Saturday 17 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (235)



"సంధ్యావందన భద్రమస్తు భవతే..." అని కీర్తించాడు.


లీలాశుకుణ్ణి కృష్ణ భక్తి ఆవరించి సంధ్యావందనం, పితృతర్పణం వంటి చేయవలసిన కర్మల నుండి దూరం చేసింది. వాటికి మంగలం పలుకుతున్నాడు.


ముందుగా వైదిక కర్మలను చేసేటప్పుడు వీటికి ఫలం ఉంటుందా? ఉండదా? అనే భావం లేకుండా చేసి తీరాలి. ఇట్లా చేస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మురికి ఎప్పుడైతే పోయిందో భగవానుని వైపు మనస్సు మళ్లుతుంది. ఇట్టి భక్తి రెండవ మెట్టు, భక్తి పరిపక్వమైతే జ్ఞానం లభిస్తుంది. ఇది చివరి మెట్టు.


కాని మనంతటమనం కర్మ, భక్తులను విడిచి పెట్టకూడదు. పండిన పండు తొడిమ నుండి రాలేటంత వరకూ అనగా జ్ఞానోదయ పర్యంతమూ వీటిని మానరాదు. ఆ భక్తి, కర్మలు వాటంతట అవే మనలను విడిచిపెట్టేయాలి.


భక్తిని విడిచి ముక్తికై సాధన చేయకూడదు కూడా. భక్తిని అనుసరిస్తే అదే మార్గాన్ని చూపిస్తుంది. ముక్తికి బాటలు వేస్తుంది. కనుక ముక్తికి ఆరాటపడడానికి ముందు భక్తినే ఆశ్రయించాలి. భక్తినిమ్మని ప్రార్ధించాలి కూడా, భక్తి మార్గంలో పయనిస్తున్న కొద్దీ ముక్తి అదే వస్తుందనే పై గోపాలకృష్ణ భాగవతార్ గారి మాటలు శిరోధార్యం.


No comments:

Post a Comment