Monday 8 July 2013

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. ఎందుకు?

మన సంప్రదాయం- శాస్త్రీయం

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఎందుకు?

ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంబిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు.

మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.

అదే కాకుండా ఆషాఢంలో ధాతుసంరక్షణ, బ్రహ్మచర్యం తప్పనిసరి అని ఆయుర్వేదశాస్త్రం చెప్తున్నది. కొత్తగా పెళ్ళైనా భార్యాభర్తలకు నిగ్రహం తక్కువగా ఉంటుంది, అందుకని వాళ్ళని దూరంగా ఉంచుతారు. మిగితావారు కూడా ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. దీనివల్ల ఆరోగ్యం రక్షించబడుతుంది.      

No comments:

Post a Comment