Tuesday 17 February 2015

17 ఫిబ్రవరి 3102 BC హిందూ చరిత్రలో ఒక మైలు రాయి

17 ఫిబ్రవరి హిందూ చరిత్రలో ఒక మైలు రాయి. అందరు గుర్తుపెట్టుకోవలసిన రోజు. ఎందుకు?

ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ లో డేట్ లు చెప్పుకోవలసి వస్తే

17 ఫిబ్రవరి 3102BC మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోలో శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణం చెందారు.

17 ఫిబ్రవరి 3102 BC తో ద్వాపరయుగం మిగుసి ఆరోజు అర్ధరాత్రి అంటే 18-2-3102 నాడు కలియుగం ప్రారంభమైంది.

17-2-3102 BC నాడు అర్ధరాత్రి ప్రపంచమంతా మహాఅంధకారంలో హాయిగా న్నిద్రిస్తున్న సమయంలో ఒక మహాజలప్రళయాం సంభవించింది. దీని గురిచి చాలా మతగ్రంధాలు తెలుపుతునాయి. ఈ జలప్రళయం నుండి భారతదేశం మాత్రమే సురక్షితంగా ఉంది.

మహాభారతం ఆధునిక కాలంలో తొలి ప్రపంచయుద్ధం. అందులో అణుబాంబులను వాడారు. అందులో మొత్తం ప్రపంచ దేశాలన్నీ పాల్గొన్నాయి.  3138 BC లో మహాభారత యుద్ధం జరిగింది. అది జరిగి సరిగ్గా 36 ఏళ్ళకు అంటే శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణం చెందారు.17 ఫిబ్రవరి 3102 BC లో పరిపూర్ణావతారమైన శ్రీ కృష్ణ పరమాత్మ మహనిర్యాణం చెందారు. వాటి అధారాలు సంస్కృత మహాభారతంలో ఉన్నాయి.

ఫిబ్రవరి 17 3102 BC అని చెప్పడానికి ఆధారం మహాభారతంలో ఇవ్వబడిన గ్రహగతులు. గ్రహగతులను ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడున్న గతులను వెనక్కు లెక్కవేసుంటూ పోతే ఈ తేదీ వస్తుంది. నవగ్రహాలన్నీ మేషరాశి మొదటికి చేరుకున్న రోజే కలియుగం ఆరంభమైంది. అంటే 18-2-3102 BC అర్ధరాత్రి 00:00 గంటలకు. అది చైత్రమాసంలో జరిగిందని గుర్తుగా మనం ఉగాది జరుపుకుంటున్నాం. అసలు మనకు ఈ ఇంగ్లీష్ తేదీలతో సంబంధం లేదు. కానీ ఎవరైనా మనల్ని మన చరిత్ర గురించి అడిగినప్పుడు మనం  వాళ్ళకు ఒక తేదీని చెప్పాలి కనుక 17 ఫిబ్రవరి 3102 ను గుర్తుంచుకోండి.

కలియుగంలో దైవాన్ని నమ్మవద్దన వాదనలు ఎక్కువగా ఉంటాయి. అసలు దేవుడే లేడంతారు. కేవలం భౌతిక సుఖాల కోసం పరితపించడం ఎక్కువగా ఉంటుంది. అసత్యం, అజ్ఞానం, హింస, అవినీతి, రాజ్యామేలుతాయి. ఎవరైన భక్తి కలిగి పరమాత్ముడిని ఆరాధిస్తుంటే, వాళ్ళను వెక్కిరించేవాళ్ళు, అసలు దేవుడు లేడని, ఉన్నా మాకు నమ్మకం లేదని చెప్పేవాళ్ళు ఎక్కువవుతారు. వారాంతా ఈ కలిపురుషుడు ప్రభావంతో ఇలాంటీ వెక్కిలి చేష్టలు చేస్తుంటారు. ప్రజల్లో స్వార్ధం పెరిగిపోతుంది. విశృంఖల కామం ఈ కలియుగ లక్షణం.        

ఇదే రోజు జరిగిన మరొక సంఘటన, 17-2-3102 BC నాడు కృష్ణ నిర్యాణం జరగగానే ఒక మహా జలప్రళయం సంభవించింది. పెద్ద ఉప్పెన(tsunami) వచ్చి ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. అప్పుడు మన మహర్షులు కర్మ భూమి, వేదభూమి, యోగభూమి అయిన మన భారతభూమి, భారతీయులు క్షేమంగా ఉండాలని పరమాత్ముడిని వేడుకున్నారు. ఒక్క భారతదేశం తప్ప మొత్తం ప్రపంచమంతా ఒక్కసారిగా అర్ధరాత్రి వచ్చిన మహాజలప్రళయంలో చాలా భాగం ధ్వంసమైంది. ఈ ప్రళయం గురించి ఇతర మతగ్రంధాలు కూడా తెలుపుతున్నాయి.

అందుకే ప్రపంచంలో ఈరోజు మన చెప్తున్న అనేక నాగరికతలు కూడా 5000 ఏళ్ళకు దరిదాపులలోనే మొదలయ్యాయి. కాని మన మహర్షుల తపశ్శక్తితో నిరంతరం ఈ దేశాన్ని రక్షిస్తూ ఉండటం వలన భారతీయ సనాతన హిందూ నాగరికత గత 197.2 కోట్ల సంవత్సరాల నుండి ఏ ప్రళయమూ లేకుండా కొనసాగుతోందని సంస్కృత భాగవతం వివరిస్తోంది. అందుకే ఈ ప్రపంచానికి నేను హిందువును అని సగర్వంగా చాటి చెప్పండి.

వీటన్నిటికి ప్రామాణికం సంస్కృత భాషలో ఉన్న మహాభారతం, భాగవతం, మరియు ఇతర పురాణాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది చారిత్రాత్మికం అంగీకరించారు.ఇందులో నాసాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.

Originally published: 17-Feb-2013
Republished 1st time : 17-Feb-2015

No comments:

Post a Comment