Sunday 3 May 2020

రాజీవ్ మల్హోత్రా గారి స్వల్పకాలిక course ద్వారా లాక్‌డౌన్ని సద్వినియోగపరుచుకోండి.


మన మీద యుద్ధం, కానీ శత్రువు కనిపించడు. ఆయుధం మన చేతికే ఇచ్చాడు. వాడు ఇచ్చిన ఆయుధాలతో మన మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాము. తెలిసీతెలియక ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతున్నామనుకునే వాళ్ళు సైతం, విచ్ఛినం చేసే ప్రయత్నాల్లో భాగవమవుతున్నారు. అవును మీరు చదివింది నిజమే.... ఇప్పుడు చాలామంది పరిస్థితి అలానే ఉంది.

యూరోపులో 16 వ శతాబ్దంలో మొదలైన భారతదేశ అధ్యయనం 19 వ శతాబ్దం నాటికి తన విషపడగ విప్పడం మొదలు పెట్టింది, భారతదేశాన్ని అస్థిరపరచడం, అసలు భారతదేశమే లేదని చెప్పడం, సనాతనధర్మాన్ని నశింపజేయడం, ధర్మంలోని అంశాలను క్రైస్తవీకరించడం, ప్రత్యేక అస్థిత్వవాదాలను ప్రోత్సహించడం, విఛ్ఛినకర సాహిత్యాన్ని అందించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటన్ కేంద్రంగా సాగిన ఈ కుట్ర, స్వాతంత్రానంతరం అమెరికా కేంద్రంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని అస్థిరపరచడంలో తమ వంతు ప్రణాలికలను పక్కగా అమలు చేసి చాలా వరకు విజయం సాధించాయి విఛ్ఛినకర శక్తులు. ఈ శక్తుల చేతిలో భారతీయులే పావులై దేశాన్ని విఛ్ఛినం చేయాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి అనేక కుట్రలను బట్టబయలు చేసిందీ పుస్తకం. విఛ్ఛినకర శక్తులు ఏవీ? వాటికి ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? అవి ఎలా పని చేస్తాయి? మనం వాటిని ఎలా అనుసరిస్తూ, మనకు తెలియకుండానే దేశానికి విఘాతం కలిగితున్నామో ఈ పుస్తకం చదివితే అర్దమవుతుంది. ఈ అంశంపై రాజీవ్ మల్హోత్రా (Rajiv Malhotra) గారు 15 ఏళ్ళు పరిశోధించి, వారి జీవితాన్ని పణంగా పెట్టి, అరవిందన్ నీలకందన్‌తో కలిసి కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు’ పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

ఇప్పుడు భారతీయ యువత చదువుకున్నారు, వారు విఛ్ఛినకర శక్తులకు పావులుగా మారరు, వారు చాలా తెలివైనవారని లేదా భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవరెన్ని చేసినా ఈ దేశానికి ఏమీ కాదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. సమస్యను తెలుసుకోకుండా, దానికి తగిన విధంగా స్పందించకుండా, ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేయడాన్ని వెర్రితనం అంటారు. శరీరంలో జబ్బు ఉంది, అయినా అది లేదని, నాకేం కాదని దాటవేస్తూ కూర్చుంటే ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇది కూడా అంతే.

మరి మనకు కావల్సింది బౌద్ధిక క్షత్రియులు (intellectual kshatiryas). అందుకోసం ఈ లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ రాజీవ్ మల్హోత్రా గారి ఆలోచన. అందుకే బౌద్ధిక క్షత్రియ (intellectual kshatiryas) అనే స్వల్పకాలిక పాఠ్యక్రమాన్ని (short term course) ని రూపొందించారు. ₹ 500/- రూపాయల నామమాత్రపు ధరతో దీన్ని అందిస్తున్నారు. చివరలో సర్టిఫికెట్ కూడా అందిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి.

క్రింది పేర్కొన్న లింక్‌లో నమోదు చేసుకోవచ్చు.

Know what is happening in your own backyard by signing up for it today.



No comments:

Post a Comment