Sunday 30 June 2013

2011లో అమర్‌నాధ్‌లో మంచులింగం కరగడానికి కారణం మానవ చర్యలే.

2011లో అమర్‌నాధ్ హిమ లింగం 15 రోజులు ముందుగానే కరిగిపోయింది. దాని మీద రకరకాల వాదనలు వచ్చాయి. మనం కాస్త ఆలోచిస్తే, అమర్‌నాధ్‌లో మంచులింగం కరగడానికి కారణం మానవ చర్యలే.

తన వద్దకు వచ్చే భక్తులు కష్టమైన కాలి బాటలోనే రావాలని అమర్‌నాధుడు చెప్పాడట. అలా వచ్చే సమయంలో పడే శారీరిక కష్టం అమరత్వం పొందడంలో ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు ఆధునిక మానవుడికి శరీరం మీద మమకారమో, దైవం మాట వినేదేంటన్న అహంకారమో, తీర్ధయాత్రను విహారయాత్ర చేసుకున్నాడు ఆధునిక మానవుడు. అమర్‌నాధ్ యాత్రకు హెలికాఫ్టర్లలో వెళ్ళడం ప్రారంభించాడు. ఇది శివ ఆజ్ఞకు పూర్తి వ్యతిరేకం.  

హెలికాఫ్టర్లు వాడడం వలన అవి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. శివలింగం కనిపించే ఒక నెల రోజుల్లో కొన్ని లక్షలమంది దర్శించుకుంటారు. రోజుకు కొన్ని వేలమంది ఆ గుహకు వెళ్తారు. ఇది ఆ గుహలో ఉన్న ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నాయి. వీటితోపాటు ఆధునిక మానవుడు గత 200 సంవత్సరాల నుంచి చేస్తున్న విధ్వంసకర అభివృద్ధి భూతాపానికి(గ్లోబల్ వార్మింగ్)కు కారణమై, భూతాపాన్ని విపరీతంగా పెంచేసింది. ఇవన్నీ ఆ మంచులింగం త్వరగా అంతర్ధానమయ్యేందుకు కారణంవుతున్నాయి. వీటికి కారణం మనమే కదా.

అమర్‌నాధ్‌కు తీర్ధయాత్రకు వెళ్తున్నాం అనే భావనతోనే వెళ్ళండి. అమర్‌నాధ్‌ను విహారయాత్ర చేయకండి. సంప్రదాయపద్దతిలో కాలినడక ద్వారా పహల్‌గాం నుంచే యాత్రను ప్రారంభించండి. పర్యావరాణాన్ని రక్షించండి. శివానుగ్రహాన్ని పొందండి.

ఓం నమః శివాయ  

No comments:

Post a Comment