Showing posts with label ఉగాది. Show all posts
Showing posts with label ఉగాది. Show all posts

Wednesday, 25 March 2020

వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి తినకపోతే ఏమవుతుంది ?



వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి తినకపోతే ఏమవుతుంది ? 

పొద్దున ఒకతను ఫోన్ చేశారు...
అతను : నమస్తే సర్! ఉగాది శుభాకాంక్షలు
నేను : ఉగాది శుభాకాంక్షలండి....
అతను: ఎలా ఉన్నారు?
నేను: బాగున్నా, మీరెలా ఉన్నారు?
అతను: బాగున్నాం సార్, కానీ ఈ సారి ఉగాదికి వేపపువ్వు దొరకలేదండి,  ఉగాది పచ్చడి చేసుకోకుండానే పండుగ జరుపుకోవలసి వస్తోంది..
నేను: పర్లేదండీ, వచ్చే ఏడాది తినచ్చు... ఈ ఏడాదికి ఇంట్లోనే ఉండండి...
అతను: తినకపోతే ఏమీ కాదా సార్ ? అది తప్పు కాదా ?
నేను : ఏమీ కాదండి... తప్పేమీ లేదు...
అతను: మరి శాస్త్రంలో చెప్పారు కదా సార్ తప్పకుండా తినాలని...
నేను: అవునండి... కానీ శాస్త్రం అంతవరకే చెప్పి ఊరుకోలేదు. మనకు ఆయుర్వేదమనే వైద్యశాస్త్రం ఉంది. అది ఉపవేదం కూడా. అది కృతజ్ఞత అని సూత్రం మీద పని చేస్తుంది. అనగా మనం ప్రకృతికి మేలు చేసే విధంగా బ్రతికినప్పుడు, ప్రకృతి మనకు మేలు చేస్తుంది... మన వంతుగా మనం ప్రకృతికి ఏ మేలూ చేయనప్పుడు, మనం ఆరోగ్యం కోసం ఎలాంటి ఔషధం పుచ్చుకున్నా పని చేయదని చెబుతుంది ఆయుర్వేదం.
అతను: అర్ధం కాలేదు సార్...
నేను : మన ఆయుర్వేద శాస్త్రాన్ని ముందు బ్రహ్మదేవుడు ప్రజాపతికి చెప్పారు. ఆయన ఆశ్వినీ దేవతలకు, వారు ఇంద్రునకు, ఆయన అత్రిపుత్రుడైన ఆత్రేయ పునర్వసు మరియు ఇతర మునులకు, వారు అగ్నివేశునకు మరియు  ఇతర ఋషులకు చెప్పారు. అలా ఆయుర్వేదం వచ్చింది. ఈ ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరీ నారాయణ స్వామి. 
ఆయుర్వేదం ఏం చెబుతుందంటే ఏదైనా ఒక మూలికను చెట్టు నుంచి గ్రహించాలంటే, దానికి ఒక ముహూర్తం చెబుతుంది. ఎప్పుడుబడితే అప్పుడు మూలికలు కోస్తే అవి పని చేయవంటుంది.... చెట్టు నుంచి ఆకులు సేకరించినా, బెరడు, వేరు లేదా ఇంకేదైనా సేకరించినా, ముందుగా ఆ చెట్టుకు నమస్కరించి, దానిని పూజించి, నాకు వచ్చిన రోగం నయమవడానికి ఈ మూలిక కోస్తున్నాను, దయచేసి నా విజ్ఞప్తిని మన్నించి, నా రోగం ఉపశింపజేయండి అని మనస్సులో ఆ చెట్టుకు చెప్పుకోవాలి. ఆ తర్వాత దానికి నీళ్ళు పోసి, అప్పుడు కృతజ్ఞతా భావనతో, ప్రసాదంగా ఆ ఆకును కోయాలి. అప్పుడే అది ఔషధంగా పని చేస్తుంది. లేదంటే పని చేయదు. పని చేసినా అది తాత్కాలిక ఫలితమే ఇస్తుంది, ధీర్ఘకాలం కాదు. 

బెరడు చెట్టు కాండాన్ని చీడపీడల నుంచి కాపాడుతుంది. ఒక చెట్టు బెరడును సేకరించాల్సి వస్తే, ఆ చెట్టు బెరుడును తీసిన చోట, కొద్దిగా పసుపు, తర్వాతా ఆవుపేడ ఆ ప్రాంతంలో పూయాలి. ఎందుకంటే మనం సేకరించిన తర్వాత ఆ చెట్టుకు ఏ చీడ పట్టకూడదని... అదీగాక మనం ప్రకృతిహితకరమైన జీవనం గడుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం సేకరించే ప్రతి మూలిక ప్రకృతిలో భాగం. ఒక ప్రక్క ప్రకృతిని హింసిస్తూ, కలుషితం చేస్తూ, ఇంకో ప్రక్క ఆయుర్వేదం వాడితే ఏమీ ఉపయోగం లేదు....
ఇప్పుడు మనం ఇవేమీ చేయకుండా చెట్టు నుంచి ఆకులు, పూలు కోస్తే, దాన్ని శాస్త్రం చౌర్యం అంటుంది, దొంగతనం చేసిన పాపం పడుతుంది. మీకో చిన్న విషయం చెబుతా. మార్నింగ్ వాక్ చేసే చాలామంది ఒక చేతిలో కవరు, ఇంకో చేతిలో పాలకోసం బుట్ట పట్టుకుని దండయాత్రకు బయలుదేరతారు. వాళ్ళు పోయే దారిలో ఏ పూల చెట్టు కనిపించినా, ఒక్క పువ్వు కూడా వదలకుండా మొత్తం దులిపేస్తారు. ఆ చెట్టు ఎవరు నాటారు అనేది వీళ్ళకి అనవసరం. కనీసం వీళ్ళు ఏనాడు ఒక మొక్కకు నీళ్ళు కూడా పోసి ఉండరు... ఇప్పుడు ఆ పువ్వులన్నీ తీసుకెళ్ళి పూజ చేస్తారు. మరి వీళ్ళకు పుణ్యం వస్తుందనుకుంటున్నారా? వీళ్ళందరికి చౌర్యం (దొంగతనం) చేసిన పాపం వస్తుంది. తర్వాత మేక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అదన్నమాట సంగతి. 

ఇప్పుడు వేప పువ్వు, మామిడాకుల విషయంలో కూడా అంతే. మన ఇంటి ముందు మనం కనీసం ఒక వేప చెట్టు, మామిడి చెట్టు నాటలేమా ? పోనీ ఇంటిముందు చోటు లేకపోతే మనముండే వీధిలో ? ఏదైనా చెట్టుకు నీరు పెట్టక, అది ఎండిపోయే స్థితికి వస్తే, ఎప్పుడైనా నీళ్ళు పోసే మొహమా మనది ? కనీసం దేవతార్చనకు పూల మొక్కలు కూడా పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా? అయినా మనకు పట్టదు. ప్రకృతికి ఏమైతే మనకేంటీ అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు కరోనా లాంటి విషవ్యాధులు ప్రబలి, ప్రకృతి మనకు సహకరించడంలేదు.

మనం ఎవరి నుంచైనా మేలు పొందితే, వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం మన ధర్మం మనకు నేర్పింది. అది మనం మర్చిపోతున్నాం. ఇంటికో వేప చెట్టు, వీధికో రావి చెట్టు ఉంటే ఏ రోగాలు మన జోలికి రావు. పండుగ రాగానే ప్రకృతి మీద పడి దండయాత్ర చేసి, చెట్లన్నీ దులిపే బదులు, మన ఇంటి ముందే ఒక మొక్క నాటి పెంచుకోవచ్చు కదా... దానికి రోజూ నీళ్ళు పొస్తే, యజ్ఞం చేసిన ఫలం మనకు వస్తుంది. దాన్ని భూతయజ్ఞం అంటుంది శాస్త్రం. ఇప్పుడు పచ్చడి తిన్నా, మన జీవన విధానం మార్చుకోకపోతే, మనకు తప్పకుండా వ్యాధులు వస్తాయి. మనం చేసిన తప్పులను తెలుసుకుని ప్రకృతి మాతను క్షమాపణ వేడుకున్నప్పుడే, ప్రకృతిహితంగా జీవించినప్పుడు మనం ఆచరించేవి మనకు ఫలాన్నిస్తాయి. ఉగాది పచ్చడి గురించి చెప్పినప్పుడు కూడా వేపచెట్టును పూజించే పువ్వు సేకరించమన్నారు.కాబట్టి ఎత్తుకొచ్చి వేపపువ్వు తినేకంటే మనమే ఓ మొక్క నాటుకుంటే సరిపోదా? 

అతను: అర్ధమైంది సార్... ఈ ఏడాది నేను కూడా మా ఇంటి ముందు వేప, మామిడి వంటి కొన్ని ఔషధ మొక్కలు నాటి, జాగ్రత్తగా పెంచుతాను.... 

Sunday, 18 March 2018

పంచాంగం కేవలం బ్రాహ్మణులకేనా?



పంచాంగం కేవలం బ్రాహ్మణులకేనా?

ఈ రోజు చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వచ్చాక, చాలామంది క్యాలెండర్ చూసుకునేది కేవలం సెలవులు ఎప్పుడొస్తాయాని తెలుసుకోవటానికే. ఎందుకంటే వారికి ఉండే పని ఒత్తిడి అలాంటిది. కానీ నిజానికి మనం పాటించేది క్యాలెండర్ కాదు, పంచాంగం.

పంచాంగం కేవలం బ్రాహ్మణులకు సంబంధించినది కాదు. అది ముహూర్తాల వరకే ఆగిపోదు. వండ్రంగివారు, మేస్త్రీలు, ముఖ్యంగా రైతులు ఈనాటికి పంచాంగం చూస్తారు. ఎప్పుడు నిర్మాణం మొదలుపెట్టాలి, కర్తరి ఎప్పుడు ఉంది అనేవి వడ్రంగి వారు చూస్తే, ఏ కార్తె ఎప్పుడు వస్తుంది, పంట ఎప్పుడు వేయాలి? ఏ నక్ష్త్రంలో పంట వేయాలి? అది ఊర్ధ్వముఖ నక్షత్రమా? అధోముఖమా? ఇలా ఎన్నో విషయాలను చూసి రైతు పంట వేస్తాడు. విత్తనం వేయడం దగ్గరే పంచాంగంతో పని మొదలవ్వదు. విత్తనాలు ఏ ఋతువులో సేకరించాలి, మేఘాలను, గాలిని, ప్రకృతిని పరిశీలించి రాబోయే కాలంలో వర్షాలు ఎలా ఉంటాయి మొదలైన ఎన్నో విషయాలు జ్యోతిష్యం చెప్పింది. కృషి పరాశరా మొదలైన గ్రంథాలు వీటి గురించి విపులంగా వివరిస్తాయి. అంతెందుకు ఈనాటికి చాలా ఊళ్ళకు వెళితే, ఏ చదువు రాని వారు కూడా పంచాంగం చూసి, ఏ కార్తెలో ఎంత ఎండ కాస్తుంది, వర్షం ఎప్పుడు పడుతుంది అనేవి చెప్పేస్తారు. వారేమీ బ్రాహ్మణులు కారు. అందులో మాలమాదిగలు కూడా ఉన్నారు. పంచాంగం అందరిది. ముఖ్యంగా కాయకష్టం చేసుకుని, ప్రకృతి పై నేరుగా ఆధారపడి జీవించే శ్రమజీవులది, కృషీవలులది, కర్షకులది.  

ప్రకృతి పులకించి, వసంతంలో చెట్లు చిగురించే సమయానికి ఉగాది వస్తుంది. అది ప్రకృతిలో నూతన ఆరంభానికి గుర్తు. అదే మన నూతన సంవత్సరం కూడా. అందుకే ఆ రోజు సాయంత్రం ఊళ్ళో అందరూ గుడి దగ్గరకు చేరుకున్నప్పుడు, ఆ ఊరి పురోహితుడు, అక్కడి రైతులను, శ్రమజీవులను ఉద్దేశించి పంచాంగ పఠనం చేస్తారు. అక్కడ కూర్చున్నవారు పంచాంగ పఠనం చేస్తారు. ఆ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా కాస్తాయి, ఏ పంట బాగుంటుంది, ఆ సంవత్సరానికి నవనాయకులు ఎవరు? మొదలైనవి ఆసక్తిగా వింటారు ప్రజలు. అయితే అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత కూడా ప్రజలు నిత్యం పంచాంగం చూస్తూనే ఉంటారు.  

కానీ గత 10-15 సంవత్సరాల నుంచి చాలా మంది రైతుల్లో ఈ జ్ఞానం కొరవడుతూ వస్తోంది. అందుకే రైతన్న ఢీలా పడుతున్నాడు. 

కాకపోతే ఇదే కాక మరో బాధాకరమైన అంశం ఏమిటంటే రాజకీయనాయకుల ఒత్తిడల వల్ల చాలామంది పంచాంగ కర్తలు అసలు విషయం చెప్పకుండా, ఉన్నవీ లేనివి కలిపి వారి మెప్పు కోసం పంచాంగం చెబుతున్నారు. పంచాంగం పరువు తీస్తున్నారు.

పాతతరం నుంచి కొత్త తరం పంచాంగం చూడటం నేర్చుకోవాలి. తద్వారా ప్రకృతిని ముందే గమనించి, అంచనా వేసి, ఇబ్బందులకు గురికాకుండా దేశానికి మంచి దిగుబడిని అందివ్వవచ్చు.

ఉగాది పచ్చడి - మనం మరిచిన ఆహారశైలి



ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వేపపువ్వుతో చేసిన ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు కలిగి ఉండటం, ఈ ఋతువులో వచ్చిన కొత్త బెల్లం, కొత్త చింతపండుతో దీన్ని చేయడం ప్రత్యేకత. ఈ పచ్చడి మనకు ఎన్నో సందేశాలను ఇస్తుంది. అయితే దాంతో పాటు ఇప్పుడు మనం మరిచిన మరొక విషయం కూడా గుర్తు చేస్తోంది.

నిత్యం స్వీకరించే భోజనం షడ్రసోపేతంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. షడ్రసోపేతం అంటే ఏంటో అనుకునేరు. ఆరు రకాల రుచులు కలిగి ఉండాలని అర్ధం అన్నమాట. అవే తీపి, వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పదనం. ఈ ఆరింటిని షడ్రుచులు అంటారు. మన శరీరంలో కఫ, వాతం, పైత్యం అని మూడు దోషాలుంటాయి. ఆ మూడు సమతుల్యతతో ఉండటమే ఆరోగ్యం. ఆ మూడింటిలో ఏ ఒక్కటి చెడినా, లేదా వాటిలో అసమతుల్యత ఏర్పడినా, ఏదో ఒక రోగం వస్తుంది. మనకు వచ్చే ప్రతి రోగానికి ఈ మూడు దోషాల మధ్య అసమతౌల్యమే కారణం కనుక ఆయుర్వేదంలో ఇచ్చే ఔషధాలు, దేహంలో విజృంభించిన ఆ దోషాన్ని నివారించి, సమతౌల్యం ఏర్పరుస్తాయి. అయితే ఈ రోజు మనం చూసుకుంటే, మన పళ్ళెంలో 6 రకాల రుచులు ఉండనే ఉండవు. మనకు వీటిలో ఏదో ఒక రుచి అంటేనే ఎక్కువ ఇష్టం. నిజానికి చాలామంది ఆరింటిలో, మూడైనా తింటారా అంటే అదీ లేదు. ఒక్కటే రుచితో సరిపెట్టుకుంటారు. కొందరు తినడానికి డబ్బు లేక, అలా చేస్తే, ఇంకొందరు ఏదో ఒక రుచి మీద ఇష్టంతో అలా చేస్తారు. ఎలా చూసినా, కేవలం ఒక రుచిని అధికంగా స్వీకరించడం వలన శరీరంలో త్రిదోషాల మధ్య సమతుల్యం చెడుతుంది. అందుకే ఇప్పుడు మనకు అనేక రకాల రోగాలు వస్తున్నాయి.

నిజానికి ఈ షడ్రుచులు కలిగిన ఆహారం తీసుకుంటున్నామంటే పోషకవిలువలు కలిగిన ఆహారం తింటున్నామనే అర్ధం. ఎందుకంటే ఒక్కొక్క రుచి, ఒక్కో రకం ఆహారంలో లభిస్తుంది. అదే సమయంలో ఇంకొక్క విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైననత వరకు దేశీమైన ఆహారాన్నే స్వీకరించాలి. ఉదాహరణకు కారం తగలడానికి మనం మిరపకాయను వాడతాము. ఈ మిరపకాయ ఎక్కడిది అనేది ప్రశ్న. నిజానికి మిరపకాయ మన దేశంలో పుట్టిన పంట కాదు. అది విదేశాల నుంచి ఈ దేశానికి మధ్యకాలంలో ప్రవేశించింది. మన దేశానికి చెందిన కారం రుచి కలిగిన వస్తువు, మిరియాలు. ఇది సహజంగానే భారతదేశానికి చెందిన మొక్క. అంటే దేశీయమైనవి. అందుకే మీకు ఆయుర్వేద వైద్యంలో మిరియాలు వాడటం కనిపిస్తుంది కాని మిరపకాయ ప్రస్తావన ఉండదు. అంతెందుకు ఉగాది పచ్చడిలోనే మిరపకాయ చేరిపోయింది. అలాంటిదే ఆలుగడ్డ. అది ఆంగ్లేయులు మన దేశానికి తీసుకువచ్చారు. ఇలాంటి విదేశీ వస్తువులను పెద్ద పెద్ద ఆలయాల వంటల్లో వాడరు. అందుకు ఉదాహరణ పూరీ క్షేత్రం. అక్కడ చేసే ప్రసాదాల్లో మిరప, ఆలుగడ్డ మొదలైనవి కనిపించవు. 

దీనిలో అర్ధం ఒకటే. ఈ ప్రకృతి జడపదార్ధం కాదు. దానిలో చైతన్యం ఉంది. అది సాక్షాత్తు భగవంతుని వ్యక్తీకరణ అని సనాతన ధర్మం విశ్వసిస్తుంది. ఒక్కో ప్రాంతానికి తగినట్టుగా, వాతావరణ పరిస్థితులు, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భగవంతుడు ఒక్కో ప్రాంతంలో నివసించే ప్రజలకు ఒక్కో రకమైన ఆహారపంటను ఇచ్చాడు. అది ఆయ ప్రాంతాల వారి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేకూర్చేదిగాను మరియు త్రిదోషాలను సమతుల్యంలో ఉంచేదిగానూ ఉంటుంది. కనుక ఎక్కడ పండిన వస్తువులను ఆ ప్రాంతం వారు తినడమే ఉత్తమము. ఆ లెక్కన మనం కూడా సాధ్యమైనంతవరకు దేశీ ఆహార పదార్ధాలనే ఉపయోగించాలి.

ఇలా మనం షడ్రసోపేతమైన దేశీ ఆహారాన్ని నిత్యం స్వీకరిస్తే, మధుమేహం, రక్తపోటు, హృద్రోగాలు మొదలైన భయానక జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు. ఈ ఉగాది మనకు అలాంటి విషయాలను గట్టిగా గుర్తు చేసి, జీవితంలో దాన్ని ఆచరించేందుకు ప్రేరణ కలిగించేది కావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 

Saturday, 18 April 2015

జలదానం ప్రాముఖ్యత

సనాతనధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ఉగాది నుంచి వర్షఋతువు వచ్చేవరకు ప్రతి హిందువు తనకు తోచినంతలో జలదానం చేయాలని శాస్త్రవచనం. అదే సంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అసలు జలదానానికున్న ప్రాముఖ్యత ఏమిటి? జలదానం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? దీని గురించి పురాణం ఏం చెప్తోంది. (గత 2 ఏళ్ళుగా పోస్టు చేస్తున్నదే అయినా, అందరికి తెలియడం కోసం మళ్ళీ పోస్ట్ చేస్తున్నా) జలదానం ప్రాముఖ్యత గురించి స్కాందపురాణంలోని ఒక కధ ఉంది.

హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు. ఆయన దానశీలుడు. ఎన్నో దానాలు చేశారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అన్ని ఉన్నాయో, సాగరంలో నీటిబిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు కావల్సినంత బంగారం, వజ్రాలు, భూములు, ఇళ్ళు విపరీతంగా దానం చేశాడు.



ఇవి మంచివే అయినా దీనితో పాటు అతనికి ఇంకోక దోషం కూడా ఉంది. అన్ని దానాలు చేశాడు కానీ ఎవరికీ జల దానం మాత్రం చేయలేదు. దూరం నుండి వచ్చినవారికి, ఎండలో వచ్చినవారికి, దాహార్తులైనవారికి నీరు దానం చేయలేదు.

నీరు దానంగా ఇచ్చేదేమిటి? నీరు ఎవరైనా ఇస్తారు. ఎక్కడైనా దోరుకుతుంది. నేను మహారాజును, నా హోదాకు తగ్గట్లు గో, భూ, సువర్ణ దానాలు చేయాలి అనుకున్నాడు. ఇది మనకు తప్పుగా అనిపించదు కానీ, శాస్త్రం మాత్రం దీన్ని దోషంగా పరిగణిస్తుంది. దాహార్తులకు నీరు ఇవ్వకపోవడం వలన 'జాతక పక్షి' జన్మ 3 సార్లు వస్తుందని శాస్త్రం.

దానం ఇచ్చేసమయంలో అందరినీ సమానంగా చూసేవాడు. ఇక్కడ సమానంగా అంటే పాత్రులా, అపాత్రులా అన్నది పట్టించుకునేవాడు కాదు (అందరికి అన్ని దానం చేయకూడదు. ఎవరికి ఏది, ఎంత అవసరమో, అది అంత మాత్రంలోనే దానం చేయాలి). పండితులకు, మూర్ఖులకు, పేదవారికి, వికలాంగులకు అందరికి సమాన సత్కారం. మంచి పండితులకు ప్రాముఖ్యం లేదు. నిజమైన పాండిత్యం లేనివారికి, డాంబికాలు, దర్పాలు, దుష్టమైన బ్రాహ్మణులని కూడా విచారించకుండా దానం చేసేవాడు. 
మహారాజు చేసే ప్రతిపని ప్రజలు గమనిస్తారు, అనుసరిస్తారు. అయోగ్యులకు సత్కారం చేస్తే ప్రజలు అతన్ని పండితుడని అనుకుంటారు. అతని తప్పుడు మాటలకు ప్రభావితం అవుతారు. అందువల్ల హేమాంగుడికి అయోగ్యులకు దానం చేయడం చేత దోషం అంటుకుంది. దుర్మార్గులకు తెలిసి దానం చేసినా, తెలియకచేసినా అది మహాపాపం.

ఈ దోషాల వలన ఇన్ని దానాలు చేసిన హేమాంగుడు పాపం అనుభవించడం కోసం కుక్క, గాడిద, పంది లాంటి ఎన్నో నీచమైన జన్మలు వచ్చి, తరువాత బల్లి జన్మ వస్తుంది. చేసిన పుణ్యం కూడా ఊరికే పోదు. అందుకే ధర్మిష్టి, నియమనిష్టలు, భగవత్భక్తి, మహాత్ములకు సేవ చేయడం వంటి సద్గుణాలు కలిగిన శ్రుతికీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు. ఒకసారి శ్రుతికీర్తి ఇంటికి మహాజ్ఞాని, మంచి సాధకుడైన 'శత్రుదేవ' అనే బ్రాహ్మణుడు వస్తాడు.

సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించిసపర్యలు చేసి, శ్రుతికీర్తి దంపతులు శత్రుదేవ పాదాలను శ్రద్దగా కడిగి, పాదపూజ చేస్తారు. దక్షిణతాంబూలాలు ఇస్తారు. ఆ బ్రాహ్మణుని పాదాలను కడిగి, జ్ఞాన పాదోదకం రాజు తలపై చల్లుకుంటున్న సమయంలో పైన గోడమీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి. ఆ జ్ఞానోదక స్పర్శతో బల్లకి పూర్వజన్మ స్మృతి వస్తుంది.

తాను హేమాంగ రాజునన్న స్పృహ వచ్చిన బల్లి శత్రుదేవను " నేను చేసిన తప్పేమిటి? అంత దానధర్మాలు చేసిన నాకు ఈ నికృష్టపు జన్మలేంటి? కారణం చెప్పమని అడుగుతాడు.

దానికి శత్రుదేవ తన తపోశక్తితో పరిశీలించి రెండు పెద్ద దోషాలు చేసినట్టు చెప్తాడు. అన్ని దానాలు చేసినా జల దానం చేయలేదని......తెలియక కాదు, శాస్త్రం తెలిసినా, నీరు దానం చేయడమేంటన్న భావంతో అవసరమున్నవారికి కూడా జలదానం చేయకపోవడం దోషమని, పాపమని చెప్తాడు.

యోగ్యతను విచారించకుండా, దుష్టులకు, దుర్మార్గులకు దానాలు చేయడం వల్ల పుణ్యం రాకపోగా, పాపం వస్తుందని అందుకే నీకు ఇలాంటి జన్మలు వచ్చాయని వివరిస్తాడు. 


అప్పుడు బల్లి రూపంలో ఉన్న హేమాంగుడు పశ్చాత్తాపపడి "మరి నాకు ఉద్దారమయ్యే మార్గం, పాప పరిహారమయ్యే మార్గం ఏమిటి?" అని శత్రుదేవను అడుగుతాడు.

కరుణించిన శత్రుదేవ తన పుణ్యంలో ఒక రోజు వేంకటాచల యాత్ర, స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీ వరహాస్వామి దర్శనం, శ్రీ శ్రీనివాస దర్శనఫలం హేమంగుడికి దానం చేయగా దానితో అతని పాపప్రక్షాళన జరిగి అతనికి బల్లిశరీరం నుండి విముక్తి లభించి, సాధానశరీరం పొంది ఉద్దరింపబడ్డాడు. (ఈ కధ పి.వి.ఆర్.కే. ప్రసాదుగారి తిరుమల లీలామృతం నుంచి సేకరించడమైనది. )

మనుష్యులే కాదు, మన చుట్టూ జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అనేకం ఉంటాయి. వాటికి ఒక్క వేసవి లోనే కాదు నిత్యం నీటి అవసరముంటుంది. కాకపోతే అవి మనలాగా నోరు తెరిచి అడగలేవు. మనమే కాస్త ఆలోచించాలి. మన ఇంటికి వచ్చినవారికి కాసిన్ని నీరైనా తప్పక ఇవ్వాలి. మన చుట్టూ ఉండే జంతువులకు, పక్షులకు, మొక్కలకు నీరు పెట్టాలి. కధలో సారాంశం అర్దం చేసుకోండి. జలదానం చేయండి, అభివృద్ధికి నోచుకోండి.              

Originally published: 26 May 2013
1st Edit: 13 April 2014
2nd Edit: 18 April 2015

Saturday, 21 March 2015

ఉగాది మనకిచ్చే సందేశం ఏమిటి?

ఉగాది మనకిచ్చే సందేశం ఏమిటి?

షడ్రుచుల(6 రకాల రుచుల) సమ్మేళనం ఉగాది పచ్చడి. అవే చేదు, తీపి, వగరు, ఉప్పు, పులుపు, కారం. దీనిని మనం దైవప్రసాదంగా స్వీకరిస్తాం. జీవితం కూడా అంతే. జీవితంలో అన్ని సుఖాలే ఉండవు, అన్నీ దుఃఖాలే ఉండవు. అన్ని భావాలు ఉంటేనే అది పరిపూర్ణమైన జీవితం అవుతుంది. మన జీవితంలో వచ్చే కష్టాల నుండి మన పాఠాలు నేర్చుకుంటే ఉన్నతస్థానానికి వెళ్ళగలం. జీవితంలో ఏది వచ్చినా అది దైవప్రసాదంగానే భావించాలి తప్ప తిరస్కరించకూడదు. ఉగాది పచ్చడిలో మొదట కొందరికి తీపి తగిలితే, కొందరికి చేదు తగులుతుంది. చేదు తగిలిందని ఉగాది పచ్చడి పడేయం కదా. అలాగే జీవితంలో కష్టాలు వచ్చాయని జీవితాన్ని సగంలోనే ముగించడం కాదు, రాబోయే సంతోషం కోసం ఎదురుచూడాలని మనకు చెప్తోంది ఉగాది పచ్చడి. నిజానికి భవిష్యత్తులో ఏదో సుఖం వస్తుందని ఆశించడం కాదు, మన ఈ జీవితం గత జన్మలో మనం చేసుకున్న కర్మ యొక్క ఫలం. అందుకని జీవితాన్ని యదాతధంగా అంగీకరించాలి. అదే ఉగాది పచ్చడి పరమార్ధం.

ఎంతో పుణ్యం చేస్తే కానీ రాదు ఈ మనిషి జన్మ.  మళ్ళీ మనిషిగా పుట్టాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. వచ్చిన జన్మను సక్రమంగా, దైవప్రసాదంగా జాగ్రత్తగా వాడుకోమని గుర్తుచేస్తోంది ఉగాది పచ్చడి.

నలుగురికి సాయం చేయాలి, ప్రతిసారీ డబ్బు సాయమే చేయక్కర్లేదు, కష్టాల్లో ఉన్నవారికి కాస్త మాట సాయం చేసినా చాలు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. మనతో కలిసి బ్రతికే జంతువులు, పక్షులను ఆదుకోవాలి, కుదిరితే కొద్దిగా ఆహారం పెట్టాలి, కుదరకపోతే కనీసం నీరైన పెట్టాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన తర్వాతి తరాల వారికి ప్రకృతిని జాగ్రత్తగా అందించాలి. దేశభక్తి కలిగి దేశానికి సేవ చేయాలి. మన ధర్మాన్ని మనం పాటించాలి. ప్రపంచ శాంతి కోరుకోవాలి. ఇదే మన నుండి దేవుడు ఆశించేది.

ఈ ఉగాది మన జీవితంలో ఒక నవశకానికి పునాది అవుతుందని ఆశిద్దాం. మనం చేసే మంచిపనుల్లో మనకు ఈ సంవత్సరం అన్నీ విజయాలే ఇస్తుందని ఆశిద్దాం.

అందరికి ఉగాది శుభాకాంక్షలు.

Originally posted: Ugadi 2012
1st Edit: 31-03-2014
2nd Edit: 21-03-2014

ఉగాది పండుగలో ఉన్న వైజ్ఞానిక అంశాలేంటి?

ఉగాది పండుగలో ఉన్న వైజ్ఞానిక అంశాలేంటి?

ఉగాది వసంత ఋతువులో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలరకాల వ్యాధులు వ్యాపిచే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఈ సమయాన్నే మన ఋషులు "యమద్రంస్టలు" అన్నారు. యమద్రంస్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను  నాశనం చేస్తాడని అర్దం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్యజాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా అదే.

ఉగాది పచ్చడి ఒక మహాఔషధం. ఈ పచ్చడిని ఒక్క ఉగాది రోజూ మాత్రమే కాదు ఉగాది మొదులుకొని శ్రీ రామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణిమ వరకు ప్రతిరోజు స్వీకరించాలి. ఈ విధంగా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు. ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ-వైరల్ లక్షణలు కలిగింది. కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది ఉగాది పచ్చడి. మనకొచ్చే రోగాలలో చాలాశాతం వీటివల్లే వస్తాయి.

ఉగాది రోజు చేసే తైలాభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం) శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విష పదార్ధాలు)ను తొలగిస్తుంది.

ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వలన మన చుట్టు వాతావరణం నుంచి మన రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. బంతి పూలు యాంటీ-సెప్టిక్, యాంటీ-బయోటిక్ లక్షణలు కలిగినవి. మామిడి ఆకుల గురించి ఇందాకే చెప్పుకున్నాం. ఇవి ఇంట్లోకీ రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి.

ఉగాది నుంచి శ్రీ రామనవమి వరకు 9 రోజుల పాటూ వసంతనవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీ రామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకోక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఞానికంగా చూస్తే, ఒక్క రోజు కాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచిశుభ్రతగా ఉంటూ, రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం.

మొత్తంగా చూస్తే ఉగాదిపచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు చస్తాయి. ఉగాదిస్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత, మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. 15 రోజుల పాటు నియమబద్ధ జీవితం, పవిత్రమైన, పుష్టకరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఇవి ఉగాదిలో ఉన్న కొన్ని వైజ్ఞానిక అంశాలను మాత్రమే.

చూశారా! మన ఋషులు ఒక పండుగ చేసుకోమని చెప్తే అందులో ఎన్ని అంశాలుంటాయో. అందుకే హిందువైనందుకు గర్వించండి. హిందువుగా జీవించండి. పర్యావరణాన్ని రక్షించండి. తోటివారికి సహాయం చేయండి.

మన్మధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Originally published: 2013 Ugadi
1st Edit: 30-03-2014
2nd Edit: 31-03-2015

Friday, 20 March 2015

ఉగాది ఎలా జరుపుకోవాలి?

ఉగాది ఎలా జరుపుకోవాలి?

ఉగాది నాడు తెల్లవారుఝామునే (సూర్యోదయానికి గంటన్న ముందు) నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్వచ్ఛమైన నువ్వుల నూనెను శరీరానికి, తలకు పట్టించుకుని, నలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి.

స్నానం చేశాక కొత్త బట్టలు/కొత్త బట్టలు కొనే పరిస్థితులు లేకపోతే ఉతికిన బట్టలు, ఆభరణాలు ధరించాలి. కొత్తబట్టలు ధరించాక మీ ఇష్టదైవాన్ని(వినాయకుడు, శివుడు, కృష్ణుడు, రాముడు........ఇలా మీకు ఎవరంటె ఇష్టమో వారిని) పూజించాలి. పూజ చేయడం రాకపోతే ఒక స్తోత్రం చదవండి, అది రాకపోతే ఆ దేవుడి నామం/ పేరును చెప్పినా చాలు. భక్తితో ఒక్క నమస్కారం చేసినా చాలు, దేవుడు ఆనందిస్తాడు.  

ప్రజలంతా ఉగాది రోజు తమ కుటుంబసభ్యులతో కలిసి వేపచెట్టుకు పసుపుకుంకుమ పూసి, దాని చుట్టు ప్రదక్షిణ చేసి దానినుండి వచ్చే ప్రాణవాయువును తృప్తిగా, దీర్ఘంగా పీలుస్తూ ఆ చెట్టునుండి వేప పువ్వును సేకరించుకుని ఇంటికి తెచ్చుకోవాలి. వేపగాలి పీల్చడం వలన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదదు మొదలైన ప్రధాన భాగాలు చైతన్యవంతమై వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

వేప పచ్చడి/ఉగాది పచ్చడిని పరకడుపున (అంటే ఖాళీ కడుపున) ఉదయం 8 గంటలలోపు సేవిస్తేనే దాని ఔషధ గుణాలు శరీరాన్ని రోగరహితం చేస్తాయని ఆయూర్వేద గ్రంధాలు చెప్తున్నాయి.

సాయంత్రం స్థానిక దేవాలయంలో కానీ, లేక ఇతర పవిత్ర ప్రదేశంలో కానీ పంచాంగశ్రవణం చేయాలి. శ్రవణం అంటే వినడం అని అర్దం. కొత్త ఏడాదిలో దేశం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఏలాంటి ఫలితాలుంటాయి, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి...... మొదలైఅనవన్నీ పంచాంగశ్రవణం లో చెప్తారు. పంచాంగశ్రవణం చేయడం వల్లనే అనేక దోషాలు తొలగిపోతాయి. గంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది.

దేవాలయంలో కానీ, సాంస్కృతిక కూడలిలో కానీ పంచాంగ శ్రవణం చేయాలి. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే 5 ని "పంచ అంగములు" అంటారు. వీటిని వివరించేదే పంచాంగం. పంచాంగం ఉత్తరముఖంగా కూర్చుని వినాలని శాస్త్రం.

పంచాంగశ్రవణంలో సంవత్సర ఫలితాలు, సంక్రాంతి పురుషుడు, నవనాయకులువంటి వారితో పాటు వివిధ రాశులవారి ఆదాయ, వ్యయాలు, రాశిఫలాలు చెప్తారు. పంచాంగ శ్రవణంలో నవగ్రహాలను స్మరించడం వలన చాలా రకాలుగా సత్ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది.

పంచాంగ శ్రవణం ఫలితంగా సూర్యుడివల్ల శౌర్యం, చంద్రుని వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వ మంగళాలు, బుధుడివలన బుద్ధి వికాసం, గురువు వలన జ్ఞానం, శుక్రుడి వలన సుఖం, శని వలన దుఖఃరాహ్యితం, రాహువు వలన ప్రాబల్యం, కేతువు వలన ప్రాధాన్యత లభిస్తాయి.
Originally posted: 30-03-2014
1 St Edit : 20-03-2015

ఉగాది - విశేషాలు

21 మార్చి 2015, శనివారం, చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది

ఉగాది గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం

ఉగాది ఎందుకు జరుపుకుంటాం?

యుగాది అంటే యుగం ప్రారంభమైన రోజు. ఈ యుగాదే కాలక్రమంలో ఉగాది గా పిలువబడుతోంది.

హిందూ కాలమానంలో మొత్తం మనకు 4 యుగాలున్నాయి.

1. కృత యుగం/ సత్య యుగం - 17,28,000 సంవత్సరాలు
2. త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు
3. ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు
4. కలియుగం - 4,32,000 సంవత్సరాలు

ఈ నాలుగు యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. దీనినే మహా యుగం అంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, అన్ని గ్రహాలు మేషరాశిలో ఉన్న సమయంలో ప్రారంభమైంది కలియుగం. ఈనాటి ఇంగ్లీష్ క్యాలండర్ ప్రకారం చెప్పాల్సివస్తే, సరిగ్గా 5116-17 సంవత్సరముల క్రితం ఫిబ్రవరి 19-20, 3,102 BCలో శ్రీ కృష్ణ పరమాత్మ అవతరపరిసమాప్తి జరిగిన వెంటనే ద్వారపరయుగం అంతమై, కలియుగం మొదలైంది.

ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే. ఈ కలియుగ ప్రారంభానికి సూచికగా చాంద్రమానాన్ని అనుసరించి మనం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటాం.

ఉగాది పచ్చడి గురించి శాస్త్రం ఏం చెప్తోంది?

ఉగాది పచ్చడిలో ఆ రోజే కోసిన వేపపువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, అరటి ముక్కలు, కొబ్బరి ముక్కలు వేస్తారు. వీటితో పాటు మామిడి చిగురు, అశోక చిగుళ్ళు కూడా వేయాలని శాస్త్రం చెప్తోంది.

త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ
పిబామి శోకసంతప్తాం మామశోకం సదాకురు

అనే శ్లోకాన్ని చెప్తూ తినాలట.

వసంతంలో చిగిర్చిన ఓ అశోకమా! నిన్ను సేవించిన నాకు ఎటువంటి శోకములు(బాధలు) లేకుండా చేస్తావు అని పై శ్లోకం అర్దం.

శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకందలభక్షణం

అంటే "ఈ వేప పచ్చడి తినడం వలన గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైన సర్వారిష్టాలు నివారింపబడి, సర్వ సంపదలు, దీర్ఘాయువు, వజ్రంలాంటి దృఢమైన, ఆరోగ్యకరమైన శరీరము లభిస్తాయి" అని పై శ్లోకం అర్దం. ఈ ఉగాది పచ్చడిని సూర్యోదయానికి పూర్వమే తినాలని శాస్త్రం.

Originally published:
1st Edit: 30-03-2014
2nd Edit: 20-03-2015

Tuesday, 17 February 2015

17 ఫిబ్రవరి 3102 BC హిందూ చరిత్రలో ఒక మైలు రాయి

17 ఫిబ్రవరి హిందూ చరిత్రలో ఒక మైలు రాయి. అందరు గుర్తుపెట్టుకోవలసిన రోజు. ఎందుకు?

ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ లో డేట్ లు చెప్పుకోవలసి వస్తే

17 ఫిబ్రవరి 3102BC మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోలో శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణం చెందారు.

17 ఫిబ్రవరి 3102 BC తో ద్వాపరయుగం మిగుసి ఆరోజు అర్ధరాత్రి అంటే 18-2-3102 నాడు కలియుగం ప్రారంభమైంది.

17-2-3102 BC నాడు అర్ధరాత్రి ప్రపంచమంతా మహాఅంధకారంలో హాయిగా న్నిద్రిస్తున్న సమయంలో ఒక మహాజలప్రళయాం సంభవించింది. దీని గురిచి చాలా మతగ్రంధాలు తెలుపుతునాయి. ఈ జలప్రళయం నుండి భారతదేశం మాత్రమే సురక్షితంగా ఉంది.

మహాభారతం ఆధునిక కాలంలో తొలి ప్రపంచయుద్ధం. అందులో అణుబాంబులను వాడారు. అందులో మొత్తం ప్రపంచ దేశాలన్నీ పాల్గొన్నాయి.  3138 BC లో మహాభారత యుద్ధం జరిగింది. అది జరిగి సరిగ్గా 36 ఏళ్ళకు అంటే శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణం చెందారు.17 ఫిబ్రవరి 3102 BC లో పరిపూర్ణావతారమైన శ్రీ కృష్ణ పరమాత్మ మహనిర్యాణం చెందారు. వాటి అధారాలు సంస్కృత మహాభారతంలో ఉన్నాయి.

ఫిబ్రవరి 17 3102 BC అని చెప్పడానికి ఆధారం మహాభారతంలో ఇవ్వబడిన గ్రహగతులు. గ్రహగతులను ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడున్న గతులను వెనక్కు లెక్కవేసుంటూ పోతే ఈ తేదీ వస్తుంది. నవగ్రహాలన్నీ మేషరాశి మొదటికి చేరుకున్న రోజే కలియుగం ఆరంభమైంది. అంటే 18-2-3102 BC అర్ధరాత్రి 00:00 గంటలకు. అది చైత్రమాసంలో జరిగిందని గుర్తుగా మనం ఉగాది జరుపుకుంటున్నాం. అసలు మనకు ఈ ఇంగ్లీష్ తేదీలతో సంబంధం లేదు. కానీ ఎవరైనా మనల్ని మన చరిత్ర గురించి అడిగినప్పుడు మనం  వాళ్ళకు ఒక తేదీని చెప్పాలి కనుక 17 ఫిబ్రవరి 3102 ను గుర్తుంచుకోండి.

కలియుగంలో దైవాన్ని నమ్మవద్దన వాదనలు ఎక్కువగా ఉంటాయి. అసలు దేవుడే లేడంతారు. కేవలం భౌతిక సుఖాల కోసం పరితపించడం ఎక్కువగా ఉంటుంది. అసత్యం, అజ్ఞానం, హింస, అవినీతి, రాజ్యామేలుతాయి. ఎవరైన భక్తి కలిగి పరమాత్ముడిని ఆరాధిస్తుంటే, వాళ్ళను వెక్కిరించేవాళ్ళు, అసలు దేవుడు లేడని, ఉన్నా మాకు నమ్మకం లేదని చెప్పేవాళ్ళు ఎక్కువవుతారు. వారాంతా ఈ కలిపురుషుడు ప్రభావంతో ఇలాంటీ వెక్కిలి చేష్టలు చేస్తుంటారు. ప్రజల్లో స్వార్ధం పెరిగిపోతుంది. విశృంఖల కామం ఈ కలియుగ లక్షణం.        

ఇదే రోజు జరిగిన మరొక సంఘటన, 17-2-3102 BC నాడు కృష్ణ నిర్యాణం జరగగానే ఒక మహా జలప్రళయం సంభవించింది. పెద్ద ఉప్పెన(tsunami) వచ్చి ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. అప్పుడు మన మహర్షులు కర్మ భూమి, వేదభూమి, యోగభూమి అయిన మన భారతభూమి, భారతీయులు క్షేమంగా ఉండాలని పరమాత్ముడిని వేడుకున్నారు. ఒక్క భారతదేశం తప్ప మొత్తం ప్రపంచమంతా ఒక్కసారిగా అర్ధరాత్రి వచ్చిన మహాజలప్రళయంలో చాలా భాగం ధ్వంసమైంది. ఈ ప్రళయం గురించి ఇతర మతగ్రంధాలు కూడా తెలుపుతున్నాయి.

అందుకే ప్రపంచంలో ఈరోజు మన చెప్తున్న అనేక నాగరికతలు కూడా 5000 ఏళ్ళకు దరిదాపులలోనే మొదలయ్యాయి. కాని మన మహర్షుల తపశ్శక్తితో నిరంతరం ఈ దేశాన్ని రక్షిస్తూ ఉండటం వలన భారతీయ సనాతన హిందూ నాగరికత గత 197.2 కోట్ల సంవత్సరాల నుండి ఏ ప్రళయమూ లేకుండా కొనసాగుతోందని సంస్కృత భాగవతం వివరిస్తోంది. అందుకే ఈ ప్రపంచానికి నేను హిందువును అని సగర్వంగా చాటి చెప్పండి.

వీటన్నిటికి ప్రామాణికం సంస్కృత భాషలో ఉన్న మహాభారతం, భాగవతం, మరియు ఇతర పురాణాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది చారిత్రాత్మికం అంగీకరించారు.ఇందులో నాసాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.

Originally published: 17-Feb-2013
Republished 1st time : 17-Feb-2015

Tuesday, 9 April 2013

ఉగాది పచ్చడి గురించి శాస్త్రం ఏం చెప్తోంది?

|| ఓం ||

ఉగాది పచ్చడి గురించి శాస్త్రం ఏం చెప్తోంది?

ఉగాది పచ్చడిలో ఆ రోజే కోసిన వేపపువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, అరటి ముక్కలు, కొబ్బరి ముక్కలు వేస్తారు. వీటితో పాటు మామిడి చిగురు, అశోక చిగుళ్ళు కూడా వేయాలని శాస్త్రం చెప్తోంది.

త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ
పిబామి శోకసంతప్తాం మామశోకం సదాకురు

అనే శ్లోకాన్ని చెప్తూ తినాలట.

వసంతంలో చిగిర్చిన ఓ అశోకమా! నిన్ను సేవించిన నాకు ఎటువంటి శోకములు(బాధలు) లేకుండా చేస్తావు అని పై శ్లోకం అర్దం.

శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకందలభక్షణం

అంటే "ఈ వేప పచ్చడి తినడం వలన గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైన సర్వారిష్టాలు నివారింపబడి, సర్వ సంపదలు, దీర్ఘాయువు, వజ్రంలాంటి దృఢమైన, ఆరోగ్యకరమైన శరీరము లభిస్తాయి" అని పై శ్లోకం అర్దం.

Sunday, 30 December 2012

జనవరి-1 కొత్త సంవత్సరం కానే కాదు భారతీయులకు.

ఓం 

జనవరి-1 కొత్త సంవత్సరం కానే కాదు భారతీయులకు.

జనవరి 1 వ తేదీన ప్రపంచమంతా కొత్త సంవత్సరం జరుపుకుంటుంది.భారత్ లో కూడా దాదాపు అన్ని వర్గాలు,వయసుల వారు వేడుకలు జరుపుకుంటారు.కేకులు కోస్తారు,విందులు వినోదాలలో మునిగిపోతారు.డిసెంబరు 31న అయితే మరీనూ.శివరాత్రికైన జాగరణ చేయనివారు ఉంటారు కాని,31 డిసెంబరు రాత్రి మాత్రం తప్పకుండా మెలుకువగా ఉంటారు.

మనం ఒక విషయం మర్చిపోతున్నాం.జనవరి 1 మనకు అంటే భారతీయులకు కొత్త సంవత్సరం కాదు.దీన్ని ఆధారంగా చేసుకుని మన సంస్కృతిలో కొత్తగా ఏమి మొదలుకావు.భారతీయులకు కొత్త సంవత్సరం అంటే తేదీలలో మార్పు వలన వచ్చేది అసలే కాదు.మనకు ఒక కొత్త సంవత్సరం జరుపుకునే రోజు ఉంది.అది యుగాది(ఇవాళ మనం ఉగాదిగా పిలుస్తున్నాం).

మన పండగలు ఏదో పబ్బం గడుపుకోవటానికి రాలేదు.ఈ సమస్త విశ్వంలో నిరంతరం జరిగే అనేక సంఘటనలు,నక్షత్రాలు,గ్రహాల నుండి వెలువడే విద్యుత్ అయస్కాంత్ కిరణాలు,వాటి వలన మానవుని పై ఉండే ప్రభావాలను చాలా సూక్ష్మంగా,సరైన విధానంలో లెక్కించి మనం(భారతీయులం,హిందువులం) తిధి,వార,నక్షత్ర,యోగ,కరణాలను నిర్ణయిస్తాం.వాటి భ్రమణంలో జరిగే మార్పులను బట్టే మన పండగల తేదీలు మారుతుంటాయి.ఒక సెకనులో 360వ వంతు(1/360 th part of the second) సమయాన్ని,అంత తక్కువ సమయంలో ఈ సమస్త విశ్వంలో జరిగే అనేకానేక మార్పులను పరిశీలించి,మానవుల మీద వాటి ప్రభావాలను ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాకుండా,కేవలం మానవ మేధస్సుతోనే లెక్కించి,వివరించిన ఘనత మన మహర్షులకే చెల్లింది.మనం వాళ్ళ వారసులం.మన సంస్కృతి అంత గొప్పది.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆచరించే క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్.అది బ్రిటిష్ వారు ప్రపంచం మీద రుద్దారు.అది scientificగా చూసిన తప్పుల తడకే. వేరే దిక్కులేక ప్రపంచం దీనిని అనుసరిస్తోంది.

ఇప్పుడింతా ఎందుకంటే ఈ జనవరి 1న కొత్త సంవత్సరం జరుపుకోవడం వలన మనకు ఓరిగేదేమి లేదు,డబ్బు ఖర్చు తప్ప.మనకంటూ ఒక సంస్కృతి ఉంది.దాన్ని మరువకండి.

మీరంటారేమొ?.........మేము enjoy చేస్తుంటే వద్దనే హక్కు మీకు ఎవరిచ్చారని.మేము మిమ్మలని enjoy చెయ్యొద్దని చెప్పటంలేదు.మీరు ఏమి చేస్తారో మీ ఇష్టం.కాని ఇది మనది కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి.అంతేకాదు,మీరు చేస్తున్నenjoyment  కేవలం తాత్కాలికమైనది.ఇది మీకు సంతృప్తినిచ్చినా అది అశాశ్వతమైన సంతృప్తినిస్తుంది.మీలో ఇంకా ఇంకా enjoy చేయాలన్న కోరికను కలిగిస్తుంది.చివరకు ఆశాంతిని మిగిల్చుతుంది.మీకు కలిగే ఆనందం కేవలం బాహ్యమైనదే.ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతకకండి."చిదానంద రూపః శివోహం శివోహం"-మీలో ఉన్న మీరే(ఆత్మ) నిజమైన,శాశ్వతమైన,ఆనంద రూపం,శివ స్వరూపం అన్న విషయాన్ని గుర్తించండి,అనుభవంలోనికి తెచ్చుకోండి.అప్పుడు కలిగేది పరమానందం,ఆత్మానందం.అదే శాశ్వతమైనది.ఇదే నిజం,సత్యం,యదార్ధం.