Friday 16 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (234)



ముక్తికై అన్వేషించే వానిని ముముక్షువని అంటాం. ఈ స్థితి భక్తివల్లనే అతనికి కొద్దికాలంలో ముక్త స్థితి రాబోతుంది. అట్టి పరిస్థితిలో ఒక ధర్మసంకటానికి లోనౌతాడు. అది కన్యాదానం చేసే తండ్రి స్టితి వంటిది. తండ్రి వివాహ ప్రయత్నాలు చేసినట్లుగా ముక్తికై ధర్మకృత్యాలను లోగడ చేసాడు. భక్తి మార్గాన్ని అనుసరించాడు. దానివల్ల చిత్త శుద్ధి ఏర్పడింది. ఇక పరమాత్మలో లీనమయ్యే స్థితి ఏర్పడింది. ఎప్పుడైతే అతని మనస్సు లీనమైందో ఇక భగవంతుడూ లేదు, భక్తి లేదు. కన్యాదానం చేసేటపుడు తండ్రి కన్నీళ్లు పెట్టుకొన్నట్లుగా ముముక్షువు కూడా తన మనస్సును అర్పించేటపుడు దుఃఖపడతాడు. ఈ బాధనొక కవి అందంగా వివరించాడు.

భస్మో ద్దూళన భద్రమస్తు భవతే


అనగా పరమేశ్వరుడు నా భక్తికి సంతోషించి అతనిలో కలుపుకొన బోతున్నాడు. ఇక నుండి విభూతిని పూసుకోనవసరం లేదుకదా! రుద్రాక్షలు ధరించడం ఉండదు కదా! మీరు వెళ్లిరండి, మీకు మంగలమగుగాక! ఓ భక్తి మార్గమా? నీకూ వీడ్కోలు చెబుతున్నా, నేను మోక్షమనే మహామోహంలో కూరుకొని పోయాను. ఆమోహం మిమ్ములనన్నిటినీ దూరంగా ఉంచేది. ఇంత వరకూ భక్తినాకానందాన్నిచ్చింది చాలు.


మోక్షం, మోహాన్ని పోగొట్టేది. కానీ ఇట్టి వానికి మోక్షమే మోహంలా కనబడింది. భక్తి మొదలగు వాటిని విసర్జిస్తున్నాడు. అట్లాగే కృష్ణ కర్ణామృతంలోనూ ఉంది. భక్తి పరిపక్వమైతే కర్మమార్గం నుండి దూరమై పోతాడు.


No comments:

Post a Comment