Tuesday, 15 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - విశ్వశాంతి యాగం - భృగు మహర్షి శాపం

ఓం నమో వేంకటేశాయ 

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడు. కలౌ వేంకటనాయకః అన్నారు, ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో పూజలందుకున్న స్వామి, కలియుగంలో శ్రి నివాసుడిగా ఆరాధించబడుతున్నాడు. శ్రీ నివాసుడి దివ్యలీలా విశేషాల గురించి, వేంకటాచల మహాత్యం గురించి 12 పురాణాల్లో ప్రస్తావించబడింది.

'వైకుంఠానికి సమానంగా ఈ వేంకటాచలంలో పరమాత్ముడు ఎందుకు ఉన్నాడు?' అని సనకాది మహామునులు సూతమహర్షిని ఒకసారి అడుగుతారు.

అప్పుడు సూతులవారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఒకప్పుడు మహర్షులంతా కలిసి ఒక మహాయజ్ఞం చేయాలనుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నారద మహర్షి, మహర్షులను ఉద్ద్యేశించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. "ఎవరి గురించి మీరు ఈ కర్మను చేస్తున్నారు? ఈ యజ్ఞ కర్మ యొక్క ఫలాన్ని ఎవరికి సమర్పిస్తారు? ఈ యజ్ఞానికి భోక్త ఎవరు? సర్వకర్మలను ఎవరికి సమర్పించాలి? ఇవన్నీ స్వీకరించే సర్వోత్తముడు ఎవరు?"

యజ్ఞభోక్త అంటే యజ్ఞంలో వేసిన హవిస్సును స్వీకరించేవాడని అర్ధం. మనం ఎవరిని ఉద్ద్యేశించి యజ్ఞం చేస్తామో, అది ఆ దేవతకు చేరవేస్తాడు అగ్నిహోత్రుడు, ఆ హవిస్సుతో తృప్తి పొందిన దేవత మన కోరికలను తీరుస్తుంది. అందరూ, అన్ని యజ్ఞాలు కోరికల కోసం చేయరు. విశ్వశాంతి కోసం కొన్ని చేస్తారు, ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇంకొన్ని చేస్తారు. మరి ఇవన్నీ ఎవరు స్వీకరిస్తారన్నది నారదమునీంద్రుల ప్రశ్న.

యజ్ఞం అంటే నిష్కామ కర్మ, స్వార్ధరహిత కర్మ. ఇక్కడ యజ్ఞం అంటే అగ్నిహోత్రం పెట్టి చేసేది మాత్రమేనని అనుకోకూడదు. మనం ఎవరికో రక్తదానం చేస్తాం, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తాం, గోమాతలు కబేళాలకు తరలిపోకుండా అడ్డుకుంటాం. ఎన్నో దానాలు చేస్తాం, సేవకార్యక్రమాలు నిర్వహిస్తాం, పేదలకు అహారం పంచిపెడతాం. ఇవన్నీ కూడా యజ్ఞాలే. యజ్ఞం అంటేనే నిస్వార్ధంగా చేసేది. మరి మనం నిత్యం చేసే ఈ కర్మలు ఎవరిని చేరుతాయి? వీటిని ఎవరు స్వీకరిస్తారు? ఇది నారద మహర్షి అడిగిన ప్రశ్నల సారం.

నారదుడి ప్రశ్నతో మహర్షుల్లో ఎవరు సర్వోత్తముడు? ఎవరికి సర్వకర్మఫల సమర్పణ చేయాలి? యజ్ఞభోక్త ఎవరు? అన్న చర్చ మొదలైంది. అందరూ తీవ్రంగా చర్చించి, ఆ మహర్షుల్లో ప్రముఖుడైన భృగు మహర్షికి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. పరిష్కారం చూపవలసిందిగా ప్రార్ధించారు.

వీటికి సమాధానం తెలుసుకోవడం కోసం భృగుమహర్షి బ్రహ్మదేవుడు, సరస్వతీ దేవి ఉండే సత్యలోకానికి వెళ్ళారు. ఆ సమయానికి బ్రహ్మాసరస్వతులు ఏకాంతంలో ఉంటారు. భృగుమహర్షి వారికి నమస్కారం చేస్తారు, కానీ బ్రహ్మదేవుడు ఏమి గమనించనట్లుగా ఉంటారు.

బ్రహ్మదేవుడు సృష్టికర్త, మహాజ్ఞాని. ఆయనకు తెలియందేముంటుంది?  కలియుగంలో కలిపురుషుడి ప్రభావం నుంచి జనులను ఉద్ధరించడానికి విష్ణువు వేంకటాచలం మీద అవతరించవలసి ఉంది. ఆ అవతారం స్వీకరించే దశలో సాగుతున్న జగన్నాటకం ఇది. ఈ ఋషి ద్వారానే విష్ణువు భులోకానికి వెళ్తాడన్నది బ్రహ్మదేవుడికి తెలుసు. కనుక ఏమి ఎరగనట్లు మౌనం వహించాడు.

మనకన్నా యోగ్యులైనవారి వద్దకు, పెద్దవారి వద్దకు వెళ్ళినప్పుడు నమస్కరించడం (సాష్టాంగా నమస్కారం, ప్రణామం మొదలైనవి చేయడం) మన కర్తవ్యం. నమస్కారం స్వీకరించినవారు దాన్ని భగవంతునకు అర్పించి, ఆశీర్వదించడం, నమస్కారం స్వీకరించిన పెద్దల కర్తవ్యం. ఇది ధర్మం. ఈ మాత్రం కూడా బ్రహ్మదేవునికి తెలియదని భావించాడు భృగుమహర్షి.

'ఈ లోకంలో నీకు ఆలయం లేకుండు గాకా' అంటూ బ్రహ్మను శపించాడు భృగుమహర్షి. అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయం కట్టి పూజించరు.

బ్రహ్మదేవుడి ఆలయం పుష్కర్‌లో ఒకటి ఉంది. అక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. దానికి గుర్తుగా ఒక చిన్నసరస్సు కూడా ఉంది. అటు తర్వాత మన రాష్ట్రంలో పవిత్ర గోదావరి నదీతీరంలో, బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కలిసి యజ్ఞం చేసిన ప్రదేశంలో, ముక్కామల క్షేత్రంలో ఈ మధ్యకాలంలో ఆలయం నిర్మించారు ముక్కామల పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీధర స్వామి.

బ్రహ్మను శపించిన భృగువు కోపంతో కైలాసానికి చేరుకుంటాడు. ఆ సమయంలో శివుడు కైలాసంలో పార్వతీదేవితో ఏకాంతంలో ఉంటాడు. శివుడి ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదని శాస్త్రం. అటువంటి శివుడు భృగువు వచ్చాడాన్న విషయాన్ని గమనించనట్లు నటిస్తాడు. దాంతో కోపం వచ్చి, 'మహర్షుల ఆగమనాన్ని కూడా గుర్తించక కామాంధుడవై ఉన్న నీవు సర్వోత్తమ్ముడు కానేరవు. లోకంలో నీకు మూర్తి పూజ లేకుండు గాకా' అంటూ శపించాడు భృగు మహర్షి. అందుకే మనం శివుడిని విగ్రహరూపంలో పూజించమని పెద్దల మాట. కానీ, భృగు మహర్షి శపించకముందు నుంచి లోకంలో లింగారాధనే ఉన్నది. శివుడి విగ్రహాన్ని పూజించేవారికంటే శివ లింగాన్ని పూజించేవారు శక్తిమంతులని, వారిని ఎవరు ఓడించలేరని మహాభారతంలో కృష్ణపరమాత్మ చెప్తారు. పరమాత్మ మాటకు కొనసాగింపుగా మహర్షి శాపం ఇచ్చాడు (ఇప్పించాడు పరమాత్ముడు). ఇదో దైవలీల.

మనకు దగ్గరలో శివుడిని విగ్రహరూపంలో కొలిచే ఒక క్షేత్రం చిత్తురు జిల్లా, సురుటపల్లిలో ఉంది. ఇక్కడ శివుడు పార్వతీదేవి ఒడిలో నిద్రిస్తునట్లుగా ఒక పెద్ద శిలాముర్తి ఉంటుంది.

ఆవేశంతో ఉన్న భృగుమహర్షి వైకుంఠం చేరుకుంటాడు. వైకుంఠంలోనూ అదే పరిస్థితి. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఏకాంతంలో ఉంటారు. భృగుమహర్షి ఆగమనాన్ని పట్టించుకోనట్ట్లు ఉంటారు. తెలియక కాది, లోక కల్యాణం కోసమని.......................... ముందు రెండులోకాల్లో పరిస్థితే ఇక్కడా అనుభమయ్యేసరికి భృగుమహర్షి ఆవేశం కట్టలుతెంచుకుంటుంది. అంతే, కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలంపై (లక్ష్మీదేవి నివాసముండే ప్రస్దేశంలో) కాలితో తంతాడు........

అప్పుడే గమనించినట్లు విష్ణుమూర్తి భృగుమహర్షి వైపు చూసి ఆయనకు ఉపచారాలు చేస్తాడు...... అతి కాఠిన్యమైన నా దేహ్న్ని తగిలి మీ పాదానికి నొప్పి కలిగి ఉంటుందంటూ ఆ కాలి వత్తి ఉపశమనం కలిగిస్తాడు. శ్రీమహాలక్ష్మీని ఆదేశించి మహర్షికి పాదపూజ చేస్తాడు. మహర్షి పాదోదకం తన పై చల్లుకుని, లక్ష్మీదేవీపై చల్లి, తన మందిరమంతా, వైకుంఠమంతా చల్లిస్తాడని పురాణవచనం.

భృగుమహర్షికి అరికాలిలో మూడవకన్ను ఉంటుంది. ఆ కన్ను కారణంగానే అతనిలో అవేశం ఎక్కువ ఉంటుంది. ఎంతటి గొప్ప సాధకుడైనా, క్రోధం ఉంటే, అతని సాధన వ్యర్ధమవుతుంది. భృగుమహర్షి గొప్పవాడు, తపోశక్తితో మూడులోకాలకు కాలినడకన వెళ్ళగలిగాడు. కానీ, అతనిలో కోపం కారణంగా బ్రహ్మను, శివుడిని శపించి, తను ఎన్నో ఏళ్ళ తరబడి తపస్సు చేసి పొందిన తపశ్శక్తిని మొత్తం వృధా చేసుకున్నాడు.

తన భక్తులు ఎప్పటికి నాశనం పొందరని పరమాత్మ గీతలో చెప్తారు. తన భక్తుడు ఎంతటి దుర్మార్గుడైనా, అతన్ని నిందించరాదని, భగవంతుని నమ్మాడు కనుక ఎప్పటికైన బాగుపడతాడని చెప్తాడు. తన భక్తులను ఉద్ధరించడం తన బాధ్యతగా స్వీకరిస్తాడు పరంధాముడు. మనం ఏ రూపంలో పీజిస్తే, ఆ రూపంలోనే మనలని ఉద్ధరిస్తాడు. అలాగే భృగుమహర్షిని కూడా ఉద్ధరించాలి, క్రోధం నుంచి విముక్తి కలిగించాలని భావించాడు శ్రీ మహావిష్ణువు.

భృగుమహర్షికి పాదపూజ చేస్తూ, అతని అరికాలిలో ఉన్న నేత్రాన్ని చిదిపేస్తాడు. క్రోధం నశించగానే, భృగు మహర్షికి తాను చేసిన తప్పు అర్ధమవుతుంది. విష్ణువును క్షమించమని వేడుకుంటాడు. తాను చేసినపనికి పశ్చత్తాప పడతాడు. విష్ణువు సర్వోత్తముడని, భూలోకానికి తిరిగి వచ్చి మహర్షులకు చెప్తాడు.

To be continued....

Monday, 14 October 2013

పాలపిట్ట కనిపించకపోతే

విజయదశమికి పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని శకున శాస్త్రం అంటుంది. మరి పాలపిట్ట కనిపించకపోతే ఏమవుతుంది? అరిష్టమా?...... అపశకునమా?......... తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి.

ఒక 5 ఏళ్ళ క్రితం మాట. ఒకసారి విజయదశమికి దేవాలయ దర్శనానికి వెళ్ళి వస్తుంటే, రోడ్డు మీద జనం మూగు ఉన్నారు. ఏమని ఆరా తీస్తే, ఎవరో పాలపిట్టను తీసుకువచ్చారని, దాన్ని ఈ రోజు చుడడం వలన మంచి జౌరుగుతుందని చెప్పాడు. మేము చూడలనుకున్నాం, పది రూపాయల తీసుకున్నాడు. ఒక చిన్న పంజరం, ఆ పంజరం చుట్టు నల్లని గుడ్డ కప్పేశాడు, అందుఓ ఒక పిట్ట/పక్షి ఉన్నది. అది కాకో, పావురమో, పాలపిట్టో, చిలకో, అసలదెంటో కూడా తెలియడం లేదు. చుశామా అంటే చూశామని చెప్పుకోవాలి, కానీ ఏం చూశామో ఇంతవరకు తెలియదు.

అసలు పాలపిట్ట అనేది ఉనందన్న సంగతి కూడా మనకు వాళ్ళకు తెలియదు. పాలపిట్ట అంటే పాలుతాగే పిట్ట అన్నాడు ఒక గడుగ్గాయి. పాలపిట్టను మన రాష్ట్రానికి, కర్ణటక, బీహార్, మరికొన్ని రాష్ట్రాలాకు ఇది రాష్ట్ర పక్షి. అది ఎక్కువగా పంటపొలాల్లో కనిపిస్తుంది (కనిపించేది). పంటలకు వచ్చే చీడలను, పురుగును తిని రైతుకు సహాయంచేస్తుంది.అలాగే కీటకాలను, సీతకోకచిలుకలను, వానపాములను, చిన్న చిన్న పాములు వంటివి దీని ఆహారం. ఒకప్పుడు ఇవి 1 చదరపు కిలోమీటరుకు సగటున 50 కనిపించేవి. ఇప్పుడివి అంతరించిపొయే పక్షుల జాతుల జాబితలో చేరిపోయాయి, ప్రమాదపుటంచున ఉన్నాయి.

మనిషికి అత్యాశ పెరిగిపోయింది. ఒక ఎకరం పొలంలో 10 బస్తాల పంట రావల్సి ఉంటే, 50 బస్తాలు ఆశిస్తున్నాడు, అదే కొవలో ప్రభుత్వాలు ఉన్నాయి. మంచి దిగుబడి కోసం రసాయన (కెమికల్) ఎరువుల్లు, పురుగుల మందులు వాడతారు. ఈ రోజు మనం తినే ఆహారం మొత్తం రసాయనాలే, మన శరీరం మొత్తం కలుషితమైపోయింది. చిన్నవయసులోనే తెల్లవెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? అందరికి మధుమేహం ఎందుకు వస్తోంది? రకరకాల రోగాలు ఎందుకు పుడుతున్నాయి? మనం అభివృద్ధి చెందిన కొద్ది కొత్త రోగాలు కూడా ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఎందుకంటే మనకు పౌషకాహారం అవసరం లేదు. ఎంత తిన్నామన్నది చూస్తున్నాం కనీ, తిన దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి చూడడం లేదు. మనకు కేవలం దిగుబడి మాత్రమే కావాలి, కానీ అది మనకు శక్తినివ్వాలని మనం మర్చిపోయాం. మనం తింటున్నాం, కేవలం తింటున్నాం, ఎందుకంటే తినాలి కాబట్టి. అంతే. మనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు.

బియ్యం అనేకమార్లు పోలిష్ పట్టి తెల్లగా కనిపించాలి. తెల్లటి బియ్యం మాత్రమే తినాలని మనం కోరిక. అందుకే చిన్నవయసులో జుట్టు తెల్లబడుతోంది. రసాయన ఎరువుల చేత పెంచబడిన ఆహారం వలన మనకు మధుమేహం (షుగర్) మొదలు అనేక వ్యాధులు వస్తున్నాయి. దంపుడు బియ్యం తింటే ఏమవుతుంది? అది పర్వౌతక్కువ పనిగా భావిస్తాం, మనం పిల్లలకు మనం రోగాలు అంటగడుతున్నాం.

ఇప్పుడు ఇది చెప్పవలసి వచ్చిందంటే పాలపిట్ట కనిపించకపోవడానికి ప్రధాన కారణం ఈ రసాయన, కెమికల్ ఎరువులు, పుర్గుల మందులే. పాలపిట్ట కనిపించకపోతే ఏమవుతుంది? పాలపిట్ట అంతరించిపోతే ఏమవుతుంది? .......... ఏమవ్వదు, త్వరలో మానవజాతి కూడా రోగాలతో సర్వనాశనమవుతుంది, అంతే. ఆరోగ్యం భారతావని కాస్తా రోగాల భారతవనిగా మారుతుంది. అదే మనకు ఈ దసరా గుర్తుచేస్తోంది.  

మనం ఇప్పుడే మేల్కోవాలి. మనం పంధాను, మన వ్య్వసాయ పద్ధతులను, జివన విధానాన్ని, ప్రక్టిపట్ల మన దృష్టిని మార్చుకోవాలి. దీనికి సమాధానం సేంద్రియ వ్యవసాయం కానే కాదు ఎందుకంటే సేంద్రియ ఎరువుల ఒక ఉష్ణోగ్రత వరకే పనిచేస్తాయి. మరి మనకు మార్గం లేదా?

ఉన్నది ఒక్కటే మార్గం. అదే ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధపద్ధతులలో సాగే వ్యవసాయం. వేదంలో చెప్పబడ్డ వ్యవసాయ పద్ధతి. పాలేకర్ రైతు ఆశ్రయించి, ఫిలితాలు చూపిన వ్యవసాయపద్ధతి. గోమాత మీద సంపూర్ణంగా ఉపయోగపడ్డ వ్యవసాయం ఇది. మన కోసం, మన బిడ్డలకోసం, భావితరాలకోసం, బంగారు భారతభూమి ఆరోగ్యంగా ఉంచడం కోసం మన ప్రభుత్వాలు ప్రోత్సహించవల్సిన వ్యవసాయపద్ధతి. భూసారన్ని పెంచే వ్యవసాయ పద్ధతి.

ఈ విజయదశమి మనకు గుర్తుచేస్తున్నది ఇదే. మనం మారితే, భవిష్యత్తులో మనకన్ని విజయలే, లేకుంటే మానవజాతికి అపజయాలే.
               

Saturday, 12 October 2013

దుర్గ అన్న నామమే పరమపవిత్రం.

దుర్గ అన్న నామమే పరమపవిత్రం.

దుర్గమాసురుడనే రక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం.దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం.

దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగనాశనానికి,
'గ' కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.

అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించపఓవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపాన, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు....... ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షసలక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది 'దుర్గా' నామంలో ఉండే 'ద'కారం.

పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది. రోగం అంటే మానసిక, శారీరిక రోగాలు మాత్రమే కాదు, దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానకరోగాలు. ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గా నామంలో ఉండే 'ర'కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.

ఇక 'గ'కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధిచిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు. సమస్తబ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరిని మనకు, ఏది తెలుసుకుంటే ఇక అన్ని తెలుస్తాయో, దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుస్కునే పని ఉండడో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో........... అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరంకాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది.

ఈ విధంగా దుర్గా అన్న నామమే పరమశక్తివంతమైనది. ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది? అమ్మ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఓం దుర్గాయై నమః 

బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగలో ఉన్న శాస్త్రీయ అంశాలేమిటో తెలుసుకుందాం.

ఇత్తడి తాంబులంలో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. తంగేడు పువ్వులు గొంతు సమస్యలకు,మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధం. కాస్త ఏత్తులో పూల పేర్పు అయ్యాక గునక, బంతి, చామంతి, అడవి చామంతి, మూత్యాలపువ్వు, రుద్రాక్ష, నీలగొరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర.... ఇలా బతుకమ్మను పేర్చడంలో రకరకాల పూలను ఉపయోగిస్తారు.

~ గునక పువ్వు యాంటి-డైహెరియా,యంటి-డైయాబేటిక్ లక్షణాలు కలది.
~ క్రిమి-సంహారిణి,దోమలను నివరించేది బంతిపువ్వు.
~ చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, అరుగుదల సమస్యలకు ఔషధంగా వాడతారు. ఇది యాంటి-బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినది, కాలుష్య కారకాలను, బెంజిన్, అమోనియా వాయువలను పీల్చుకొని, గాలిని శుద్ధిచేస్తుంది.

ఈ విధంగా బతుకమ్మ పేరున వాడే ప్రతి పువ్వుకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ పూలన్ని గోపురంలా పేర్చాక పైన గుమ్మడిపువు గొడుగుపెడతారు. తమలపాకులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పక్కనే దీపం వెలిగిస్తారు. పసుపు శుభానికి సూచన, క్రిమి-సంహారిణి. దీపం జ్ఞానానికి సంకేతం. అది గాలిని శుద్ధి చేస్తుంది, క్రిములను హరిస్తుంది.

సాయంత్రం ఇంటిముందుకాని, వీధిలోకాని, దేవాలయంలో, చెరువు, వాగు ................ ప్రతి చోట అందరు చేరి, బతుకమ్మలను మధ్యలో ఉంచి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడతారు.

చీకటి పడుతుండగా చెరువుల్లో నిమ్మజ్జనం చేస్తారు. ఆ పూలుకున్న ఔషధ గుణాలు నీటిని శుద్ధిచేసి, నీటిద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి. ఇంట్లో 9 రోజులపాటు ఆ పూలను పేర్చడం, ఆ వాసన ఇల్లంత వ్యాపించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న క్రిములు హరింపబడతాయి, అందరు ఆ వాసన పీల్చడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తారు.

Thursday, 10 October 2013

శ్రీ మహాలక్ష్మీ

శ్రీ మహాలక్ష్మీ సిరులతల్లి, విష్ణుపట్టపురాణి. ఈ లోకంలో అందరూ లక్ష్మీకటాక్షం కోసం చేయని పూజ ఉండదు.

లక్ష్మీదేవి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే డబ్బు, అధికారం, భవనాలు మొదలైన భౌతిక సంపద అని మాత్రమే అనుకోకూడదు. ఈ భౌతిక సంపద అశాశ్వతమైనది. ఈ భౌతిక సంపదలన్నీ జీవించి ఉన్నంత వరకే. మరణనించాకా ఆత్మతో పాపపుణ్యాలు, వాసనలు తప్ప ఈ బౌతిక సంపదలు రావు. లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్టసమయంలో దైర్యాన్నిచ్చేది, కష్టాల నుంచి తప్ప్కించుకోవడం కాదు, కష్టాలను ఎదుర్కునే బలాన్ని ఇస్తుంది, పూర్వజన్మ వాసనలను రూపుమాపి, పాపపుణ్యాలను క్షయం చేసుకుని, జ్యోతిస్వరూపమైన పరమాత్మలో ఆత్మను ఐక్యం చేసే జ్ఞాన సంపదను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.

లక్ష్మీదేవి తత్వం అంతటా వ్యాపించి ఉంటుంది. లక్ష్మీకటాక్షం మనపై ఎప్పుడు ఉంటుంది, కానీ అది గుర్తించే పరిస్థితుల్లో మనం ఉండము, అంతే. ఈ మానవ జన్మ కలగడం ఆమె అనుగ్రహమే. ఈ జన్మను మంచికార్యాలకు, భగవద్భక్తికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపయోగించుకోవడం, ఈ శరీరాన్నిచ్చిన లక్ష్మీదేవికి మనం చేసే అర్చన. ఆరోగ్యంగా జీవించడం కూడా లక్ష్మీకటాక్షమే. ఆత్మ తత్వం తెలుసుకోవాలంటే ఈ మానవదేహం చాలా అవసరం. అటువంటి ఈ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆరోగ్యలక్ష్మీకి చేసే ఆరాధనవుతుంది.

యా దేవీ సర్వ భూతేషు లక్ష్మీ రూపేణా సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

సర్వజీవులయందూ జీవసక్తిగా, ప్రాణశక్తిగా లక్ష్మీదేవి కొలువై ఉంది. సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండడం, ఇతర జీవల ఆకలి తీర్చడం, వాటి జీవనానికి సహాయపడడం భూతలక్ష్మీకి (భూతములంటే జీవజాలం అని అర్దం) చేసే పూజ. అందరికి కొద్దొగొప్పొ డబ్బు ఉంటుంది. ఆ ధనాన్ని ధర్మకార్యాలకు వెచ్చించడం మనం ధనలక్ష్మికిచ్చే గౌరవం అవుతుంది. సంతానం లక్ష్మీదెవి అనుగ్రహం వల్లనే కలుగుతుంది, పిల్లల రూపంలో లక్ష్మీదేవి ఇంటిలో తిరుగుతుంటుంది. అటువంటి పిల్లల్లో దేశభక్తిని, దైవభక్తిని పెంపొందించడం, మంచి విద్యావంతుల్ని చేయడం ద్వారా సంతానలక్ష్మీని పూజించినవారమవుతాం.

లక్ష్మీదేవికి నిత్యానపాయిని, విష్ణువును విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. విష్ణువంటే వ్యాపకత్వం కలిగినవడు. ఈ సృష్టిలో వ్యాపకత్వం కలిగినది ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప ఈ జగత్తులో మరకొటి లేదు. మనకు కనిపించేవన్నీ ఆత్మ యొక్క ప్రతిబింబాలు. ఇవి ఏదో ఒకరోజు లయం అయిపోతాయి. కానీ ఆత్మ సనాతనమైనది, ఆత్మ ఆనందస్వరూపం. విష్ణువు ఆత్మ అయితే, ఆత్మానందం లక్ష్మీదేవి. ఆత్మానూభూతిని పొందడం వలన, ఆత్మ స్థితిలో ఉండడం వలన కలిగే చిదానందమే లక్ష్మీకాటాక్షం.

ఓం నమో లక్ష్మీనారాయణాయ                       

Wednesday, 9 October 2013

శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి

ఓం శ్రీ మాత్రే నమః 

మహామహిమాన్వితమైనది శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి. 

భాస్కరరాయులవారు (1690-1785) బ్రహ్మాండపురాణంలో ఉన్న శ్రీ లలితా సహస్రనామాలకు భాష్యం రాసారు. వారు ఈ సహస్రనామాలకు భాష్యాన్ని (కామెంటరి) రాస్తున్న స
మయంలో ఒక సంఘటన జరిగింది. కాశీలో, అక్కడి పండితులు అహంకారంతో భాస్కర రాయులవారిని విమర్శిస్తూ నీవు లలితా సహస్రనామాలకు భాష్యం రాసేంత పండితుడివా? నువ్వు లలితా సహస్రనామాలకు భాష్యం రాసేంతటి గొప్పవాడివైతే లలితా సహస్రనామంలో 'మహచతుష్షష్టికోటి యోగినీగణ సేవితా' అనే ఒక నామం ఉంటుంది. అంటే లలితా దేవిని 64 కోట్ల మంది మహయోగినులు నిత్యం పూజిస్తూ ఉంటారని అర్దం. ఆ 64 కోట్లమంది యోగినీ గణాల పేర్లు చెప్పు అంటూ సవాల్ చేశారు.

ఆయన మరుసటి రోజు చెప్తా అని ఇంటికి చేరారు. అమ్మవారిని ప్రార్ధించారు. వారి పేర్లు నాకేమి తెలుసు, నీవే రాయిస్తున్నావు, దీనికి కూడా నువ్వే సమాధానం చెప్పాలి అని వేడుకున్నారు. అమ్మవారు నీ వెంట నేను ఉన్నాను. నేను చూసుకుంటా అన్నది. మరునాడు గంగా నదిగట్టున కూర్చున్న ఆ పండితుల దగ్గరికి వెళ్ళారు భాస్కర రాయులు. చెప్పగలవా అంటూ భాస్కరరాయులవారిని ఎగతాళి చేశారు పండితులు.

అంతే అమ్మవారి మహిమ వల్ల ఆ గంగా నది ఒడ్డున ఆకాశంలో 64 కోట్లమంది యోగీని దేవతలు ఒక్కసారిగా ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వరుసగా అందరి పేర్లు చెప్పడమే కాదు, వారిని ప్రత్యక్షంగా చూపించారు భాస్కరరాయులవారు. ఇదంతా అమ్మవారి అనుగ్రహంతోనే సాధ్యపడింది.

భక్తులపాలిట కల్పవృక్షం లలితాపరమేశ్వరీ దేవి.

ఓం శ్రీ మాత్రే నమః 

Wednesday, 2 October 2013

దేవి శరన్నవరాత్రి విశేషాలు

దేవి శరన్నవరాత్రి విశేషాలు తెలుసుకుందాం.

పౌర్ణమితిధి  రోజున అశ్విని నక్షత్రం ఉన్న నెలను ఆశ్వీయుజ మాసం అంటారు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి(అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి) నుండి నవమి వరకు గల తొమ్మిది రాత్రులను దేవినవరాత్రులు అంటారు.

ఈ నవరాత్రులలో దేవిని ఆరాధిస్తాం కనుక వీటిని దేవి నవరాత్రులు అని, ఇవి శరత్ ఋతువులో వస్తాయి కనుక వీటిని శరన్నవరాత్రులు అని అంటారు.

ఒక ఏడాదిలో ఆషాఢ నవరాత్రులు, శారదా నవరాత్రులు, మహానవరాత్రులు, వసంత నవరాత్రులు అనే నాలుగు నవరాత్రులు ఉంటాయని అగ్నిపురాణం చెప్తోంది. వీటిలో ఆశ్వీయుజమాసంలో వచ్చే దేవి నవరాత్రులు(శరన్నవతారులు), వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రులు ముఖ్యమైన., ఈ రెండు కాలాలను యమద్రంస్టలు అంటారు. ఈ సమయంలో యముడి నోటి నుంచి కోర్లు బయటకు వస్తాయి కనుక ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, మృత్యువు నుంచి తప్పించుకోవాలంటే ఈ సమయంలో అమ్మవారిని విశేషంగా ఆరాధించాలని పురాణవచనం.

శరత్కాలం నిర్మలత్వానికీ,శరశ్చంద్రుడు ప్రశాంతతకూ ప్రతీకలు. నిర్మలమైన ప్రేమ, కరుణ కురిపించే చల్లని మనస్సు మాతృ మూర్తి సహజ లక్షణాలు. అందుకే నిర్మల,ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలం అంటే జగన్మాతకు అత్యంత ప్రీతి.

ఈ సమయంలో అమ్మవారిని ధ్యానించడం, పగలు ఉపవసించి రాత్రి పూజించాలని, దుర్గా సప్తశతి, దేవి భాగవతం పారాయణ చేయాలని శ్రీ దేవీ భాగవతం చెప్తోంది.