Wednesday 1 April 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (2వ భాగం)



ఇప్పుడు అమెజాన్ అడువులైనా, ఆస్ట్రేలియా అడవులైనా, లేక ప్రపంచంలో ఏ అడవులైనా, ఇవాళ వాటిని తగలబెట్టి, నేలను చదును చేసి, వ్యవసాయ భూమిగా మారుస్తున్నారు. ఆయా దేశాల జనాభకు ఆహారం అందించడానికి సరిపడా భూమి లేక కాదు, దేశప్రజల దురాశను తీర్చలేక. ప్రపంచమంతా ఇదే జరుగుతోంది.
అది ఎలా అంటారా? ప్రపంచమంతా కలిపి 150 కోట్ల గోసంతతి ఉందని అంచనా. మనుషుల తర్వాత అత్యధిక జనభా ఉన్న క్షీరదాల్లో ఆవులు ప్రధానమైనవి. అయితే వీటిలో చాలా వాటిని పెంచేది పాల కోసం కాదు, వాటిని చంపి భీఫ్ తినడానికి. కేవలం ఆవుల విషయమే కాదు, పందులు, మేకలు, గొఱ్ఱెలు, కోళ్ళు, గేదెలు మొదలైన ఇతర జంతువుల పరిస్థితి కూడా అంతే. మాంసాహర ఉతపత్తులకు మంచి డిమాండ్ ఉండటంతో, వీటిని పెంచడానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. మరి వీటి పెంపకానికి సరిపడా భూమి కావాలి, వాటిని పొషించడానికి తగినంత ఆహారం, నీరు కావాలి. అందుకోసమే అడువులు నరికేస్తున్నారు. అమెజాన్ లో కాల్చబడిన అడవిలో 80% కేవలం ఈ మాంసహారం కోసమే.

దీని గురించి రాజీవ్ దీక్షిత్ ఒక ప్రసంగంలో చెప్పారు. ఆయన చెప్పిన సమయంలో ప్రపంచ జనాభా 650 కోట్ల. ఆయన ఇలా అన్నారు - "ఇప్పుడు ప్రపంచ జనాభా 650 కోట్లు. కానీ ఈ ప్రపంచం (అన్ని దేశాలు కలిపి) 1300 కోట్ల జనాభాకు సరిపడా ఆహారం పండిస్తోంది. ఒకవేల ఉన్నపళంగా ప్రపంచ జనాభా రెండితలైనా అందరికీ కడుపు నింపగలశక్తి భూమాతకు, ప్రకృతికి ఉంది. కానీ ఆ ఆహరం, నీరు అంతా ఏమవుతోంది ? ప్రపంచంలో అత్యధికంగా తినబడే జీవజాతి గోజాతి (గోజాతికి చెందిన ఆవు, ఎద్దు, దూడలు). ఆ తర్వాత పంది, గేదె, మేక, కోడి, అటుతర్వాత ఇతర పక్షులు, జంతువులు. వీటిలో చాలా జంతువులు తమ ధర్మాన్ని (లక్షణాన్ని) అనుసరించి గడ్డి తింటయి. కానీ వీటి శరీరంలో మాంసం బాగా వృద్ధి చెందడానికి వీటికి గోధుమలు, వరి, పప్పులు, సోయా గింజలు, ఇతర ఆహారాధాన్యాలన్నీ పెడుతున్నారు. ఇవన్నీ తిని వాటి కండపుష్టి ఎంత బాగా పెరిగితే, మాంసం అమ్ముకునే కంపెనీలకు అంత లాభం. భారత్, పాకిస్థాన్, ఇండొనేషియా లాంటి పేద దేశాలు తమ మానవులు తినే ఆహార ఉత్పత్తుల్లో సరాసరి 40% జంతువులకు పెడుతుండగా, అమెరికా, బ్రిటన్, జెర్మని లాంటి దేశలు 70% ఆహార ఉత్పత్తులను జంతువులకు పెడుతున్నాయి. మొత్తం కలిపి చూస్తే సగటున ప్రపంచం మానవుల ఆకలి తీర్చడానికి పండిచిన ఆహార ఉత్పత్తుల్లో 55% శాతం జంతువులకు పెట్టి, వాటిని మేపి, వాటిని తింటున్నారు. అందుకే ఈ ప్రపంచంలో అనేక కోట్ల మంది తినడానికి తిండి లేక ఆకలితో మరణిస్తున్నారు. ఆహార్న్ని పండించి, ఆ మొత్తాన్ని జంతువులకు పెట్టి, వాటిని చంపి తినేకంటే, జంతువధను ఆపి, శాఖాహరం తినడం ప్రారంభిస్తే, ఎంతో మందికి భోజనం దొరుకుతుంది. వనరులు వృధా కావు."

ఇప్పుడు మీకు అర్ధమయ్యే ఉంటుంది, మన దురాశ మరియు జిహ్వచాపల్యం కారణంగా జంతువులు మరణించడమే కాదు, వేల ఎకరాల్లో అడవులు నాశనమవుతున్నాయి. మన ఆహారపు అలవాట్ల కారణంగా కొన్ని కోట్లమంది ఆకలితో అలమటించాలా ? మరి జరుగుతున్న వినాశనంలో మనకు వాటా లేదా ? మన అలవాట్లను మార్చుకుంటే తప్పేంటి ? 

To be continued.... 

No comments:

Post a Comment