Saturday 21 September 2024

శ్రీ గరుడ పురాణము (295)



మాఘశుద్ధ చతుర్థినాడు ఆహారమేమీ తీసుకోకుండా బ్రాహ్మణునికి తిలాదానం చేసి వ్రతి తిలలను నీటిని ఆహారంగా భావించి ప్రాశ్న చేయాలి. ఈ విధంగా ప్రతినెలా రెండేళ్ళపాటు చేసి ప్రత సమాప్తిని గావించాలి. ఇలా చేసిన వారికి జీవితంలో ఏ విఘ్నాలూ కలగవు. ప్రతి చవితి నాడూ గణపతిని యథావిధిగా పూజించాలి. ఈ పూజలో మూలమంత్రమైన ఓం గః స్వాహా ను వీలైనన్ని మార్లు పఠిస్తూ ఈ క్రింద పేర్కొన్న విధంగా అంగన్యాస పూజనూ చేయాలి.


ఓం గ్లౌం గ్లాం హృదయాయనమః అంటూ కుడిచేతి అయిదు వేళ్ళతోనూ గుండెను ముట్టుకోవాలి.


ఓం గాం గీం గూం శిరసే స్వాహా అంటూ తలనూ


ఓం హ్రూం హ్రీం హ్రీం శిఖాయై వషట్ అంటూ పిలకనూ 


ఓం గూం కవచాయ వర్మణే హుం అంటూ కుడి వ్రేళ్ళతో ఎడమభుజాన్నీ ఎడమ చేతి వ్రేళ్ళతో కుడిభుజాన్నీ స్పృశించాలి.


ఇంకా ఓం గౌం నేత్ర త్రయాయ వౌషట్ అంటూ కుడిచేతి వ్రేళ్ళ కొనలతో రెండు కనులనూ, లలాట మధ్య భాగాన్నీ స్పృశించాలి.


చివరగా ఓం గౌం అస్త్రాయ ఫట్ అనే మంత్రవాక్యముతో కుడిచేతిని తలపైకి లేపి ఎడమవైపు నుండి తలవెనుకకు గొనిపోయి కుడివైపు నుండి ముందుకి తీసుకువచ్చి, చూపుడు, మధ్యము వ్రేళ్ళతో ఎడమ అరచేతిని చప్పట్లు కొట్టినట్టు చరచాలి.


ఆవాహనాదులలో ఈ క్రింది మంత్రాలను పఠించాలి.


ఆగచ్చోల్యాయ గంధోలు పుష్పాల్కో ధూపకోల్యకః |

దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాథ విస (మా)ర్జనం ||


పూజాద్రవ్యాలన్నిటినీ తేజః స్వరూపాలుగా భావించి సాధకుడు పెట్టి వెలిగించిన దీపానికి మరింతకాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలబెట్టుమని చేసినప్రార్ధన ఇది.


No comments:

Post a Comment