Sunday 6 March 2016

హిందూ ధర్మం - 198 (వేదంలో గోసంరక్షణ - 3)

ఘృతం దుహానామదితిం జానాయాఘ్నే మా హింసీహీః - యజుర్వేదం 13.49

పుష్టినిచ్చి ఎదుగుదలకు తోడ్పడుతున్న ఆవులు, ఎద్దులు (గోజాతిని) ఎల్లవేళలా రక్షణ పొందాలి.

ఆరే గోహా నృహా వధో అస్తు - ఋగ్వేదం 7.56.17
గోవును చంపటం మనిషిని చంపటంతో సమానమైనది. ఎవరైతే గోహత్యకు ఒడిగడతారో వారికి కఠిన శిక్ష వేయండి.

వైదిక నిఘంటువు గోవును అఘ్న్యా, ఆహీ, అదితి అంటుంది.
ఆహీ అనగా వధించకూడనిది.

అఘ్న్యా అయిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో చంపరాదు. శుద్ధమైన నీరు, పచ్చని గడ్డి పెట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచండి. తద్వారా సద్గుణాలు, జ్ఞానము, సంప్దలు పొందండి. - ఋగ్వేదం 1.164.40, అధర్వణ వేదం 7.73.11, అధర్వణ వేదం 9.10.20.

అఘ్న్యా అయిన ఆవువులు, ఎద్దులు మీకు ఆఇస్వర్యాలను తీసుకువస్తాయి. - యజుర్వేదం 12.73

అంతకాయ గోఘాతం - యజుర్వేదం 30.18
గోవులను వధించేవారిని అంతం చేయండి.

మన ఆవులను, గుర్రాలను, ప్రజలను నశింపజేసేవారిని సీసపు గుళ్ళతో చంపండి.

ధేనుసాధనం రాయేనాం - అధర్వణ వేదం 11.1.34
గోవు అన్న సంప్దలకు సాధనం/కారణం

ఋగ్వేదం 6 మండలం 28 వ ఒక సూక్తం గోవు యొక్క ఖ్యాతిని చాటి చెప్తుంది.

గోవులను అన్ని రకాల దుర్భిక్షాల నుంచి దూరంగా ఆరోగ్యంగా ఉంచండి.
గోవులను రక్షించేవారిని భగవంతుడు ఆశీర్వదిస్తాడు.
శత్రువులు కూడా గోవులపై ఆయుధాలు వాడకూడదు.
గోవును ఎవరూ వధించకూడదు.
ఆవు ఐశ్వర్యము, బలము ఇస్తుంది.
ఆవును ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచితే, స్త్రీపురుషులు కూడా రోగరహితంగా, ఐశ్వర్యవంతులై ఉంటారు.
ఆవులు పచ్చగడ్డి తిని, నీరు త్రాగుగాక. ఆవి వధింపబడకుండు గాక, మరియు మనకు ఐశ్వర్యాన్నిచ్చు గాక.

To be continued ........

2 comments: