Tuesday 21 April 2020

ఇంతకీ రాక్షసులంటే ఎవరు ? (2)



ఒకప్పుడు రాక్షసులు పాపకర్మలు చేస్తే, ఆ పాపభారం భరించలేక దేవతలందరితో భూదేవి కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి 'స్వామి! పాపభారం మోయలేకపోతున్నాను, దయచేసి అవతరించండి' అని చెప్పినట్లు పురాణాల్లో విన్నాము.

ఇప్పుడు ఆధునిక మానవుడు అంతకు తక్కువేమీ చేయడంలేదు. కొన్ని చూడండి.

ప్రకృతి విద్వంసం కారణంగా ఈ ప్రపంచంలో ప్రతి సంవస్తరం 25,000 నుంచి 50,000 జీవజాతులు అంతరించపోతున్నాయి, అనగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి.
భూమ్మీద ఉన్న అడవులలో దాదాపు 50% పూర్తిహా నశించిపోయింది. అందులో చాలా భాగం గత మూడు దశబ్దాల్లోనే నశించింది.
ఈ భూమి వయస్సు 460 కోట్ల సంవత్సరాలు. దాన్ని 46 ఏళ్ళు అనుకుంటే, అప్పుడు ఇక్కడ మానవుడు నివసిస్తున్నది కేవలం 4 గంటల నుంచే. మన పారిశ్రామిక విప్లవం మొదలై 1 నిమిషమైంది. ఆ సమయంలోనే మనం ప్రపంచంలోని 50% అడవులను నాశనం చేశాం. అది మన అభివృద్ధి ?? 
భూమి మీద జీవమనుగడకు సరిపడా వాతవారణాన్ని కాలుష్యం చేసి, భయంకారంగా భూమి మీద వాతావరణాన్ని పెంచేశాము.దాన్ని భూతాపం (గ్లోబల్ వార్మింగ్/ Global Warming) అంటున్నారు. ఆ ఫలితంగా రాబోవు 50 ఏళ్ళలో ప్రపంచంలో గొప్ప గొప్ప నదులు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందులో మన గంగ కూడా ఉంది. అయినా మనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. 
ఈ పరిస్థితి ఇలాగే ఉంటే, కార్బన ఉద్గారాల విషయంలో ఆలోచించకపోతే, 2100 కి అసలు మానవుడి సహా ఈ భూమ్మీద ఏ జీవి బ్రతకదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. 

రాక్షసులు పుణ్యనదులను కలుషితం చేశారు, చెరువులను నాశనం చేశారు. ఇప్పుడు మనవాళ్ళూ చెరువులను కబ్జా చేసి కనిపించకుండా చేశారు. ఈ భూతాపం గంగ రాబోయే 50 ఏళ్ళలో ఎండిపోతుందని, వాతవరణ మార్పుల పై బలమైన విధానం లేదు. 

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మనిషి బయటకు రాకపోతే ప్రకృతి పులకిస్తోంది. జరిగిన లోపాలను సవరించుకుంటోంది. ప్రపంచనేతలు చాలా సదస్సులు పెట్టారు, చాలా మాట్లాడారు, కానీ ఒక్కటీ అమలు పరచలేదు. బహుసా అందుకే ప్రకృతియే రంగంలోకి దిగిందేమో. అందుకే రాక్షసునిలా ప్రవర్తిస్తున్న మానవుడిని ఒక్క క్రిమితో కట్టడి చేసి, తనను తాను శుద్ది చేసుకుంటోంది. మిగితా జీవాలకు స్వేచ్ఛనిచ్చింది. ఈ కరోనా పేరుతో లాక్‌డౌన్ మొదలైన తర్వాత 10 రోజుల్లోనే గంగా, యమునా మొదలైన నదుల్లో చక్కని మార్పు కనిపించింది, కాలుష్యం తగ్గింది. అసలు స్నానానికి కూడా పనికి రాని విధంగా మనం గంగను కలుషితం చేస్తే, కేవలం 14 రోజుల్లోనే గంగ నీరు హరిద్వార్, ఋషికేశ్ మొదలైన ప్రాంతాల్లో త్రాగడానికి పనికి వచ్చే స్థాయికి వచ్చాయి. మిగితా వాటి పరిథితి కూడా ఇలానే ఉంది.

ఎవరినో తిట్టి చేసేదేమీ లేదు. అందరూ మారాలి, ఈ ప్రకృతికి మానవుడు అధిపతి కాదు, ప్రకృతిలో ఒక భాగమని, అతడు స్వతంత్రుడు కాదని, అన్ని జీవుల మీద ఆధారపడ్డాడని తెలుసుకుని, వినయంగా మెలగాలి. ప్రకృతిని కలుషితం చేయడం రాక్షసత్వం, సహజ వనరులను విచ్చలవీడిగా వాడటం రాక్షస్త్వం, అది చేసేవారంతా రాక్షసులేనని గుర్తించాలి. రాక్షసునిగా కాక మానవునిగా బ్రతకడం నేర్చుకోవాలి.

భూగోళాన్ని  కాపాడుకోవడం అనేది పర్యావరణ పరిరక్షకుల బాధ్యత కాదు, , మనకు ఉండాల్సిన కనీస ఇంగిత జ్ఞానం.  

No comments:

Post a Comment