Tuesday 11 September 2012


part-23

~ వినాయకచవితికి పూజించిన విగ్రహాలను నిమ్మజ్జనం చేయాలా?

~ వినాయకచవితి ఉత్సవాలకు పూజించే ప్రతిమలను మట్టితో చేస్తారు(మట్టితొనే ఎందుకు చేయాలో 1,2 భాగాల్లొ ఉంది).ఈ విగ్రహానికి యంత్రపూర్వక స్తాపన ఉండదు.కేవలం కొన్ని రోజులకోసమే ఈ బొమ్మను పూజించడం జరుగుతుంది.ఉత్సవాల అనంతరం ప్రతిమను నిమజ్జనం చేయకపొతే రోజూ ఎవరు పూజచేస్తారు?తాత్కాలింగా వేసిన పందిరి ఎన్ని రోజులు ఉంటుంది?మట్టిబొమ్మ కదా,కొద్ది రోజులకే పగుళ్ళు వస్తాయి.విరిగిన విగ్రహాలను ఎలా పూజిస్తాం?అందుకే నిమ్మజ్జనం చేయమన్నారు.

~ వినాయక నవరాత్రులలో ఈ విగ్రహంలొకి అంతరిక్షం నుండి వచ్చే గణపతి తరంగాలు,దివ్య శక్తులు ఉద్వాసన చెప్పినా ఆ విగ్రహాన్ని పూర్తిగా విడిచి వెళ్ళవు.మన చేతిలొ కర్పూరం పట్టుకొని ఇతరులకు ఇస్తే చేయి కర్పూరం వాసనే వస్తుంది కదా.ఇది అంతే.ఆ శక్తివంతమైన విగ్రహాన్ని మన బావిలొ నిమ్మజం చేస్తె ఆ శక్తి మన బావిలో ఉన్న నీటికి వస్తుంది.ఎవరు ఈ సమాజ శ్రేయస్సు కోసమని నిత్యం తపిస్తారో,ఎవరు నిస్వార్ధంగా ఈ ప్రపంచానికి మేలు చేయాలని చూస్తారో వారే భారతీయులు,హిందువులని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

~ అందువల్ల మనం ఆ విగ్రహాలను చేరువులోనొ,నదిలొనో నిమజ్జనం చేస్తాం.ఒక విగ్రహానికి ఉన్న శక్తికంటే అనేకానేక విగ్రహాలకు ఉన్న శక్తి ఎక్కువ.అది ఆ చేరువులొనో,నదిలొనో వ్యాపిస్తుంది.ఆ నీరు శక్తివంతమవుతుంది.ఆ నీరు పంటలకు వాడడం వల్ల మనం తినే ఆహారానికి ఆ శక్తి వస్తుంది.ఆ నీటిని త్రాగడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.అంతేనా?కాదు.

~ ఆ నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి వర్షం పడుతుంది.ఆ మేఘాలు  చాలా దూరప్రాంతానికి చేరి అక్కడా వర్షిస్తాయి.అక్కడి ప్రజలు,జంతువులు,పర్యావరణం హాయిగా ఉంటుంది.అందుకే ఏంతొ ఘనంగా పూజించిన విగ్రహాలను చెరువుల్లొనో,నదుల్లొనో నిమజ్జనం చేయడం.ఎంత నిస్వార్ధ జీవనం మనది.

~ చెరువునుండి తీసిన మట్టితో చేసిన విగ్రహం తిరిగి చేరువులొనే కలపడం అంటే ఈ జీవితం శాశ్వతం కాదు,ఎక్కడి నుంది వచ్చామో అక్కడికే వెళ్ళిపొతాం అని అర్దం.మధ్యలో పూజ అంటే అల అందరికి అన్ని అందిస్తూ పూజింపబడు అని అర్దం.మనం పరమాత్మ నుండి వచ్చమని,మన ఆత్మ పరమాత్మ స్వరూపమని భగవద్గీత సారాంశం.

~ చూశారా ఎంత గొప్పదో హిందూ సంస్కృతి,భారతీయ జీవనం.మరి ఇవ్వాళ మనం చేస్తున్నదేమిటి?రసాయన విగ్రహాలను పూజిస్తున్నారు.ఆ రసాయనిక రంగులు ఆరోగ్యానికి మంచివి కావు.తరువాత నిమజ్జం చేస్తాం.అది పర్యావరణానికి మంచిది కాదు.ఈ సంవత్సరం హైద్రాబాదులో అక్టోబరు 1-19 వరకు జీవవైవిధ్య సదస్సు ఉంది.చాలా దేశాలనుండి ఎంతో గొప్ప వ్యక్తులు వస్తున్నారు.వారు వారి దేశాలకు వెళ్ళి హిందుసంస్కృతిలో ఉన్న పర్యావరణ పరిరక్షణ,సంప్రదాయలు వంటి అంశాలను గొప్పగా చెప్పుకొవాలి కానీ ఇదిగో ఆ హిందువుల పండుగ పర్యవరణానికి కీడు చేస్తొందని చెప్పుకుంటే మనకు ఎంత సిగ్గు చేటు.ఆలోచించండి.
         
to be continued.......      

No comments:

Post a Comment