Friday 12 July 2013

సర్వం జగన్నాథమయం

సర్వం జగన్నాథమయం

పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధం. మీకు తెలుసా..............పూరీలో స్వామి రధయాత్రలో ఆయనకు చాలా రకాల నైవేధ్యాలు సమర్పిస్తారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వారు, ధనిక పేద అనే తేడా లేకుండా తమకు ఉన్న దాంట్లో నైవేధ్యం తయారుచేసి అర్పించి, రధయాత్రలో భక్తులకు అది పంచిపెడతారు. కటిక పేదలు కూడా కుండల్లో నైవేద్యం వండి పంచిపెడతారట(ఇప్పుడు ఈ పద్ధతి ఉందో లేదో తెలియదు కాని, కొన్నేళ్ళ ముందు మాత్రం ఉండేది). ఇలా పేదలు, అట్టడుగు వర్గాలవారు పంచిన నేవదన కొందరికి స్వీకరించడం నామోషిగా అనిపించవచ్చు. అలా భావించి నైవేధ్యం తీసుకోని వారు పూరీలో సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళి అందులో కొట్టుకుపోయేవారట. ఇలా అక్కడ ప్రసాదం స్వీకరించడంలో తారతమ్యం చూపినవారందరికి ఇదే గతి పట్టిందని చెప్తారు. కనీసం జాడ కూడా దొరికేది కాదట. ఈ సమస్త జగత్తంతా జగన్నాథుడే. అందరిలోనూ ఆ జగన్నాథుడు దర్శించాలని, అందరిని సమభావంతో చూడాలని, అందరిలో ఉన్న అ పరమేశ్వరుడిని దర్శించాలని, ఈ జగత్తంతా జగన్నాథమయమేనని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

జై జగన్నాథ            



No comments:

Post a Comment