Sunday 11 November 2012

ధన్వంతరి జయంతి

ఆశ్వయుజ బహుళ ద్వాదశి,ధన్వంతరి జయంతి

పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు  చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన శ్రీ మహా విష్ణు అంశ.

సుశ్రుతుడు ఈ ప్రపంచంలో తొలి శస్త్ర వైధ్యుడు(world's first surgeon).1120 రోగాల గురించి,700 మూలికల గురించి,శరీరం గురించి,300 రకాల శస్త్ర చికిత్సల(300 types of surgeries) గురించి,120 surgical instruments గురించి సవివరంగా వివరించిన గ్రంధం అది.అది 6 BC కంటే ముందే రచింపబడిందని తెలుస్తొంది.ధన్వంతరి మహర్షి ప్రజాహితం కోసం ఉపదేశించిన ఆయుర్వేదతంత్రాన్ని అనుసరించి తన పేరిట సుశ్రుతసంహిత రచించినట్లు సుశ్రుతుడు తన రచనలో పేర్కొనాడు.ధన్వంతరి లక్షశ్లోకాల ఆయుర్వేద శాస్త్రాన్ని ఉపదేశించాడని,ధన్వంతరి ఆయుర్వేద మూలపురుషుడని సుశ్రుతుడు చెప్పాడు.

మన దేశంలో 3000 ఏళ్ళ క్రితమే తొలి ప్లాస్టిక్ సర్జరి(plastic surgery)జరిగింది.ఆ కాలంలోనే తోలి   open heart surgery జరిగింది.అది 36 గంటలపాటు జరిగిందని,అలాగే cataract operations కూడా మొట్టమొదటిసారిగా 3000 ఏళ్ళ క్రితమే అనేకం జరిగినట్టు గ్రంధాల ద్వారా స్పష్టం అవుతోంది.ఇలా అనేకం కనిపిస్తాయి.వీటన్నిటికి మూలం ఆయుర్వేదమే.అటువంటి ఆయుర్వేదాన్ని ప్రచారం చేసిన వారు ధన్వంతరి.

వ్యాస మహాభారతంలో మనకు వైద్యానికి సంబంధించిన విషయాలు కనిపిస్తాయి.భీష్మ పర్వంలో బాణాల చేత గాయపడిన భీష్ముడు అంపశయ్యమీద ఉన్నప్పుడు ఆయనకు చికిత్స చేయడానికి శస్త్రచికిత్సలో(surgery) నిపుణులైన కొంతమంది శస్త్రవైద్యులు(surgeons)తమ పరికరాలతో(surgical instruments) భీష్ముడి శరీరం నుండి బాణాలు తీయడానికి రాగా భీష్ముడు "అంపశయ్య మీద పడుకున్న నాకు ఈ చికిత్స చేయించుకోవడం ఇష్టం లేదు.క్షత్రియుడైన(warrior)నేను నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాను.యుద్ధంలో పోరాడి ఉన్నతమైన స్థానాన్ని నిలుపుకున్నాను.ఇప్పుడు నాకు వైద్యులతో (physicians and surgeons)పని ఏంటి?అందువల్ల వారికి తగిన ధనం ఇచ్చి గౌరవ మర్యాదలతో సాగనంపండి"అని పలుకుతాడు.అక్కడికి physicians and surgeons అందరు వచ్చారని మనకు మహాభారతం చెప్తోంది. మహాభారతం జరిగి 5000 సంవత్సరాలు దాటింది.అంటే అంతకు పూర్వమే మన దేశంలో వైద్య శాస్త్రం(medical science) ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది.    

"ఆయుర్వేదం శ్చికిత్సాశాస్త్రం ఋద్వేదస్యోపవేదః"
అంటే ఆయుర్వేదం అనే చికిత్సా శాస్త్రం ఋగ్ వేదానికి ఉపవేదమని శౌనకుని చరణవ్యూహం పేర్కొంది.

ఇంత గొప్ప వైద్య విధానం మన భారతీయుల సొంతం.ఆయుర్వేదం కేవలం ఉపవేదమే కాదూ మన భారతీయ ఋషుల గొప్ప ఆవిష్కారం. allopathy కూడా నయం చేయలేని ఎన్నొ రోగాలను ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చు. మన పండగలలోను,మన హిందూ సంప్రదాయ వస్త్ర ధారణలోనూ,వంటకాలలోనూ ఆయుర్వేదం తనదైన ముద్ర వేసింది.అంతేందుకు 3 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా స్వైన్ ఫ్లూ(swine flu) వ్యాపించింది.భారతదేశంలో దాని వల్ల జరిగిన నష్టం తక్కువనే చెప్పొచ్చు.అది మన దేశంలో వ్యాపించకపోవడానికి  ఒక కారణం తులసిమొక్క,రెండూ మన వంటకాలని ఒక విదేశి వైద్య బృందం చెప్పింది.ఈ రెండు కూడా ఆయుర్వేదం ద్వారానే వాడుకలోనికి వచ్చాయి.అంతేకాదు ఆహారంలో పసుపును ఉపయోగించి క్యాన్సర్(cancer) ను అరికట్టవచ్చని,కొత్తిమీరను వంటల్లో వాడి food poisoning ను అరికట్టవచ్చని ఆయుర్వేదం చెప్పడమే కాదు మనం ఆచరించేలా చేసింది.ఇప్పుడు మనం వాటిని వంటల్లో వాడుతున్నామంటే అది ఆయుర్వేదం కారణంగానే.

అటువంటి ఆయుర్వేదాన్ని భారతీయులం మరచిపోయాం.అమెరికా వాళ్ళు పసుపు క్యాన్సర్ ను అరికడుతుందని అది తామే కనుగొన్నామని చెప్పుకుని పసుపు మీద "పెటెంట్"పొందారు.అదే కొత్తిమీర విషయంలో కూడా జరిగింది.అంతేకాదు మన ఋషులు చెప్పిన ఆయుర్వేద గ్రంధాలను ఎత్తుకుపొయి 30,000 ఆయుర్వేద మూలికల మీద "పెటెంట్స్"పొందింది ఆ దేశం.వేప,కలబందల గొప్పతనం,ఔషధి గుణాల గురించి ఆయుర్వేదం,భారతీయులు చెప్పినంత గొప్పగా ఇంకేవరు చెప్పలేదు.అటువంటి వేప,కలబందను మన ప్రభుత్వం  ద్వారా అధికసంఖ్యలో తమ దేశానికి తరలించుకుపోయి వాటి మీద పెటెంట్స్ పొందింది చైనా.ఇలా భారతదేశం మీద  bio-piracy యుద్దం ప్రకటించాయి.కాని మనం ఏమి పట్టనట్టు,మనకు సంబంధం లేని విషయమైనట్టు భావిస్తున్నాం.మన దేశ మేధాసంపత్తిని(intellectual property) ఇతర దేశాలు దొంగిలించిపోతుంటే సిగ్గులేకుండా చూస్తూ కూర్చున్నాం.ఇప్పటికైన మనము,రాజకీయనాయకులు కళ్ళు తెరవాలి,మన భారతీయ సంపదను కాపాడుకోవాలి.

No comments:

Post a Comment