబ్దాలకిందటే దాదాపుగా అంతరించిపోయి, ఐదింట నాలుగొంతుల జనాభా ఇస్లాం మతాన్ని తరతరాలుగా ఆచరిస్తుండగా... తమదికాని, ... అందునా విగ్రహారాధకుల మతం తాలూకు పేర్లను ప్రభుత్వ సంస్థలకు పెట్టటమేమిటి? ప్రభుత్వ కరెన్సీపై అన్యమతానికి చెందిన దేవతామూర్తిని ముద్రించటమేమిటి?... అన్న అభ్యంతరం ఇండోనీసియన్లకు లేదు. తమ ప్రాచీన హిందూ సంస్కృతి అన్నా, వాటి ప్రతిరూపాలన్నా వారికి మహా ఇష్టం.
కొద్దినెలల కిందటి ముచ్చటే చూడండి. ముస్లిం దేశమైన ఇండోనేసియా, (ప్రధానంగా) క్రైస్తవ దేశమైన అమెరికాకు 16 అడుగుల ఎత్తు సరస్వతీదేవి విగ్రహాన్ని కళాత్మకంగా చెక్కించి, స్నేహానికి గుర్తుగా పంపించింది. వేరే మతానికి చెందిన దేవతావిగ్రహాన్ని ప్రభుత్వ కానుకగా పంపించటం అపరాధమని ఇండోనేసియా సర్కారు అనుకోలేదు. తమది కాని మతం ప్రతిమను తామెందుకు తీసుకోవాలని అమెరికన్ గవర్నమెంటూ చిరాకు పడలేదు. సంతోషంగా దాన్ని స్వీకరించి, వాషింగ్టన్ డి.సి.లో వైట్ హౌసుకు కిలోమీటరు దూరంలో టూరిస్టులకు ప్రత్యేకాకర్షణగా దాన్ని ఉంచారు.
పైన చెప్పుకున్న వాటిలో ఏ ఒక్కదాన్నయినా ఇండియా దటీజ్ సెక్యులర్ భారత్‌లో కలనైనా ఊహించగలమా?
కర్మంచాలక అదే సరస్వతీదేవి విగ్రహాన్ని అమెరికాకు కాక ఇండియా సర్కారుకు ఇండోనేసియా బహూకరించిందనుకోండి! ఏమయ్యేది? విగ్రహం ఎంత ముచ్చటగా ఉంటేనేమి? అది ఒక మతానికి సంబంధించినది కదా? ఆ మతం ఎంత ప్రాచీనమైనది అయితే మాత్రమేమి? మా దేశంలో నూటికి 80 మంది ఇప్పటికీ అనుసరిస్తున్నదే అయితే నేమి? ఫలానా మతానికి చెందిన దేవతా ప్రతిమను ముట్టుకుంటే మా సెక్యులర్ మడి మైలపడుతుంది. కాబట్టి వద్దే వద్దని ఘనత వహించిన భారత సర్కారు ఆ కానుకను తిరుగు టపాలో వెనక్కి పంపించేది. సమయానికి సెక్యులర్ మతి తిన్నగా పనిచేయక మన్మోహన్ సర్దార్జీగారో, మరో పెద్దతలకాయో ఆ విగ్రహాన్ని స్వీకరించి ఉంటేనా...?! దేశంలోని సెక్యులర్, లిబరల్, లెఫ్టిస్టు, అనార్కిస్టు తక్కుంగల మేధావిగణం యావత్తూ రేచుకుక్కల్లా మీదపడి పీకిపెట్టేది. జాతి ఎంచుకున్న సెక్యులర్ జీవన విధానానికి, రాజ్యాంగ వౌలిక స్ఫూర్తికి, మానవతా విలువలకు జరిగిన ఆ మహాపచారం సభ్య సమాజానికి సిగ్గుచేటు అంటూ ‘ది హిందూ’ పత్రిక ఘాటైన సంపాదకీయం రాసేది. వీరనారి అరుంధతీరాయ్ డిటోడిటోగా ‘ఔట్‌లుక్’ వీక్లీనిండా చెడామడా చెలరేగేది. పాఠశాలల్లో, పబ్లిక్ కార్యక్రమాల్లో సరస్వతీ ప్రార్థన చేయటమే సెక్యులర్ వ్యతిరేక దురాగతమని జాతీయ ఏకాభిప్రాయం ఎంచక్కా నెలకొని ఉన్న పవిత్ర భారతదేశంలో బాధ్యతగల ప్రభుత్వమే బరితెగించి ఏకంగా సరస్వతీ విగ్రహానే్న అందుకోవటాన్ని రాజ్యాంగ వ్యతిరేక దుశ్చర్యగా ప్రకటించమంటూ వీర సెక్యులరిస్టులు ఏ ఉన్నత న్యాయస్థానంలోనో అర్జంటుగా ప్రజాహిత వ్యాజ్యం వేసేవారు.
-ఇప్పుడు బృహదీశ్వరాలయం బొమ్మతో ప్రత్యేక నాణేన్ని రిజర్వు బ్యాంకు చలామణీ చేయడం మీద ఢిల్లీ హైకోర్టులో లక్షణమైన ‘పిల్’ పడ్డట్టు!
పనిలేనివాడు దావావేస్తేనేమి? అన్నీ తెలిసిన న్యాయస్థానం అడ్డగోలు వాదాన్ని ఎందుకు మన్నిస్తుంది - అంటారా?
తాజా నాణెం కేసులో ఏమయింది?
బృహదీశ్వరాలయం బొమ్మతో మూడేళ్ల కింద రిజర్వు బ్యాంకు ప్రత్యేక నాణేన్ని వెలువరించింది తంజావూరు గుడికీ హిందూ మతానికీ వల్లమాలిన పబ్లిసిటీ తెచ్చిపెట్టటానికి కాదు. ప్రపంచ హెరిటేజ్ సెంటరుగా ‘యునెస్కో’ గుర్తింపు పొంది, కళాత్మక నిర్మాణ వైభవానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ పెద్ద గుడికి వెయ్యేళ్లు నిండిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యమది. అయితేనేమి? సెక్యులరిజం మంట కలిసిందంటూ నఫీస్ కాజీ, అబూ సరుూద్ అనే ఇద్దరు ఢిల్లీ పౌరులు ప్రజాహితవ్యాజ్యం వేసీ వెయ్యగానే అన్నీ తెలిసిన ఢిల్లీ హైకోర్టు న్యాయపీఠం ప్రభుత్వంమీద ఫైర్ అయింది. మీపై వచ్చిన అభియోగానికి ఏమంటారో చెప్పుకోమని కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వుబ్యాంకుకు నోటీసులిమ్మని ఆదేశించిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ బి.డి. అహమ్మద్‌గారు ఆ సమాధానమేదో వచ్చేదాకా ఆగకుండానే ప్రభుత్వానికి సెక్యులర్ వ్రత విధానం గురించి పెద్ద క్లాసు తీసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెయ్యేళ్లు నిండిన అరుదైన సందర్భాన్ని పురస్కరించుకునే నాణేన్ని వెలువరించామని ప్రభుత్వం పనుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏ ఒక్క మతానికీ ప్రచారం చేయరాదు; సెక్యులరిజాన్ని సక్రమంగా అర్థం చేసుకోవలెను అంటూ ఎడాపెడా ఉతికేశారు. పాతికేళ్లకు ఇది, వందేళ్లకు అది అంటూ తడవతడవకూ ప్రత్యేక నాణేలేమిటని తెగచిరాకు పడ్డారు. శభాష్!
న్యాయం, ధర్మం సర్వం ఎరిగిన ఉన్నత న్యాయస్థానం వారి ఉపదేశమే ఈ రీతిన ఉన్నప్పుడు ప్రాచీన కళలను, సంస్కృతిని రూపుమాపడమే సెక్యులర్ సర్కారు స్పెషల్ డ్యూటీగా పెట్టుకుని, ఓటు బ్యాంకుల కోసం ఎంత చేటుపనికైనా ఉరకలేయడంలో వింతేముంది? శ్రీనగర్ దాల్ సరస్సు దాపున ఉండే జగత్ప్రసిద్ధి చెందిన ‘శంకరాచార్య హిల్’ను ‘తఖ్త్-ఎ-సులేమాన్’గా పేరుమార్చి, కొత్త చరిత్రను బనాయించే పవిత్ర కార్యాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ.) వారు రాజకీయ యజమానుల పురమాయింపు మీద జయప్రదంగా పూర్తిచేశారు. తమ కబంధ హస్తాల్లో చిక్కిన ఎన్నో ప్రాచీన దేవాలయ కట్టడాలను ‘పరిరక్షణ’ పేరిట కూల్చి కుప్పపోసే మహత్కార్యక్రమంలో ఈ సర్కారీ సంస్థ వారు ఔరంగజేబు ఆవహించినట్టు చాలాకాలం నుంచీ నిర్ణిద్ర దీక్షతో పాటుపడుతున్నారు. హిందూ మతం గురించి, హిందూ సంస్కృతి గురించి, వాటి సంరక్షణ గురించి మాట్లాడితే ‘సెక్యులర్’ శీలం చెడి, కమ్యూనల్ ముద్ర పడుతుంది కనుక హిందూ సంస్థల పెద్దలూ నోళ్లు కుట్టేసుకున్నారు.
ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి సెక్యులరిజం నేర్పింది. ప్రపంచాన్ని చూసి భారతదేశం సెక్యులరిజాన్ని నేర్చుకోవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.

Saturday, 22 March 2014

రాజ్యాధికారమే లక్ష్యంగా మతమార్పిడులు

రెండు వందల ఏళ్ళ తీవ్రప్రయత్నం తరువాత కుడా హిందూ ధర్మం నాశనం కాకపోవడాన్ని క్రైస్తవ మిషనరీలు అంగీకరించలేకపోయాయి. స్వతంత్రం వచ్చినా, ఇంకా భారత్‌ను మతం మర్చాలనీ, తమకు బానిస చేసుకోవాలనీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  భారతదేశంలో జరిగే మత మార్పిడుల వెనుక విదేశీ హస్తం ఉంది. అది ఎలాగంటారా? దేశవ్యాప్తంగా జరుగుతున్న మతమార్పిడుల వెనుక పెద్ద పధకమే ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంటు స్థానంలో తమ మతస్థులు కనీసం 30-35% తగ్గకుండా ఉండేలా మరమార్పిడులు చేస్తున్నారు. అంతకుమించినా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మతమార్పిడి జరిగిన తరువాత వారికి ఇచ్చే భోధనలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎక్కువగా హిందూ సంస్కృతికి, భారతదేశ సమగ్రతకు వ్యతిరేకంగానే ఉంటాయి. అది తెలియని అమాయకజనం అవే నిజమని నమ్ముతారు.

మన దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు మనకు తెలిసిందే. దానికి తోడు హిందువుల్లో ఐక్యత ఉండదు. ముస్లింలు, క్రైస్తవులు అందరూ తమకు సంబంధించిన ఒక రాజకీయపార్టికి గంపగుత్తగా ఓటు చేసినట్టు హిందువులు ఓటు వేయరు. పైగా రాజకీయనాయకులే హిందువులను కులం, ప్రాతం పేరున విడిదీస్తారు. కనుక ఎన్నికల సమయంలో ఈ 30% ఓట్లు రాజకీయ పార్టీల జయాపజయాలకు కీలకంగా మారతాయి. మతపెద్ద ఎవరికి ఓటు వేయమంటే వారికే ఓటు వేసేలా ఆయా మతస్థులను తయారు చేస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఈ 30-35% ఉన్న జనాన్ని ఆకర్షించడానికి వారికి అనుగుణంగా పనిచేసే రాజకియ నాయకులను నిలబెడతారు.

ఉదాహరణకు ఒక నియోజవర్గంలో, 100 భారతీయుల్లో 70 మంది హిందువులు, వేరే మతస్థులు 30 మంది ఉన్నారనుకుందాం. 70 మంది హిందువులు ఐక్యత లేని కారణంగా 7 రాజకీయపార్టీలకు ఓటు వేస్తారు. ఫలితంగా ఓట్లు చీలిపోతాయి. మిగితా 30 మంది ఒకే పార్టికి తమ ఓటు వేసి, తమ మతానికి సంబంధించిన అభ్యర్ధిని గెలిపించుకుంటారు. రానున్న కొద్ది కాలంలో దేశమంతా ఇదే జరగాలని విదేశీయులు ఆశిస్తున్నారు. ఈ గెలిచిన అభ్యర్ధులు కూడా దేశానికి మేలు చేసే విధంగా నడుచుకోరు, వారికి ముందే బోధనలతో బ్రెయిన్ వాష్ చేసిన కారణంగా మానసికంగా బలహీనపడి, విదేశీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటారు, వారికి బానిసలవుతారు. ఇలా ఎప్పుడైతే మన దేశపు సార్వభౌమాధికారం ఇతర దేశాలవారి పాదాల దగ్గర పడుతుందో, అప్పుడు ఒక 20 సంవత్సరాలలో దేశం విదేశాలకు బానిస అయిపోతుంది. పార్లమెంటులోకి విదేశియులు ప్రవేశిస్తే, చట్టాలు మారిపోతాయి, క్రమక్రమంగా భారతదేశం బలహీనపడుతుంది. ఒకసారి విదేశీయులు వెనుక ఉండి నడిపిస్తున్న ఇతర మతస్థుల చేతుల్లోకి అధికారం వెళ్ళిదంటే హిందూ సంస్కృతి, భారతదేశం అస్థిత్వం కోల్పోతుంది. ఒకప్పుడు దక్షిణ కొరియా బౌద్ధమతస్థులు అధికంగా ఉన్న దేశం. కానీ దాని మీద క్రైస్తవ మిషనరీలు దృష్టి పెట్టి, దాన్ని క్రైస్తవ మెజారటి దేశంగా మార్చేశాయి. ఇప్పుడు అవే మిషనరీలు భారతదేశం మీద దృష్టి పెట్టాయి. మనం మేల్కొనకపోతే హిందువులు స్వదేశంలో మైనారటిలు అవుతారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది. ఇటువంటి అనేక విషయాలను Rajiv Malhotra గారు Breaking India అనే తన పుస్తకంలో వివరిచారు. కనీసం ఇప్పటికైనా హిందువులంతా ఐక్యంగా ఉండాలి, భారతదేశాన్ని రక్షించుకోవాలి. మత మార్పిడిలను అరికట్టాలి. విదేశీయుల చేతిలో మోసపోకుండా మన సోదరులు, భారతీయులైన ఇతర మతస్థులను కాపాడుకోవాలి. హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారాలి. మన ఉమ్మడి హక్కులను రక్షించుకోవాలి.   

Sunday, 9 March 2014

మత మార్పిడులను అరికట్టాలి.

భారతదేశానికి హిందూ ధర్మానికి తేడా లేదు. భారతదేశనికి ఏదైనా గర్వకారణంగా చెప్పుకుంటే, దాని మూలం హిందూసంస్కృతిలోనే ఉంటుంది. హిందూ సంస్కృతిని పక్కనపెట్టి భారతదేశ గొప్పతనాన్ని గురించి చెప్పమంటే ఒక్క విషయం కూడా చెప్పలేరు. సున్నాను కనుక్కుని ఆర్యబట్టుడైనా, ఆయుర్వేద వైద్యశాస్త్రజ్ఞుడు శుశ్రుతుడైనా, మనం గొప్పగా చెప్పుకుంటున్న వారంతా హిందు విద్యావిధానంలో విద్యాభ్యాసం చేయడం వల్లనే, వేదవేదాంగాలను చదవడం వల్లనే అన్ని గొప్ప విషయాలను కనుగొన్నారు. భారతదేశ వైభవమంతా హిందూ ధర్మంలోనే ఉంది.

హిందూధర్మాన్ని, తమ మాతృభూమి భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం 800 ఏళ్ళుగా పొరాటం చేసిన ఘనత హిందువులకే దక్కుతుంది. మనం దేశం మీద పడ్డ అరబ్బులు ఎన్నో గ్రంధాలు తగలబెట్టినా, ఆంగ్లేయులు ఎన్ని ఆరచకాలకు పాల్పడినా హిందూ సమాజం తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది. ఎంత మంది ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా, భారతదేశం ఏనాడు సంపూర్ణంగా విదేశియుల చేతిలోకి వెళ్ళలేదు. క్రైస్తవులైన ఆంగ్లేయులు అమెరికా వెళ్ళారు, అక్కడ ఉన్న రెడ్ ఇండియన్లను ఊచకోత కోసి, దోపిడికి పాల్పడ్డారు, తమ మతప్రచారం చేసుకున్నారు. ఆప్రికా వెళ్ళారు, అక్కడ కూడా అదే పరిస్థితి. 'మొదటవారు వచ్చినప్పుడు మా చేతుల్లో భూములు ఉన్నాయి, వారి చేతిలో బైబిలు ఉంది, రండి! కలిసి ప్రార్ధన చేద్దాం అన్నారు, అందరం కలిసి ప్రార్ధన చేశాం, కళ్ళు తెరిచి చూసేసరికి భూములు వాళ్ళ చేతిల్లోకి వెళ్ళాయి, బైబులు మా చేతిలోకి వచ్చింది' అని ఆప్రికా వాళ్ళే చెప్పుకున్నారు. మన దేశంలోనూ అదే జరిగింది. అంగ్లేయులు వచ్చేసరికి మన దేశంలో దళితుల వద్ద కూడా వందల ఎకరాల భూమి ఉండేవి, వాటిని లాక్కుని, వారిని పీడించి, పేదలను చేసి, స్కాటిష్ మిషనరీ దళిత అన్ని పదాన్ని ప్రయోగించి, తమ చేత మోసగింపబడ్డవారిని దళితులనీ, వారి పేదరికానికి, దరిద్రానికి కారణం వారి మస్థులైన అగ్రవర్ణ హిందివులేననీ, హిందువుల్లో భేదాభిప్రాయాలను సృష్టించే ప్రయత్నం చేశారు. బూటకపు ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని లేవదీసి, భారతీయుల్ని ఆత్మనూన్యతకు గురిచేసి, మతమార్పిడి చేసేందుకు కుట్రపన్నారు. అయినా అన్నిటిని తట్టుకుని భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

కానీ అప్పటికి సంతృపి చెందని విదేశీశక్తులు, దేశాలు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి, హిందు ధర్మాన్ని నాశనం చేయడానికి, తమ మత ప్రాబల్యాన్ని పెంచుకోడానికి, రాజ్యాధికారం పొంది భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేందుకు ఎత్తులు వేస్తూనే ఉన్నాయి. దానికి ప్రధాన ఊతం మత మార్పిడిలే. ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని మతమార్పిడి చేయాలని మిషనరీలు బహిరంగంగా టార్గెట్ పెట్టుకున్నాయి.

భారతీయులు, హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి. దేశంలో జరుగుతున్న అక్రమ మతమార్పిడులను అడ్డుకోవాలి. ఇతర మతస్థుల మతాచరణను గౌరవిస్తూనే, వారినే ఆదరిస్తూనే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. తోటి హిందువులను రక్షించాలి. హిందువులు, జైనులు, సిక్కులు ఐక్యమవ్వాలి. భారతీయులైన మన ముస్లింలను, మన క్రైస్తవులను విదేశీ కుట్రల్లో పావులు కాకుండా కాపాడుకోవాలి. మత మార్పిడిలను అరికట్టాలంటే ప్రతి హిందువు హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి, అన్ని కులాల వారిని ఆదరించాలి.

హిందూ ధర్మం శాశ్వతంగా వర్ధిల్లాలి.

జై శ్రీ రాం
జై హిందూ