Saturday 29 December 2012

సంకష్టహర చవితి

ఓం గం గణపతయే నమః
జనవరి 1 2013-మంగళవారం,సంకష్టహర చవితి,అంగారక చతుర్థి.

మంగళవారం సంకష్టహర చవితి వస్తే అది చాలా విశేషమైనది.దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు.గణపతి ఆరాధనకు విశేషమైన రోజు అది.

సంకష్టహర చతుర్థి:
దీన్నే సంకట చతుర్థి,సంకట చవితి అని కూడా అంటారు.నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది.

ప్రదోషకాలంలో(సూర్యాస్తమయ సమయంలో)చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి.రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు.ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ,పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది.ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3,5,11 లేద 21 నెలలు ఆచరిస్తారు.ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి.ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని,సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు(గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి.ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు,2 వక్కలు,దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి.దానిని స్వామి ముందు ఉంచి ధూపం(అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి.వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు.పూజలో ఉన్న గణపతిని తీయకూడదు.శారీరికంగానూ,మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం.అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం,ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి."సూర్యాస్తమయం వరకు ఉడికించిన  పదార్ధంగాని,ఉప్పు తగిలిన(కలిసిన)/వేయబడిన  పదార్ధాలు తినకూడదు".పాలు,పళ్ళూ,పచ్చి కూరగాయలు తినవచ్చు.అనుకున్న సమయం(3,5,11 లేదా 21 'చవితి 'లు)పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి.చంద్రదర్శనం లేద నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప,దీప,నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయవచ్చు.నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.

courtesy-sri saila prabha
ఓం గం గణపతయే నమః

ఓం శాంతిః శాంతిః శాంతిః

No comments:

Post a Comment