Tuesday 2 July 2013

ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ధారీదేవి ఆగ్రహం అంటున్నారు అక్కడి స్థానికులు. అసలు ఏవరీ ధారీ దేవి?

ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ధారీదేవి ఆగ్రహం అంటున్నారు అక్కడి స్థానికులు. అసలు ఏవరీ ధారీ దేవి?

సూమారు 800 ఏళ్ళ క్రితం ఉత్తరాఖండ్‌లో గార్హ్వాల్ ఎగువ ప్రాంతంలో వచ్చిన వరదలకు ఒక అమ్మవారి విగ్రహం కొట్టుకువచ్చి ఇప్పుడు ధారీదేవిని ప్రతిష్టించిన ప్రదేశంలో ఉన్న ఒక శిలకు తగిలింది. దీంతో అక్కడున్న శిల(రాయి) విలపించిందట. అప్పటి నుంచి ఆ ప్రాంతంవారు ఆ శిలను పూజిస్తున్నట్టు అక్కడివారు చెప్తారు.  

అలకానంద నది మధ్యలో ఒక ఉంటూ, నది యొక్క ధారను(ప్రవాహాన్ని) నియంత్రిస్తుంది కనుక ఈ అమ్మవారికి ధారీ దేవి అని పేరు వచ్చిందని కొందరు చెప్తారు.

ధారీదేవి కాళీమాత ప్రతిరూపం, శక్తి స్వరూపిణి. చార్‌ధాం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులకు రక్షకురాలు, ఉత్తరాఖండ్ గ్రామ దేవత ఈ ధారీ దేవి.  

ధారీ దేవి కేధార్‌నాధ్‌లో నిత్యం సంచారం చేస్తూ, రక్షిస్తూ ఉంటుంది. ఉదయం బాలిక స్వరూపంలో, మధ్యాహ్నం యవ్వన స్త్రీ రూపంలో, రాతి వేళ ముసలి స్త్రీ రూపంలో దర్శనమిస్తూ, కేధార్‌నాధ్ క్షేత్రంలో  తిరుగుతూ ఉంటుంది.

బధ్రీనాధ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో, రుద్రప్రయాగకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ధారిదేవి ఆలయం.

ఈ తల్లి యొక్క సగభాగం ఇక్కడ ధారిదేవి రూపంలో పూజింపబడుతుంటే, మిగితా సగభాగం కాళీమట్ ప్రాంతంలో కాళీ దేవి రూపంలో పూలందుకొంటున్నది.

శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడిన శక్తి యొక్క 108 దివ్య క్షేత్రాల్లో ఈ ధారీ దేవి కూడా ఉండడం విశేషం.

No comments:

Post a Comment