Friday 5 July 2013

బయటనుండి రాగానే ముందుగా కాళ్ళు కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ప్రవేశించమని మన పెద్దలు చెప్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి?

మన సంప్రదాయం - శాస్త్రీయత

బయటనుండి రాగానే ముందుగా కాళ్ళు కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ప్రవేశించమని మన పెద్దలు చెప్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి?

చెప్పులు వేసుకుని వెళ్ళినా, మన రకరకాల ప్రదేశాల్లో తిరుగుతాం. అవి పరిశుభ్రంగా ఉండచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి చోటా అనేక రకాల క్రిములు ఉంటాయి. మనం బయట తిరిగినప్పుడు ఆ క్రిములు మన శరీరానికి, ముఖ్యంగా పాదాలకు అంటుకుంటాయి. మనం నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తే, ఆ రోగకారక క్రిములు ఇంట్లోకి చేరి ఆ ఇంట్లో నివసించేవారికి వ్యాధులు కలిగించవచ్చు. అదే పసిపిల్లలు ఉంటే వాళ్ళు ఇల్లంతా పాకుతారు కనుక ఇంకా త్వరగా అనారోగ్యం వచ్చేస్తుంది. అందుకే మన పెద్దలు బయటకు వెళ్ళిరాగానే ఇంట్లోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోమన్నారు.

మన నడిచే దారిలో మనకు హాని కలిగించేవి అనేకం ఉండచ్చు. కొందరు దిష్టి తీసిన నీళ్ళు, నిమ్మకాయలు వంటివి ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. మనం వటిని దాటే అవకాశం ఉంది. ఒకవేళ మనం అలాంటి వాటిని దాటితే, ఆ దోషం తొలగిపోవడానికి, మనకు ఎటువంటి కీడు జరగకుండా ఉండడం కోసం బయటకు వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కుంటాం.

మరొక ఆరోగ్య రహస్యం కూడా ఉందండి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. మెదడు, కళ్ళకు సంబంధించిన నాడులు కొన్ని పాదాల్లోనూ, అరికాల్లోనూ ఉంటాయి. కాళ్ళు పరిశుభ్రంగా లేకపోతే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయంటోంది ఆయుర్వేదం. వీటితో పాటు బయటకు వెళ్ళి రావడం వలన అలసట ఏర్పడుతుంది. వెళ్ళిరాగానే కాళ్ళ మీద చల్లటి నీరు పడడంతో ఆ చల్లదనం నాడులు ద్వారా మెదడకు చేరి మెదడు సేద తీరుతుంది. అలసట త్వరగా పోతుంది.

ఇన్ని శాస్త్రీయ విషయాలు, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కనుకే మనం బయటకు వెళ్ళిరాగానే కాళ్ళు కడుక్కుంటాం. కానీ ఇప్పుడు మనం మర్చిపోయాం. కనీసం ఇక నుంచి మీరు కూడా పాటిస్తారు కదూ.  

No comments:

Post a Comment