Wednesday 26 June 2013

ఉత్తరాఖండ్‌లో కొండచర్యలు విరిగిపడడం వలన కూడా చాలా నష్టం సంభవించింది. అసలు ఆ ప్రాంతం కొండచర్యలు విరిగిపడడానికి కారణం ఎవరు?

ఉత్తరాఖండ్‌లో కొండచర్యలు విరిగిపడడం వలన కూడా చాలా నష్టం సంభవించింది. అసలు ఆ ప్రాంతం కొండచర్యలు విరిగిపడడానికి కారణం ఎవరు?

1) హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లో ఒక 50ఏళ్ళ క్రితంవరకు అక్కడి జనం ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణానికి అనుగుణంగా రాగులను పండించేవారు. మార్కెట్‌లో వరికి పెరిగిన డిమాండు రీత్యా కానీ గత 40-30 సంవత్సరాల నుంచి వరి పండించడం మొదలుపెట్టారు. రాగులతో పోలిస్తే వరి వ్యవసాయానికి అధిక నీరు కావాలి. అది కూడా అందించారు. ఈ మారిన వ్యవసాయ పద్దతుల వల్ల అక్కడి భూమి పలుచబడింది. తన సహజ శక్తిని కోల్పోయింది.

2) ఒక 50 సంవత్సరాల క్రితం వరకు కేధార్‌నాధ్, బధ్రీనాధ్ వెళ్ళే యాత్రికులు అతి తక్కువగా ఉండేవారు. కానీ, ఈ మధ్య కాలంలో టూరిస్ట్ సంస్థల ప్రచారం వలన ప్రతి ఏడాది లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు. ఇంత మంది జనం వెళ్ళడానికి కొండల వెంబడి రోడ్లు వేశారు. అది అసహజ రీతిలో, పర్వతాలను పేల్చివేసి, ప్రకృతికి విరుద్ధంగా. కొన్ని వందల ఏళ్ళ నుంచి మానవ సంచారం లేని ప్రాంతంలోకి కేవలం ఒక 6 నెలల వ్యవధిలో లక్షలమంది వెళ్ళడం, వారి ప్రయాణం కోసం రోడ్లు వేయడం, వాహన శబ్దాలు, వాటి తరంగాలు ఇవన్నీ ఆ ప్రాంతపు భూభాగంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాయి. అక్కడి భూమిని పలుచుబరిచాయి.

3) వీటికి తోడు అక్కడ జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కొండలను పేల్చివేశారు. అడవులను, చెట్లను నరికేశారు. చెట్లు మట్టి కొట్టుకుపోకుండా ఆపి భూసారాన్ని కాపాడుతాయి. చెట్లు, అడవుల నరికివేత వలన భూమి కోతకు గురైంది. మట్టి కోట్టుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాంతంలో భూమి తన శక్తిని కోల్పోయింది. ఇక ఆ ప్రాంతంలో కొండలను పేల్చడం వలన, అవి అక్కడి పర్వతాల్లో అసహజమైన కదలికలను, మార్పులను తీసుకువచ్చాయి.  

ఇవన్నీ ఆ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడడానికి దోహదం చేశాయి. అపార నష్టాన్ని కలిగించాయి. ఎలా చూసిన ఇవన్నీ పిచ్చిమానవుడి వెర్రి చేష్టలకు పలితాలే తప్ప ప్రకృతికి మనిషి మీద ఉన్న పగ కాదు. అసలు ప్రకృతికి మనిషి మీద పగ ఎందుకుంటుంది. మనమంతా ప్రకృతి మాత ముద్దుబిడ్డలం. మనమే ఈ విషయం మర్చిపోయి మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం.  

No comments:

Post a Comment